RAJAMPET
-
ఇవాళ పోసానిని కలిసేందుకు చట్ట ప్రకారం ములాఖత్ పెట్టుకున్న YSRCP నేతలు
-
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
అన్న క్యాంటీన్లో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
దిగడం సరే.. ఎక్కడమెలా!
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది. కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్కు నందలూరు హాల్టింగ్ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓబులవారిపల్లె, రాజంపేటలో..ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు. -
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజంపేట: కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి బీజేపీ అభ్యరి్థగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి? మిధున్రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను. మీ ప్రత్యరి్థ, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి మిధున్రెడ్డి: నేను లోకల్ లీడర్, కిరణ్కుమార్రెడ్డి గెస్ట్ పొలిటిíÙయన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు మిధున్రెడ్డి: నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు. వచ్చే టర్మ్లో ఏం చేయనున్నారు మిధున్రెడ్డి: రూ.2400 కోట్లతో వాటర్గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు మిధున్రెడ్డి: ప్రదానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ వి«ధంగా హాలి్టంగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా మిధున్రెడ్డి: చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. రాజంపేట వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యరి్ధగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి మిధున్రెడ్డి: కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుçష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనారీ్టలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆతీ్మయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. -
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
-
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
-
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
-
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
-
నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
దగాపడ్డ తమ్ముళ్లు!
రాజంపేట: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో రాజంపేట తమ్ముళ్లు మరోసారి దగాపడ్డారు. శుక్రవారం రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్, గతంలో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యంకు టికెట్ కేటాయించడంతో రాజంపేట టీడీపీ వర్గీయుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాము ఆశించిన నేత, రాజంపేట టీడీపీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పలువురు పార్టీ క్యాడర్లోని నేతలు రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేశారు. తమనేత బత్యాల అభ్యర్థి కాకపోతే రాజంపేటలో టీడీపీ ఓటమి తధ్యమని తమ్ముళ్లు స్పష్టం చేశారు. రాజంపేట బత్యాల భవన్ వద్ద టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు హల్చల్ చేశారు. తమ నాయకుడు చెంగల్ రాయుడు కు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మందా శీను మనస్థాపం చెందారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని భవనం పైకెక్కాడు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు సముదాయించి కిందికి దించారు. కాగా రాజంపేట టికెట్ను టీడీపీ నుంచి బత్యాల చెంగల్రాయుడుతోపాటు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, రాజంపేట వ్యవసాయమార్కెట్కమిటి మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి, మరో నాయకుడు మేడా విజయశేఖర్రెడ్డి టికెట్ ఆశించినవారిలో ఉన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం రోజున వీరందరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. చతికిలపడ్డ ‘సేన’ రాజంపేటలో జనసేనకు టికెట్ దక్కుతుందన్న ఆశతో నియోజకవర్గంలో పలువురు జనసేన తరపున కార్యక్రమాలు చేపట్టారు. నందలూరుకు చెందిన యల్లటూరు శ్రీనువాసురాజు ఏకంగా తన ఉద్యోగ పదవికి వీఆర్ఎస్ ఇచ్చి మరీ జనసేనలో చేరారు. అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన అతికారి దినేష్, మలిశెట్టి వెంకటరమణ టికెట్ను ఆశించి భంగపడ్డారు. అనుహ్యంగా తెరపైకి బాలసుబ్రమణ్యం.. రాజంపేట టీడీపీ టికెట్ సుగవాసి బాలసుబ్రమణ్యం కు కేటాయించడంతో టీడీపీ రాజకీయాలు వేడె క్కాయి. నాన్లోకల్ను రాజంపేటకు తీసుకొచ్చి మరి పోటీ చేయించడంపై టీడీపీ కేడర్ పెదవివిరుస్తోంది. -
ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది. – సాక్షి, రాయచోటి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు. టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. కల్యాణం రోజు ఇంతటి అపశృతి చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది. అభివృద్ధితో కళకళ చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి. – శ్రీనివాసులు, ఒంటిమిట్ట రామయ్యకు రాజయోగం నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్గా పనిచేశాను. ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. – ముమ్మడి నారాయణరెడ్డి, పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం అద్భుత క్షేత్రమైంది ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట -
మూడు ముక్కల టీడీపీకి మరో సంకటం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త సంకటం వచ్చి పడింది. అసలే మూడు వర్గాలతో, నిత్యం కొట్లాటలతో సతమతమవుతున్న టీడీపీకి జనసేనతో పొత్తు కారణంగా కొత్తగా మరో గ్రూపు చేరింది. రాజంపేట టీడీపీని మరింత రగిలిస్తోంది. పొత్తులో భాగంగా రాజంపేట టికెట్ తమకేనంటూ జనసేన నేతలు ఘంటాపథంగా చెప్పడం టీడీపీ నేతలకు చిర్రెక్కిస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాలని టీడీపీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన అభ్యర్థిత్వానికి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు మోకాలడ్డుతున్నారు. బత్యాల నాన్ లోకల్ అభ్యర్థి, పోటీలో నిలిపినా నిరుపయోగమేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు రాజంపేట ఎంపీగాకంటే అసెంబ్లీకి పోటీచేయాలని గంటా నరహరి ఉవ్విళ్లూరుతున్నారు. బత్యాల, జగన్మోహన్రాజులకు గట్టిగానే అడ్డం పడుతున్నారు. వీరు చాలదన్నట్టు తాజాగా పోలు సుబ్బారెడ్డి, మేడా విజయశేఖర్రెడ్డి రేసులోకి వచ్చారు. వీళ్ల మధ్య నిత్యం కొట్లాటలతో కేడర్ క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు పొత్తులో మాకే సీటంటూ జనసేన నేతలు రంగంలోకి వచ్చారు. రాజంపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ టిక్కెట్ తనదేనంటున్నారు. మలిశెట్టికంటే తానే మెరుగైన అభ్యర్థి అంటూ అతికారి దినేష్ మరోపక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చిన శ్రీనివాసరాజు తానే జనసేన అభ్యర్థినంటూ తెరపైకి వచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేతల కొట్లాటలతో టీడీపీ, జనసేన వర్గాలు కకావికలవుతున్నాయి. మైదుకూరు, రాజంపేట నేతల పైరవీలు టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకున్నా వైఎస్సార్ జిల్లాలో మైదుకూరు, అన్నమయ్య జిల్లాలో రాజంపేటని జనసేనకు అప్పగించవద్దని టీడీపీ నేతలు పైరవీలు ఆరంభించారు. వాస్తవంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను నిలిపే అవకాశం బలంగా ఉంది. ఈ మేరకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు ప్రాంతాల్లో మాత్రమే జనసేన సీట్లు కోరే అవకాశం ఉంది. రైల్వేకోడూరు ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడం, సరైన నాయకుడు లేకపోవడంతో రాజంపేట, మైదుకూరు సీట్లపై పట్టుబట్టనున్నారు. ఈ నేపథ్యంలో మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి జనసేన టికెట్పై పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. -
అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడిపి నేతల దుర్మార్గం
-
నిమజ్జనంలో విషాదం.. చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!
సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్న కిరణ్.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్ బంపర్పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. -
రాజంపేటలో వాల్మికి విగ్రహావిష్కరణ
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ వాల్మీకి సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డిలు ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ వాల్మికుల సమస్యలపై లోక్సభలో ప్రస్తావించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. వాల్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన వాల్మికి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి సీతారామ,లక్ష్మణ, ఆంజనేయులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, రామాయణం సృష్టికర్త వాల్మీకి మహర్షి అని కొనియాడారు. -
స్టార్ మిస్ టీన్ ఇండియాగా రాజంపేట అమ్మాయి
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కల గడ్డ విష్ణు చౌదరి, ఉత్తరల కుమార్తె ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఇంటెలిజెంట్ 2023కు విజేతగా నిలిచింది. ధనూషసాయి దుర్గాచౌదరి(15) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజస్థాన్లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
ఘనంగా ఎంపీ మిథున్రెడ్డి జన్మదిన వేడుకలు
కేవీపల్లె : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి జన్మదిన వేడుకలను కేవీపల్లెలో ముందస్తుగా నిర్వహించారు. శనివారం జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఆధ్వర్యంలో కేక్ ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్కు తినిపించారు. పీలేరు నియోజకవర్గం నుంచే గాక, రాయచోటి, పుంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలు మిథున్రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు హరీష్రెడ్డి, కారపాకుల భాస్కర్నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ కడప గిరిధర్రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, నాయకులు గజ్జెల శీన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, జయరామచంద్రయ్య, రామ్ప్రసాద్నాయుడు, సి.కె. యర్రమరెడ్డి, సిరి, సైఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కండక్టర్ నిజాయితీ
రాజంపేట: రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ రాజంపేట డిపోలో పనిచేస్తున్న సీ.మాధవి అనే కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం తిరుపతి–రాజంపేట బస్సు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పీ.శివప్రసాద్ రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగేటప్పుడు తన బ్యాగును మరిచిపోయారు.అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న బ్యాగ్ను కండక్టర్ గుర్తించింది ప్రయాణికులను విచారించింది. ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల్ పాయింట్లో ఫిర్యాదు చేశారు. టికెట్ను బట్టి కండక్టరుకు ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్ను డిపో మేనేజరు రమణయ్యకు అందచేశారు. డీఎం చేతులమీదుగా శివప్రసాద్కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు. -
పవన్ కల్యాణ్ యాత్ర ఫ్లాప్
రాజంపేట(వైఎస్సార్ జిల్లా): జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో శనివారం చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర బొమ్మ ప్లాప్ అయింది. షెడ్యూల్ ప్రకారం 1గంటకు చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్ 4 గంటలకు చేరుకున్నారు. ఆలస్యంగా ఆయన వచ్చినా ఓపెన్ గ్యాలరీలో జనం లేకపోవడం కనిపించింది. కేవలం మీడియా, మహిళల గ్యాలరీకే జనం పరిమితమయ్యారు. పాసులు ఇచ్చిన వారు మాత్రమే సభ ప్రాంగణం ముందున్న గ్యాలరీలో చేరుకున్నారు. సాధారణ జనం కోసం ఏర్పాటుచేసిన మైదానం జనం లేక బోసిపోయింది. గందరగోళంగా సభ.. పవన్ సభ గందరగోళంగా మారింది. 150పైగా కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పదేపదే చెప్పారు. ఏ సంవత్సరం నుంచి అనేది లేకుండా కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై బురదచల్లేందుకే అన్నట్లుగా సభ నిర్వహించారని విమర్శలు వెలువడ్డాయి. పవన్ ప్రసంగానికి స్పందన కనిపించలేదు. స్థానికేతరులు అధికంగా వచ్చారు. జనసేన సభకు టీడీపీ క్యాడర్ హాజరైంది. సిద్ధవటంలో టీడీపీ నేత అతికారి వెంకటయ్య, ఆయన తనయుడు దినేష్, తమ్ముడు అతికారి కృష్ణ తోపాటు సంబంధీకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. -
ఘనంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాజంపేట: పద కవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఉదయం పల్లకీసేవ నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవస్వామి ఆలయంలో ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవితో కలిసి చెన్నకేశవస్వామి శేషవాహనంపై ఊరేగారు. టీటీడీ అర్చకస్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. టీటీడీ సూపరిండెంట్ పి.వెంకటశేషయ్య, ఇన్స్పెక్టర్ బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు
రాజంపేట: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులకు తక్కువ ధరతో గమ్యాలను చేర్చే రైలుగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల ఆదరణ దక్కించుకుంది. అలాంటి రైలిప్పుడు జిల్లా ప్రయాణికులకు దూరమయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 57273/57274 నంబర్లతో కాకినాడ–తిరుపతి–హుబ్లీ (ఇంటర్సిటీ రైలు) ఉభయ జిల్లాల మీదుగా నడిచింది. అలాగే సీమవాసులు కోస్తా కారిడార్ ప్రయాణానికి ఈ రైలు అందుబాటులో ఉండేది. అన్ని వర్గాల ప్రజల ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రైలును ఫస్ట్వేవ్ కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ విషయాన్ని పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల యాత్రికులకు సౌకర్యంగా.. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులకు సౌకర్యంగా ఈ రైలు నడిచింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తక్కువ ధరతో టికెట్ తీసుకొని ప్రయాణించే యాత్రికులపై రైల్వేబోర్డు శీతకన్ను వేసిందనే అపవాదును మూటకట్టుకుంది. సీమ జిల్లాలో పేద ప్రయాణికుల ఆదరణ పొందిన ఏకైక రైలు ఇంటర్సిటీ అని చెప్పుకోవచ్చు. ప్రజాసౌకర్యం కన్నా ఆదాయమే ప్రధానం అన్న విధంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) ఇంటర్ సిటీ దరిచేరని డెమో రేణగుంట–గుంతకల్లు మధ్య నడుస్తున్న డెమో ఎక్స్ప్రెస్ రైలుకు పెట్టిన ధరలతో పోలిస్తే ఇంటర్సిటీ మేలంటున్నారు ప్రయాణికులు. ఉదాహరణకు నందలూరు నుంచి కడపకు రూ.10నే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చార్జీతో డెమోను తీసుకొచ్చి రూ.30 తీసుకుంటున్నారు. ఒక వేళ రూ.30 టికెట్ తీసుకున్నా, స్టేషన్ నుంచి ఆటోకు రూ.20 కావడం మొత్తం మీద రూ.50 అవుతోంది. అలాంటప్పుడు బస్సులో వెళితే నేరుగా టౌన్లోకి వెళ్లవచ్చు కదా అనే భావనతో ప్రయాణికులు డెమో వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. 12 బోగీల ఫార్మిసన్తో నిత్యం రద్దీగా.. ఇంటర్సిటీ రైలు 12 బోగీల ఫార్మిసన్తో నిత్యం రద్దీగా నడిచేది. నందలూరులో కూడా ఈ రైలు క్రూ ఛేంజింగ్ ఉండేది. రెండు రిజర్వేషన్ బోగీలు కూడా ఉండేవి. ఉభయ జిల్లాలకు చెందిన వారు అనేక మంది కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ కేంద్రం వరకు రాకపోకలు సాగించేవారు. రెండు రాష్ట్రాల మధ్య తక్కువ ధరతో గమ్యానికి చేరుకొనేవారు. అందువల్ల ఈ రైలు ఎప్పుడైనా రద్దీతో నడిచేది. ఫుట్బోర్డు ప్రయాణం కొనసాగేది. అలాంటి రైలును ఇప్పుడు రైల్వేశాఖ కనుమరుగు చేసేలా తీసుకుంటున్న విధానాలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
రెండేళ్ల తర్వాత పట్టాలపైకి ‘అరక్కోణం’
రాజంపేట: రెండేళ్ల తర్వాత అరక్కోణం రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు (06401/06402) వచ్చేనెల 27 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అన్ని ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అప్పటి నుంచి పల్లె ప్రయాణికులకు ఒక్క రైలు కూడా లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఒక డెమో రైలు ప్రస్తుతం వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నడుస్తోంది. 8 కార్ మెమూ రేక్తో మెమూ నడవనుంది. కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్ అరక్కోణం నుంచి కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్తో మెమూ రైలు నడుస్తోంది. అరక్కోణం, తిరుత్తణి, పొనపాడి,వెంకటనరసింహారాజుపేట, నగిరి, ఏకాంబరకుప్పం,వేపగుంట, పుత్తూరు, తడకు, పూడి, రేణిగుంట జంక్షన్ మీదుగా నడుస్తుంది. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లె, శెట్టిగుంట, రైల్వేకోడూరు, అనంతరాజంపేట, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం,నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లె కడప వరకు నడుస్తుంది. చార్జీలు ఎక్స్ప్రెస్ తరహాలో ఉన్నప్పటికి అన్ని స్టేషన్లలో స్టాపింగ్ సౌకర్యం ఉండటం వల్ల కొంతమేర పల్లెప్రయాణికులకు ఊరట లభించింది. సమయం ఇలా.. మెమూ రైలు రేణిగుంటలో ఉదయం 8.50కి బయలుదేరుతుంది. నందలూరుకు 11 గంటలకు, కడపకు 11.45 గంటలకు చేరుతుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 3.10 గంటలకు బయలుదేరి, 3.54 గంటలకు నందలూరుకు చేరుకుంటుంది. రైల్వేకోడూరుకు 5.48 గంటలకు, రేణిగుంటకు 5.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేబోర్డు తెలి పింది. తమిళనాడు (సదరన్రైల్వే) లోని పుత్తూరుకు 6.21 గంటలకు, తిరుత్తిణికి 7గంటలకు, అరక్కోణానికి 7.35 గంటలకు చేరుకుంటుంది. -
ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!
రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిట్ట స్టేషన్కు ఎఫ్ఓబీకి బ్రేక్ ఒంటిమిట రైల్వేస్టేషన్లో డబుల్ ఫ్లాట్ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్ఓవర్ బ్రిడ్జిని(ఎఫ్ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్ డివిజన్లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్ప్లాట్ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రె డ్ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్వాచ్టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్టవర్ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం.. నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5 లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాల ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రెడ్వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని రామాపురం చెక్పోస్టు వద్ద అరటికాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా అటవీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజంపేట ఫారెస్టు రేంజర్ నారాయణ శనివారం విలేకరులకు వెల్లడించారు. బొలోరో వాహనంలో అరటికాయల లోడు వస్తుండగా, ఆపి వాహనాలను తనిఖీ చేశామన్నారు. అందులో ఎర్రచందనం దుంగలు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నామన్నారు. దుంగలను వత్తలూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వారు తెలిపారన్నారు. ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పట్టుబడినవారిలో రాజంపేట మండలం డీబీఎన్పల్లెకు చెందిన కసిరెడ్డి నాగార్జునరెడ్డి, వత్తలూరుకు చెందిన రెడ్డయ్య, రాయచోటికి చెందిన వెంకటరమణల ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు, అటవీ సిబ్బంది అంజనాస్వాతి, సాయికుమార్ పాల్గొన్నారు. -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్లు ఉన్నాయి. బేస్క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు. ఆలయ అభివృద్ధికే.. రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు. ►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు. ►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు. -
హలీమ్ కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. మదనపల్లె సిటీ/రాయచోటిటౌన్ / రాజంపేట టౌన్: హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ►మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ►రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. ►రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. హలీం తయారీలో నిమగ్నుడైన వంట కార్మికుడు , హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు 8 తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పు లు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. – మహమ్మద్ఖాన్, టీచర్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. – డాక్టర్ అశ్విన్చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
నడిచే దైవం జానీబాషాసాహెబ్: ఆకలి తీర్చి.. నీడనిచ్చాడు
వైఎస్సార్జిల్లా (రాజంపేట టౌన్) : రాజంపేట పట్టణంలోని జానీబాషాపురం గ్రామం ఏర్పడటానికి ఓ ఆసక్తికరమైన వాస్తవిక నేపథ్యంవుంది. జానీబాషాపురం గ్రామ ప్రజల కథనం మేరకు వివరాలిలావున్నాయి. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం ప్రస్తుతం ఉన్న జానీబాషాపురం ప్రాంతానికి తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన జానీమియా అలియాస్ జానీబాషాసాహెబ్ వచ్చాడు. తనకు తెలిసిన మంత్రాలు, నాటు వైద్యంతో జీవనం సాగించేవాడు. అయితే అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు అత్యంత నిరుపేదలు కావడంతో జానీబాషాసాహెబ్ తన సంపాదనను ఖర్చు చేసి వారి కడుపునింపేవారు. అలాగే అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఉచితంగా వైద్యం చేసి వారి ఆరోగ్య సమస్యలను నయం చేసేవారు. ఈనేపథ్యంలో జానీబాషాపురం గ్రామానికి ప్రక్కనే ఉన్న తుమ్మల అగ్రహారంకు చెందిన షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి, జానీబాషాసాహెబ్ మధ్య చక్కటి స్నేహం కుదిరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి కుమార్తె లక్ష్మీదేవి అనారోగ్యం భారీనపడటంతో సుబ్బయ్యశాస్త్రి ఆరోజుల్లోనే తన కుమార్తెకు పెద్దనగరాల్లో వైద్యం చేయించాడు. అయితే ఆమె ఆరోగ్యం కుదుటుపడలేదు. దీంతో సుబ్బయ్యశాస్త్రి జానీబాషాసాహెబ్కు తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేసి వైద్యం అందించాల్సిందిగా కోరాడు. కుమార్తె ఆరోగ్యం కుదుటుపడితే తనకున్న భూమిలో కొంత ఇస్తానని జానీబాషాసాహెబ్కు చెప్పాడు. తనకు ఎలాంటి ప్రతిఫలం వద్దని నీకుమార్తె ఆరోగ్యం బాగుచేస్తానని సుబ్బయ్యశాస్త్రికి జానీబాషాసాహెబ్ మాటిచ్చాడు. జానీబాషాసాహెబ్ తనవైద్యంతో ఆమె ఆరోగ్యం కుదుటుపరిచాడు. సుబ్బయ్యశాస్త్రి ఇచ్చినమాట ప్రకారం 1943వ సంవత్సరంలో 3.2 ఎకరాల భూమిని జానీబాషాసాహెబ్ పేరిట రాసి ఇచ్చాడు. జానీబాషాసాహెబ్ ఆ భూమిని అక్కడున్న ప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేశాడు. ఆ సలాన్ని ఎవరు కూడా విక్రయించకుండా వారు, వారి వారసులు మాత్రమే అనుభవించేలా రాతపూర్వకంగా రాయించాడు. దీంతో అక్కడి ప్రజలకు ఆయన దేవుడయ్యాడు. ఇందువల్లే ప్రతి ఏడాది జానీబాషాసాహెబ్ పేరిట ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాక తమ గ్రామానికి జానీబాషాసాహెబ్ అని నామకరణం చేశారు. కాలక్రమేనా ఆ గ్రామం జానీబాషాపురంగా మారింది. -
పల్లెకు వచ్చిన ప్రభుత్వం
(మోడపోతుల రామ్మోహన్, రాజంపేట) గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ఊరు పేరు చెన్నయ్యగారిపల్లె. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి నందలూరు మీదుగా గ్రామానికి చేరుకొనే సరికి ఉదయం 11 గంటలు అయింది. ముందుగా దళితవాడకు వెళ్లితే... ఇరువూరి సుబ్బన్న అనే పెద్దాయన ఎదుర య్యాడు. ’సాక్షి’ ఆయన్ని పలకరించగా ఇప్పుడు అంతా బాగుంది నాయనా..అన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చెక్డ్యాంల నిర్మాణం జరగడంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు గ్రామంలో లోఓల్టేజీ సమస్యతో కరెంటు సరఫరా సక్రమంగా ఉండేది కాదు...ఇప్పుడు రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా సబ్స్టేషన్ ఏర్పాటు జరిగింది. దీంతో గ్రామంలో ఆ సమస్య కూడా తీరిపోయింద న్నారు.అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఆంజనేయసర్కిల్ వద్దకు వెళితే గురుమూర్తి కనిపించారు. ఆయన మాట్లాడుతూ హైస్కూలు స్థాయి విద్యను అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చకచకా జరుగుతోందని చెప్పారు. గ్రామంలో విశాలమైన సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. సచివాలయ వ్యవస్థ రాక ముందు పట్టాదార్ పాస్ పుస్తకాలు, తహసీల్దారు, ఎంపీడీఓ, హౌసింగ్, వ్యవసాయ కార్యాలయాల్లో పనులకు మండల కేంద్రానికి పరుగు పెట్టాల్సివచ్చేది. వైద్య అవసరాలకు ఇదే పరిస్థితి. ఆటోలో శ్రమపడి వెళితే ఒక రోజులో పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు.ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే సర్కారీ సేవలు అందుతున్నాయి. వైద్యకోసం మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా వలంటీర్లు కృషి చేస్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారని గ్రామస్థులు చెప్పారు. ప్రభుత్వమే పల్లెకొచ్చినట్లు ఉందనే ఆనందం ప్రతివారిలో వ్యక్తమైంది. సాగుకు భరోసా నేను అయిదు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాను. రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సాయం ఎంతో ఆదుకుంది. నేరుగా సొమ్ము నా బ్యాంకు ఖాతాకే జమ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విత్తనాల పంపిణీ వంటి పనులు అన్నీ మా ఊరిలోనే జరిగిపోతున్నాయి. –గుగ్గిళ్ల సుబ్రమణ్యం, రైతు ఆర్ధిక సాయం మరువలేనిది కరోనా విపత్కర పరిస్థితుల్లో సున్నా వడ్డీ కారణంగా అందిన ఆర్థికసాయం మా గ్రూపులోని సభ్యులకు ఎంతో ఉపయోగపడింది. లాక్డౌన్ సమయంలో అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం మరువలేనిది. –వెంకటసుబ్బమ్మ -
నెల రోజులు వైఎస్సార్ జిల్లాలోనే..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని రాజస్తాన్లో తాను చదువుకుంటున్న యూనివర్సిటీకి వెళ్లే క్రమంలో ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో చిక్కుకుపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజుల పాటు తెలిసిన వారి ఇంటివద్ద తలదాచుకున్న ఆ విద్యార్థిని చివరకు మంత్రి హరీశ్ చొరవతో ఇంటికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆశా వర్కర్ లింగంపల్లి అమృతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె స్వాతి రాజస్తాన్ అజ్మీర్లోని భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనలియర్ చదువుతోంది. సెలవుల నేపథ్యంలో మార్చిలో గజ్వేల్కు వచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాజంపేటకు చేరుకోగానే, కరోనా వైరస్ ప్రభావం కారణంగా కళాశాలకు సెలవులు ఇచ్చారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నది. దీంతో ఇంటికి తిరిగి వెళ్ళాలని భావించింది. ఇంతలోనే లాక్డౌన్ ప్రకటన రావడంతో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయి అక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆమె తల్లి అమృత ఆందోళనకు గురైంది. తన కూతురిని ఇంటికి రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు ఈనెల 17న విషయాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కల్యాణ్కర్ నర్సింగరావుకు తెలియజేసింది. దీంతో నర్సింగరావు విద్యార్థిని ఇబ్బందిని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఆయన వైఎస్సార్ జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి స్వాతి గజ్వేల్కు వచ్చేలా ఏర్పాట్లు చేయించారు. ఆమెతో పాటు అదే జిల్లాలో ఉన్న మరో 20 మంది హైదరాబాద్కు వచ్చేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం స్వాతి గజ్వేల్కు చేరుకుంది. తన కూతురిని ఇంటికి రప్పించేందుకు కృషి చేసిన మంత్రి హరీశ్రావుకు విద్యార్థిని తల్లి అమృత కృతజ్ఞతలు తెలిపింది. -
టీడీపీ నేత బార్లో కల్తీ మద్యం!
