-
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
హిందీలో చాలా ఏళ్ల నుంచి దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కరణ్ జోహార్. ప్రస్తుతం డైరెక్షన్ పక్కనబెట్టి నిర్మాతగా వరస చిత్రాలు తీస్తున్నారు. కరణ్ నిర్మించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఈ నెల చివర్లో రానుంది. సరే దాని గురించి పక్కనబెడితే ఈయన్ని ఇప్పుడు ఓ కమెడియన్ ఘోరంగా హర్ట్ చేశాడు. దీంతో కరణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. తనని చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్ స్టాలో స్టోరో కూడా పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)ఇంతకీ ఏమైంది?దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని చూసిచూడనట్లు వదిలేస్తుంటాడు. అయితే ప్రముఖ రియాలిటీ షోలో ఓ కమెడియన్.. కరణ్ని దారుణంగా అనుకరించాడట. తల్లితో కలిసి టీవీ చూస్తున్న టైంలో ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చిందని, దీంతో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.కరణ్ పోస్టులో ఏముంది?'నేను, మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. ఓ పేరున్న ఛానెల్లో రియాలిటీ కామెడీ షో ప్రోమో ఒకటి చూశాను. అయితే ఓ కమెడియన్.. నన్ను చాలా చీప్గా అనుకరించాడు. ఇలాంటివి ట్రోలర్స్ నుంచి వచ్చాయంటే అర్థముంది. కానీ ఇండస్ట్రీలో పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాలేదు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇలా అవమానించడం కరెక్టేనా? ఈ విషయంలో నాకు కోపం రావట్లేదు కానీ చాలా బాధ కలుగుతోంది' అని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆ షో ఏంటి? కమెడియన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా) -
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
కరణ్ జోహార్ ఇంట్లో కనిపించిన త్రిప్తి దిమ్రీ
-
అందరూ చూస్తుండగా అతడి కాళ్లు మొక్కబోయిన సమంత!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంగళవారం (మార్చి 19న) పెద్ద ఈవెంట్ నిర్వహించింది. త్వరలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవేనంటూ పెద్ద లిస్ట్ విడుదల చేసింది. ఆయా సినిమాలకు సంబంధించిన తారలంతా ఈ ఈవెంట్లో తళుక్కుమని మెరిశారు. టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా సిటాడెల్ సిరీస్ కోసం స్టేజీపైకి వచ్చింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న హీరో వరుణ్ ధావన్.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పాదాలకు నమస్కరించాడు. దాన్ని గుర్తు చేయొద్దు ఇంతలో సమంత సైతం అతడి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన కరణ్.. వద్దు, వద్దంటూ సామ్ను ఆపాడు. దీంతో వరుణ్.. అందరూ కరణ్ పాదాలకు నమస్కరించాల్సిందేనన్నాడు. దీనికి కరణ్ బదులిస్తూ.. నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయొద్దు ప్లీజ్.. ఈ మధ్యే ఓ ఏజ్(50 ఏళ్లు) దాటేశాను. దయచేసి నాకు దాన్ని గుర్తు చేయొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ వినని వరుణ్.. మీ ముఖంలో వయసు కనిపించనీయకుండా మీ స్కిన్ డాక్టర్ చాలా బాగా కష్టపడుతున్నాడు అని సెటైర్స్ వేశాడు. నేనే ట్రీట్మెంట్ చేయించుకోలే నేనేమీ అందరిలా ముఖానికి సర్జరీలు, ట్రీట్మెంట్లు చేయించుకోలేదు.. అలాంటివారిలో నేను ఒకడిని కానే కాదు అని నొక్కి చెప్పాడు కరణ్. ఇకపోతే సిటాడెల్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సిటాడెల్ అనే హాలీవుడ్ సిరీస్కు ఇది రీమేక్గా తెరకెక్కింది. ఇందులో సిమ్రాన్, కేకే మీనన్, శివశక్తి సింగ్, సఖీబ్ సలీం, సిఖిందర్ ఖేర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. गले 😍. . .#varundhawan #karanjohar #samantharuthprabhu #Reelswithtahirjasus #jasus007 pic.twitter.com/XwHon5qfVY — Tahir Jasus (@Tahirjasus) March 19, 2024 చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన ప్రేమలు హీరోయిన్ -
డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
డైరెక్ట్గా ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ డైరెక్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించారు. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్లో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. (ఇది చదవండి: బిగ్బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీనవం.. ఇంతలో!) ఈ సినిమాను భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఓ మహిళ కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథనే సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంత రేడియో దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు. resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH — prime video IN (@PrimeVideoIN) February 13, 2024 -
2023లో ఉత్తమ చిత్రం యానిమల్: స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్ని గేమ్ చేంజర్గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్ను దాటేసింది. -
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ, చంద్రముఖి సినిమాలతో బిజీగా ఉంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ఎమర్జన్సీ. ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కంగనా మూవీ ఎమర్జన్సీ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని అన్నారు. కరణ్ జోహార్ ట్వీట్పై కంగనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) కంగనా స్పందిస్తూ.. "హాహా లాస్ట్ టైమ్ కూడా నా చిత్రం మణికర్ణికను చూడాలని ఎక్సైట్గా ఉందని చెప్పినప్పుడు.. మూవీ రిలీజైన వారాంతంలో నాపై పెద్దఎత్తున విష ప్రచారం చేశారు. నా సినిమాపై బురద చల్లేందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా నా మూవీ చూడాలని ఆసక్తిగా ఉందంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అమ్మో మీరు అలా మాట్లాడుతుంటే నాకు నిజంగా భయమేస్తోంది. ఎందుకంటే మీరు మళ్లీ ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఇటీవలే కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రంపై కంగనా విమర్శలు చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని.. కలెక్షన్స్, రివ్యూలన్నీ ఫేక్ అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంగనా చిత్రంపై కరణ్ చేసిన కామెంట్స్ బీటౌన్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఎమర్జన్సీ చిత్రం నవంబర్ 2023లో విడుదల కానుంది మణికర్ణిక వివాదం గతంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019) వివాదానికి దారితీసింది. ఆ చిత్రం నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్.. కంగనాపై ఆరోపణలు చేశాడు. అయితే క్రిష్ చిత్రం నుంచి తప్పుకోవడంతో కో-డైరెక్టర్ సహాయంతో ముఖ్యమైన సీన్స్ రీషూట్ చేసినట్లు వెల్లడించింది. తాము 70 శాతం సినిమా చిత్రీకరించినట్లు కంగనా చేసిన వాదనలను అప్పట్లో క్రిష్ వ్యతిరేకించారు. కాగా.. కంగనా నటిస్తోన్న ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్గా నటించిన తేజస్ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం చంద్రముఖి -2లో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!) Ha ha last time when he said he was excited to see Manikarnika, the worse smear campaign of my life was unleashed upon me on its releasing weekend … almost all main actors working in the film were paid to sling mud on me and sabotage the film and suddenly the most successful… https://t.co/iruVo5wq5o — Kangana Ranaut (@KanganaTeam) August 22, 2023 -
షారూక్ ఖాన్పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్లో హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్పై విమర్శలు చేశారు. ముఖ్యంగా స్టార్ డమ్ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) -
సోది సినిమా, అచ్చంగా సీరియల్.. కట్ చేస్తే రూ.200 కోట్లు
రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని.. సోది సినిమా.. అసలిది సినిమానా? అచ్చంగా సీరియలే.. అయినా ఇది ఎప్పుడో చూసిన కథే, కొత్తగా ఏముంది? ఇలా నానామాటలు