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీ నేతకు చెందిన బార్లో కల్తీ మద్యం విక్రయం జోరుగా సాగుతుంది. రాజంపేటలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ పాచి, గడ్డి ఉన్న మద్యాన్ని విక్రయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం తిరుమల బార్లో బీర్ బాటిళ్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు.. వాటిలో పెద్ద ఎత్తున పాచి, గడ్డి దర్శనం ఇచ్చాయి. దీనిపై వినియోగదారులు బార్ ఓనర్ పులిరాజును ప్రశ్నించారు. అయితే ఓనర్ మాత్రం ఈ మద్యం తాము అమ్మలేదని.. వినియోగదారులపై దుర్భాశలు ఆడారు. కల్తీ మద్యం విక్రయంపై వినియోగదారులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, అర్బన్ సీఐ శుభకుమార్, ప్రొహిబిషన్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లభించింది. -
రాజంపేట జీవనచిత్రం మారనుందా
అన్నమయ్య ప్రాజెక్టు నిరంతర జలకళ సంతరించుకోనుందా.. రాజంపేట జీవనచిత్రం మారనుందా .. కొత్త ప్రతిపాదనలతో ఇది సాధ్యమేనంటున్నారు ఇంజినీరింగ్ అధికారులు..విద్యార్థులు.. తమ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే 70,000 ఎకరాలకు సాగునీరందుతుందని కుండబద్ధలుకొట్టి చెబుతున్నారు. జీఎన్ఎస్ఎస్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రాజెక్టు దిగువ భాగాన పాక్షిక సబ్సర్ఫేస్ డ్యామ్ నిర్మించాలనే ప్రతిపాదనలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి నివేదించారు. డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. సాక్షి, కడప : అన్నమయ్య ప్రాజెక్టులో నిత్యం నీరుండే పరిస్థితి కనిపించడంలేదు. ఒక ఏడాది నీరు కనిపిస్తే మరో రెండేళ్లు జలకళకు దూరమవుతోంది. దీని మీద ఆశలు పెట్టుకున్న రైతాంగానికి అండగా నిలబడలేకపోతోంది. ఏటా ఒకేతరహా నీరు నిల్వ ఉండేలా ఈ ప్రాజెక్టు ఉండాలంటే ఏం చేయాలి.. దీని పరిధిలో మరిన్ని ఎకరాలకు సాగు నీరందించాలంటే ఎలా..ఈ ప్రశ్నలకు సమాధానం తమ వద్ద ఉందని చెబుతున్నారు గతంలో ఇక్కడ నీటిపారుదల ఈఈగా పనిచేసిన రమేష్.. ఈ ప్రాజెక్టుపై ఆయ న తన పరిధిలోని ఇంజినీర్లతో కలిసి మెదడుకు పదును పెట్టారు. కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా తమ వైవిధ్యమైన ఆలోచనలను ఇంజినీర్లతో పంచుకున్నారు. ఫలితంగా కొత్త ప్రతిపాదనలను ఆవిష్కరించగలిగారు. ప్రాజెక్టు ప్రస్తుతం ఇలా : అన్నమయ్య ప్రాజెక్టు నీటి కెపాసిటీ 2.24 టీఎంసీలు.1996 వరకు ఈ ప్రాజెక్టు చెయ్యేరు ప్రాజెక్టుగా(సీపీసీ) డివిజన్ కింద ఉండేది. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుగా మారింది.అన్నమయ్య ప్రాజెక్టుకు ఫించా,బాహుదానది,మాండవి నుంచి నీరు చేరేది. 2001లో ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే 5 గేట్లలో మొదటి గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి వెల్డింగ్ సరిగాలేదని పేర్కొంది. మళ్లీ 5 గేట్లను నిర్మించారు. 2012 వరకూ ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. 2015 నవంబర్లో తొలిసారిగా ప్రాజెక్టుకు 2.01 టీఎంసీల నీరు చేరింది. 2016లో చుక్క నీరు కూడా రాలేదు. 2017లో 2.24 టీఎంసీల మేర నీరు చేరింది. గత ఏడాది నీరు లేక ప్రాజెక్టు జలకళ తప్పింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.55 టీఎంసీల నీరుంది.. కొత్త ప్రతిపాదనలు ఇలా: అన్నమయ్య ప్రాజెక్టులో నిరంతరం నీరుండేలా అధికారులు కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ ప్రతిపాదనల రూపకల్పనలో కేఎస్ఆర్ఎం, అన్నమాచార్య ఇంజనీరింగ్ విద్యార్థుల మేథస్సును కూడా వినియోగించుకున్నారు. ప్రాజెక్టు వర్క్లో భాగంగా విద్యార్థులు గత ఈఈ రమేష్ బృందంలో చేరి ఆలోచనలు పంచుకున్నారు. ప్రాజెక్టుకు జీఎన్ఎస్ఎస్ రెండోదశ ప్రధాన కాలువ కిలోమీటరు దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎత్తిపోతల కింద ప్రాజెక్టుకు నీటిని తరలించే కోణంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 20 మీటర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించవచ్చని అంచనాకు వచ్చారు. రోజుకు 800 క్యూసెక్కుల మేర 36 రోజులలో 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్టు సామర్ధ్యం మేర తరలించవచ్చని భావించారు. ఇప్పుడున్న 10,236 ఎకరాల ఆయకట్టుతోపాటు దిగువనున్న 12,500 ఎకరాలకు కూడా కొత్త ప్రతిపాదనల ద్వారా నీటి అందించవచ్చంటున్నారు. . ఇందుకు రూ.101 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు. 2.4 టీఎంసీలు నింపగలిగితే దిగువనున్న సుమారు వంద గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. దిగువకు నీటిని వదిలినపుడు ఆ ప్రాంతంలోని 36 ఊట కుంటలు ఎప్పుడూ నీటితో ఉండేలా 36 పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాములను నిర్మించాలనేది కూడా కొత్త ప్రతిపాదనలో భాగం. సర్ఫేజ్ డ్యాముకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వ్యయమవుంది. అంటే సుమారు రూ.94 కోట్లు అవసరమవుతాయి. 100 నుంచి 200 మీటర్ల లోతులో మూడు మీటర్ల వెడల్పుతో సర్ఫేజ్ డ్యాములను నిర్మించాల్సి ఉంటుంది. సైన్స్ కాంగ్రెస్లో ప్రశంస యోగి వేమన యూనివర్శిటీలో గతంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్లో ఈ ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు. అక్కడ ప్రశంసలు అందుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల మేధస్సును ఉపయోగించుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయడంపై వ్రశంసల జల్లు కురిసింది. గతంలో ఈఈగా పనిచేసిన రమేష్ సాక్షితో మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి అభినందించారన్నారు. వీలైనంత త్వరలో డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. తాజా ప్రతిపాదన వల్ల రాజంపేట జీవన పరిస్థితులు మారిపోయే అవకాశాలున్నాయి. 2015 నవంబరులో ప్రాజెక్టు నుండి ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పండ్ల తోటల ద్వారా రూ. 400 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నిరంతరం నీరు ఉంటే కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. 70వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం కాలువల ఆధునీకరణకు రూ.32 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. పాక్షిక సబ్ సర్ఫేజ్ డ్యాముల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపాం. జీఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులను నింపే ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేశాం. – రవి కిరణ్, ఈఈ, అన్నమయ్య ప్రాజెక్టు -
వేధింపులే ఆమెను బలిగొన్నాయా?
సాక్షి, వైఎస్సార్ కడప : రెక్కాడితేగాని డొక్కాడని బతుకు.. కష్టపడి తమ బిడ్డను చదివించుకుంటున్నారు. చదువులో రాణించి ఉజ్వల భవిష్యత్ పొందుతుందని కలగన్నారు. కానీ, కన్నబిడ్డ ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు నిశ్ఛేష్టులయ్యారు . పుల్లంపేటలో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. రాజంపేట పట్టణంలోని బీఎస్ హాల్ సమీపంలోని కొండపల్లి కృష్ణమోర్తి, గౌరి దంపతులు ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ కుమార్తె లక్ష్మీప్రసన్న పుల్లంపేట ఆదర్శపాఠశాలలో పదో తరగతి చదువుతుంటే సంబరపడిపోయారు. చదివి పెద్ద ఉద్యోగం చేస్తుందని భావించారు. కానీ లక్ష్మీప్రసన్న గత కొంతకాలంగా చురుకుగా ఉండడం లేదు. ఆరా తీస్తే స్కూలులో చదువులో మార్కులు తదితర విషయాలపై ఉపాధ్యాయుడు శివ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయేది. సహచరి విద్యార్థినిలకు చెప్పుకొని బాధపడేది. పలు సందర్భాలలో కుమార్తెను ఓదార్చేందుకు ఆమె తల్లి ప్రయత్నించి విఫలమైంది. ఏమైందో తెలియదు.. మంగళవారం సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత ఆ బాలిక తానుంటున్న హాస్టలు గదికి చేరుకుంది. గడియ వేసుకుంది. ఒంటిపైనున్న చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత గదికి చేరుకున్న కొందరు విద్యార్థులు ఈ సంఘటన చూసి నివ్వెరపోయారు. స్కూలు వర్గాలకు చెప్పారు. కానీ అంతకుమునుపే పాఠశాలకు ఆ బాలిక తల్లి వచ్చింది. తన బిడ్డను ఓదార్చుదామని వచ్చినట్టు భోగట్టా. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో బయటే ఉండిపోయింది. తీరా హాస్టలు గదిలో కుమార్తె లక్ష్మీప్రసన్న తనువు చాలించిందని తెలుసుకున్న మృతురాలి తల్లి నిర్ఘాంతపోయింది. ఇలా అర్ధాంతరంగా ప్రాణం తీసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. గుండెలవిసేలా రోదించింది. స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ శుభకుమార్, పుల్లంపేట ఎస్ఐ వినోద్కుమార్, తహసీల్దార్ ఉమామహేశ్వర్, డాక్టర్ సానే శేఖర్, ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి, డీఈఓ శైలజ, ఎంఈఓ రంగనాథయ్య తదితరులు చేరుకున్నారు. ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ వినోద్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీలు..ముగ్గురి దుర్మరణం
-
హైవే రక్తసిక్తం.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీలు..!
కడప–రేణిగుంట నేషనల్ హైవే రక్తసిక్తంగా మారింది. రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా నలుగురికి గాయాలయ్యాయి. రెండు లారీలు వేగంగా వస్తూ ఢీకొని పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లాయి. ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రామస్తులు ధర్నాకు దిగారు. సాక్షి, రాజంపేట: రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఊటుకూరు గ్రామం వద్ద గుజరాత్కు చెందిన (జీజే06 ఏజెడ్1324) నంబరు గల కంటైనర్, చెన్నై నుంచి కడపకు వెళుతున్న ఐషర్ వాహనం (ఏపీ04యూఏ0459) అదుపుతప్పి ఢీకొన్నాయి. సమీపంలో ఉన్న రేకుల ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇంటిలో ఉన్న వృద్ధుడు గొళ్ల వెంకటనరసయ్య (60) దుర్మరణం చెందాడు. అలాగే ఐషర్ వాహనంలో ఉన్న చింతకొమ్మదిన్నెకు చెందిన ప్రతాప్(27), కడపకు చెందిన మహమ్మద్ (29) మృతిచెందారు. గాయపడిన మునీశ్వరరెడ్డి(చింతకొమ్మదిన్నె), రాజారెడ్డి(గోపాలపురం), పరమేశ్వరరెడ్డి (చింతకొమదిన్నె), గంగిరెడ్డి(చింతకొమ్మదిన్నె)ని చికిత్స కోసం రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైవేపై ధర్నాకు దిగిన ఊటుకూరు గ్రామస్తులు గ్రామస్తుల ధర్నా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము కొన్నేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, తహసీల్దారు రవిశంకర్రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నేత రేవరాజు శ్రీనివాసరాజు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎస్ఐలు హనుమంతు, వినోద్ ట్రాఫిక్ క్లియరెన్స్కు చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై ఆరా.. ఊటుకూరు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
కుల రాజకీయాలతో అమాయకుల బలి
సాక్షి, కడప(నందలూరు) : రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజంపేటలో కులరాజకీయాలు చేస్తూ అమాయకులను బలిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ నేత పెనుబాల నాగసుబ్బయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్యాల గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గం ప్రశాంతత కోల్పోయిందన్నారు. ఈనెల 9న సోమవారం గువ్వల ఎల్లమ్మ పొలానికి సంబంధించి ప్రభుత్వం 1994లో 1158 సర్వేనెంబరులో 2.80 ఎకరాల సెంట్ల భూమికి సంబంధించి పాసుపుస్తుకాలు, వన్బీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆమెకు ఆర్థికస్తొమత లేక రాజకీయ అండదండలు లేక ఆ భూమిని అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. ఈ మధ్య కాలంలో ఎల్లమ్మ కుమారుడు ఓబులేసు అనే వ్యక్తి ఈ పొలంలో గది నిర్మించుకున్నాడన్నారు. 10వ తేదీన బత్యాల వర్గీయులు కొండా సురేష్, మరి కొంతమంది బుల్డోజర్ సాయంతో గదిని ధ్వంసం చేశారన్నారు. బాధితుడిపై మచ్చుకత్తితో దాడి చేశారన్నారు. తల్లీకొడుకును పొలంలో నుంచి బయటకి తరుముకుంటూ వచ్చారన్నారు. దీంతో బాధితుడు భయపడి తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులకు మొరపెట్టుకున్నారన్నారు. తనతో పాటు మండెంనాగరాజు, ధనుంజనాయుడు , కాకిచంద్ర, భాస్కర్, నాని , మధు యాదవ్లు ఉన్నారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు ఈ సంఘటనపై విచారణ చేయకుండా కేవలం ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తూ కులాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు. మేడా కుటుంబీకులను విమర్శించే హక్కులేదు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ మేడా కుటుంబాన్ని విమర్శించే హక్కు బత్యాలకు లేదని నాగసుబ్బయ్య అన్నారు. మేడా కుటుంబం ఎంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. బత్యాల ఇప్పటికైనా ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు వేల్పుల శైలకుమార్, పణతల గంగయ్య, ధనుంజ నాయుడు, శివ, మధు, హిమగిరి, గుండు మల్లికారుజనరెడ్డి్డ, అరిగెల నాని, హిమగిరి, రాజశేఖర్రెడ్డి విజయుడు, కొరివి బలరాం, గుండు మల్లికార్జునరెడ్డి, మధు, మండెం నాగరాజు, «గుండు జనార్దన్రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రవాసులను ఆలోచింపజేస్తున్న ‘గల్ఫ్ బాబాయ్’
సాక్షి, కడప : కడప జిల్లా రాజంపేటకు చెందిన గిరిప్రసాద్ కాస కువైట్ కేంద్రంగా ‘గల్ఫ్ బాబాయి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గల్ఫ్ సమస్యలపై తెలుగులో విషయాత్మక లఘు చిత్రాలు ప్రసారం చేస్తూ ప్రవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిప్రసాద్ 20 ఏళ్లుగా కువైట్లో ఓ మీడియా కంపెనీలో ఎడిటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గల్ఫ్ జీవితాల పట్ల ఉన్న అవగాహనతో నాలుగేళ్ల క్రితం ‘గల్ఫ్ బాబాయి’ యూట్యూబ్ ఛానల్ను స్థాపించారు. కువైట్లోని 20 మంది తెలుగువారితో ఒక టీమ్ ఏర్పాటు చేసి వారినే ఆర్టిస్టులుగా చేసి అవగాహన, సందేశాత్మక, వినోదాత్మక షార్ట్ ఫిల్మ్లను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 18 నిమిషాల నిడివిగల ‘సారాయి’ షార్ట్ ఫిల్మ్ నిజ జీవితాన్ని ఆవిష్కరించింది. గిరిప్రసాద్ కాస కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించిన ఈ ష్టార్ట్ మూవీ ‘గల్ఫ్బాబాయ్’ యూట్యూబ్ఛానల్లో ఉంది.https://www.youtube.com/ watch? v=63U5Ek_l9tM_ feature=youtu.be లింక్పై క్లిక్ చేసి ఈ మూవీని చూడవచ్చు. గల్ఫ్కు వెళ్లే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. గతంలో విడుదల చేసిన చీటి పాటల మోసం, గల్ఫ్లో కొత్త కుర్రోడు లాంటి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్లను కూడా ఈ ఛానల్లో చూడవచ్చు. -
అ‘విశ్రాంత’ ఉపాధ్యాయులు
‘సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసిన మదర్ థెరిస్సా. కొందరు చేసే సేవలను చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది. ఉద్యోగ విరమణ పొందినా ముగ్గురు ఉపాధ్యాయులు తాము పని చేసిన పాఠశాలల్లోనే విద్యా బోధన చేస్తూ.. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సాక్షి, రాజంపేట టౌన్ : రాజంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హెచ్ఎంలు, ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాము పని చేసిన పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తూ సేవాతత్పరతను చాటుతున్నారు. రిటైర్డ్ అయ్యే చాలా మంది ఉపాధ్యాయులు శేష జీవితాన్ని తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలో.. ముందే ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు, ఎగువగడ్డకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం వనం ఎల్లయ్య, ఎగువగడ్డ ప్రాంతానికే చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు హెప్సీబ ఉద్యోగ విరమణ పొందినా తమ శేష జీవితాన్ని మాత్రం విద్యార్థులతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులు కావడంతో.. వారి ఉన్నతి కోసం తోడ్పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువులకు వందనం రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు తుమ్మల అగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ 2017లో ఉద్యోగ విరమణ పొందారు. వనం ఎల్లయ్య ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, హెప్సీబ మండలంలోని వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు అదే పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. హెప్సీబ రాజంపేట పట్టణం నుంచి వెంకటరాజంపేటకు తన సొంత ఖర్చుతో ఆటోలో వెళ్లి విద్యార్థులకు బోధన చేస్తుండటం విశేషం. వీరికి వందనం అని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. దేవుడిచ్చిన వరం సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనది. నాకు ఉపాధ్యాయ వృత్తి లభించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. అందువల్లే నేను ఉద్యోగ విరమణ పొందినా భగవంతుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల ఉన్నతికి వినియోగిస్తున్నా. – యు.సుబ్బరాయుడు,రిటైర్డ్ హెచ్ఎం, టి.అగ్రహారం పేద విద్యార్థులతోనే శేష జీవితం రెండున్నర దశాబ్దాల పాటు పేద విద్యార్థులతో నా జీవితం సాగింది. శేషజీవితం కూడా వారితోనే కొనసాగించాలన్నదే నా కోరిక. అందువల్ల నేను రిటైర్డ్ అయినా పేద విద్యార్థులకు ఉచితంగా బోధించాలని నిర్ణయించుకున్నా. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. – వనం ఎల్లయ్య, రిటైర్డ్ హెచ్ఎం, ఎగువగడ్డ, రాజంపేట శరీరం సహకరించినంత వరకు.. నేను వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లు ఉపాధ్యాయురాలిగా పని చేశాను. ఇక్కడి విద్యార్థులు, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. నాకు శరీరం సహకరించినంత వరకు ఈ గ్రామంలోని విద్యార్థులకు సేవ చేస్తా. – హెప్సీబ, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, ఎగువగడ్డ గొప్ప విషయం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించడం చాలా గొప్ప విషయం. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉండే పాఠశాలల్లో ఇలా బోధిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – మేడా చెంగల్రెడ్డి, ఎంఈఓ, రాజంపేట -
రైల్వే ఎన్నికలకు రెడీ..!
సాక్షి, రాజంపేట: భారతీయ రైల్వేలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైల్వేకార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం రెడీ అవుతోంది. ఈమేరకు ఎన్నికలకు సంబంధించి మెంబర్షిప్ వెరిఫికేషన్కు అన్ని జోనల్ జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు డైరెక్టరు డి.మల్లిక్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిలకు రైల్వే యాజమాన్యం సన్నాహాలకు దిగినట్లే. రైల్వే బోర్డు ఆదేశాలతో ఆల్ ఇండియ రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్)కు అనుబంధంగా ఉన్న సౌత్సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) సౌత్సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకత్వాలు జోన్, డివిజన్ల స్థాయిలో క్యాడర్ను సిద్ధం చేస్తోంది. ఆగస్టులో ఎన్నికలు : ఆగస్టులో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకోనున్నది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జిల్లా వరకు నందలూరు, కడప రైల్వేకేంద్రాలలో మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచిల పరిధిలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఈ ఎన్నికల్లో తమతమ సంఘాలను గెలిపించుకునేందుకు పోటీపడనున్నారు. రైల్వేబోర్డు ఆదేశాలతో కార్మిక సంఘాల నేతలు ఇప్పటి నుంచి సన్నద్దులవుతున్నారు. 2013లో ఎన్నికలు : 2013 ఏప్రిల్లో భారతీయ రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సౌత్సెంట్రల్ మజ్దూర్ యూనియన్ విజయఢంకా మోగించిన సంగతి విధితమే. ఆ ఎన్నికల్లో 46 శాతం ఓట్లను దక్కించుకుంది. జోన్ స్థాయిలో 86వేల ఓట్లలో 36వేల ఓట్లను ఎస్ఆర్ఎంయూ దక్కించుకుంది. ఎస్ఆర్ఎంయూ, సంఘ్కు సమానంగా వచ్చి రెండింటికి రిగ్నజైడ్ గుర్తింపు వచ్చింది. అయితే గుంతకల్ డివిజన్ స్థాయిలో ఎస్ఆర్ఎంయూకు 998 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా... రైల్వే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో నిర్వహించారు. కడప, నందలూరులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో ఉన్న రైల్వే ఉద్యోగులు, కార్మికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు ఇరు కార్మికసంఘాలు ప్రతిష్టాతక్మంగా తీసుకోనున్నాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో 14వేల సభ్యులు ఉన్నారు. ఈ యేడాది ఈ సంఖ్యలో 20వేలలోపు చేరనున్నదని రైల్వే వర్గాలు అంటున్నాయి. -
8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది
-
కడప జిలాలో టీడీపీకి గట్టి షాక్
-
అమరావతి రమ్మని నన్ను ఘోరంగా అవమానించారు
సాక్షి, కడప : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్ నేత సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణాంతరం సాయిప్రతాప్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా సాయిప్రతాప్ కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘దిక్కుతోచని స్థితిలో నా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగింది. రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చాను. కానీ ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంది. నన్ను రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండమన్నారు. కానీ నా పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వరు. ఇన్ఛార్జ్కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నా. నా అల్లుడు సాయి లోకేష్కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగింది. కానీ నాకు మొండిచేయి చూపించారు. ఈరోజు టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నన్ను అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు నన్ను చూసి పక్కకు మొహం తిప్పుకుని చూడనట్లు వ్యవహరించారు. టీడీపీలో సరైన విలువలు ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. డబ్బులు లేని వారికి టీడీపీలో స్థానం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో చంద్రబాబు అన్యాయం చేసారు. చంద్రబాబు తీరు వల్ల గత వారం రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యను. టీడీపీలో స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు. సీనియర్ నాయకులకే విలువ లేని టీడీపీలో యువతరానికి విలువలు ఉంటాయా...? రెండు రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను’ అని అన్నారు. -
కడప: రెండు నెలలు ఓపిక పట్టండి
సాక్షి,రాజంపేట: ‘‘రెండు నెలలు ఓపికపట్టండి.. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’’అంటూ వైఎస్సార్సీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి రాజంపేట రూరల్ ఏరియాలోని ఎస్.ఎర్రబల్లి సర్కిల్లో వైఎస్సార్సీపీ జెండా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి ఎగురవేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్ పాలన అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా సంక్షేమపాలన ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన 35 కుటుంబాల వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనరు పోలా శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, సీనియర్ నాయకుడు కొండూరు శరత్కుమార్రాజు, మండల కన్వీనరు భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు
రాజంపేట నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ హయాంలో శాశ్వత అభివృద్ధి జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కొండూరు ప్రభావతమ్మ, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. తాగు, సాగునీటి ప్రధానసమస్యలను తీర్చారు. అటువంటి రాజంపేటలో మళ్లీ రాజన్న రాజ్యానికే మద్దతు పలకనున్నారు. ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి తనదైనశైలిలో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశారు. 1952–55 కాలంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పంజం నరసింహారెడ్డి , కాంగ్రెస్ తరఫున పోలా వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికలలో పార్థసారథి, పీవీ సుబ్బయ్య కాంగ్రెస్పార్టీ తరఫున పోటీచేసి చెరో 40వేలకుపైగా ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా కొండూరు మారారెడ్డి 14,335 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పార్థసారథిపై విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా బండారు రత్నసభాపతి 35,845 ఓట్లతో గెలుపొందారు. 1972లో రెండోసారి కూడా ఈయన గెలుపొందారు. 1997 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండూరు ప్రభావతమ్మ గెలుపొందారు. 1978లోరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభావతమ్మ పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సభాపతిపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ, టీడీపీ అభ్యర్థి సభాపతిపై గెలుపొందారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టం. 1989లో కాంగ్రెస్ టికెట్ దక్కని ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్మోహన్రెడ్డి విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య పై సుమారు 24వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 12వేల మెజారిటీతో గెలుపొందారు. ఆతర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆకేపాటి గెలుపొందారు. 2014లో మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన మల్లికార్జున రెడ్డి పార్టీలో చేరారు. బరిలో స్థానికేతరుడు టీడీపీ నుంచి ఈసారి రైల్వేకోడూరుకు చెందిన బత్యాల చెంగల్రాయుడును చంద్రబాబు బరిలోకి దింపారు. రాజంపేటకు ఎలాంటి సంబంధంలేని ఈయనపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. స్థానిక నాయకత్వాన్ని కాదని బత్యాలను పోటీకి దింపారు. ఈ సారి ఎన్నడూలేని రీతిలో సామాజికవర్గరాజకీయాలు రాజంపేటలో రాజ్యమేలుతున్నాయి. మేడా వైపే.. రాష్ట్ర విభజన అనంతరం రాజంపేట తొలి ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా రాజంపేటలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఆంధ్ర భద్రాద్రిగా రామాలయానికి అధికారిక గుర్తింపుతోపాటు టీటీడీలో విలీనం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలను తీసుకొచ్చి జలకళను తెప్పించారు. పేదలకు ముఖ్య మంత్రి సహాయ నిధిని ఇప్పించడంలో కృషి చేశారు. నందలూరు మండల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. నిరంతరం ప్రజలసమస్యలను పరిష్కరించడంలో ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషిచేశారు. – మోడపోతుల రామ్మోహన్, సాక్షి, రాజంపేట -
కన్నప్ప జన్మస్థలిపై కనికరమేదీ!
సాక్షి, రాజంపేట : శ్రీకాళహస్తిలో దక్షిణకాశిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేసి అపర శివభక్తునిగా నిలిచిన భక్తకన్నప్పది వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు (ఊడుమూరు) గ్రామమని పెరియపురాణం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడున్న శివాలయంలో శివలింగానికి కన్నప్ప పూజించినట్లుగా చెబుతుంటారు. అపర శివభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) జన్మస్థలంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారముద్ర ఇంతవరకు పడలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జన్మస్థలం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి దేవస్థానం శీతకన్ను వేసిందని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంలోని ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. భక్త కన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్త కన్నప్ప జన్మ స్థలంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం కన్నప్ప కాళహస్తికి ఎలావెళ్లాడు.. తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారి పూజలు చేసేవాడు. తర్వాత పరమశివునికి తన రెండు కళ్లను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు కన్నప్పకి మోక్షమిచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం జన్మ స్థలమైన ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప ఊహాచిత్రం అన్నమయ్యతో భక్త కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం.. తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనమడుగా పుడతాడని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై 32వేల కీర్తనలు రచించి, పదకవితా పితామహడు పేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. -
సీనియర్లకు బాబు మొండిచేయి
అమరావతి : రాజంపేట పార్లమెంటు స్థానంపై గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేతలు పసుపులేటి బ్రహ్మయ్య, పాలకొండ రాయుడికి చంద్రబాబు మొండిచేయి చూయించారు. రాజంపేట సీటు కోసం ప్రయత్నిస్తూ ఇటీవలే పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురైన సంగతి తెల్సిందే. రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజంపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డే(రాజంపేట శాసనసభ స్థానం నుంచి). ఇటీవలే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెల్సిందే. అలాగే రాయచోటిలో పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న సీనియర్ నేత పాలకొండ రాయుడిని పక్కన పెట్టి ఈ సారి రమేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. పీలేరు శాసనసభా స్థానం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనూష రెడ్డి, రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్లకు సీట్లు కేటాయిస్తున్న చంద్రబాబు వెల్లడించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లాలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవలే సీనియర్లు తమకు టిక్కెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంటుగానైనా బరిలోకి దిగుతామని బాహాటంగా హెచ్చరించిన సంగతి తెల్సిందే. -
రాష్ట్రంలో దోపిడీ పాలన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దోపిడీ పాలన సాగుతోందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. ‘నిన్ను నమ్మం బాబూ.. నమ్మంగాక నమ్మం’ అని అంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయాల మేరకు సుపరిపాలన సాధించేందుకు టీడీపీకి రాజీనామా చేసినట్లు మేడా తెలిపారు. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఆదరించే సీఎంగా వైఎస్ జగన్ ముందుకు వెళ్తారని చెప్పారు. గురువారం హైదరాబాద్లో వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు ఒకటే మాట చెబుతున్నా. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం’ అని పేర్కొన్నారు. రాజంపేట, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించుకుని వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. తాము టీడీపీ మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్లం కాదని మేడా వ్యాఖ్యానించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా.. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీ కొనుగోళ్లకు పాల్పడితే ఈరోజు దాకా వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని మేడా పేర్కొన్నారు. ‘వైఎస్ జగన్ నాకు ఒకే మాట చెప్పారు. పార్టీలో చేరే ముందు టీడీపీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రమ్మని కోరారు. ఈ నెల 22వ తేదీనే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈరోజు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపా’ అని మేడా వివరించారు. అన్ని వర్గాలకూ టీడీపీ దగా.. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసి అన్ని వరాలకు మంచి జరిగే పరిపాలన రావాలన్నది తన అభిమతమని మేడా చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గాన్ని దగా చేశారని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత, కాపులు.. ఇలా అందరినీ టీడీపీ మోసగించిందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లాలో వైఎస్సార్ సీపీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ప్రకటించారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డితో కలసి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వెళ్తానని మేడా చెప్పారు. భారీగా తరలివచ్చిన మేడా అనుచరులు రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం కిక్కిరిసింది. రాజంపేట నుంచి భారీగా వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. మేడాకు లోటస్పాండ్లో వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ ప్రతి ఒక్కరినీ సాదరంగా పలకరించారు. పార్టీలో చేరిన వారందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతా కలసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి కావడం గమనార్హం. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుతోపాటు మేడా రఘునాథ్రెడ్డి, మేడా విజయభాస్కర్రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి మేడా మల్లికార్జునరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కొందరు నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఇదివరకే మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లాలో పోటీ చేసి.. గెలిచిన ఏకైక టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి. ఆయనతోపాటు రాజంపేట నుంచి భారీ ఎత్తున వచ్చిన ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన వైఎస్ జగన్.. కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా: మేడా వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను తాను పంపానని తెలిపారు. వైఎస్ జగన్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా అమలు చేయని హామీలు ఇప్పుడు ఎలా చంద్రబాబు అమలు చేస్తారని మేడా ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, ఆయన హామీలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గతవారం వైఎస్ జగన్తో భేటీ! వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్ జగన్ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన వైఎస్ జగన్ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. చదవండి: బాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుంది : మేడా -
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
-
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
సాక్షి, రాజంపేట: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పిలవకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మేడా వర్గీయులు మంత్రిని నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. పొమ్మనలేక పొగబడుతున్నారంటూ మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు టీడీపీ అధిష్టానం తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియోజకవర్గాల వారీగా చంద్రబాబునాయుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రాజంపేట నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. దీని కోసం నిన్న రాత్రి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యతిరేకులతో మంత్రి ఆదినారాయణరెడ్డి సారథ్యంలో రాజంపేటలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మేడాను పిలువలేదు. దీంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశం వద్దకు వెళ్లి.. మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సమావేశం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాజంపేటలో సమావేశం గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారని, తనకు వ్యతిరేకంగా జిల్లా నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అవుతానని చెప్పారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు తాను బెదరనని, కార్యకర్తలతో చర్చించి వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. -
రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజంపేట టీడీపీలో వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్థానిక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డిని పిలువకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి తమ నేతను పిలువకపోవడంపై హాజరైన ఎమ్మెల్యే మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే తమ నాయకుడిని పిలువలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక ఆయనకు పొగబెడుతున్నారని వారు ఆగ్రహం వక్తం చేశారు. తనకు అనుకూలుడైన నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించడానికే ఆదినారాయణరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని మండిపడుతూ.. ఈ సమావేశాన్ని మేడా వర్గీయులు బహిష్కరించారు. -
ఆస్పత్రికి వెళితే..ఆయువు తీశారు..!
అది ఏ దిక్కూలేని దవాఖానా. అక్కడ వైద్యులు ఉండరు. సకాలంలో వైద్యం అందదు. కళ్లుతిరిగి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళితే వృద్ధురాలి ఆయువు తీశారు. ప్రాణాలు పోతున్నా వైద్యం చేసేవారు కరవు అనేందుకు రాజంపేట ఏరియా ఆస్పత్రిలో శనివారం జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, వైద్యుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట: ఆకేపాడు గ్రామపరిధిలోని రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆవుల సుభద్రమ్మ (68) అనే వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు... సుభద్రమ్మ కళ్లు తిరిగి కిందకిపడిపోయింది. ఆమెను రాజంపేట ఏరియా ఆసుపత్రి(వైద్యవిధానపరిష్)కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్స్ స్థానిక వైద్యునికి సమాచారం తెలియజేశారు. ఆయన వచ్చే సరికే వృద్ధురాలి పరిస్థితి విషమించింది. మృత్యుఓడిలోకి చేరుకుంది. వృద్ధురాలిని పరిశీలించి అక్కడి నుంచి వైద్యుడు వెళ్లిపోయారు. సకాలంలో వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చినప్పటికి వైద్యం అందించలేకపోవడంతో బంధువులు ఆగ్రహించారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే (ట్రామాకేర్సెంటర్) ఉద్దేశంతో వృద్ధురాలిని తీసుకు వచ్చామని.. ఆస్పత్రి దుస్థితి తమకు తెలిసి ఉంటే తీసుకొచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లినా కాపాడుకునేవాళ్లమని మృతురాలి సంబంధీకులు వాపోయారు. కాల్డ్యూటీలు.. రాజంపేట ఏరియా హాస్పిటల్లో కాల్డ్యాటీలు అమలుచేస్తున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో కాల్డ్యాటీలు తెరపైకి వచ్చాయి. వైద్యుడు 10 నుంచి 15 నిమిషాల్లో వచ్చి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరోవైపు చెబుతున్నాయి. అయితే కొందరు వైద్యులు జీవో ప్రకారం స్థానికంగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైవుతాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కాల్డ్యూటీలో రోగులు తమకు సహకరించాలని ముందస్తుగా సెంటర్లో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లెక్కన చూస్తే శనివారం వృద్ధురాలని 12.15గంటలకు తీసుకొస్తే 12.40గంటలకు కానీ వైద్యం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో వృద్ధురాలి కానరాని లోకాలకు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతల ఆందోళన వృద్ధురాలి మృతికి సకాలంలో వైద్య సేవలందించకపోవడమే కారణమని, ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరని వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గీతాల నరసింహారెడ్డి, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు, దళితనాయకులు దండుగోపి, ఆర్సీ పెంచలయ్య, సొంబత్తిన శ్రీనివాసులు, మాజీ సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాధవరం వల్లి, ఆకేపాడు గ్రామానికి చెందిన నాయకులు ట్రామా కేర్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యవిధానపరిషత్ నిర్వహణ విఫలమయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్యులు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కృషితో ట్రామాకేర్సెంటర్ను తీసుకొచ్చారని, ఇప్పుడు టీడీపీ పాలనలో దిక్కులేని దవాఖానాగా మారిపోయిందని విమర్శించారు. ప్రాణాలు కాపాడలేని పెద్దాసుపత్రి ప్రాణాలు పోసేవిధంగా ఉండాలే కానీ, ప్రాణాలను కాపాడలేని విధంగా రాజంపేట పెద్దాసుపత్రి నిర్వహణ తీరు కనిపిస్తోంది. గతంలో చిన్నారి భవ్యశ్రీ మృతి సంఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు వృద్ధురాలి ప్రాణంపోయి ఉండేది కాదు. తాను ఎంతో కృషిచేసి ట్రామాకేర్సెంటర్ మంజూరు, ఓపీబ్లాక్ ఆధునీకరణ లాంటివిచేపడితే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించాను. టీడీపీ పాలకుల వల్లే ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చింది. –ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట డీసీహెచ్కు ఫోన్చేశాను.. అవ్వ అస్వస్థతకు గురికావడంతో రాజంపేట ఏరియా హాస్పిటల్కు తీసుకువచ్చాను. అయితే అందుబాటులో వైద్యులు లేరు. వైద్యుని కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మృతిచెందినట్లుగా తెలిసి, ఇక్కడున్న పరిస్థితులను డీసీహెచ్కు ఫోన్ ద్వారా వివరించాను. పొంతనలేని సమాధానాలు చెప్పి, ఫోన్ కట్చేశారు. –ఆవుల విష్ణుకాంత్రెడ్డి, మృతురాలి మనవడు, ఆకేపాడు -
పుస్తకం కోసం వచ్చి.. మృత్యు ఒడికి..
రాజంపేట: రాజంపేట–రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం సాయంత్రం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఇంటర్ విద్యార్థి యెద్దల రమేష్(17) దుర్మరణం చెందాడు. మృతుడు రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం బావికాడిపల్లె రామాపురం నడిమ అరుంధతీవాడకు చెందిన చిన్నయ్య, లక్షుమ్మ దంపతులకు రెండవ కుమారుడు. రమేష్ రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు. విద్యార్ధి మృతితో రామాపురం నడిమ అరుంధతీవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గైడ్ కోసం పట్టణంలోకి వచ్చి..రమేష్, శ్యామ్కుమార్లు సైకిల్పై గైడ్ కొనుగోలు చేసేందుకు ఆర్వోబీ( రాయచోటి వైపు) నుంచి పట్టణంలోకి వచ్చారు. తిరిగి మళ్లీ కళాశాల వైపు వెళ్లే సమయంలో ఆర్వోబీ ఎక్కే సమయంలో అకస్మాత్తుగా వెనుకవైపు నుంచి రాయచోటి వైపు వెళుతున్న టిప్పర్ ఢీ కొంది. సైకిల్పై ఉన్న శ్యామ్కుమార్ ఎడమవైపు పడటంతో టిప్పర్ కింద పడకుండా తప్పించుకోగలిగాడు. అయితే రమేష్ మాత్రం టిప్పర్ వెనుక టైర్ల కింద పడటంతో తల నుజ్జునుజ్జు అయింది. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అరుంధతీవాడలో విషాద ఛాయలు...రామాపురం నడిమ అరుంధతీవాడలో ఇంటర్ విద్యార్థి రమేష్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని టిప్పర్ ఢీ కొని నేరుగా వెళ్లిపోతుండగా స్థానికులు వెంబడించారు. ఆర్వోబీ ఆవలివైపు టిప్పర్ను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచ బయటపడిన శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నారు. -
చిచ్చు పెట్టిన ఫొటో
సాక్షి, రాజంపేట : అన్న, తమ్ముడి మధ్య ఓ ఫొటో చిచ్చు పెట్టింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని బీఎస్ థియేటర్ సమీపాన ఉన్న ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కరీముల్లా, షమీవుల్లా అన్నదమ్ముళ్లు. రంజాన్ను ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. ఇంతలోనే తమ్ముడు షమీ వుల్లా అన్న భార్య ఫొటో తీశారు. ఈ క్రమంలో అన్న కరీముల్లా అభ్యం తరం చెప్పారు. గొడవ వాతావరణం నెలకొంది. పైగా అనుమానం కలిగి ఉన్న అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన తమ్ముడిని స్థానిక పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ నరసింహులు మాట్లాడుతూ తమ్మునిపై అన్నకు అనుమానం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో ఘర్షణ చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఆర్టీసీ డ్రైవర్పై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం
-
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం..!
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాజంపేటలో ఆర్టీసీ బస్సు ముందు తన వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మేడా అనుచరుడు మనోహర్రెడ్డి అడ్డంగా నిలిపేవాడు. దీంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. తన వాహనానికే హరన్ కొడతావా అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మల్లికార్జున్పై దాడికి దిగాడు. రక్తం వచ్చేలా డ్రైవర్ను కొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చేరాడు. దాడి సమయంలో నిందితుడు 84శాతం అల్కాహల్ సేవించి ఉన్నాడని రాజంపేట అర్బన్ పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొల్లినేని
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. -
అవమానాలు భరించలేకే టీడీపీకి రాజీనామా
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా మల్లికార్జునరెడ్డి గెలవడానికి కమ్మ సామాజిక వర్గం కృషి చేసిందని, అయితే ఆయన నాలుగేళ్లుగా కమ్మ వర్గీయులను పూర్తిగా అణగదొక్కారని విమర్శించారు. అధికారుల నుంచి పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్న వ్యవహారాలు నియోజకవర్గంలో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాగే భూదందా, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట తహసీల్దారు నివసిస్తున్న అపార్టుమెంట్ అద్దె కూడా ఎమ్మెల్యే వర్గీయుల్లో కొందరు చెల్లిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. -
కనీవినీ ఎరుగని బీభత్సం
రాజంపేట/ కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర వారం రాత్రి వర్ష బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళన లకు గురి చేసింది. ఇలాంటి దుర్ఘటనను తాము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ముందస్తు చర్యలేవీ? శుక్రవారం సా.7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవ డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని ప్రశ్నిం చినట్లు సమాచారం. మరోవైపు ఒంటిమిట్టలో కల్యాణ వేదిక, రామాలయం పరిసర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జరిగిన నష్టంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా ఆలయ ధ్వజస్తంభంపైభాగంలో వంకరపోయింది. రామాలయం మూసివేత బలమైన ఈదురుగాలుల ధాటికి రామాల యంలో తాత్కాలిక నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో శనివారం భక్తులకు స్వామివారి దర్శనం సా. 4 గంటల వరకు లేకుండాపోయింది. సంప్రోక్షణ పేరుతో ఆలయ ద్వారాలను మూసివేసిశారు. కోదండ రాముడి ఆలయంలో కూలి పడ్డ చలువ పందిళ్లు తాత్కాలిక నిర్మాణాలవల్లే ప్రాణ నష్టం శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంపై టీటీడీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో రూ.4.47 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వత నిర్మాణాల గురించి టీటీడీ పట్టించుకోకపోవడంవల్లే భక్తులు బలి కావాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా వర్ష బీభత్సంవల్ల గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 80 మంది గాయపడగా, వీరిలో 32మంది కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో కోడల్ని కోల్పోయాం ‘‘నా పేరు సాంబశివరావు. మాది కృష్ణా జిల్లా పెడన మండలంలోని తెలుగుపాలెం. నాతోపాటు నా భార్య అరుణకుమారి, కోడలు ఎం.మీనాతోపాటు ఐదుగురం వచ్చాం. కల్యాణోత్సవంలో స్వామివారిని చూస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయాం. హఠాత్తుగా ఈదరుగాలులు, వర్షం ధాటికి స్తంభాలు నేలకూలాయి. కరెంటు పోయింది. బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నా కోడలు మీనా మృతి చెందింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించి తలంబ్రాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన మేము మృతదేహాన్ని తీసుకుని వెళ్లాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’’. -
వైఎస్సార్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య
-
విద్యుదాఘాతంతో యువతి మృతి
సాక్షి, రాజంపేట: విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ పంచాయతీ పరిధిలోని శేర్శంకర్ తండాలో శనివారం జరిగింది. దీప్ల, ఆజల కుమార్తె రేణుక(19) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు పక్కనే ఉన్న విద్యుత్ మెయిన్ వైరు తగలడంతో ఇంటికి కరెంట్ ప్రసారం జరుగుతోంది. ఇది గమనించని రేణుక బాత్రూంలో ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా వారికి కూడా షాక్ కొట్టింది. దాంతో పక్కింటి వారు పరుగున వచ్చి కట్టెతో కొట్టి విడిపించారు. రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. -
రాజంపేటలో బ్రౌన్షుగర్ అమ్మకాలు...
సాక్షి, రాజంపేట : వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణం బ్రౌన్షుగర్ క్రయవిక్రయాలకు అడ్డాగా మారింది. నిషేధిత బ్రౌన్షుగర్ అమ్ముతున్నారన్న సమాచారంపై పట్టణానికి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కొంతమంది యువకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. వారి వద్ద నుంచి బ్రౌన్షుగర్ కూడా లభ్యమైనట్లు తెలిసింది. కాగా ముగ్గురిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించినట్లు, ఆపై మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే పోలీసులు అదుపులో ఉన్న యువకులు పట్టణానికి చెందిన వారు కావడంతో పోలీసుస్టేషన్ వద్ద సంబంధీకులు మకాం వేశారు. దీన్ని బట్టి చూస్తే రాజంపేట పట్టణంలో బ్రౌన్షుగర్ అమ్మకాలు జరుగుతున్నాయనే వాదన బలపడుతోంది. స్థానికంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎక్కువ కావటంతో ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను ఇక్కడికి తెప్పించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో నిఘాను పెంచారు. శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కిలో బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
జడ్జి ఎదుటే ఎస్సై వీరంగం
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట కోర్టులో జడ్డి ఎదుటే ఓ ఎస్సై వీరంగం సృష్టించాడు. ఎర్ర చందనం రవాణా కేసు ముద్దాయి పెద్ద రెడ్డయ్య గురువారం కోర్టులో స్వచ్చందంగా లొంగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న చిట్వేలి ఎస్సై నాయక్ అతనిపై చేయిచేసుకున్నాడు. ఆగ్రహించిన న్యాయమూర్తి ఆ ఎస్సైను సాయంత్రం లోపల కోర్టులో హాజరు పరచాలని డీఎస్పీని ఆదేశించారు. -
కలలు..కల్లలు
రైలుమార్గం ప్రారంభం: 2010 బడ్జెట్లో ఆమోదం: 2008 – 09 అంచనా వ్యయం: రూ.1000 కోట్లు రైలుమార్గం: 258 కిలోమీటర్లు నిర్మాణం : నాలుగుదశల్లో ... భూసేకరణ: రూ.199.92 కోట్లు బడ్జెట్: రూ.240 కోట్లు రాజంపేట: కడప–బెంగళూరు మధ్య రైలు మార్గానికి సరిగ్గా ఏడేళ్ల కిందట శంకుస్ధాపన రాయిపడింది. అప్పటి నుంచి భూసేకరణ..నిధుల లేమి తదితర అం శాలు వెంటాడుతున్నాయి. దీనికి మహానేత దివంగత వైఎస్ రాజఖరరెడ్డి 2008లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం వాటా కేటాయించేలా చేశారు.ఆయన మరణాంతరం పనులునత్తనడకన సాగుతున్నాయి. ఈ రైలుమార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబరు 1న అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు.దీనికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనావ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. 258 కిలో మీటర మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించారు. ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే నేటికీ లక్ష్యం నెరవేరలేదు. రూ.100కోట్ల వ్యయంతో ఆర్ఐడీసీ రైల్నెట్వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిం చాయి. అందులో భాగంగా రూ.వందకోట్లతో రైల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది.ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గాన్ని చేర్చారు. మొదటిదశలోనే..... కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలు గుదశల్లో నిర్మాణం చేపట్టేలా నిర్ణయించారు. మొదటిదశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసే కరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేశారు. ఈ దశలో 21.8కిలోమీటర్ల వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నవి, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. ముందుకుసాగని మిగిలిన దశలు.. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు),మూడోదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) మదగట్ట టు ముల్బాగల్ (కర్ణాటక సరిహద్దు) నాలుగదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మా ణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్కు రూపకల్పన చేశారు. అయితే ఇది పూర్తి కావడానికి ఇంకెన్నాళ్లుపడుతుందోనని జిల్లావాసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. -
రాజంపేటలో ఇంట్లో పేలిన సిలిండర్
-
ప్రేమ కోసం వచ్చిన ప్రియుడు.. కానీ
– రైలు కింద పడి మృతి –పది రోజుల కిందటే గల్ఫ్ నుంచి వచ్చిన ప్రియుడు రాజంపేట: ఒకరు పెళ్లి కాని యువకుడు. మరొకరు పెళ్లై ముగ్గురు సంతానం ఉన్న వివాహిత. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎక్కడెక్కడో తిరిగారు. చివరికి ఆదివారం రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. మృతదేహాల వద్ద ఆధారాలను బట్టి రైల్వేపోలీసులు.. వారి వివరాలను సేకరించి, సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్కుమార్, మన్నూరు ఎస్ఐ మహేశ్నాయుడు, రైల్వే పోలీసులు చేరుకొని పరిశీలించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని సుంకేసులు గ్రామానికి చెందిన రాజోలి నాగార్జునరెడ్డి (26), కొమ్మలూరు గ్రామానికి చెందిన పుత్తా లక్ష్మీదేవి (26) కలిసి ఇళ్లు విడిచి వెళ్లారు. తన భార్య కనిపించడం లేదని ఖాజీపేట పోలీస్స్టేషన్లో మృతురాలి భర్త కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెకు ముగుర్గు సంతానం ఉన్నారు. పది రోజుల కిందట ప్రియుడు గల్ఫ్ నుంచి స్వదేశానికి రావడం జరిగింది. వీరిద్దరూ ఇంటి నుంచి బయట పడి తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరికి రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతుడి దేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. కాని మృతురాలి దేహాన్ని తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలిసింది. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజంపేటలో మెడికో విద్యార్ధి ఆత్మహత్య
-
పెట్రోలు దొంగల అరెస్ట్
రాజంపేట రూరల్: గూడ్స్ వ్యాగిన్లు, ట్యాంకర్ల నుంచి పెట్రోలు, డీజిల్ను దొంగలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. పెట్రోలు, డీజిల్ను దొంగలించే కనకయ్య, ఓబులమ్మను డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల ఎదుట సోమవారం హాజరు పరిచారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కనకయ్యశెట్టి, అంగడివీధికి చెందిన పెద్దఓబులమ్మ గతంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర ఆగే గూడ్స్ వ్యాగిన్ల నుంచి పెట్రోలు, డీజిల్ను దొంగలించి లారీలు, ఆటోలకు అమ్ముకుంటుండే వారు. ఇటీవల కాలంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర నుంచి ఐఓసీ, హెచ్పీసీఎల్ కంపెనీలను ఎత్తివేసి భాకరాపేట వద్ద హెచ్పీసీఎల్ కంపెనీని స్థాపించి, అక్కడి నుంచే పెట్రోలు, డీజిల్ను ట్యాంకర్ల ద్వారా పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ను దొంగలించడానికి అలవాటు పడ్డ కనకయ్యశెట్టి, పెద్దఓబులమ్మ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు డబ్బును ఎరగా చూపి.. హెచ్పీసీఎల్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ట్యాంకర్ల నుంచి అక్రమంగా తీసుకునే వారు. లారీలకు, ఆటోలకు పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఒకటి, రెండు రూపాయలకు తగ్గించి అమ్ముకునే వారు. కొందరు అందించిన సమాచారం మేరకు ఈ విషయంపై కూపీ లాగగా అక్రమ దందా వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ చోరీలో కనకయ్యశెట్టి రెండవ భార్య వెంకటసుబ్బమ్మ అలియాస్ బుజ్జమ్మ సహకారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు సహకరించిన గుంతకల్లుకు చెందిన ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు అయిన చంద్రశేఖర్, రఫిక్, ఆరీఫ్, ఎస్ఏ.ఖాదర్, ఖాదర్వలీ, మహమ్మద్, జిలానీ, అస్లాంబాషా, షఫి, అబ్దుల్రహిమాన్, వీరేష్, శివను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్, సిద్దవటం ఎస్ఐ అరుణ్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని వివరించారు. -
రాజంపేటలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
-
రాజంపేటలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
-
12న రజకుల వివాహ పరిచయ వేదిక
కడప రూరల్ : ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనే రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేదికకు హాజరయ్యే వారు వధూవరుల ఫుల్ఫోటో, పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 96427 10496 నెంబరులో సంప్రదించాలన్నారు. -
డ్యాన్సర్లతో ఏఎస్ఐ చిందులు..
-
పచ్చనేత ఇంటికి చేరిన జన్మభూమి సభ
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటిలో జన్మభూమిసభల నిర్వహణ వివాదస్పదంగా మారుతోంది.గురువారం సుద్దగుంతలలో స్ధానిక టీడీపీ నేత ఇంటివద్ద జన్మభూమి సభను నిర్వహించారు. మున్సిపాలిటీకి చెందిన రెండవటీం నిర్వాహకులు మున్సిపాలిటీ టీపీఓ బాలాజి, టీపీఎస్ మధుసూదనరావురు నేతృత్వంలో కార్యక్రమం కొనసాగింది. మున్సిపాలిటి విడుదల చేసిన ప్రకటనలో 5వతేదీన ఎంపీపీ ఎలిమెంటరీ స్కూలులో సభను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటి వద్ద సభను నిర్వహించే విధంగా మున్సిపాలిటి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చేసేదేమిలేక ఆయన ఇంటి వద్ద జన్మభూమిసభను నిర్వహించారు. సభకు హాజరైన మహిళలు ఇదేమి విడ్డూరం అంటూ అసంతృప్తితో వెళ్లిపోయారు. దీనికి అధికారులు ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సభకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కమిషనరు రమణారెడ్డి, రాజంపేట ఏరియా ఆసుపత్రి కమిటి చైర్మన్ వడ్డెరమణ, జెబీ సభ్యులు గుల్జార్బాష, మల్లెల సుబ్బరాయుడు, డా.సుధాకర్, సంజీవరావు, అబుబకర్, చిదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సుజనాచౌదరి సభలో మహిళల గగ్గోలు!
రాజంపేట/పుల్లంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పుల్లంపేట రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముందువరుసలో ఉన్న మహిళలు ఒక్కసారిగా లేచి తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న నష్టాలు, అన్యాయాలపై నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని , ఫించన్ రాలేదని, పని దినాలు కల్పించాలని, కరెంటు బిల్లులు కట్టలేకున్నామని మంత్రికి వినిపించేలా అరిచారు.అయితే వీరి గురించి పట్టించుకోకుండా సన్మాన ఆనందంలో మునిగిపోయారు. 50రోజుల పనిదినాలు కల్పిస్తాం: కలెక్టరు మహిళ కేకలు విని మంత్రి సుజనా వారి పరిస్థితి గురించి తెలుసుకోవాలని జిల్లా కలెక్టరు సత్యనారాయణను ఆదేశించారు. తమ అధికారి ద్వారా తెలుసుకున్న కలెక్టరు 50రోజులు పనిదినాలు కల్పిస్తామని చెప్పారు. అయినా మహిళలు సమాధానపడలేదు. కంటతడిపెట్టిన నిరుపేదమహిళ.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, పింఛను సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితలేకుండాపోయిందని చిన్నఓరంపాడుకు చెందిన నిరుపేద మహిళ గంగమ్మ కంటతడిపెట్టింది. ఈమెను పలకరించే నాథుడు కనిపించలేదు. నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా సభకు తీసుకొచ్చారు. మంత్రికి స్వాగతం పలికేందుకు గంటలతరబడి ఎండలో నిరీక్షించారు. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు మంత్రి సుజనా ప్రసంగిస్తున్న తరుణంలో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కృషి: సుజనా రాజంపేట: ప్రత్యేకప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి అభిప్రాపయడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప పవర్ఫుల్ జిల్లా అని కొనియాడారు.ఇక్కడ సహజవనరులు, ఖనిజాలు ఉన్నాయన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో సైన్స్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపనకు కృషిచేస్తామన్నారు. సీఎం రమేష్, పౌరసరఫరాల అభివృద్ధిసంస్ధ చైర్మన్ లింగారెడ్డి, జిల్లా కలెక్టరు సత్యనారాయణ, శాసనమండలి నేత సతీష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు మాట్లాడారు. -
రాజంపేటలో ఘనంగా దసరా ఉత్సవాలు
-
రాజంపేటలో నకిలీ కోయదొరలు అరెస్ట్
-
మాజీ ప్రియురాలే చంపేసింది
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో అదృశ్యమైన యువకుడు గాదెరాజు సాయిప్రకాశ్రాజు(19) హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి మాజీ ప్రియురాలు సునీతే చంపిందని పోలీసులు తేల్చారు. ప్రియుడు నాగేంద్రతో కలిసి సాయిప్రకాశ్రాజును హతమార్చింది. గుట్టుచప్పుడు కాకుండా వీరిద్దరూ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 28న సాయి కనపించడంలేదని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సునీతతో సాయికి వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అతడిపై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
అదృశ్యానికి అక్రమ సంబంధమే కారణమా !!
► మిస్టరీగా యువకుడి అదృశ్యం కేసు ► వారం రోజులుగా కనిపించిన పరిస్థితి ► వివాహేతర సంబంధంపై అనుమానాలు ► అర్బన్ పీసీలో మిస్సింగ్ కేసు నమోదు రాజంపేట: రాజంపేట పట్టణంలో గాదెరాజు సాయిప్రకాశ్రాజు(19) అదృశ్యం మిస్టరీగా మారింది. వారంరోజులుగా కనిపించని పరిస్థితి నేపథ్యంలో రాజంపేట అర్బన్ పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. మండలంలోని పాపరాచపల్లెకు చెందిన సాయిప్రకాశ్రాజు తన తల్లితండ్రులతో కలిసి పట్టణంలోని విద్యుతనగర్లో ఉంటున్నారు. ఇతని అదృశ్యం వెనుక వివాహేతర సంబంధంపై అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సాయి స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయి వారంరోజులుగా రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తన బిడ్డ అదృశ్యమైయ్యాడని తండ్రి చంద్రరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఆ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలో సాయినగర్లో నివాసం ఉంటున్న ఓ వివాహితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అప్పుడప్పుడు ఆమెతో గొడవపడి కొట్టేవాడ నే వాదనలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈమె భర్త జీవోనపాధికై గల్ఫ్దేశానికి వెళ్లాడని సమాచారం. మరొకరితో వివాహేతర సంబంధం కారణమనే... సాయిప్రకాశ్రాజు సంబంధం పెట్టుకున్న మహిళ కడపకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణమే వీరిద్దరికి మధ్య గొడవలు మొదలైనట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఈ యువకుడు ఆమె ఇంటిలోకి వెళ్లగానే అక్కడ కడపకు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు, తర్వాత వారి మధ్య ఘర్షణ వాతవరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సాయిపై దాడి చేయగా మృతి చెందినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోలీసు విచారణలో ఉన్న వివాహిత కూడా ఇదే విధంగా వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు సాయి ఉన్నడా? లేక హత్య చేసిన శవాన్ని మాయం చేశారా? ఎక్కడ బూడ్చారా అన్న అంశాలు పోలీసులకు సవాల్గా మారాయి. -
ఫ్యాన్సీ షాపు దగ్ధం : రూ. 20 లక్షల ఆస్తి నష్టం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న సిరి ఫ్యాన్సీ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని షాపు యజమాని రామిరెడ్డిగారి సురేష్బాబు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని చెప్పారు. -
టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి ఎ. సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. గురువారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఫాంహౌస్ లో ఆయన సమక్షంలో సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీలోకి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. యూపీఏ హయాంలో సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా సాయి ప్రతాప్ విజయం సాధించారు. అయితే గతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.మిథున్ రెడ్డి చేతిలో సాయి ప్రతాప్ ఓటమి పాలైయ్యారు. -
పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం: చిన్నారులు మృతి
రాజంపేట (వైఎస్సార్ జిల్లా) : ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చెరువులో తోసేసి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రాజంపేట మండల పరిధిలోని హోలి చెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. తల్లి రేఖ(30) పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం రామాపురం చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం అటవీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
రాజంపేట: వేగంగా వెళ్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్జిల్లా రాజంపేట మండలం రామాపురం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి చెందిన క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు వాహనంలో తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కలుషితాహారంతో బాలికలకు అస్వస్థత
రాజంపేట : ఆహారం వికటించి 15 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 300 మంది బాలికలు ఉండే ఈ వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం తిన్న ఆహారంతో రాత్రి కొందరికి వాంతులు, విరేచనలు మొదలయ్యాయి. వారిని రాజంపేటలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, గురువారం ఉదయం వరకు కూడా తమను చూసేందుకు వైద్యులు రాలేదని బాలికలు చెబుతున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజంపేటలో తన్నుకున్న పచ్చతమ్ముళ్లు
రాజంపేట: తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఎంపికపై తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో గురువారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కమిటీల ఎంపిక చేపట్టారు. ఒంటిమిట్ట మండల కమిటీ ఎంపిక ఏకపక్షంగా జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య వర్గం ఆరోపించింది. వారి అభ్యంతరాలతో గొడవ ప్రారంభమవడంతో ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డి వర్గం ఎదురుదాడికి దిగింది. వాదప్రతివాదాలు ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మల్లికార్జునరెడ్డి..గొడవలకు కారణమయ్యే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించటంతోపాటు బ్రహ్మయ్య వర్గానికి చెందిన కొందరిని సమావేశం బయటకు పంపడంతో పరిస్థితి చక్కబడింది. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రాజంపేట (వైఎస్సార్జిల్లా): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఆదివారం లభ్యమైంది. నదిలో వ్యక్తి (35) మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతుడు రెండు మూడు రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతోళ్లం కనిపించమా?
రాజంపేట : జిల్లాలో టీడీపీకి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట నియోజకవర్గంలో నేతల విభేదాలు రచ్చకెక్కాయి. ఒంటిమిట్ట, సుండుపల్లె మండల కమిటీ ఎన్నికల ప్రక్రియ రసాభాసాగా మారింది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె, సిద్ధవటం, వీరబల్లి మండలాల నేతలు శుక్రవారం రాజంపేట పట్టణంలోని కళాంజలి గార్డెన్స్లో సమావేశమయ్యారు. మండల కమిటీ అధ్యక్షుల పేర్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రకటించడం మొదలుపెట్టారు. రాజంపేట, నందలూరు, వీరబల్లి మండల కమిటీలను ప్రకటించారు. అంతలో.. గ్రామ కమిటీలు ఏకపక్షంగా జరిగాయని కొందరు, లాడ్జిలో కూర్చొని జాబితా తయారు చేశారని మరికొందరు ఆరోపిస్తూ వేదిక వద్దకు దూసుకొచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమావేశం గందరగోళంగా మారింది. సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు విమర్శించారు. ఒంటిమిట్టతో రసాభాస.. ఒంటిమిట్ట అధ్యక్షునిగా వెంకట నరసయ్య పేరును ప్రకటించగానే, అదే మండలానికి చెందిన కొత్తపల్లె శ్రీనువాసులు, పంచవెంకటయ్య, రాజుకుంటపల్లె రమణ, వెంకటరెడ్డి, గజ్జెల సుబ్బారెడ్డి, అడ్వకేట్ రామదాసు, ఈశ్వరయ్య, కట్టానారాయణ ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకువచ్చారు. వెంకట నరసయ్య వద్దంటూ.. మరొకరిని అధ్యక్షునిగా నియమించాలని నిలదీశారు. లింగారెడ్డి, మేడా.. జోక్యం చేసుకొని సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. ఇది ప్రతిపాదన మాత్రమే అని, గజ్జెల సుబ్బారెడ్డి, రామదాసు పేర్లు కూడా అధిష్టానానికి పంపుతామని, తుది నిర్ణయం అధిష్టానందేనని శాంతింపజేశారు. సుండుపల్లెలో సీనియర్లు వర్సెస్ తెలుగు కాంగ్రెస్ సుండుపల్లె కమిటీని ప్రకటించేసరికి సీనియర్లు, తెలుగు కాంగ్రెస్ కమిటి నేతలకు మధ్య అధ్యక్ష పదవి కేటాయింపు విషయంలో తేడాలు పొడచూపాయి. కమిటి అధ్యక్షునిగా మహేష్రాజు పేరును ప్రకటించే సమయంలో, ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న శివకుమార్నాయుడు వర్గం ఊవ్వెత్తున ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఇరు వర్గాల వారు పరస్పరం దూషించుకున్నారు. తాము పాతోళ్లమని, కాంగ్రెస్లో ఉండి.. రెండేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన మహేష్రాజుకు నాయకత్వ బాధ్యతలు ఎలా ఇస్తారని శివకుమార్నాయుడు వర్గం నిలదీసింది. లింగారెడ్డి జోక్యం చేసుకొని సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తుదకు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాల వారిని దూరంగా పంపించారు. నేనేమైనా వైఎస్సార్కు పనిచేస్తున్నానా? శివకుమార్నాయుడు, మహేష్రాజు వర్గీయులు గొడవ పడటం, సుండెపల్లె నేతలు నిలదీయడంతో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సహనం కోల్పోయారు. మీరొక్కరే తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నారా? నేనేమైనా వైఎస్సార్ పార్టీకి పని చేస్తున్నానా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ గొడవ పడాల్సిన పని లేదు.. ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపుతాం. పై స్థాయిలో నిర్ణయం జరుగుతుందని అందరికీ సర్దిచెబుతుండగా, అక్కడ కాదు.. ఇక్కడే లేల్చితేనే న్యాయం జరుగుతుందని కొందరు నేతలు పట్టుపట్టారు. దీంతో రసాభాసగా మారిపోయింది. అంతలో పలువురు నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. సుండుపల్లె మండలానికి చెందిన సీనియర్లు అలిగి వెళ్లిపోయారు. సుండుపల్లె, ఒంటిమిట్ట మండల కమిటీల ఎంపిక నిలిచిపోయింది. కాగా, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య వర్గం దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ అంటే అంత నిర్లక్ష్యమా!
వైఎస్సార్ జిల్లా(రాజంపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కమిటి కన్వీనర్ నారా లోకేష్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. లోకేష్ తీరుకు వారు చాలా నిరుత్సాహపడ్డారు. బ్రహ్మంగారి మఠం మండలం కేశవపురంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజంపేటలో కాసేపు ఆగారు. బైపాస్ సర్కిల్లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. పూలదండను ఎన్టీఆర్ విగ్రహం భుజంపై సిద్ధంగా ఉంచారు. లోకేష్ అక్కడకు రాగానే ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయాలని కార్యకర్తలు, నేతలు కోరారు. ఇందుకు ఆయన స్పందించ లేదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయినా లోకేష్ పట్టించుకోకుండా విగ్రహాన్ని చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. దాంతో కార్యకర్తలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు, తన తాత విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించకుండా లోకేష్ నిర్లక్ష్యంగా వెళ్లిపోయినందుకు కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్ అంటే అంత నిర్లక్ష్యమా!
-
కరుణ చూపని ప్రభు..!
ప్రతి రైల్వేబడ్జెట్లో జరుగుతున్న అన్యాయమే ఈసారీ పునరావృతమైంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు జిల్లాకు హ్యాండిచ్చారు. జిల్లా ప్రజల రైల్వే ఆవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీలు, ప్రజాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను బీజేపీ సర్కారు తుంగలో తొక్కింది. అరకొర కేటాయింపులతో దశాబ్ధాలుగా రైల్వేలైన్ల నిర్మాణం పూర్తికావడంలేదు. ఈ బడ్జెట్ జిల్లా వాసులను పూర్తిగా నిరాశపరిచింది. రాజంపేట: రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. కొత్తరైళ్లు ఊసేలేదు.. గత హామీల అమలులేదు.. అధిక ప్రాధాన్యం ఉన్న ముంబాయి-చెన్నై కారిడార్ పరిధిలో జిల్లా ఉన్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎర్రగుంట్ల-నొస్సం మధ్య ప్యాసింజర్ రైలును రెండేళ్ల కిందట బడ్జెట్లో ప్రకటించగా అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. కొత్తరాజధానికి మార్గం లేకపోయినా, కడప నుంచి రేణిగుంట మీదుగా నడిపే విధంగా కొత్తరైలు తీసుకురావాలన్న డిమాండ్ను కూడా పక్కనపెట్టేశారు. డీఎంయు (కడప-తిరుపతి-రేణిగుంట) రైళ్లు, తుంగభద్ర ఎక్స్ప్రెస్, తిరుపతి-షిర్డి రైళ్ల ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. కనెక్టివిటీ లైన్ల ఊసేలేదు రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కేంద్రం నుంచి రాజధానిగా మారుతున్న ప్రాంతానికి కనెక్టివిటీ లైన్ల గురించి రైల్వేబడ్జెట్లో మంత్రి ప్రస్తావన చేయలేదు. ప్రొద్దుటూరు-కంభం, భాకారపేట-గిద్ద లూరు రైల్వేలైన్లను గత బడ్జెట్లో ఇచ్చిన సర్వేలకే పరిమితం చేశారు. ఆ లైన్ల కోసం కేటాయింపులు కూడా చేయలేదు. జిల్లా నుంచి రాజధాని కోసం రేణిగుంట మీదుగా ఒక పొడిగింపు రైలును కూడా మంజూరు చేయలేదు. రైల్వేపరిశ్రమకూ మొండిచెయ్యే... జిల్లాలో బ్రిటిష్ కాలం నుంచి రైల్వేపరంగా ప్రాముఖ్యత కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో ఎప్పటిలాగే రైల్వే పరిశ్రమ ఏర్పాటులో మొండిచెయ్యి మిగిల్చారు. యుపీఏ హయాంలో అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్యాదవ్ రాజ్యసభలో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించారు. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి లోక్సభలో నందలూరు ప్రాముఖ్యత గురించి సభలో వివరించారు. రెడీమేడ్గా ఉన్న వనరులను వినియోగించుకుని జిల్లాకు భారీ రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన సంగతి విధితమే. బీజెపీ అధికారంలోకి వస్తే రైల్వేపరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీపెద్దలు లోకోషెడ్ను సందర్శించిన సందర్భంగా మాటలు నీటిమూటలుగా మారిపోయాయని స్ధానికులు విమర్శిస్తున్నారు. కేటాయింపులు ఇలా.. రైల్వేబడ్జెట్లో జిల్లాలోని 31 కిలోమీటర్లు నిర్మితం కావాల్సిన నంద్యాల-ఎర్రగుంట్లకు రూ.130 కోట్లు కేటాయించారు. కడప-బెంగళూరు రైల్వేలైన్ పెండ్లిమర్రి వరకు ఎర్త్ వర్క్ పనులు జరిగిన నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో రూ.265కోట్లు కేటాయించారు. ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గంలో బడ్జెట్లో కేవలం రూ.కోటి నిధులు మాత్రం కేటాయించారు. గత బడ్జెట్లో ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు విషయంలో 24 శాతం పెరిగినట్లు రైల్వేనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కరుణించు ప్రభూ
రాజంపేట: నిన్న యూపీఏ.. నేడు ఎన్డీఏ.. పాలకులు ఎవరైనా జిల్లా రైల్వే ప్రగతిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో పనులు నొస్సం వరకు పూర్తి కాగా, కడప- బెంగళూరు పనులు పెండ్లిమర్రి వరకు పూర్తయ్యాయి. ఇక కృష్ణపట్నం- ఓబులవారిపల్లె మార్గంలో ఎర్త్ పనులు పూర్తికాగా, టన్నెల్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులకు అరకొర నిధులు కేటాయిస్తుండటంతో దశాబ్దాల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక కొత్త రైళ్లపై జిల్లా వాసులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ముంబయి-చెన్నై కారిడార్ మార్గం జిల్లా మీదుగా ఉండటంతో బైవీక్లీ ైరైళ్లు నడుస్తున్నాయి. జిల్లాలో రైల్వేపరంగా బ్రిటీష్ కాలం నుంచి వైభవంగా వెలుగొందిన నందలూరు రైల్వే పరిశ్రమపై నాటి యూపీఏ..నేటి ఎన్డీఏ పాలకులు శీతకన్ను వేశారన్నది వాస్తవం. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానికి జిల్లా నుంచి ఒక్కటంటే ఒక రైలుమార్గం కూడా అందుబాటులో లేదు. కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్తోపాటు డబుల్డెక్కర్ రైలు స్టాపింగ్స్ గురించి ఎప్పటి నుంచో కోరుతున్నా రైల్వే మంత్రిత్వశాఖ ఖాతరు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే అభివృద్ధి విషయంలో జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈనెల 26న పార్లమెంటులో రైల్వేమంత్రి సురేష్ప్రభు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ఈసారైనా కరుణ చూపేనా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లపై కోటి ఆశలు.. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్ల మాట అటుంచితే.. కనీసం పొడిగింపు రైళ్లకు కూడా మోక్షం కలగలేదు. జిల్లా మీదుగా షిర్డికి వెళ్లేందుకు గతంలో ఏర్పాటు చేసిన రైలును ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి హయాంలో గుంతకల్లు నుంచి ధర్మవరం, పాకాల మీదుగా తిరుపతికి మళ్లించేలా చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లా మీదుగా షిర్డీ వెళ్లేందుకు ఒక్కరైలు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. అలాగే మచిలీపట్నం-తిరుపతి రైలును కడప వరకు పొడిగిస్తే తాత్కాలికంగా రాజధానికి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో నందలూరు నుంచి నొస్సం వరకు రైలు నడిపించాలనే ప్రయత్నాలు ఎప్పుడు అమలవుతాయో అర్థం కావడం లేదు. పగటి పూట కర్నూలు- హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలును కడప వరకు పొడిగించాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. చెన్నై నుంచి డీజిల్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూ) రైళ్లను కడప వరకు నడిపిస్తే ఆదాయం బాగుంటుందని రైల్వే కమర్షియల్ అధికారులు సూచిస్తున్నా పట్టించుకునే వారు లేరు. జిల్లాలో గ్రామీణులకు అందుబాటులో గుంతకల్లు నుంచి కడప వరకు, కడప నుంచి రేణిగుంట వరకు మరో ప్యాసింజర్ రైలును కోరుతున్నప్పటికి బోగీల కొరత ఉందంటూ కాలయాపన చేస్తున్నారు. కొత్త రైల్వే లైన్లు సర్వేలకే పరిమితం.. 2010-2011 రైల్వే బడ్జెట్లో కూడా కొత్త రైల్వే లైన్గా కంభం-ప్రొద్దుటూరును ప్రకటించారు. రైల్వేలైన్ 142 కిలోమీటర్ల మేర ఉండే విధంగా రూట్ను ఖరారు చేశారు. దాదాపు రూ.829 కోట్ల వ్యయాన్ని ఈ రైల్వేలైన్కు అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రణాళిక సంఘం ఈ లైనుకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీఏ, ఎన్డీఏ సర్కారు బడ్జెట్లో ప్రవేశపెట్టిన గిద్దలూరు- భాకరాపేట, కంభం -ప్రొద్దుటూరు రైల్వే లైన్లు గిద్దలూరులో ఉన్న రైలు మార్గానికి కలిపే విధంగా సర్వేలు చేపట్టిన విషయం విదితమే. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు, బద్వేలు మీదుగా గిద్దలూరు లైనుకు కలిపే విధంగా మార్గానికి రూపకల్పన చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం. గత బడ్జెట్లో కేటాయింపు ఇలా.. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక తొలిసారి అప్పటి రైల్వేమంత్రి సదాశివనందగౌడ్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులకు ఆశాజనకంగా లేదు. కంభం-ప్రొద్దుటూరు లైనుకు రూ. 10లక్షలు, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్కు రూ.208కోట్లు, కడప-బెంగళూరు రైల్వేలైన్కు రూ. 30కోట్లు కేటాయించారు. పెండ్లిమర్రి వరకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ రైల్వేలైను అందుబాటులోకి రావాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందోననే చర్చ జరుగుతోంది. అలాగే నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్కు రూ.80కోట్లు కేటాయించారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైలును పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిపిస్తారోనని ఆ రెండు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ైరె ల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందో లేదో వేచి చూద్దాం. -
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం టన్నెల్ పనులకు బ్రేక్
రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం మార్గం రైల్వేలైన్కు సంబంధించిన టన్నెల్ నిర్మాణ పనులు ఆది నుంచి అడ్డంకులతో ముందుకు సాగడంలేదు. ఈ మార్గంలో టన్నెల్ నిర్మించేందుకు 2007లో చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) టెండర్లు పిలిచింది. అప్పట్లో ముంబయికి చెందిన దీపికా నిర్మాణ సంస్థ ఈ పనులను దక్కించుకుని పనులు మొదలుపెట్టింది. ఈ మార్గంలోని వెలుగొండ అడవుల్లో కొండను తవ్వినప్పుడు వచ్చిన మట్టి, ఎర్త్ పనులకు సంబంధించిన విషయంలో ఆర్వీఎన్ ఎల్తో కాంట్రాక్టు సంస్థకు విభేదాలు పొడసూపాయి. దీనికితోడు టెండర్లు పిలిచినప్పటి రేట్లతో తాము పనులు కొనసాగిస్తే నష్టపోతామని అందువల్ల ఈ పనులను చేయలేమని సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆర్వీఎన్ఎల్ గత ఏడాది చివర్లో ఈ పనులకు తిరిగి టెండర్లు నిర్వహించింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన హెచ్ఈడబ్ల్యు నిర్మాణ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం కావాల్సి ఉంది. ఈ దశలో తొలుత టెండర్లు దక్కించుకుని ఆ తర్వాత పనులు నిలిపేసిన దీపికా సంస్థ ఆర్వీఎన్ఎల్ నుంచి తమకు కోట్లాది రూపాయల డబ్బు రావాల్సి ఉందని కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పనులను దక్కించుకున్న హెచ్ఈడ బ్ల్యు సంస్థ పనులు మొదలుపెట్టేందుకు వీలు లేకుండా పోయింది. టన్నెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందున పనులకు బ్రేక్ పడిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టులో కేసు పరిష్కారం కావడంతో పాటు ఈ మార్గంలో పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైతే తప్ప టన్నెల్ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 23న రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా అధిక నిధులు కేటాయిస్తారేమోననే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పనులు ముమ్మరంగా.. ఇదిలా ఉండగా ఈ మార్గంలో ఉన్న మొత్తం మూడు రీచ్లలో జర గాల్సిన మిగతా పనులను ఆర్వీఎన్ఎల్ వేగవంతంగా చేపడుతోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని ఎర్త్వర్క్ పనులు పూర్తయ్యాయి. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలు పట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్ పనులను 17 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. 38 చిన్న వంతెనలు, 8 పెద్ద వంతెనలు పూర్తి కానున్నాయి. పెరిగిన అంచనా వ్యయం.. కృష్ణపట్నం రైల్వేలైను 2005-06లో మంజూరైనప్పుడు రూ.930 కోట్ల అంచనాతో రైల్వే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. టన్నెల్ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గంలో టన్నెల్ నిర్మాణ పనులకు మోక్షం లభించేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది. -
ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు
జిల్లావాసుల కోరిక నెరవేరింది.. పార్టీలకతీతంగా ఉమ్మడిగా కలిసి చేసిన కృషి ఫలించింది.. రాష్ట్రస్థాయిలో ఆధ్యాత్మిక పరంగా జిల్లాకు విశిష్ట గుర్తింపు దక్కింది. ఇకపై ప్రతి నవమినాడు జిల్లా ప్రత్యేక శోభతో విలసిల్లనుంది.. రాష్ట్ర పటంలో జిల్లా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. ఒంటిమిట్ట కోదండరాముడికే ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు సీఎం అంగీకరించడంతో జిల్లావాసుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కడప కల్చరల్: అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఇక ప్రతి శ్రీరామ నవమి ఉత్సవాలలోనూ రాజ లాంఛనాలు అందుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రత్యేకించి రాజంపేట, ఒంటిమిట్టలలో భక్తుల ఆనందోత్సాలు మిన్నంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం రాముడికి శ్రీరామ నవమి నాడు అందుతున్న ప్రభుత్వ లాంఛనాలు రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల శ్రీ కోదండ రామయ్యకు అందుతాయని జిల్లా ప్రజలు ఒంటిమిట్టకే రాజలాంఛనాలు దక్కుతాయని ఎంతో ఆశించారు. దీనికి అడ్డుపడుతూ విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కించుకునేందుకు ఆ జిల్లా వాసులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒంటిమిట్టకే రాజ లాంఛనాలు దక్కడం అన్ని విధాల న్యాయమని స్థానిక రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన భాష, చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ముందుకు రావడంతో జిల్లా వాసుల డిమాండ్కు మరింత బలం చేకూరింది. ఎత్తులు చిత్తు ఒంటిమిట్ట రామాలయానికి ప్రభుత్వ లాంఛనాలు దక్కుతాయోనన్న భయంతో కొందరు విజయనగరం రామతీర్థం ఆలయానికి లేనిపోని ఊహాగానాలతో పురాణగాథలను అప్పటికప్పుడు సృష్టించి దినపత్రికల ద్వారా ప్రచారంచేసే కుట్ర చేశారు. కానీ, అటు పురాణ పరంగా చూసినా, ఇటు చరిత్ర పరంగా చూసినా, జనాంతికంగా గమనించినా ఒంటిమిట్ట రామాలయానికి మాత్రమే రాజలాంఛనాలకు పూర్తి స్థాయి అర్హత ఉందని ‘సాక్షి’ దినపత్రిక శాసనాలు, కైఫీయత్తులు, పేజీ నెంబర్లు సహా ఈ నెల 18న ప్రచురించింది. పౌరాణిక కథనాలతో నిర్ణయం తీసుకోవడం హేతుబద్ధం కాదని, చరిత్ర, పురావస్తుశాఖల నిపుణులతో పరిశీలింపజేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్న ప్రజాభిప్రాయాన్ని ప్రచురించింది. ప్రజా విజయం ఎట్టకేలకు జిల్లావాసులు విజయం సాధించారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా వాసుల డిమాండుకు అంగీకారం తెలుపుతూ దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లికార్జునరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అందరి కృషి ఒంటిమిట్ట ఆలయానికి రాజలాంఛనాలు సాధించడంలో దాదాపు అందరి కృషి ఉండడం విశేషం. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒక్కటిగా కలిసి డిమాండ్ చేయడంతో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి గౌరవించారు. ఇంటాక్ సంస్థ నవంబరు 24న ఒంటిమిట్టలో భారీ ర్యాలీ నిర్వహించింది. సాధన క్రమం ఇలా.... రాష్ట్రం విడిపోయిన తర్వాత గత నవంబరులో ‘సాక్షి’ దినపత్రిక ‘ఇక ప్రభుత్వ లాంఛనాలు ఒంటిమిట్ట కోదండ రామునికేనా’ అన్న శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్లో చర్చను లేవనెత్తింది. అనంతరం మొదలైన ప్రజా ఉద్యమానికి ఊతమిస్తూ జనవరి 17, 26 తేదీల్లో కూడా ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రజలు, భక్తుల డిమాండ్ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయంలో సమావేశం నిర్వహించి రాజలాంఛనాలు ఈ ఆలయానికే దక్కాలని డిమాండ్ చేశారు. అనంతరం కడప నగరంలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పై అంశాన్ని బలపరిచారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం తిరుమలకు రానున్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంటిమిట్ట, తాళ్లపాకలతోపాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించనున్నారు. ఒంటిమిట్ట రామునికే రాజ లాంఛనాలు దక్కనున్నాయన్న నేపధ్యంలో ఆయన రాక ప్రత్యేకతను సంతరించుకుంది. -
పల్లెపై పన్ను పోటు!
రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు సన్నద్ధమవుతోంది. నిన్నటి వరకు మున్సిపాలిటీల్లో పన్నులు రాబట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా పల్లె జనంపై కూడా పన్నుపోటు వేయనుంది. వివిధ రకాల పన్నులతో పంచాయతీల ఆదాయం పెంచుకోవాలనే దిశగా యోచిస్తోంది. రాజంపేట: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి తద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం కల్పించడంపై దృష్టి సారించింది. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు తమకు వచ్చే ఆదాయంతో అభివృద్ధి చేసుకోవాలని చెబుతూనే అందుకు అవసరమైన ఇంటిపన్నులు మొదలుకుని ఎన్నిరకాల పన్నులు ఉన్నాయో అన్నీ పెంచుకోవాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పైసా కూడా విదల్చదని..‘మీ అభివృద్ధి..మీ పన్నులతోనే’ అనే నినాదాన్ని చంద్రబాబు సర్కారు తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదేరీతిలో పల్లెలపై కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా పన్నుపోటు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీల వారీగా ఆదాయవనరులు కల్పించుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో ఇక అందరి దృష్టి పల్లెలపై పడనుంది. జిల్లాలో 700 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో పన్నులు పెంచుకునేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. 48 రకాల పన్నులు.. పంచాయతీరాజ్ కమిషనర్ గ్రామాల్లో 48 రకాల పన్నులు విధించవచ్చని గుర్తించారు. ఆయా రకాల వృత్తులు, పనులు తదితర వాటిని గుర్తించి వాటి వివరాలను ఆర్ఏ పీఆర్ వెబ్సైట్లో పొందుపరిచారు. వాటిపై పన్నులు ఎలా వేయాలి..ఎంతెంత వసూలు చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. తక్కువ జనాభా ఉండే పల్లె పంచాయతీ మొదలుకుని మేజర్ పంచాయతీల వరకు ఈ పన్నును వర్తింపజేసేందుకు గత యేడాది డిసెంబరులో సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పుడు రాజంపేట, జమ్మలమడుగు, కడప డివిజన్లలో పెలైట్ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను తీసుకొని ఆయా డీఎల్పీఓల పర్యవేక్షణలో ఈఓపీఆర్డీల నేతృత్వంలో సర్వేలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 19,20వ తేదీలలో ఈ సర్వేను చేపట్టనున్నారు. ఈ సర్వే ద్వారా వేటివేటికి పన్ను వేయాలి..పన్ను చెల్లించనివారు ఉన్నారా? ఇళ్లు, నీటికనెక్షన్లు తదితర అన్ని అంశాలపై కూలంకషంగా వివరాలు తెలుసుకున్న తర్వాత పన్నుల వేటను పంచాయతీలు ప్రారంభించనున్నాయి. ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండానే పన్నులు రాబట్టాలని అధికారులకు మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వానికి మధ్య గ్రామ, మండల స్థాయి అధికారులు నలిగిపోతున్నారు. ప్రజలనుంచి వచ్చే విమర్శలను ఎలా తట్టుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు. ఒకటేంటి.. పల్లె నుంచి మండల కేంద్రం వరకు ఒకటేంటి.. ఎన్ని రూపాల్లో వీలయితే అన్ని రూపాల్లో ఆదాయవనరులను సమకూర్చుకోవాలనే దిశగా పన్నుల వసూలుకు టీడీపీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. పల్లెల్లో ఉన్న వివిధ రకాల వ్యాపారాలు, వ్యక్తిగత వ్యాపారం, పబ్లిసిటీకి సంబంధించిన బోర్డులు, రైతుల ఉత్పత్తులు ఇలా ఒకటేంటి పలు విధాలుగా ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు సన్నద్ధులవుతున్నారు. రైతుల నుంచి కాటారుసం(ధాన్యం,ఉద్యానవన పంటలు) వసూలు చేయనున్నారు. క్వింటాళ్ల లెక్కన పన్ను రాాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. గోడమీదరాతలు, ఇటుకలతయారీ, ప్రచారహోర్డింగ్(కమర్షియల్), కొళాయిల డిపాజిట్లు, షాపుల లెసైన్సులు, పిండిమిషనర్లు, ఖాళీ స్థలం, వ్యవసాయభూమి,సెల్టవర్స్, ఫోర్వీలర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెల్లో జనం వేటిపై ఆధారపడి జీవిస్తున్నారో వాటన్నింటిపై పన్నులు వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణుల్లో గుబులు పుట్టిస్తోంది. -
సామాన్యుడిపై కక్ష సాధింపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సాక్షి ప్రతినిధి, తిరువతి: ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం కరెంటు చార్జీలు, డీజిలు, పెట్రోలు ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తోంది. బొగ్గు ధరలు తగ్గినా విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిలు ధరలపై లీటరుకు *4 ఆధారిత పన్ను (వ్యాట్) విధించింది. దీని ప్రభావం నిత్యావసర పస్తువులతో పాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు ఉన్నా బకాయిలు చెల్లించలేదని కేసులు పెడుతున్నారు. 2004 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతులంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. రైతులు, సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతోంది. అన్నదాతలపై కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజల తరపున పోరాటాలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదు’’అని హెచ్చరించారు. -
సామాన్యుడిపై కక్ష సాధింపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తిరువతి: ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం కరెంటు చార్జీలు, డీజిలు, పెట్రోలు ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తోంది. బొగ్గు ధరలు తగ్గినా విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిలు ధరలపై లీటరుకు *4 ఆధారిత పన్ను (వ్యాట్) విధించింది. దీని ప్రభావం నిత్యావసర పస్తువులతో పాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు ఉన్నా బకాయిలు చెల్లించలేదని కేసులు పెడుతున్నారు. 2004 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతులంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. రైతులు, సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతోంది. అన్నదాతలపై కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజల తరపున పోరాటాలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదు’’అని హెచ్చరించారు. -
అన్న క్యాంటీన్..ఆర్భాటమే!
రాజంపేట టౌన్: అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ‘తమిళనాడు రాష్ట్రంలో మాదిరి ఆంధ్రలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.. రూ. 5కే పేదల కడుపు నింపుతాం’ అంటూ హడావుడి చేశారు. మరోవైపు మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఆ పథకం అమలు తీరుపై అవగాహన కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీతతో పాటు పలువురు ఐఏఎస్లు, మున్సిపల్శాఖ కమిషనర్లు తమిళనాడులో సైతం పర్యటించి వచ్చారు. కానీ రోజులు మారుతున్నా.. నెలలు గడుస్తున్నా అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాదుకదా ఆ ఊసే లేకుండా పోరుుంది. తమిళనాడు పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయిల ప్రజా ధనం ఖర్చుచేసింది. తొలివిడతగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు పలు మున్సిపాలిటీలను కూడా ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్థానం రాజంపేట నియోజకవర్గం కావడంతో ఈ మున్సిపాలిటీని కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. అన్న క్యాంటీన్ల ఏర్పాటు విషయంలో అప్పట్లో రాష్ట్రంలోని మంత్రులు, అధికారుల హడావుడి చూసి ఇక్కడి నిరుపేదలంతా ప్రస్తుత కరవు కాలంలో ఒక పూట అయినా ఆకలి దప్పులు తీరుతాయని సంబర పడ్డారు. అంతేగాక పట్టణంలోని పాతబస్టాండు సమీపంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేసేందుకు ఇక్కడి మున్సిపల్శాఖ అధికారులు అక్కడి గదులను శుభ్రం చేయించారు. అయితే ఆరునెలలైనా ఇటు ముఖ్యమంత్రి కానీ, అటు మంత్రులు, అధికారులు కానీ అన్న క్యాంటీన్ల ఊసే ఎత్తక పోవడం, దీనికి తోడు అన్న క్యాంటీన్ ఏర్పాటుకు శుభ్రం చేసిన గదులు ప్రస్తుతం అపరిశుభ్రంగా తయారవడంతో ఇంతకీ అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయా అన్న అనుమానం పేద ప్రజల్లో వ్యక్తమవుతోంది. మింగను మెతుకు లేకున్నా.. ఒకవైపు కూలీలకు సరిగ్గా పనులు దొరకక, మరోవైపు కరవుతో జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా ఊహ ప్రపంచంలో విహరించకుండా కింది స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే పేద ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతుందని వారు అంటున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ను ఆంధ్రులు అన్నా అని పిలుచుకుంటారని, అలాంటి పేరుతో చేపట్టాలనుకున్న పథకాన్ని కూడా చేపట్టక పోవడం బాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఇంకా గైడ్లైన్స్ రాలేదు అన్న క్యాంటీన్కు రాజంపేట మున్సిపాలిటీ ఎంపికైంది. అయితే క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. అన్న క్యాంటీన్ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే ఏర్పాటు చేస్తాం. -ఫజులుల్లా, మున్సిపల్ కమిషనర్, రాజంపేట. -
ఎర్ర స్మగ్లర్లు
రాజంపేట: నిఘా పెరిగే కొద్దీ ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. పద్ధతి ఏదైనా వారి దారి రైలు మార్గమే. రోడ్డు మార్గంలో వాహనాల్లో కంటే రైలు మార్గమే సురక్షితమని వారు భావిస్తున్నారని తాజా సంఘటనలు రుజువు చేస్తున్నారుు. ఇటీవల జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్పై పోలీసుశాఖ పట్టుబగించడం.. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఉద్ధృతం కావడంతో స్మగ్లర్లు రవాణా రూట్ మార్చుకుంటున్నారు. తాజాగా రైళ్ల ద్వారా ప్రయాణికుల్లా బ్యాగుల్లో దుంగలను తరలించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇటీవల నందలూరులో కూడా బ్యాగులో దుంగలను తరలిస్తుండగా రైల్వే జనరల్ పోలీసులు పట్టుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్లు నరికేందుకు తమిళతంబిలు కూడా రైళ్లలో రాజంపేట, బాలుపల్లె, రైల్వేకోడూరు, మామండూరు, అనంతరాజంపేట, పుల్లంపేట రైల్వేస్టేషన్ల ద్వారా శేషాచలంలోకి ప్రవేశించేశారు. ఇలాంటి వందలాది మందిని గతంలో పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా దుంగలను రైళ్ల ద్వారా గమ్యాలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. పునరావృతమైన రైళ్లలో స్మగ్లింగ్ రెండు దశాబ్ధాల కిందట స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను గూడ్స్రైళ్లలో రవాణా చేసేవారు. శేషాచల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బాలపల్లె, మామండూరు తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రవాణా చేసేవారు. చెన్నై హార్బర్కు వెళ్లే ఐరన్ఓర్ రవాణా చేసే గూడ్స్రైళ్లలో దుంగలను తరలించేవారు. వ్యాగిన్లో దుంగలు హార్బర్కు వెళితే.. అక్కడ నుంచి స్టీమర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యేది. గూడ్స్రైళ్లలో దుంగల తరలింపు అప్పట్లో పెద్దఎత్తున జరిగేది. అయితే ఈ రవాణాపై నిఘా వ్యవస్ధ ్ట తీవ్రస్ధాయిలో దృషి సారించడంతో స్మగ్లర్లు రవాణా రూట్ను మార్చుకున్నారు. రోడ్డు మార్గాన్ని ఎంచుకుని చాలా ఏళ్లు సాగించారు. అక్కడ నిఘా ఎక్కువ కావడంతో ఇప్పుడు మళ్లీ ఏకంగా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణీకుల ముసుగులో దుంగలను తరలించేస్తున్నారు. పరిస్ధితులను బట్టి రవాణా పరిస్ధితులను బట్టి స్మగ్లర్లు దుంగలను రవాణా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర లారీలు, ఆర్టీసీ బస్సుల నుంచి రైళ్లలో రవాణా జరిగే స్థాయికి పెరిగింది. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టడంతో శేషాచల అడవుల నుంచి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. గతంలో లారీలు, ట్రక్కులు, ఆటోలు, జీపులలో చివరికి టు వీలర్లలో సైతం తరలిస్తూ అనేక మంది పట్టుబడ్డారు. ఇటీవల జిల్లా పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ఆర్టీసీ బస్సు ద్వారా కూడా ఈ రవాణా జరుగుతున్నట్లుగా వెల్లడైంది. ఇందులో పలువురు ఆర్టీసీ డ్రైవర్లు సస్పెండ్ కాగా మరి కొందరు కూడా అదేబాటలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుట్టుచప్పుడుగా.. అక్రమ రవాణాకు అలవాటు పడి కోట్లరూపాయలు సంపాదిస్తున్న వారు తాజాగా రైళ్లలో ఎర్రచందనం తరలిస్తూ రైల్వే పోలీసులకు పట్టుబడటం సంచలనం కల్పిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెపుతోంది. చెన్నై నుంచి గుంతకల్ వైపు వెళ్లే రైళ్లలో దుంగలు తరలింపు కొనసాగుతోంది. అయితే అది కూడా చైన్లింక్ సిస్టమ్లో కొనసాగుతోంది. ఒక వేళ పట్టుబడిన వ్యక్తికి ఎక్కడి నుంచి దుంగలు వస్తున్నాయో సమాచారం తెలియకుండానే దుంగల రవాణా కానిచ్చేస్తున్నారు. -
దిగువ ఎడారే!
రాజంపేట: ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నీటి కొరత తీరుతుంది. పచ్చనిపొలాలు రైతన్న ఇంట సిరులు కురిపిస్తాయి... ఇదంతా నాణేనికి ఒకవైపే. ప్రాజెక్టు నిర్మాణంతో పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని.. మట్లిరాజుల కాలం నాటి ఊటకాల్వలు ఒట్టిపోయాయని రైతన్నల ఆవేదన మరో కోణం. ఇది చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని నందలూరు, పెనగలూరు మండలాలకు చెంది వేలాది మంది రైతుల పరిస్ధితి. అన్నమయ్య జలాశయం నిర్మితం సమయంలో ఎగువ, దిగువ ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీలో న్యాయం జరిగాలి. అయితే కేవలం ఎగువ ప్రాంత అవసరాలకే అన్నట్లు ఉంది. దిగువ ప్రాంతాల్లో నందలూరు, పెనగలూరు మండలాలున్నాయి. యేటిలో నీటి ప్రవాహంతో ఒకప్పుడు ఈ ప్రాంతంలో చక్కగా పంటలు పండేవి. ఇప్పుడు డ్యాం పుణ్యమా అని నిర్వీర్యమయ్యాయి. డ్యాం ఫుల్ అయితేనే.. జలాశయం నిండి విడుదల అరుుతే తప్ప దిగువ ప్రాంతానికి నీటి చుక్క రాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అయితే వేసవిలో దిగువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దిగువ ప్రాంతానికి నందలూరు కెనాల్ను నిర్మిస్తేనే ప్రయోజనమని రైతులు కోరుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తమ కడుపు కొడుతోంద ని దిగువ రెతులు ఆవేదన చెందుతున్నారు. డ్యాం నిర్మాణం ఇలా.. మొదట తొగురుపేట వద్ద డ్యాంకు శంకుస్ధాపన శిలాఫలకం వేశారు. పలు రకాల కారణాలు చూపి ఆ తర్వాత బాదనగడ్డ వద్ద చెయ్యేరు ప్రాజెక్టు నిర్మాణానికి 1976లో అప్పటి సీఎం జలగంవెంగళరావు శంకుస్ధాపన చేశారు. నిర్మాణం ఆరంభమైన 27సంవత్సరాలకు పూర్తి అరుుంది. 2003లో అప్పటి భారీ నీటీపారుదలశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రాజెక్టు వల్ల రాజంపేట, పుల్లంపేట మండలాలు సస్యశ్యామలమయ్యాయి. భూగర్భజలాలు బాగా పెరిగి కరువును పారదోలింది. డ్యాం నిండి నీటి విడుదల అవకాశాలు లేకపోవడంతో దిగువ ప్రాంతం పరిస్థితి మాత్రం దయనీయంగా తయూరైంది. ఎడారిగా దిగువప్రాంతం.. దిగువ ప్రాంతాలైన నందలూరు, పెనగలూరు మండలాల్లోని రైతుల కష్టాలు చెప్పనలివికాదు. చెయ్యేరు నది ఎండిపోయి ఎడారిలా ఉంది. భూగర్భజలాల అడుగంటిపోయాయి. చరిత్ర కాలంలో ఈ రెండు మండలాల్లో రైతుల కోసం మట్టిరాజుల నిర్మించిన 23 ఊటకాల్వలు ఒట్టిపోయి వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 18వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోవడంలేదు. నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె, నందలూరు, లేబాక తదితర ప్రాంతాల్లో చుక్కనీరు లేదు. చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది చెయ్యేటిలో చేతితో ఇసుక తీసినా నీరొచ్చేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. అన్నమయ్య డ్యామే కారణం. పెనగలూరు, నందలూరు మండలాలకు డ్యాం నిర్మాణం శాపంగా మారింది. కనీసం దిగువ ప్రాంతాల గురించి నిర్మాణ రోజుల్లో ప్రభుత్వం ఆలోచించలేదు. తోటంశెట్టి సురేష్, నారాయణనెల్లూరు, పెనగలూరు చెయ్యేరులో ఎప్పుడూ జలకళ ఉండేది చెయ్యేరులో ఒకప్పుడు జలకళతో ఉట్టిపడేది. ఇప్పుడు యేటిలో నీటి ప్రవాహం లేదు. ఇందుకు ఒక రకంగా అన్నమయ్య డ్యాం అనే చెప్పవచ్చు. డ్యాం నిర్మాణంలో దిగువ ప్రాంతాల గురించి ఆలోంచించి ఉంటే ఇప్పుడు యేరు కరువు పరిస్ధితులను అధిగమించేది.. భూమన శివశంకరరెడ్డి, మాజీ సర్పంచ్, నందలూరు చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాలి చెయ్యేరు దిగువ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. డ్యాం నిర్మాణ సమయంలో దిగువ ప్రాంతానికి కెనాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డ్యాం నిర్మాణం వల్ల నందలూరు, పెనగలూరు మండలాలకు కరువు ఛాయలు అలుముకుంటన్నాయి. ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు రైతుల కష్టం గురించి ఆలోచించాలి. సీవీరవీంద్రరాజు, అధ్యక్షుడు, ధర్మప్రచారపరిషత్, నందలూరు -
చెయ్యేరులో ఇసుకదందా!
రాజంపేట: చెయ్యేరులో ఇసుకదందా అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న కొందరి కనుసన్నల్లో భారీగా ఇసుకను తోడేస్తున్నారు. దాడి చేసే అధికారులకు దొరకకుండా ఉండేందుకు సొంతంగా నిఘా ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాహనాల్లో వేగంగా చేరుకోకుండా సొంతంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఏ స్థారుులో జరుగుతోందో అర్థమవుతుంది. రెవిన్యూ డివిజన్ పరిధిలోని రాజంపేట, నందలూరు, పెనగలూరులో ఇసుకమాఫియా పెట్రేగిపోతోంది. ఈ మాఫీయాకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు అధికారులు సైతం వారితో మిలాఖత్ అయ్యారన్న విమర్శలున్నాయి. చెయ్యేరు నది రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలకు అనుకూలంగా ఉండటంతో అడ్డదారులు ఏర్పాటుచేసుకుని ఇసుకను అడ్డూఅదుపూ లేకుండా తోడేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రాజంపేట సబ్డివిజన్ పరిధిలోని రెండు పోలీస్స్టేషన్లకు మాముళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మందరం వయా రాజంపేట మీదుగా... చెయ్యేరు నది పరిధిలోని మందరం(రాజంపేట) కేంద్రంగా ఇసుక అక్రమరవాణా సాగిస్తున్నారు. అనధికారిక క్వారీలను ఏర్పాటుచేసుకొని ఏటికి వెళ్లే రహదారిలో గేట్ పెట్టుకున్నారు. దానికి తాళాలు కూడా వేస్తారు. చెయ్యేరులోకి దారులు ఏర్పాటుచేసుకొని వందలాది ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసుకుంటున్నారు. అక్రమరవాణాకు పటిష్టమైన నిఘా వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. బెస్తపల్లె, మందరం, ఇసుకపల్లె, తాళ్లపాక(ఆర్చి) మర్రిపల్లెతోపాటు యేటి పరిసరాల్లో బృందాలుగాా ఉంటూ రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులో, విజిలెన్స్ వస్తున్నారంటే వెంటనే ట్రాక్టర్లు, ఇసుక నింపే కూలీలు చెయ్యేటిలో నుంచి సురిక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. మందరం నుంచి పుల్లంపేట, రైల్వేకోడూరు, చిట్వేలితోపాటు తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా జరుగుతోంది. భారీగా ఫైన్ వేస్తున్నా.. పోలీసు, రెవిన్యూ అధికారుల కన్నా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన తరుణంలో పట్టుబడిన డంప్, రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి భారీగా పైన్ వేస్తున్నా వీరు వెనుకంజ వేయడంలేదు. నందలూరు మండలంలోని కుమరనిపల్లెలో అధికారిక క్వారీ ఉంది. దాని ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అనధికారిక క్వారీ ఇసుకకే డిమాండ్ సర్కారు మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకం చేపట్టినా వాటి కంటే అనధికార క్వారీల ఇసుకకే డిమాండ్ ఉంది. మహిళా సంఘాల ద్వారా ఇసుకతవ్వకంతోపాటు ఇంటికి సరఫరా చేసేందుకు కిలోమీటర్కు రూ.30చొప్పున, క్యూబిక్మీటరు రూ650 లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి. మీసేవ, బిల్లుల సమస్య లాంటివి లేకుండా అనధికారిక క్వారీ నుంచి రిస్క్ లేకుండా ఇంటికి ఇసుకను చేర్చుతుండడమే కారణం. -
చెయ్యేరులో ఇసుక తోడవద్దు
రాజంపేట : చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య జలాశయం దిగువ ప్రాంతంలో ఇసుక క్వారీలను నిషేధించాలంటూ నది పరీవాహక ప్రాంత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గురువారం రాజంపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలో కమిటీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలను చేపట్టారు. ఆయనతోపాటు సర్పంచులు ఆరీప్(ఓబిలి), వెంకటసుబ్బయ్య(నల్లతిమ్మాయపల్లె), కె.సుబ్బరాయుడు (కుందానెల్లూరు), నరసింహులు(టంగుటూరు) ఆమరణదీక్షలో పాల్గొన్నారు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకాసురులను నిలదీసే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఇసుకను ఇష్టానుసారంగా తరలించడం దారుణమన్నారు. దీనివల్ల నీటి లభ్యతకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇసుకక్వారీలకు ఇలా అనుమతి ఇస్తూ పోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని తెలిపారు. ఎక్కడకక్కడే ఇసుకలారీలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇసుకను కాపాడుకోకపోతే చెయ్యేరు నదీపరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయన్నారు. చెయ్యేరు పరీవాహక పరిరక్షణకమిటి అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణకుమార్ మాట్లాడుతూ చెయ్యేరు వల్ల రాజంపేట, పెనగలూరు మండలాలు సస్యశ్యామలంగా ఉండేవని, ప్రభుత్వం ఇసుక అమ్మడానికి అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టినప్పటికి నుంచి కరువు పరిస్ధితలు దాపురించాయన్నారు. టీడపీ నాయకుడు మోదుగల పెంచలయ్య మాట్లాడుతూ ఇసుక తవ్వకాల వల్ల అత్తిరాలలో మడుగు అడుగంటిపోయిందన్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికైనా ఇసుక దోపిడీని అరికట్టకపోతే భావితరాలకు తీవ్ర నష్ట వాటిల్లుతుందన్నారు. వీరితోపాటు కొప్పలసుబ్బన్న, జీవీసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా కలిసిరావాలి: గోపిరెడ్డి చెయ్యేరులో ఇసుక క్వారీల నిషేధానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెయ్యేరు నదీపరీవాహక పరిరక్షణ కమిటి కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య డ్యాం ఎగువ ప్రాంతంలో ఇసుకక్వారీలకు అనుమతులు ఇస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. రాజంపేట ఆర్డీవో ప్రభాకర్పిళ్లై దీక్షాశిబిరానికి వచ్చి దీక్షను విరమించాలని హెచ్చరించారన్నారు. ఎలాంటి పరిస్ధితుల్లో ఇసుక క్వారీ నిషేధం కోసం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలను కొనసాగిస్తామని వెల్లడించారు. తరలివచ్చిన నేతలు, రైతులు నిరాహారదీక్షకు నందలూరు, రాజంపేట, పెనగలూరు మండలాలకు చెందిన నేతలు, నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. టీడీపీ నేతలు మోదుగుల పెంచలయ్య, పెనగలూరు మండలపార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, బీసీనేత వర్ధిబోయన సుధాకర్బాబు, సీపీఐ ఏరియా కార్యదర్శి మహేశ్, ఎఐటీయుసీ నేత ఎంఎస్రాయుడు, వైఎస్సార్సీపీ నేతలు జీవీసుబ్బారెడ్డి, నాగినేని నాగేశ్వర్నాయుడు, హస్తవరం వేణురెడ్డి, భాస్కరరాజు, జీవీసుబ్బరాజు, శివరామరాజు, విస్సీ, పసుపులేటి సుధా, దళితనేతలు కొప్పల సుబ్బన్న, దండుగోపి, మోడపోతుల సుధా, గీతాల నరసింహారెడ్డి, విజయకుమార్, సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాజీ సర్పంచి గంగినాయుడు తదితరులు మద్దతు ప్రకటించారు. -
పట్టాలెక్కేనా..!
రాజంపేట: రైల్వే బడ్జెట్లో దశాబ్దాలుగా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ప్రతి ఏడాది జిల్లా నేతలు సరైన సమయంలో ఒత్తిడి పెంచకపోవడం, ప్రతిపాదనల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నష్ట వాటిల్లుతోంది. మరోసారి ఆ సమయం ఆసన్నమైంది. 2015-2016 బడ్జెట్ రైలును పట్టాలపైకి తీసుకురావడానికి రైల్వేమంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ దశలోనే మన నేతలు స్పందించాలి. ఆయా ప్రాంతాల పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల పరిధిలో నెలకొన్న డిమాండ్లపై లేఖలు పంపాలని రైల్వేశాఖ కోరింది. జిల్లా అవసరాలు నెరవేరేలా ప్రతిపాదనలు చేసి వాటికి బడ్జెట్లో చోటు దక్కేలా చేసుకోవాల్సింది. ఈ స్థితిలో జిల్లాలో రైల్వే పరంగా ఉన్న అవసరాలను ఒకసారి పరిశీలిస్తే.... డిమాండ్లో ఉన్న రైళ్లు ఇవే.. తిరుపతి-షిర్టి మధ్య రైలును జిల్లా మీదుగా నడిపించాలని ప్రతిపాదన అలాగే ఉంది. గతంలో ఉన్న ఇదే రైలును అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమారరెడ్డి సర్కారు హయాంలో అనంతరం జిల్లా మీదుగా మార్చుకున్నారు. షిర్డికి వెళ్లాలంటే గుంతకల్కు వెళ్లి ఎక్కాల్సిన పరిస్ధితి జిల్లా వాసులకు పట్టింది. తిరుపతి-మచిలీపట్నం రైలు కడప వరకు పొడిగింపు ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఈరైలు రాకతో జిల్లా వాసులకు కొత్తరాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు వీలవతుంది. ఎర్రగుంట్ల-నొస్సం మధ్య నడిచే రైలు బడ్జెట్కే పరిమితమవుతోంది. ఈ రైలు నిర్వహణ పరంగా నందలూరు-నొస్సం మధ్య నడిపించే అంశాన్ని రైల్వే పరిశీలించాలని రైల్వేనిపుణులు కోరుతున్నారు. ఈ రైలును రెండేళ్ల కిందట బడ్జెట్లో ప్రకటించారు. ఇంతవరకు ఆ రైలు పట్టాలెక్కలేదు. ఎపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్కు జిల్లాలో కీలకమైన రైల్వేకేంద్రాల్లో స్టాపింగ్ ఇవ్వాలని చాలకాలంగా కోరుతున్నప్పటికీ రైల్వేశాఖ స్పందించే పరిస్ధితులు కనిపించడంలేదు. కర్నూలు వరకు నడస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలును కడప, నందలూరు వరకు పొడిగించాలనే చిరకాల ప్రతిపాదనను ఆటకెక్కించారు. రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో అన్ని ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే ఉద్యోగులు, సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని స్టాపింగ్స్ ఇవ్వాలనే డిమాండ్ రైల్వేకార్మికసంఘాలతో పాటు..ప్రజాప్రతినిధుల డిమాండ్ చేస్తున్నారు. ప్రధానడిమాండ్లు ఇవే.. నంద్యాల-ఎర్రగుంట్ల లైన్ ఇంకా 31 కిలోమీటర్లు నిర్మితం కావాల్సి ఉంది.నొస్పం వరకు ట్రాక్ వేశారు. 128 కిమీ ఉన్న ంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గానికి రూ843.45కోట్ల అంచనా వ్యయాన్ని వేశారు. ఇప్పటి వరకు రూ753.44 కోట్లు ఖర్చు చేశారు. కడప-బెంగళూరు రైలు మార్గానికి రూ. 1343 కోట్లతో అంచనా వేశారు. గత బడ్జెట్లో రూ.30కోట్లు మాత్రమే కేటాయించారు. పెండ్లిమర్రి వరకు ఎర్త్ వర్క్ పనులు జరిగాయి. కంభం-ప్రొద్దుటూరు, భాకరపేట-గిద్దలూరు రైల్వేలైను సర్వేకే పరిమితమయ్యాయి. నందలూరు రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్లో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగులుతోంది. ఇటీవల సోలార్ విద్యుత్ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. అయితే ఇది కాకుండా రైల్వేపరమైన పరిశ్రమ కావాలని డిమాండ్ ఎన్డీఏ ప్రభుత్వపెద్దల వద్దకు తీసుకెళ్లారు. ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గంలో ఎర్త్ పనులు పూర్తి అయినప్పటికీ టన్నెల్ పనులు మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు. దీంతో ఈ మార్గ నిర్మాణం పూర్తికావడానికి జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్ -రైల్వేమంత్రిత్వశాఖ కసర త్తు, మీ ప్రాంతంలో రైల్వే డిమాండ్ల వివరాలు ఇవ్వాలంటూ ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిదులకు లేఖలు వ్రాశారు. బడ్జెట్ కేటాయింపులో ద.మరైల్వే లేఖలాఉ కొత్తరైఉ్ల,మార్గాలు, సర్వేలు. ప్రాజెక్టులు -
రూ.5 కోట్లతో తాగునీటి బోర్ల డ్రిల్లింగ్
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లను డ్రిల్లింగ్ చేయనున్నట్లు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో తన నిధుల నుంచి రూ.5 కోట్లను బోర్ల డ్రిల్లిం గ్కు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్న 400 గ్రామాలను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డ్రిల్లిం గ్ చేస్తున్నట్లు వివరిం చారు. శాశ్వత పరిష్కారానికి అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలి పారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా మంచినీళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని, అయితే టీడీపీ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. కొంతవరకైనా సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో నిధులను అధికంగా మంజూరు చేశానన్నారు. హంద్రీ- నీవా జలాశయంతోనైనా సమస్య శాశ్వత పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు
వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎంపీపీ సుహర్లతపై అనర్హత వేటు పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సుహర్లత, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. దాంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నాయకుడు ఆకేపాటి మురళీరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ పదే పదే పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి దూకడం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువగా కనిపించింది. -
తెగిస్తున్నారు..
రాజంపేట: అంతర్జాతీయంగా విలువ కలిగిన ఎర్రచందనంను దోచుకెళ్లాలనే బడా స్మగ్లర్లు ఆశచూపుతున్న కాసుల కోసం తమిళనాడుకు చెందిన కూలీలు ఎంతకైనా తెగిస్తున్నారు. తిరుపతి, రాజంపేట అటవీ డివిజన్లో విస్తరించిన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనంను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఎర్రచందనం చెట్లను నరికి తరలించుకుపోయేందుకు ఎర్రకూలీలు గుంపులు.. గుంపులుగా తరలివస్తున్నారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు దాడులు చేయడంతో ఇద్దరు అటవీ సిబ్బంది ఇటీవల చనిపోయారు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్పై అటవీశాఖతో పాటు పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ వస్తున్నారు. కూంబింగ్తో పాటు స్మగ్లర్లను పట్టుకోవడం వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ వస్తున్నారు. అయితే చెట్లు కొట్టేందుకు తమిళనాడు నుంచి కూలీలు రావడం ఆగిపోవడంలేదు. నెలరోజుల వ్యవధిలోనే బాలు పల్లె రేంజ్ పరిధిలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎర్రకూలీలు మృతి చెందారు. జల్లెడ పడుతున్నా... శేషాచలం అడవులను స్పెషల్పార్టీతో పాటు అటవీ పోలీసులు జల్లెడ పడుతున్నప్పటికీ ఎర్రకూలీలు అడవిలోకి వచ్చేందుకు వెనకాడటం లేదంటే స్మగ్లింగ్ ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు నుంచి రైలుమార్గంలో శేషాచ లం అడవులకు దగర్గగా ఉన్న బాలుపల్లె, మామండూరు, శెట్టిగుంట రైల్వేస్టేషన్లలో దిగేసి దర్జాగా అడవిలోకి వెళుతున్నారు. స్పెషల్ పార్టీతో పాటు అటవీ పోలీసుల వ్యూహాలను పసిగట్టి మరీ అడవిలోకి ప్రవేశిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి చేరిన తర్వాత రెండు నుంచి మూడురోజులు దాకా మకాం వేసి చెట్లను కొట్టివేస్తున్నారు. కూంబింగ్ చేసే పోలీసులు ఎదురుపడితే తప్పించుకుపోవడం.. ఎదురుదాడులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వందమంది కూలీలు చొరబాటు జిల్లా సరిహద్దులోని కుక్కలదొడ్డి దాటిన తర్వాత వందమంది కూలీలు శనివారం కూంబింగ్ చేస్తున్న స్పెషల్పార్టీ పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్ల దాడి చేశారు. కూంబింగ్ పార్టీలో కేవలం ఐదుమంది పోలీసులే ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగారు. పోలీసు బలగాలతో తిరిగి వెళ్లేసరికి అప్పటికే ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రైల్వేకోడూరు డీఆర్వో మద్దిలేటి ధ్రువీకరించారు. కాగా వందమంది ఎర్రకూలీలు అడవిలోకి ప్రవేశించడంతో కూంబింగ్ను ముమ్మరం చేశారు. -
మృత్యు గేట్లు
రాజంపేట: జిల్లాలోని పలుప్రాంతాల్లో కాపలా లేని రైల్వేగేట్లు ఉండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం ప్రజల్ని వెంటాడుతోంది. రైల్వేకోడూరు మొదలుకుని ఎర్రగుంట్ల వరకు 8 చోట్ల ఇలాంటి రైల్వే గేట్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో కాపలా లేని రైల్వేగేటు వద్ద స్కూల్ వ్యానును రైలు ఢీకొన్న సంఘటనలో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో కాపలా లేని రైల్వేగేట్లు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం ఆ తర్వాత మిన్నకుండిపోవడం రైల్వే అధికారులకు పరిపాటిగా మారింది. ముంబయి-చెన్నై కారిడార్లో జిల్లా పరిధిలో నందలూరు, కడప, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల రైల్ట్రాక్ సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 8 కాపలాలేని లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. గతంలో 20 గేట్లు ఉండేవి, వాటిలో కొన్నింటిని మూసివేయడంతో పాటు మరికొన్నింటికి మనిషిని కాపాలా ఉంచారు. జిల్లాలో ఇంకా 8 చోట్ల మనిషి కాపలా లేని గేట్లు ఉన్నాయి. మనిషి కాపలా లేని గేట్ల వద్ద భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కన్నుమూసి తెరిచేలోపు పట్టాలపై వెళుతున్నవారిని రైళ్లు కబళిస్తున్నాయి. తరచూ ఈ క్రాసింగ్ల వద్ద రెలుపట్టాలు దాటుతూ మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయితే రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద కాపలా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు కూడా సగం ఖర్చు భరించాలని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రైల్వే క్రాసింగ్లను ఆధునీకరించేలా, కాపలా వ్యక్తులను నియమించేలా ప్రజా ప్రతినిధులు రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో ఎక్కడున్నాయంటే ... కడప, ఎర్రగుంట్ల సెక్షన్ పరిధిలో కృష్ణాపురం-గంగాయపల్లె మధ్య రెండు, గంగాయపల్లె-కమలాపురం మధ్య రెండు, ఎర్రగుడిపాళెం-ఎర్రగుంట్ల మధ్య ఒకటి, కోడూరు-అనంతరాజుపేట మధ్య ఒకటి, పుల్లంపేట-రాజంపేట మధ్య ఒకటి, హస్తవరం-రాజంపేట మధ్య ఒక చోట మనిషి కాపలా లేని గేట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నాలుగు ప్రమాదాలు జరిగాయని రైల్వే వర్గాల అధికారిక సమాచారం. రైళ్లు ఢీకొన్న వాటిలో అధికంగా ఆటోలు, ట్రాక్టరు ఉన్నాయి. 2010లో పుల్లంపేట మండలంలోని అప్పయ్యరాజుపేట వద్ద ఆటోను ప్యాసింజర్ రైలు ఢీకొంది. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత అప్పయ్యరాజుపేట గ్రామస్తుల విన్నపాన్ని పరిశీలించిన రైల్వేశాఖ అధికారులు ఆ క్రాసింగ్ను మనిషి కాపలా ఉండే గేటుగా మార్చారు. కాపలా లేని గేట్లకు స్వస్తి ఎప్పుడో? జిల్లాలో మనిషి కాపలా లేని రైల్వే గేట్లకు రైల్వే శాఖ ఎప్పుడు స్వస్తి పలుకుతుందో తెలియనిపరిస్ధితి. కొన్నిచోట్ల వివిధ కారణాలు చూపి పూర్తిగా మనిషి కాపలా లేనిగేట్లను మూసివేస్తున్నారు. దీని వల్ల ఆ ప్రాంతంలో రాకపోకలకు గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గేట్మెన్లు లేని లెవల్ క్రాసింగ్లు అధికంగా గ్రామాలకు సమీపంలో ఉండటం వల్ల ఆధునీకరించి విడతలవారీగా వాటి వద్ద గేట్మెన్లను నియమిస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో రైల్వే మంత్రులు పేర్కొంటూవస్తున్నారు. రైల్వే శాఖ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నప్పటికి స్వల్ప ఖర్చుకు వెనకడుగు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బండి వచ్చేది కూడా తెలియడం లేదు బండి వచ్చేది కూడా తెలియడం లేదు. గతంలో రైళ్లు వస్తుంటే తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంట్ ఇంజన్లతో రైళ్లు నడుస్తున్నాయి. గేటు చూసుకుని దాటుకోవాల్సి వస్తుంది. లేకుంటే ప్రాణాలు తెలియకుండానే పోతాయి. మనిషి కాపలా లేని గేటు వల్ల ఇబ్బంది పడుతున్నాం. -రామయ్య,పుల్లంపేట మండలం -
నో ఫిల్లింగ్!
రాజంపేట: జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులలో నోస్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. బంకుల యజమానులు డబ్బులు కట్టలేకకాదు..సరైన మోతాదులో పెట్రోలు..డీజిల్ దిగుమతి లేని పరిస్ధితులు నెలకొంటున్నాయి. జిల్లాలోని సగానికిపైగా పెట్రోలు, డీజిల్ బంకుల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలోని రాజంపేట, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల తదితర ప్రాంతాల్లో ప్రధానంగా మూడు కంపెనీలకు చెందిన బంకులను అధికసంఖ్యలో ఏర్పాటుచేశారు. నిత్యం లక్షలాది లీటర్లు బంకుల ద్వారా సరఫరా అవుతోంది. హెచ్పీసీ(హిందూస్థాన్పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్), ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), బీపీసీఎల్(భారత్పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా ఆయిల్ ఫిల్లింగ్స్టేషన్లను విరివిగా ఏర్పాటుచేశారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో చాలాచోట్ల లేదు..లేదు అన్న పదాలు వాహనదారులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. ఎందుకు ఇలా..... కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు పెట్రోలు, డీజిల్ సరఫరాచేసేందుకు జిల్లా కేంద్రంలోని కడప రైల్వేస్టేషన్ సమీపంలో ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీఎల్ డిపోలు ఒకేచోట ఉండేవి. రైల్వేతో ఉన్న 50 యేళ్ల అగ్రిమెంటుకు కాలపరిమితి ముగిసింది. దీని ఫలితంగా అక్కడి నుంచి డిపోలను మూసివేయాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. మూడు ప్రధానసంస్ధలు వేర్వేరుచోట్ల డిపోలను ఏర్పాటుచేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా గుత్తిలో బీపీసీఎల్ డిపో ఏర్పాటు కాగా, చిత్తూరులో ఐఓసీ డిపోను ఏర్పాటుచేసుకుంది. భాకరాపేట వద్ద హెచ్పీసీఎల్ డిపో ఏర్పాటు పూర్తికావస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డిపోలోకి రైల్వేట్రాక్ను కూడా వేసుకున్నారు. త్వరలో ఈ డిపో వినియోగంలోకి రానున్నదని సమాచారం. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ జిల్లాలోని ఆయిల్ ఫిల్లింగ్స్టేషన్ల నిర్వహణ విషయంలో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కనిపిస్తోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సేల్ట్యాక్స్ పరంగా నెంబర్లు కూడా మారిపోనున్నాయి. ఇందువల్ల కొన్ని బంకుల యజమానులు కూడా ఫిల్లింగ్స్టేషన్ల నిర్వహణ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న నెంబర్లు కాకుండా విభజన తర్వాత కొత్తగా సేల్ట్యాక్స్ నెంబర్లు వస్తాయి. పాతనెంబరు..కొత్తనెంబర్ల అంశంతో ఫిల్లింగ్స్టేషన్లకు సంబంధించి పన్ను వ్యవహారంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో కొంతమంది తమ ఫిల్లింగ్స్టేషన్లను ఖాళీగానే ఉంచుకున్నారు. కొత్తగా సేల్ట్యాక్స్ నెంబర్లతో తిరిగి పెట్రోలు, డీజల్ వ్యాపారాలు సాగించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఇతర డిపోల నుంచి.. జిల్లాలో ప్రస్తుతానికి చిత్తూరు, గుత్తి ,ఒంగోలు డిపోల నుంచి పెట్రోలు, డీజిల్ను జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్ధితిలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. అంతేగాకుండా అదే స్ధాయిలో డిమాండ్కు కూడా ఏర్పడింది. బంకుల యజమానులు పెట్రోలు, డీజిల్కు డబ్బులు కట్టినా దిగుమతి ఆలస్యమవుతోంది. మరికొంతమంది బంకు యజమానులు పరస్పర సర్దుబాటుతో బంకులను నిర్వహిస్తున్నారు. కొందరైతే బంకులకు పెట్రోలు, డీజిల్ను దిగుమతి చేసుకోవడంలేదు. చాలాచోట్ల ఇదే పరిస్ధితులు ఉండటంతో బంకులు నిండుకున్నాయి. -
అటకెక్కిన ఒప్పందం
రాజంపేట: శేషాచల అడవుల్లో ఇనుప ఖనిజ నిక్షేపాల వెలికితీత ఒప్పందం ఆటకెక్కింది. రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలోనూ, పుల్లంపేట మండల పరిధిలోకి వచ్చే తుమ్మలబైలు ప్రాంతంలో ఇనుపఖనిజం నిక్షేపాలున్నట్లు ఖనిజాభివృద్ధి సంస్ధ గతంలోనే గుర్తించింది. అటవీ ప్రాంతం అంతర్భాగంలో ఆవిరించి ఉన్న ఖనిజనిక్షేపాలను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుల్లంపేట ప్రాంతంలో ఖనిజాభివృద్ధికి తోడ్పడే పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు అప్పటి కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి సాయిప్రతాప్ 2009లో ప్రకటించారు. రెండు ప్రాంతాల్లో ఇనుపఖనిజ నిక్షేపాలు వంద మిలియన్ల టన్నుల కంటే ఎక్కువుగా ఉంటే ఎన్ఎండీసీ ఇనుప కర్మాగారం పెట్టే అవకాశాలను కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. యుపీఏ పాలనలో కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రిగా కొనసాగిన రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని భారీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకురాలేకపోయారు. జాతీయఖనిజాభివృద్ధి సంస్ధ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఇనుపఖనిజ తవ్వకాలపై ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఇనుపఖనిజనిక్షేపాలు శేషాచల అటవీ ప్రాంతాల్లో ఉండటంతో అటవీశాఖ అనుమతులు లభించాల్సివుంది. పుల్లంపేట వత్తలూరు మల్లేంవారిపల్లె సమీపంలోని అటవీ పరిసర ప్రాంతంలో ఇనుపఖనిజం నిక్షేపం అయి ఉన్నట్లు సర్వేల ద్వారా వెల్లడవుతోంది. నేషనల్ మినరల్ డెవలప్మెంటు కార్పొరేషన్ సంస్ధ (ఎన్ఎండీసీ) శేషాచల అటవీ ప్రాంతంలో సర్వే చేపట్టింది. తుమ్మలబైలు అటవీప్రాంతంలో దాదారు రెండువేల నుంచి మూడువేల ఎకరాల్లో మేలైన ఇనుపఖనిజం ఉన్నట్లు భూగర్భగనులశాఖ అధికారులు సర్వే చేశారు. చివరకు వెలికితీతకు చేసుకున్న ఒప్పందాన్ని పాలకులు అటకెక్కించారు. నాలుగు దశాబ్ధాల కిందటే.. 1960 ప్రాంతంలో ఇనుపరాయికి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, మార్కెట్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ప్రాంతం నుంచి రాయిని వెలికి తీసేందుకు ఎవరూ ముందుకురాలేదని సమాచారం. ఇక్కడ లభ్యం అయ్యే ఖనిజం మంచి గ్రేడ్ కలిగి ఉన్నదేనన్న అంశం సర్వేలో వెల్లడైంది. ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇక్కడ కూడా ఓ మారు సర్వే నిర్వహించారు. ఈ రెండుచోట్ల లభించే ఇనుపఖనిజ నిక్షేపాలను ఆధారం చేసుకుని ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేంద్రస్ధాయిలో ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ ప్రాంతంలో వెయ్యి ఎకరాల స్థలం కోసం రెవెన్యూవర్గాలు అన్వేషించిన సంగతి విదితమే. ఇనుపఖనిజం వెలికితీత ఒప్పందం అటకెక్కడంతో రెండు మండలాలు మరింతగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు వీలుపడుతుంద న్న ఆశలు ఆవిరైపోతున్నాయి. -
'అధిష్టానం నిర్ణయం శిరసా వహిస్తా'
తిరుపతి : ప్రజాతీర్పు శిరోధార్యమని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆమె గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానన్నారు. రాజంపేటలో తనకు సహకరించిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు పురంధేశ్వరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. -
రాజంపేటలో పురందేశ్వరి వెనుకంజ
రాజంపేట : రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరిపై ముందంజలో ఉన్నారు. కాగా కడప ఎంపీ, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. -
డబుల్ డెక్కర్..
కడప అర్బన్, న్యూస్లైన్: రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. ఏసీ డబుల్ డెక్కర్ బై వీక్లీ సూపర్ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. క డప రైల్వేస్టేషన్కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు (ప్రతి బుధ,శనివారం) జిల్లా మీదుగా తిరుపతికి వెళుతుంది. అలాగే ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడకు వెళుతుంది. తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు కడప చేరుకుని 3.22కు బయలుదేరుతుంది. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు గురు, ఆదివారాల్లో ఉదయం 8.05 గంటలకు కడప చేరుకుని 8.07కు బయలుదేరుతుంది. ఈ రైలు జిల్లాలో ఎర్రగుంట్ల, కడప, రాజంపేట స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. బోగీలన్నీ ఏసీ కావడంతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ఇందులో ప్రయాణిస్తున్న వారు పేర్కొన్నారు. చార్జీలు ఇలా.. కడప నుంచి రాజంపేట, రేణిగుంట, తిరుపతి వరకు రూ. 250 ఛార్జిగా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. కనీస ఛార్జి ఈ రైలులో రూ. 250గా నిర్ణయించారన్నారు. కడప నుంచి కాచిగూడకు రూ. 570 ఛార్జి ఉంటుందన్నారు. కడప నుంచి ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు రూ. 250 వసూలు చేస్తారన్నారు. కడప నుంచి గుత్తికి రూ. 260, డోన్కు రూ.310, కర్నూలుకు రూ. 355, గద్వాల్కు రూ. 410, మహబూబ్నగర్కు రూ.460, కాచిగూడకు రూ. 570 వసూలు చేస్తారన్నారు. కాచిగూడ నుంచి తిరుపతికి రూ. 655 ఛార్జీ వసూలు చేస్తారు. రిజర్వేషన్ ఛార్జితో కలిపి రూ.700గా నిర్ణయించారు. తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే రూ. 885 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ తప్పక చేయించుకోవాలి. జిల్లాలోని స్టేషన్లలో ప్రయాణించేటప్పుడు కరెంటు బుకింగ్లో రూ. 250 కనీస ఛార్జి ఉంటుంది. ఉదాహరణకు కడప నుంచి రాజంపేటకు, రేణిగుంట, తిరుపతికి రూ. 250 ఉంటుంది. ఎర్రగుంట్ల నుంచి కడపకు కూడా రూ. 250 చెల్లించాల్సిందే. చాలా సౌకర్యవంతంగా ఉంది డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంది. పగటిపూట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా గమ్య స్థానానికి చేరుకోవచ్చు. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. - శ్రీదేవి, ప్రయాణికురాలు సంతోషంగా ఉంది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా వేసవి కాలంలో ఏసీ బోగీల రైలు డబుల్ డెక్కర్లో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. మిగతా రైళ్లలోని ఎక్స్ప్రెస్లలో ఏర్పాటు చేసిన ఏసీ బోగీలతో సమానంగా అధునాతన సౌకర్యాలతో రూపొందించారు. - తుకారం, ప్రయాణికుడు -
ఆమె ‘అన్న’ కూతురైతే...నేను జగన్ తమ్ముణ్ని
రాజంపేట: ‘ఆమె అన్న కూతురైతే, నేను జగనన్న తమ్ముణ్ని.. జగనన్నే నా బలం. ఎన్నికలయ్యాక వెంట తెచ్చుకున్న సూట్కేసుతో వెళ్లిపోతారు. నేను స్థానికుడిని. ఇక్కడే ఉండి మీ సమస్యలను పట్టించుకుంటాను’ అని వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డితో కలసి ఆయన బి కొత్తకోట, పీటీఎం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, సాయిప్రతాప్ ఎంపీ పదవికి, డబ్బుందని వ్యాపారి శంకర్ తంబళ్లపల్లె ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారన్నారు. వారు డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, దీనికి ఓటర్లు బలికావద్దని కోరారు. ఓటుకు రూ.500 తీసుకుని వారికి ఓటేస్తే.. ఐదేళ్లపాటు నష్టపోవాల్సివస్తుందని హెచ్చరించారు. భవిష్యత్లో కష్టాలు రాకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీని ఆదరించాలన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడారని అన్నారు. తాను పల్లెల్లో పర్యటిస్తున్నప్పుడు చికిత్సలతో ప్రాణం పోసుకున్న వారంతా తమ శరీరంపై ఆపరేషన్లు చేసిన గుర్తులను చూపిస్తున్నారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసేందుకు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తని అని సీఎం కాగానే మహిళా రుణాలను మాఫీ చేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులను జైళ్లకు పంపారని, బిల్లులు కట్టలేమన్న అన్నదాతలపై కేసులు పెట్టించారని గుర్తు చేశారు. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే, తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చంటూ ఎగతాళిచేసిన చంద్రబాబు నేడు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆల్ఫ్రీ మాటలు చెబుతున్నారని విమర్శించారు. మతతత్వ బీజేపీ ఎంపీ అభ్యర్థిని, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కనీసం నీటి సమస్యనైనా తీర్చలేకపోయాడన్నారు. నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని తాను, ప్రవీణ్కుమార్రెడ్డి, కలిచెర్ల ప్రభాకర్రెడ్డి అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో నెలకొన్న సమస్యలను జగన్ మోహన్ రెడ్డి తీరుస్తారని అన్నారు. రాజంపేట ఎంపీగా తనను, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ప్రవీణ్కుమార్రెడ్డిని గెలిపించాలని ప్రజలకు మిథున్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పురందేశ్వరి పేరు ప్రస్తావించని బాబు
చిత్తూరు : కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు. బీజేపీ-టీడీపీ పొత్తు నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో గురువారం చంద్రబాబు పాల్గొన్నారు. మదనపల్లిలో నరేంద్ర మోడీ సభలో పాల్గొన్న చంద్రబాబు మాత్రం పురందేశ్వరికి మద్దతు తెలపలేదు. అంతేకాకుండా ఆమె పేరును ప్రస్తావించేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. కాగా టీడీపీ నుంచి వెళ్లిపోయేంతవరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిప్పలు పెట్టిన చంద్రబాబుకు పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. బీజేపీ తరఫున కోస్తాలో ఎక్కడ టికెట్టు దక్కించుకున్నా విజయావకాశాలు ఉంటాయనే ఉద్ధేశంతో బాబు చక్రం తిప్పారు. చివరకు రాజంపేట మినహా మరో గత్యంతరం లేని వాతావరణం కల్పించారు. పురందేశ్వరి అయిష్టంగానే రాజంపేట నుంచి నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో నానా అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కడా నామమాత్రపు బలం కూడా లేదు. ఇక టీడీపీ శ్రేణుల నుంచి సహకారం అం తంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఆమె ఎన్నికల ప్రచారం ముందుకు సాగడం లేదు. బీజేపీ అభ్యర్థి అని చెప్పుకుంటే ఓట్లు రావని అర్థం చేసుకున్న ఆమె ఎన్టీఆర్ తనయగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. -
పాపం పురందేశ్వరి
నిన్నటి వరకు కేంద్ర మంత్రిగా అధికారం చలాయించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు. కమలదళంలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే అక్కడ తెలుగు దేశం కార్యకర్తలు ఆమెకు మద్దతు ప్రకటించడం లేదు. పురందేశ్వరి వల్ల లాభం కంటే తమకు నష్టమే ఎక్కువ జరుగుతోందని టీడీపీ ఆందోళన చెందుతోంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓటర్లు ఆమెను వ్యతిరేకిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లూ ఆమెకు దూరందూరంగా ఉంటున్నారు. రాజంపేట లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కోడూరు, రాజంపేట, రాయచోటి కడప జిల్లాలో ఉండగా.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వీటిలో మొదటి నుంచీ మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయచోటి, మదనపల్లి వంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరింట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుండగా.. మదనపల్లెను మాత్రం బీజేపీకి కేటాయించారు. అయితే మైనారిటీ ఓటర్లు ఆమెకు మద్దతు పలికే విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు. పురందేశ్వరి నియోజకవర్గంలో జోరుగానే పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ కూతురునని గుర్తు చేస్తున్నారు. ఆయన ఆశయాల మేరకు పని చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె ఎంత ఎన్టీఆర్ కూతురైనా.. పార్టీ మారి బీజేపీలో చేరడం, సమైక్యాంధ్ర విషయంలో చివరి వరకూ ఏమీ చేయలేకపోవడం వంటి అంశాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఇది తమ అభ్యర్థులకు కూడా ఇబ్బందికరంగా మారిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాలుగేళ్లుగా జనంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఎదుర్కోవడం కత్తిమీద సామేనని టిడిపి నాయకులు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
పురందేశ్వరికి బలంలేని స్థానం కేటాయింపు
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి బిజెపి రాజంపేట లోక్సభ స్థానాన్ని కేటాయించింది. ఆమె గత లోక్సభ ఎన్నికలలో విశాపట్నం నుంచి గెలిచారు. ఆ చివరి విశాఖప్నటం నుంచి తీసుకువెళ్లి రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట స్థానం కేటాయించారు. అక్కడ బిజెపి గానీ, టిడిపికి గానీ బలంలేదు. టిడిపితో పొత్తులో భాగంగా ఏరికోరి ఓడిపోయే స్థానం ఆమెకు కేటాయించారని భావిస్తున్నారు. పురందేశ్వరికి రాజంపేట స్థానం కేటాయించడం పట్ల బిజెపి శ్రేణుల్లో నిరాసక్తత నెలకొంది. బిజెపి అధిష్టానంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే ఈ ఆమెకు ఓడిపోయే ఇటువంటి స్థానం కేటాయించారని భావిస్తున్నారు. పురందేశ్వరి పది సంవత్సరాలు ఎంపిగా ఉండి, కేంద్ర మంత్రిగా తన ప్రతిభను చూపుతూ జాతీయ స్థాయిలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీలో పరిచయాలు పెంచుకున్నారు. ఈ పరిస్థితులలో ఆమె మళ్లీ ఎంపిగా గెలిస్తే తనకు జాతీయ స్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు భయపడి ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఈ స్థానం కేటాయించడంతోనే ఇందులో చంద్రబాబు హస్తం ఉన్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. -
రాజంపేట బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి
-
కిరణ్ కు సాయిప్రతాప్ షాక్
న్యూఢిల్లీ: కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు సాయి ప్రతాప్ మళ్లీ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ను సాయి ప్రతాప్ కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరింది. పార్టీలో చేరే విషయంపై సాయి ప్రతాప్ దిగ్విజయ్ సింగ్తో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో సాయి ప్రతాప్ చేరారు. సాయి ప్రతాప్ సహా జై సమైక్యాంధ్రలో చేరిన పలువురు నాయకులు పార్టీని వీడుతు కిరణ్కు షాకిలుస్తున్నారు. -
ఎలా జరిగిందో..!
రాజంపేట, న్యూస్లైన్ : రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహనరెడ్డి ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఇద్దరు దుర్మరణం చెందారు. పేలుడు కారణాలపై పోలీసులు భిన్నకోణాల్లో ఆరా తీస్తున్నారు. సంఘటనస్థలాన్ని ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి, స్థానిక డీఎస్పీ జీవీరమణతో కలిసి పరిశీలించారు. క్లూస్టీం, డాగ్, బాంబ్స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. పేలుడుకు కారణాలను తెలుసుకునేందుకు సంఘటన స్ధలంలో లభ్యమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లారు. కాగా ఆదివారం పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుడు రాజంపేట ప్రాంతంలో రాజకీయవర్గాల్లో కలకలంరేపింది. పేలుడు ప్రాంతంలో పెద్దఎత్తున జనం గుమికూడటంతో ఆర్ఎస్రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మృతులు గుంటూరు జిల్లావాసులు మదన్మోహన్రెడ్డి స్వగృహం రాజంపేట పట్టణం ఆర్ఎస్రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉంది. కుక్కుల పోతిరెడ్డి, లక్షుమమ్మ అనే దంపతులు 15 ఏళ్లుగా మదన్ ఇంటిలో కాపలాదారులుగా నివసిస్తున్నారు. వీరు గుంటూరు జిల్లా బాపట్లలోని మాలేపాటిపాలెంకు చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు , ఒక కూతురు ఉన్నారు. వీరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరందరూ జీవనోపాధికోసం రాజంపేటకు వచ్చారు. ఏంజరిగింది... మదన్ ఇంటి వెనుకవైపు గదిలో పోతిరెడ్డి, లక్షుమమ్మ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో వీరు నిద్రకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున నాలుగుగంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీరు నిద్రిస్తున గదిలో పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కలవారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనస్ధలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే గదిలో ఉన్న భార్యాభర్తలు విగతజీవులయ్యారు. అన్నీ అనుమానాలే? మదన్ ఇంట్లో జరిగిన పేలుడుపై అన్ని అనుమానాలే పుట్టుకొస్తున్నాయి. ఇదే అంశం అటు జనంలోనూ.. ఇటు పోలీసుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రాధమిక విచారణలో గ్యాస్లీక్గా పోలీసులు భావించారు. గదిలో రెండు గ్యాస్సిలెండర్లు ఉన్నాయి. ఒకటి హెచ్పీ, మరొకటి ఇండేన్కు చెందిన సిలిండర్, వీటి నుంచి గ్యాస్ లీక్ అయినట్లు పోలీసులు భావించారు. అయితే పెద్దశబ్ధం రావడం, సిలిండర్లు యధాస్థానంలో ఉండటం చూస్తుంటే పేలుడుకు మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ద్వారా పేలుడు కారణాలు వెల్లడవుతాయన్నారు. పోలీసులే తేల్చాలి తన ఇంటిలో జరిగింది పేలుడా, గ్యాస్ సిలిండర్ పేలుడా అనేది పోలీసులే తేల్చాలని మాజీ ఎమ్మెల్యే మదనమోహనరెడ్డి పేర్కొన్నారు. జరిగిన సంఘటన బాధాకరమన్నారు. రాజంపేటలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. పోలీసులు విచారించి దోషులను శిక్షించాలన్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ పేలుడు...
రాజంపేట : తెల్లవారుజామున పెద్ద శబ్దం రావడంతో చుట్వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో భారీ పేలుడు సంభవించింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భార్యా భర్తలు మృతి చెందారు. టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై వుండచ్చొని పోలీసులు భావిస్తున్నా, ఇంట్లో వున్న రెండు గ్యాస్ సిలెండర్లు.. సురక్షితంగా వుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు పనివారు ఉండగా ఘటన జరిగిన గదిలో రెండు మృతదేహాలు పడివున్నాయి. మరో అతను మేడమీద ఉన్నట్లు తెలిసింది. కాగా అతనికి ఏమీ కాలేదు. వివరాలు ఇచ్చేందుకు మదన్ మోహన్ రెడ్డి అందుబాటులో లేరు. పేలుడు ధాటికి గది గోడలు బద్దలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ పేలుడు...
-
తాళ్లపాకను చూసొద్దాం రండి
రాజంపేట, న్యూస్లైన్ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511 వర్ధంతి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను తాళ్లపాకలోని ధ్యానమందిరంతో పాటు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించనున్నారు. ఉత్సవాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. వీటిని టీటీడీ నిర్వహించనుంది. తాళ్లపాకలో నృత్య, హరికథ, సంగీతసభలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. కళకారులు భాగస్వాములు కానున్నారు. ఏర్పాట్లు సిద్ధం అన్నమాచార్య మహోత్సవాలకు టీటీడీ సకల ఏర్పాట్లు సిద్ధం చేసింది. తాళ్లపాకతో పాటు హైవేలోని తాళ్లపాక ముఖద్వారం నుంచి 108 అడుగుల అన్నమయ్య విగ్రహ వరకూ వేదికలు, ఆర్చ్లు ఏర్పాటు చేసింది. తాళ్లపాకలో ఉత్సవాల ప్రారంభం రోజు ఉదయం బహుళద్వాదశి పూజ కార్యక్రమంతో పాటు సప్తగిరి సంకీర్తనలు, సంకీర్తనలు, గోష్టిగానం నిర్వహిస్తారు. తరువాత తాళ్లపాక అన్నమాచార్యుల చిత్రపటాన్ని ఊరేగించనున్నారు. చివరి రోజు(31న) తిరుపతి, తెనాలి, కాకినాడ, రాజంపేట, బోయనపల్లె కళాకారులతో నాటకాలు నిర్వహిస్తారు. అన్నమయ్య విగ్రహం వద్ద కూడా ఇవే కార్యక్రమాలు ఉంటాయి. ఆ కీర్తనలు సజీవం కలియుుగ దైవమైన వెంకటేశ్వరుడికి 32 వేల కీర్తనలతో ఆరాధించిన అన్నవూచార్యుడు తాళ్లపాకలో జన్మించారు. చందవూవురావె జాబిల్లి రావె.., అదివో అల్లదివో శ్రీ హరి వాసవుు.. వంటి కీర్తనలు ఆయునవే. క్రీ.శ 1408 సంవత్సరం క్రోధి వైశాఖ శుద్ధపౌర్ణివు రోజున తాళ్లపాకలో అన్నవుయ్యు జన్మించారు. తల్లి లక్కవూంబ, తండ్రి నారాయుణసూరి. అన్నవుయ్యు చిన్నప్పుడే తిరువుల చేరుకున్నారు. తల్లితండ్రులు కోరగా తాళ్లపాకకు వచ్చి వివాహం చేసుకున్నారు. వుళ్లీ తిరువులకు వెళ్లారు. ఆయున ఇల్లాలు తివ్ముక్క సుభద్రా పరిణయుం రచించారు. అన్నయువ్యు కువూరుడు పెద తిరువులాచార్యులూ కీర్తనలు రచించారు. 1982లో అన్నవుయ్య ఆరాధన వుందిరాన్ని నిర్మించారు. ఈ వుందిరంలో అన్నవుయ్యు విగ్రహాన్ని నెలకొల్పారు. కాగా అన ్నమయ్య కీర్తనలు నేటికీ సజీవమే. అన్నవుయ్యు 32 వేల కీర్తనలు భాండాగారం తిరువులలోని శ్రీ వారి హుండీ వద్ద ఉండేవి. 500 ఏళ్ల తర్వాత వీటిని గుర్తించారు. ఇవి రాగిరేకుల రూపంలో నిక్షిప్తమై ఉన్నారుు. వీటిని టీటీడీ స్వాధీనం చేసుకొని ఉద్ధండులైన తెలుగు పండితులతో అనువాదం చేసి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కీర్తనలను అన్నవూచార్య ప్రాజెక్టు దిశదశలా వ్యాపించే విధంగా కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు 1978లో ఏర్పాటైంది. భాండాగారాన్ని బ్రిటిష్ కాలం నాటి అధికారి క్యాంప్బెల్ వెలుగులోకి తీసుకొచ్చారు. 32 వేల కీర్తనలో 14,358 కీర్తనలు వూత్రమే పూర్తిగా లభ్యమయ్యాయి. ఆ తర్వాత దేవస్థానం ఇన్స్పెక్టర్ సాధు సుబ్రవుణ్యం వీటిని పూర్తిగా వెలుగులోకి తెచ్చారు. తొలిసారిగా 108 కీర్తనలను స్వయుంగా టీటీడీ ప్రచురించింది. -
తుది ఓటర్ల జాబితా సిద్ధం
రాజంపేట, న్యూస్లైన్: ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా సిద్ధంగా ఉన్నట్లు ఆర్డీఓ ఎం.విజయసునీత అన్నారు. సోమవారం తన చాంబర్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అందరి సహకారంతో ఓటర్ల తుది జాబితా పూర్తి చేశామన్నారు. పోలింగ్ రోజున ఏజెంట్గా నియమితులయ్యే వ్యక్తికి ఖచ్చితంగా ఎపిక్కార్డు ఉండాలన్నారు. ఆ గ్రామంలో ఓటరుగా ఉండాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం డీఎస్పీ అనుమతి కోరాలన్నారు. వాహనాలకు సంబంధించి ఆర్ఓ అనుమతి ఉండాలన్నారు. నిబంధనల మేరకే వాహనాలలో వెళ్లే వారి సంఖ్య ఉండాలన్నారు. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థులు క్షుణ్ణంగా చదివి నెమ్మదిగా భర్తీ చేయాలన్నారు. మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్ పేరును మండల ప్రజా పరిషత్ స్కూల్గా జాబితాలో సవరణ చేశామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు భాస్కర్రాజు, రమేష్రెడ్డి, గోపిరెడ్డి, దినేష్, నాగేశ్వరనాయుడు, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లునాయుడు, తహశీల్దార్ విష్ణువర్ధన్రెడ్డి, డీటీ సుబ్బన్న, ఎలక్షన్ డెస్క్ ప్రతినిధి శ్రీధర్ పాల్గొన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలపై 25న సమావేశం ఒంటిమిట్ట కోదండరామాలయం ఉత్సవాలపై ఈనెల 25వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ విజయసునీత తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. -
రాజంపేటలో ఎర్రచందనం స్వాధీనం
-
వెంకటాద్రిలో పొగలు
రాజంపేట, న్యూస్లైన్ : కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్(12797)రైలులో గురువారం పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే బ్రేక్బైడింగ్తో హస్తవరం రైల్వేస్టేషన్లో అరగంట పాటు నిలిచిపోయింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు రాజంపేట-నందలూరు మధ్య ఉన్న హస్తవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ఎస్-1బోగీకి సంబంధించి వీల్ వద్ద బ్రేక్బ్లాక్ జామ్ అయింది. పాస్త్రూలో వెళుతున్న రైలులో స్వల్పంగా మంటలు రావడంతో స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది గమనించారు. వెంటనే డ్రైవర్కు సమాచారం ఇవ్వడంతో నిలిపివేశారు. బ్రేక్బైడింగ్లో సాంకేతికలోపం తలెత్తడంతో రైలు వేగం కూడా తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైలు రన్నింగ్స్టాప్ ఎస్-1బోగీ వద్దకు చేరుకొని బ్రేక్రిలీజ్ చేశారు. అనంతరం రైలుకు క్లియరెన్స్ ఇచ్చారు. -
'వెంకట్రాద్రి ఎక్స్ప్రెస్లో పొగలు'
కడప జిల్లా రాజంపేట సమీపంలో గురువారం ఉదయం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోని ఓ బోగీ నుంచి ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు వెంటనే ట్రైన్ చైయిన్ లాగీ నిలిపివేశారు. కొంతమంది ప్రయాణికులు భయంతో ట్రైన్ వదిలి పరుగులు తీశారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బోగీలో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై కనుగొన్నారు. బ్రేక్ స్ట్రక్ అవడంతోనే పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 15 నిముషాల అనంతరం ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరింది. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలు కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. -
రాజంపేట సబ్జైలుకు కన్నం
రాజంపేట, న్యూస్లైన్ : రాజంపేట సబ్జైలుకు కన్నం వేశారని ఆదివారం పట్టణంలో కలకలం రేగింది. దీంతో జైలు అధికారులు ఆ కన్నంను పరిశీలించారు. ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని భావించారు. ఇటీవల సబ్జైలును కొత్తగా నిర్మించారు. ఈ జైలుకు ప్రహారీ గోడ ఆఫీసర్స్ క్లబ్కు సమీపంలో ఉంది. ఈ గోడ అవతలి వైపు జైలులో ఉన్న వినాయకస్వామి గుడికి వస్తుంది. ఆ తర్వాత ఖైదీలు ఉండే గదులు, బాత్ రూములు ఉన్నాయి. ఈ గోడకు రంధ్రం ఎందుకు వేశారనే అన్న సందేహాలు వెలువడుతున్నాయి. జైలు ప్రహరీకి రంధ్రం పడిన విషయం తెలుసుకున్న జైలు సూపరిండెంట్ బీ.రవిశంకర్రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. కన్నం కాదని, ఇది ఆకతాయిలు చేసిన పని అని వివరించారు. -
వీడిన దివ్య హత్యకేసు మిస్టరీ
రాజంపేట, న్యూస్లైన్ : ఓ వివాహితను నమ్మించి తన వెంట తీసుకెళ్లి సరదాగా తిరిగి చివరికి ఆమెను హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరు మండ లం తంబళ్లవారిపల్లెకు చెందిన గాలి పెంచలయ్య, గాలి ఈశ్వరమ్మలకు రెండవ కుమార్తె దివ్య. ఆమెను బద్వేలుకు చెందిన నాగశేషుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 7వ తేదిన ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత 9వ తేది రాజంపేట మండలంలోని బోయనపల్లె హైస్కూల్లో శవమై కనిపించింది. దివ్యతో పరిచయం ఇలా.. ఏడాది కిందట దివ్యకు ఓ మిస్కాల్డ్ వచ్చింది. దీంతో ఆమె ఫోన్ చేయగా తన పేరు కార్తీక్ అని దివ్యతో పరిచయం మొదలెట్టాడు. తాను ఇంజనీరు అని చెప్పి పరిచయాన్ని కొనసాగించాడు. అప్పటికే ఇష్టంలేని పెళ్లి చేసుకున్న దివ్య అతని మాటలకు పడిపోయింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని బంగారు, డబ్బు తీసుకురావాలని చెప్పడంతో ఈనెల 7వ తేదిన మెట్టినింట గడప దాటి హత్యకు గురైంది. హత్యకేసు మిస్టరీని చేధించిన పోలీసులు పోలీసుల విచారణలో దివ్య, కార్తీక్లు తిరుమల, తిరుపతి తదితర ప్రాంతాల్లో జల్సాగా తిరిగారు. చివరికి తన అక్క రాజేశ్వరి, బావ మాతయ్య ఉంటున్న బోయనపల్లెకి వచ్చేశారు. అక్కడ స్నేహితుడు చంద్ర వద్ద మకాం వేశారు. బోయనపల్లె హైస్కూల్లో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆమెను కర్చీప్తో గొంతు బిగించి హత్య చేశారు. దివ్య వద్ద ఉన్న ఆరుతులాలు బంగారు, 38 గ్రాముల వెండి నగలు, సెల్ఫోన్లు తీసుకొని వెళ్లిపోయాడు. రాజంపేట రూరల్ పోలీసులు హత్యకేసులోని మిస్టరీని చేధించారు. అరెస్టు ఇలా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రైల్వేకోడూరు నారాయణరాజుపోడుకు చెందిన కార్తీక్ను అక్కడే ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట జూనియర్ సివిల్ జడ్జికోర్టులో హాజరు పెట్టగా రిమాండ్కు ఆదేశించారు. డీఎస్పీ జీవీ రమణ సమక్షంలో విలేకరుల ఎదుట మన్నూరు సీఐ కార్యాలయ ఆవరణలో హాజరుపెట్టారు. హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు రివార్డు ఇప్పించేందుకు ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ ప్రకటించారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండిచేయి
రాజంపేట, న్యూస్లైన్: రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. మాటలను కోటలు దాటించే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి హామీలు నీటిమూటలే అయ్యాయి. కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి రాయలసీమ నుంచి ప్రాతనిథ్యం వహిస్తుండటంతో బడ్జెట్ విషయంలో జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వేశాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే గందరగోళం మధ్య బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్లో జిల్లాకు కనీస న్యాయం జరగలేదు. కాచిగూడ- తిరుపతి డబుల్డెక్కర్ రైలును బైవీక్లీగా జిల్లా మీదుగా నడిపించనున్నారు. అలాగే కాచిగూడ-నాగర్కోయిల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్, ముంబై-చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్ జిల్లా మీదుగా నడవనున్నది. బడ్జెట్లో నందలూరు రైల్వేపరిశ్రమ ఊసేఎత్తలేదు. కొత్త మార్గాల గురించి కానీ.. ప్రతిపాదనలో ఉన్న పొడిగింపు రైళ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. కాచిగూడ- మంగళూరు, చెన్నై-నాగర్సోల్, బనగానపల్లె-ఎర్రగుంట్ల రైళ్లు బడ్జెట్ కాగితాల్లోనే ఉండిపోయాయి. కడప-బెంగళూరు, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గాలకు మళ్లీ అరకొర నిధులే కేటాయించారు. దీంతో ఈ రైలు మార్గాల నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతునే ఉంది. -
‘కోటి’ తిప్పలు
రాజంపేట, న్యూస్లైన్: రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన శాఖలో గత ఏడాది జరిగిన చోరీకి సంబంధించి బ్యాంకు అధికారులు ఖాతాదారులతో సెటిల్మెంట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన బ్యాంకులో జరిగిన చోరీ జిల్లాలో సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. రూ. 18 లక్షల నగదు, 62 మంది ఖాతాదారులకు సంబంధించి తాకట్టు పెట్టిన 3 కిలోల బంగారు నగలు కలిపి మొత్తం దాదాపు రూ.కోటి చోరీకి గురైనట్లు అప్పట్లో బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల సమస్య పరిష్కారానికి ఏపీజీబీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. న ష్టపోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని తీర్మానించింది. ఈ దిశగా అధికారులు దృష్టి సారించారు. తాకట్టు పెట్టిన 62 మందిలో నలుగురు మాత్రం తాము తీసుకున్న అప్పును బ్యాంకుకు చెల్లించినట్లు సమాచారం. దీంతో అధికారులు పక్కాగా రికార్డు ఆధారంగా బాధితులు నష్టపోయిన మొత్తాన్ని చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఏపీజీబీ ఆర్ఎం శివశంకర్రెడ్డిని న్యూస్లైన్ వివరణ కోరగా చోరీకి గురైన ఖాతాదారుల తాకట్టు నగలు, నగదుకు సంబంధించిన చెల్లింపు ప్రక్రియను చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇలా చెల్లించాలని.. ఖాతాదారుల డబ్బుకు సంబంధించి అంతే మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించనున్నారు. అలాగే నగల విషయంలో వారికి నగలకు బదులు వాటికి సరిపడే డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. వీరికి డబ్బులు చెల్లించే నాటికి ఆ రోజున మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో అంత మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం.అయితే తాకట్టు పెట్టిన బంగారంపై ఖాతాదారులు తీసుకున్న అప్పులు ఏవైనా ఉంటే వాటిని లెక్కలోకి తీసుకోనున్నారు. నగలకు విలువకట్టి మొత్తంలో అప్పుగా ఉన్న మొత్తాన్ని తీసుకొని మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. -
నేడే వీఆర్వో,వీఆర్ఏ పరీక్షలు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్: వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే వీఆర్వో పరీక్షలకు 28,352 మంది, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరిగే వీఆర్ఏ పరీక్షలకు 888 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందు కోసం కడపలో 38, ప్రొద్దుటూరులో 16, రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రభుత్వ సూచనలు పాటించాలని డీఆర్వో ఈశ్వరయ్య కోరారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి 20 నిమిషాల ముందు నుంచే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్ టిక్కెట్లతోపాటు ఆధార్, ఓటరు గుర్తిపుకార్డు, పాన్ కార్డులలో ఏదో ఒకటి తప్పక తీసుకు రావాలి. హాల్ టిక్కెట్లపై ఫొటో లేకపోవడం, పురుషులకు బదులు మహిళలు లేదా మహిళలకు బదులు పురుషులు అని నమోదు కావడం వంటి సమస్యలు ఉత్పన్నమైతే మూడుపాస్పోర్టు సైజ్ ఫోటోలపై గెజిటెడ్ అధికారుల సంతకం చేయించుకుని తీసుకు వస్తే అనుమతిస్తారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులు మాత్రమే ఉపయోగంచాలి. వీఆర్వో ప్రశ్నాపత్రం కోడ్ 999, వీఆర్ఏ ప్రశ్నాపత్రం కోడ్ 888. నామినల్ రోల్స్లో అభ్యర్థుల సంతకంతోపాటు ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి. ఓఎంఆర్ పత్రాన్ని నింపిన తర్వాత ఇన్విజిలేటర్ సంతకం తప్పనిసరి. ఓఎంఆర్ షీట్లో మొదటి వైపు పార్ట్-ఏ, బీ, సీలోని ఏ ఒక్క అంశాన్ని సక్రమంగా నింపకున్నా, వృత్తాలను బాల్ పాయింట్ పెన్నుతో నింపకున్నా, టెస్ట్బుక్లెట్ సీరీస్ నెంబరు, రోల్ నెంబరు, పేపర్ కోడ్ నింపకపోతే అభ్యర్థుల సమాధాన పత్రాలను పరిశీలించరు.ఓఎంఆర్ షీట్పై రఫ్ వర్క్ చేయడం, మడవడం, గీతలు, చింపడం, పిన్ చేయరాదు.ఏవైనా ఫిర్యాదులుంటే కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సి.గుణభూషణ్రెడ్డిని 98499 04116 నెంబరులో సంప్రదించాలి. -
ఆ బిడ్డకు ఏం కష్టమొచ్చిందో..
రాజంపేట, న్యూస్లైన్ : ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ బలవన్మరణానికి పాల్పడింది. తను ఉండే గది కిటికీకి ఓణీతో ఉరేసుకుని తనువు చాలించింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. శనివారం తెలవారుజామున జరిగిన ఈ సంఘటనతో రాజంపేట మండలం నరనరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లెకు చెందిన హేమలత, రామకృష్ణారెడ్డి(ఈయన మైదుకూరులో ట్రాన్స్కో శాఖ లైన్మెన్గా పని చేస్తున్నారు) దంపతుల కుమార్తె అయిన జి.శ్రీనిధి అలియాస్ సన్ని(13)జవహర్ నవోదయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుర్తించింది ఇలా... శుక్రవారమంతా తోటి స్నేహితులతో సరాదాగా గడిపిన శ్రీనిధి రాత్రి అందరితో పాటు నిద్రపోయింది. అయితే శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు విద్యార్థినులందరూ పీఈటీ క్లాస్కు వెళ్లడం దినచర్య. యథాప్రకారం విద్యార్థినులందరూ క్లాస్కు వెళ్లగా వారిలో ఒకరు తక్కువగా ఉన్నారు. శ్రీనిధి రాలేదని తెలుసుకుని ఆ అమ్మాయి కోసం తోటి విద్యార్థులను పిల్చుకురమ్మని పంపారు. అయితే ఆమె కన్పించలేదు. అదే విషయం ఉపాధ్యాయులకు తెలుపగా, వారొచ్చి గదంతా పరిశీలించారు. స్టోర్ రూపంలో గోడకు ఓ వైపున ఆనుకుని నిద్రపోతున్నట్లుగా కన్పించింది. నిద్రపోతోందేమోనని భావించి ఆమెను లేపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓణీతో కిటికీకి ఉరేసుకుని ఉండడాన్ని గుర్తించి హడలెత్తిపోయారు. వెంటనే ఆమెను కదిపి చూడగా ఎటువంటి కదలికలు లేవు. అప్పటికే మరణించినట్లు గుర్తించి వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కేవీఎస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పండుగకు వచ్చిందే చివరిసారి.. పండుగకు స్వగ్రామానికి వచ్చిన శ్రీనిధి కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపింది. పండుగ తరువాత తండ్రితో కలసి పాఠశాలకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై నవోదయ ప్రిన్సిపాల్ పోలసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుధాకర్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు శ్రీనిధి రాసి ఉంచిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కదిలొచ్చిన యంత్రాంగం నవోదయ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, డీఈఓ అంజయ్య, స్థానిక తహశీల్దార్ చండ్రాయుడు వెంటనే విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. -
కాన్పు కేసా.. రిమ్స్కెళ్లండి
ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. ఇది.. ప్రభుత్వ పెద్దల మాట. కాన్పు కేసా.. రిమ్స్కెళ్లండి ఇది.. ఆయా ఆసుపత్రులలోని సిబ్బంది మాట. వైద్యుల నిర్లక్ష్యంతో అనేక సందర్భాలలో మార్గమధ్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల తదితర ఆసుపత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేట, న్యూస్లైన్: కాన్పు కోసం రాజంపేట వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వాస్పత్రి కి వస్తే.. రిమ్స్ కు రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇక రాత్రు ల్లో కాన్పు కేసులు వస్తే మరోమాట లేకుండా రిమ్స్ కు తరలిస్తున్నారు. పైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేదలు విధిలేని పరిస్థితిలో రిమ్స్కు వెళుతున్నారు. ఈ నెల వరకు సీమాంక్ నుంచి 25 రెఫర్లు జరిగాయి. నెలకు 5 నుంచి 6 సీజేరియన్ కేసులు నమోదు అవుతున్నాయి. సీమా ంక్లో సేవలందించేందుకు ఒక వైద్యుడు ఉండగా, ఇద్దరు వైద్యురాలు ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్నారు. ప్రభుత్వాస్పత్రిలో గర్భిణీ మూడో నెల నుంచి చూపించుకునే వారికి (బుక్డ్) ప్రసవానికి వస్తే చికిత్స అందిస్తున్నారు..అలా కాకుండా ఎక్కడో చూపించుకొని (అన్బుక్డ్) డెలివరీకి సీమాంక్కు వస్తే వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. -
కిరణ్.. వాట్ ఈజ్ దిస్
కడప కార్పొరేషన్, న్యూస్లైన్ : అధికారంలో ఉంటే ఏమేమి చేయవచ్చో కాంగ్రెస్ నేతలు చేసి చూపిస్తున్నారు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అన్నట్లు ముఖ్యమంత్రి అండతో రూ. కోట్ల పనులను అడ్డదారిలో దక్కించుకుంటున్నారు. అభివృద్ధి పనుల కేటాయింపులపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉన్నప్పటికీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికార పార్టీ నేతలకు రూ.కోట్ల పనులను అప్పనంగా అప్పగిస్తున్నారు. రాజంపేటలో అధికార పార్టీ నేత మేడా మల్లికార్జునరెడ్డి పేరుతో రూ. 2కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్నిధులను కేటాయిస్తూ ఈనెల 17వ తేదీన ఏకంగా జీఓ జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బద్వేలు నియోజకవర్గ పరిధిలో రూ.2.83కోట్లను అక్కడి స్థానిక ఎమ్మెల్యే పీఎం కమలమ్మ ప్రతిపాదనలను అనుసరించి మంజూరు చేశారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఇదే రీతిలో స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ప్రతిపాదనలను అనుసరించి స్పెషల్ డెవలప్మెంట్ నిధులను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నిధులను స్థానిక ఎమ్మెల్యేలకే కేటాయించారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మాత్రం అక్కడి ఎమ్మెల్యేకు నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రికి మనసు అంగీకరించలేదు. అధికార పార్టీలో కొనసాగుతున్న మేడా మల్లికార్జునరెడ్డి ప్రతిపాదించిన 75 పనులకు సంబంధించి రూ. 2కోట్లను ముఖ్యమంత్రి దారాళంగా మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులందరికీ న్యాయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం ఒక్క నాయకుడికి రూ. 2కోట్ల పనులను అప్పగించడంపై కాంగ్రెస్ నాయకులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. -
రాజంపేట చోరీపై ఐజీ ఆరా
రాజంపేట, న్యూస్లైన్: రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ ఘటనపై రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్ ఆరా తీశారు. హ మేరకు శుక్రవారం రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి చోరీ సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చోరీపై దృష్టి పెట్టి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సబ్డివిజన్ పరిధిలోని శాఖ పరమైన పురోగతిపై సమీక్షించారు. సబ్డివిజన్ పరిధిలో పోలీసు శాఖకు సంబంధించి నివాస గృహాలు దెబ్బతిని ఉంటే వాటికి మరమ్మతులు చేయించాలని, నివాస గృహాల విషయమై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ యనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్, రాజంపేట డీఎస్పీ అన్యోన్య, పట్టణసీఐ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు ఉన్నారు. -
బద్వేల్ డివిజన్కు రంగం సిద్ధం!
రాజంపేట, న్యూస్లైన్: బద్వేల్ డివిజన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెలాఖరులో ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది వరకే బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించింది. బద్వేలు డివిజన్ ఏర్పాటు విషయంలో జిల్లా కలెక్టర్ ఇప్పటికే సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా బద్వేలు డివిజన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులో డివిజన్ ఏర్పాటుపై గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సీజన్ ముంచుకొస్తోంది. ఈరెండు అంశాలు బద్వేలు డివిజన్ ఏర్పాటు అంశంపై ప్రభావం చూపనున్నాయి. నిధుల వ్యయంతోనే వెనకడుగు.. కొత్త డివిజన్ల ఏర్పాటుకు నిధులను అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి కలుగుతుంది. బడ్జెట్ లోటుతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం కొత్త డివిజన్ల ఏర్పాటుపై ఆచితూచి అడుగులువేయనున్నది. కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్ల పరిధిలో జిల్లాలోని మండలాలు విస్తరించివున్నాయి. ఆర్డీఓలతో పాటు రాజంపేట సబ్కలెక్టర్కు విధి నిర్వహణ భారంగా మారుతోంది. డివిజన్ కేంద్రం నుంచి సుదూరంగా ఉన్న మండలాలు అనేకం ఉన్నాయి. పరిపాలన పరంగా విధి నిర్వహణ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తోంది. ప్రజల సౌకర్యార్థం ..పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ల సరిహద్దులను మార్చేందుకు యోచిస్తోంది. . జిల్లాలో మొత్తం 51 మండలాలు ఉన్నాయి. రాజంపేట రెవిన్యూ డివిజన్లో 17 మండలాలు, జమ్మలమడుగు డివిజన్లో 16 మండలాలు, కడప డివిజన్లో 17 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్లలోని సగానికిలోపు మండలాల వాసులు సమస్యలు విన్నవించుకునేందుకు రావాలన్నా, ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు అధికారులు వెళ్లాలన్నా తీవ్ర వ్యయప్రయాసాలను ఎదుర్కొంటున్నారు. 45కిలోమీటర్ల దూరమే లక్ష్యంగా.. ప్రస్తుతం ఉన్న రెవిన్యూ డివిజన్2 కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉన్న మండలాలను నూతనంగా ఏర్పాటుచేసే కొత్త డివిజన్లలోకి కలుపుతారు. ఆయా మండలాల్లో నీటి వనరుల లభ్యత, అటవీ ప్రాంతాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త డివిజన్లు ఏర్పాటుచేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు కలిపి రాజంపేట డివిజన్గాను, బద్వేలు, మైదుకూరు కలిపి బద్వేలు డివిజన్గాను, జమ్మలడుగు, ప్రొద్దుటూరు కలిపి జమ్మలమడుగు డివిజన్గాను, రాయచోటి, పులివెందుల కలిపి పులివెందుల డివిజన్గా, కడప, కమలాపురం కలిపి కడప రెవిన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
దోపిడీ !
సాక్షి, కడప : ‘ఏరా.. ఏట్లో ఇసుకేమిరా...కావాల్సినప్పుడల్లా డబ్బులు కావాలి అని సతాయిస్తుంటారు. డబ్బులు లేవు..ఏమీ లేవు ఫో..!’ ఇవి గతంలో పల్లెల్లో డబ్బులు అడిగిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాటలు. ప్రస్తుతం సీన్ మారింది. ఇసుక బంగారమైంది. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎంతలా అంటే.. తవ్వకాలు, రవాణా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారంటే జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తవ్వకాలపై దాదాపు మూడేళ్ల్ల కిందట హైకోర్టు నిషేధం విధించింది. దీంతో అప్పటిదాకా ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక క్వారీలపై అధికారులు నిషేధం విధించారు. తవ్వకాలు జరపకుండా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో జిల్లాలో ఇసుకరవాణా తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇసుక తవ్వకాలపై నిషేధం విధించకమునుపు జ్యోతి, అనిమెల, రాజంపేటతో పాటు ఏడు ఇసుక క్వారీలకు అనుమతి ఉండేది. ప్రభుత్వ రుసుం మేరకు డబ్బులు చెల్లించి ఇసుక తవ్వకాలు కొనసాగేవి. బాడుగతో కలిపి ట్రాక్టర్ ఇసుకకు రూ. 500 వసూలు చేసేవారు. దూరప్రాంతాలైతే బాడుగ పెరిగేది. అయితే నిషేధం తర్వాత ఇసుక బంగారమైంది. ఒక్కసారిగా 5-10రెట్లు పైబడి ఇసుక ధర పెరిగింది. పస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ. 2,500 నుంచి రూ. 7వేల వరకూ పలుకుతోంది. ఇళ్ల నిర్మాణానికి ఇసుక తప్పనిసరి. ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నవారు ఎంతడబ్బైనా చెల్లించి ఇసుక కొనుగోలు చేయాల్సిందే. ట్రాక్టర్ల యజమానులు చెప్పినంత డబ్బులు చెల్లించి ఇసుక కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన డబ్బుల్లో మొదటగా ట్రాక్టర్ల యజమానులు లబ్ధిపొందుతుంటే..రెండోస్థానంలో పోలీసులు..మూడోస్థానంలో రెవెన్యూ అధికారులు..నాలుగో స్థానంలో మైనింగ్ అధికారులు ఉన్నారు. దూరాన్నిబట్టి రేటు: నదీ ప్రాంతం నుంచి పదికిలోమీటర్లలోపు ఒక్కో ట్రాక్టరు ఇసుకకు రూ. 2,500 నుంచి 3వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ పరిధి దాటితే ధర పెరుగుతూ పోతుంది. పోరుమామిళ్లతో పాటు నెల్లూరు, క ర్నూలుకు కూడా ఇసుక రవాణా సాగుతోంది. ట్రాక్టర్లకైతే రూ. 7 -8 వేలు వసూలు చేస్తారు. ఇతర జిల్లాలకు లారీల ద్వారా రవాణా చేస్తారు. లారీల బాడుగే రూ. 15-20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్దవటం, కమలాపురం, జమ్మలమడుగు, చెన్నూరు, బద్వేలు, అట్లూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. పోస్టింగ్ కోసం తంటాలు: త్వరలో ఎస్ఐల బదిలీలు ఉన్నాయి. ఇసుక రవాణా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం కొంతమంది ఎస్ఐలు తీవ్రంగా యత్నిస్తున్నారు. వారికి అనుకూలమైన ప్రజాప్రతినిధులు, రాజకీయనేతల ద్వారా సిఫార్సు చేయించుకుంటున్నారు. అడ్డొస్తే భౌతిక దాడులకూ సిద్ధం: ఇసుకరవాణాలో సహకరిస్తే డబ్బులు ఇవ్వడం, కాదంటే దాడులకు దిగడమే మార్గంగా ఇసుకాసురులు భావిస్తున్నారు. గతేడాది కడప సమీపంలోని లింగంపల్లి సమీపంలో తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ జిల్లా అధికారిపై ఇసుకమాఫియా భౌతికదాడికి తెగబడింది. అట్లూరు పరిధిలో అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ కానిస్టేబుల్పై మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. -
దున్నపోతు స్వైర విహారం
రాజంపేట, న్యూస్లైన్ : రాజంపేట మండలం ఎంజీపురం పరిసర ప్రాంతాల్లో ఓ దున్నపోతు స్వైరవిహారం చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ గ్రామస్తులకు మాత్రం నిద్రహారాలు లేకుండా చేస్తోంది. కొందరైతే దున్నపోతు దేవుడికి ఇచ్చారని చెపుకుంటున్నారు. నాలుగు రోజులుగా దున్నపోతు పేరు వింటేనే గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు. అది కనిపిస్తే ఉరుకులు..పరుగులు తీస్తున్నారు. రాత్రిళ్లు సమీప తోటల్లో మకాం వేసి, సాయంత్రం కాగానే ఊరిపై పడటం ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజు కిందట దున్నపోతు దాడి నుంచి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న పెంచలయ్య చెట్టెక్కి తప్పించుకోగా, అదే రోజున అదే గ్రామానికి చెందిన కామాక్షమ్మపై దున్నపోతు దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆమెను తిరుపతి రుయాలో చేర్పించారు. ఆమె పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. దున్నపోతు వ్యవహారంపై మాజీ సర్పంచ్ చిన్నపెంచలయ్య, రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు కెఎంఎల్ నరసింహులు కలసి రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర జూ డెరైక్టర్ దృష్టికి.. దున్నపోతును పట్టుకొనే విషయాన్ని సీఐ వెంకటేశ్వర్లు రాష్ర్ట జూ విభాగం డెరైక్టరు మల్లికార్జున దృష్టికి ఫోన్లో తీసుకెళ్లారు. ఆయన ఖమ్మంజిల్లాలో కూడా ఓ దున్నపోతు కనిపించి జనంపై దాడి చేసిన సంఘటన గుర్తు చేసుకున్నారు. దీంతో తిరుపతి జూ అధికారులు డాక్టర్ అరుణ్, రేంజర్ సెల్వకుమార్ ఇక్కడికి చేరుకన్నురు. దున్నపోతుకు మత్తు ఇచ్చి అదుపులోకి తీసుకునేందుకు సీఐతో కలసి గాలించారు. బాగా పొద్దు పోయినంత వరకు దున్నపోతు కోసం గాలించారు. అది కన్పించకపోవడంతో చేసేది లేక జూ అధికారులు వెనుదిరిగారు. దున్నపోతు కన్పిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. -
జిల్లా అభివృద్ధికి కేంద్ర నిధులు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకువస్తామని రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి చైర్మన్ హోదాలో ఆయన హాజరై అధ్యక్షత వహించారు. ఉపాధి హామి, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిర జలప్రభ, ఇంటిగ్రేటెడ్ మెగా వాటర్షెడ్, గృహనిర్మాణం, పెన్షన్లు తదితర అంశాలపై చ ర్చించారు. డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం తమ శాఖ ప్రగతిని వివరించారు. ఇందిర జలప్రభ కింద మరో 12 వేల ఎకరాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. 11 వేల ఎకరాల్లో నీరందించేందుకు బోర్ పాయింట్లు గుర్తించామన్నారు.ఎంపీ కల్పించుకుంటూ ఐదు మంది రైతులు కలసి ఒక బోరుతో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేవన్నారు. రెండు, మూడు ఎకరాలున్న రైతులను గుర్తించి వారికి వ్యక్తిగతంగా బోర్లు మంజూరు చేస్తే ఉపయోగముంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై తీర్మానాన్ని ఆమోదించి ముఖ్యమంత్రికి పంపాలని కలెక్టర్కు సూచించారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లలో 15 శాతం ఫెయిల్ అవుతున్నాయని ఆరోపించారు. రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కరువు మండలాల్లో ఉపాధి కూలీలకు 150 రోజులు పనులు కల్పించాలని కోరారు. జలప్రభ కింద ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఆలస్యమవుతోందన్నారు. మెగా వాటర్ షెడ్స్ నిర్మాణాలు ఎక్కడ చేపడుతున్నారో తమకే తెలియడం లేదన్నారు. కొత్త పెన్షన్లు ఎవరికీ ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ షేక్ హుసేన్ తెలిపారు. ఖాళీలుంటే తప్ప భర్తీ చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ నిర్మల మాట్లాడుతూ ఆస్పత్రి వర్గాలనుంచి తమకు కూడా ఫిర్యాదు వచ్చిందన్నారు. ఝరికోన ప్రాజెక్టు నీటినిముఖ్యమంత్రి పీలేరుకు తరలించడం వల్ల తన నియోజకవర్గంలోని సంబేపల్లె, చిన్నమండెం మండలాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని శ్రీకాంత్రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ అవుకు నుంచి గండికోటకు నీరు ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం గండికోటలో ఉన్న నీటిని మైలవరం రిజర్వాయర్కు తరలించి ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ శశిధర్ బదులిస్తూ గండికోటలో ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు ఉందన్నారు. ఇంకా రెండు టీఎంసీలు అవుకు నుంచి గుర్రప్ప చెరువు ద్వారా మైలవరానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. రాజీవ్ యువ కిరణాల అమలుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా యువత ఇక్కడే ఉద్యోగం కావాలని కోరుకుంటోందని తెలిపారు. జీతాలు తక్కువగా ఉన్నందున హైదరాబాద్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదన్నారు. ఫ్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లుగా ఓవర్సీస్కు పంపుదామంటే అవసరమైన స్కిల్స్ ఉండడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుని యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. ఇందుకు ఎంపీ సాయిప్రతాప్ స్పందిస్తూ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
త మిళనాడు టు శేషాచలం
రాజంపేట, న్యూస్లైన్: కూలీ డబ్బుల కోసం ఆశపడి చిత్తూరు, కడప జిల్లా సరిహద్దులోని శేషాచలం అటవీ ప్రాంతానికి తమిళనాడు కూలీలు వస్తున్నారు. రెండురోజులుగా వందకుపైగా తమిళతంబీలు అటవీ అధికారులకు పట్టుబడ్డారు. మేస్త్రీ పంపిస్తే వచ్చాం.. చెట్లు నరికేందుకు రోజుకు రూ. 300 నుంచి రూ 500 ఇస్తారని చెబుతున్నారు. తమ వెంటనే పదునైన గొడ్డళ్లను తెచ్చుకుంటారు. వీరికి అడవిలో ఒకరోజుకు సరిపడే అన్నం సరఫరా చేస్తారు.. అదే అన్నంను మరుసటి రోజు నీళ్లు కలుపుకుని తాగుతారు. కొట్టిన ఎర్రచందనం దుంగలను డ్రస్సింగ్ చేసి 30 నుంచి 40 కిలోమీటర్ల మోసుకుని రోడ్డు మార్గానికి చేరవేస్తారు. ఈ విధంగా ఎర్రచందనం అక్రమరవాణాకు కూలీలను స్మగ్లర్లు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా తమిళనాడులోని వేలూరు, సేలం, తిరవళ్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని కొన్ని తమిళ ప్రాంతాలకు చెందిన కూలీలను మాట్లాడుకుని శేషాచలం తరలిస్తున్నారు. ఇద్దరు అటవీ అధికారుల హత్య నేపథ్యంలో శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. అటవీ, పోలీసుశాఖలు మూకుమ్మడిగా రెండురోజులుగా 119 మంది కూలీలను అరెస్ట్ చేశారు. -
స్మగ్లర్ల వేటలో సాయుధ బలగాలు
రాజంపేట, న్యూస్లైన్: ప్రపంచలోనే అత్యంత అరుదైన ఎర్రచందనాన్ని విస్తారంగా కలిగి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల కోసం సాయుధ బలగాలు వేట మొదలుపెట్టాయి. వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో ఏడు ప్లటూన్ల బలగాలు ఇప్పటికే వేటను ముమ్మరం చేశాయి. వై.కోట, కేవీబావీ, గాదెల, తుమ్మలబైలు, రోళ్లమడుగు, సానిపాయి, రాజంపేట, బాలపల్లె తదితర ప్రాంతాల్లోని డీప్ ఏరియాల్లోకి బలగాలు దూసుకెళ్తున్నాయి. కర్నూలు మూడో బెటాలియన్కు చెందిన బలగాలు రాజంపేట డివిజన్కు చేరుకున్నాయి. ఈ బలగాలు కేవలం అడవికే పరిమితం కాకుండా రహదారుల్లోనూ రాత్రిళ్లు గస్తీ, వాహనాల తనిఖీని సైతం చేపట్టాయి. రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు? తిరుపతి డివిజన్లోని తుంబరతీర్థం వద్ద డేవిడ్ కరుణాకర్, శ్రీధర్ అనే ఇద్దరు అటవీ అధికారులను స్మగ్లర్లు బరితెగించి అత్యంత దారుణంగా హతమార్చడం సంచలనం సృష్టించింది. దీన్ని అటవీ శాఖ జీర్ణించుకోలేకపోతోంది. ఇది కచ్చితం గా అటవీ దొంగ వీరప్పన్ అనచరుల పనే అయి ఉంటుందని ఆ శాఖ గట్టిగా నమ్ముతోంది. దీంతో గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపి స్మగ్లర్లను పూర్తిగా ఏరివేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు రంగంలోకి దిగి ఎర్రచందనం చెట్లను నరికి సులవుగా రోడ్డు మార్గం గూండా తరలిస్తుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వందల సంఖ్యలో తమిళనాడుకు చెందిన ఎర్ర దొంగలు అడవుల్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను కూల్చుతున్న తరుణంలో అటవీ, పోలీసు శాఖలు సంయుక్తంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
తిరగబడితే కాల్చివేత
రాజంపేట, న్యూస్లైన్: ఎర్రచందనం స్మగర్లు తిరగబడితే కాల్చివేయనున్నారు. ఈ మేరకు అటవీ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తుంబురతీర్ధం వద్ద అటవీ అధికారులను ఇటీవల దారుణంగా హత్య చేసిన ఎర్రదొంగలను వేటాడేందుకు సాయుధబలగాలు రంగంలోకి దిగాయి. శనివారం నుంచి ఆపరేషన్ ప్రారంభించనున్నారు. ఆరు ప్లటూన్ల సాయుధబలగాలు రాజంపేట డివిజన్ ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఏపీఎస్పీ బెటాలియన్ ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో శేషాచలంలో గాలింపు చేసేందుకు అటవీ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అటవీ సిబ్బంది, సాయుధబలగాలు సమైక్యంగా అడవిలోకి అడుగు పెట్టనున్నారు. మొత్తం మీద శేషాచల అటవీ ప్రాంతాలు సాయుధబలగాల కనురెప్పల్లో ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. -
తెగబడ్డారు
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. తమిళనాడు నుంచి తరలి వచ్చిన కూలీలు యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికి అక్రమ రవాణా చేస్తున్నారు. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించే అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. మారణాయుధాలతో సంచరిస్తున్న స్మగ్లర్లు అటవీ ఉద్యోగులను హత మార్చేందుకూ వెనుకాడటం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలో ఉద్యోగులున్నారు. రాజంపేట, న్యూస్లైన్: శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికేస్తున్నారు. అడ్డొచ్చిన అటవీ అధికారులను అంతమొందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో అటవీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కడప -చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న తుంబురతీర్థం సమీపంలో స్మగ్లర్లు తెగబడ్డారు. అధికారులపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా చ ంపారు. మరికొందరు సిబ్బంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ సంఘటన అటవీ ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న అటవీ అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిరాయుధులంగా ఉంటూ స్మగ్లర్ల చర్యలను ఎలా తిప్పికొట్టాలని ప్రశ్నిస్తున్నారు. అయితే తుంబరతీర్ధం వద్ద జరిగిన సంఘటనతో తుమ్మలబైలు, బాలపల్లె, మామండూరు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తమిళ స్మగ్లర్లు జిల్లాలోని శేషాచలం అడవుల వైపు వస్తారన్న అనుమానంతో అడవిలో గాలింపు చేస్తున్నారు. వారు వైఎస్సార్ జిల్లాలో రోడ్డు, రైలు మార్గం ద్వారా వారి గమ్యాలకు చేరుకుంటారనే అనుమానాలు అటవీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు లేకుంటే వెళ్లలేం స్మగ్లర్ల చేతిలో ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురైన నేపథ్యంలో ప్రస్తుతం అటవీ ఉద్యోగులు అడవిలోనికి వెళ్లి విధులు నిర్వహించాలంటేనే వణికిపోతున్నారు. ఆయుధాలు లేకుండా విధులకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. పాతకాలం నాటి తుపాకులు ఉన్నాయే తప్ప అధునాతన ఆయుధాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లను కాల్చివేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. కేవలం అడవిలో సాయుధ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కూంబింగ్ చేస్తున్నారు. అయితే అటవీ సిబ్బంది చేతికి మాత్రం ఆయుధాలు ఇవ్వలేదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. తుంబురతీర్థం సంఘటనతో అడవిలోకి అటవీ సిబ్బంది వెళ్లడంలేదు. అప్రమత్తమైన అటవీశాఖ కడప-చిత్తూరు జిల్లా సరిహద్దులో జరిగిన సంఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఇటీవల శేషాచలం అడవిలో తిష్ట వేశారు. వారిని నియంత్రించేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే అడవిలో అనేకమార్లు స్మగ్లర్లు తిరగబడటం, చెక్పోస్టులను సైతం లెక్కచేయకుండా స్మగ్లింగ్ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో తమిళ తంబిలను అరెస్టు చేశారు. అయినప్పటికీ వారి ఆగడాలు ఆగడం లేదు. శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేయాలనే విషయంపై అటవీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తిస్థాయి రక్షణ లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకోలేమనే అభిప్రాయంలో వారున్నారు. -
పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్..
రాజంపేట, న్యూస్లైన్: వరస హత్యలతో కలకలం సృష్టిస్తున్న సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజంపేట పట్టణంలో గురువారం తోట వెంకటరమణను పొలీసులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా పుల్లంపేట, రాజంపేట, ఓబులవారిపల్లె తదితర ప్రాంతాల్లో పోలీసు ప్రత్యేకబృందాలు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి పుల్లంపేట నుంచి వత్తలూరు మీదుగా అలాగే రాజంపేటలో బృందాలు గాలింపు చేశాయి. ఈ క్రమంలో రాయచోటి రోడ్డులోని రాజంపేట ఆర్వోబీ వద్ద తోట వెంకటరమణను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసుశాఖ గోప్యంగా ఉంచుతోంది. ఈవిషయంపై నోరు విప్పడంలేదు. అయితే తమకు సవాల్గా మారిన తోట వెంకటరమణను ఎట్టకేలకు పట్టుకోవడంతో ఆ శాఖ ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం తోట వెంకటరమణ అరెస్టును చూపే అవకాశం ఉంది. -
కడప రాజంపేటలో లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం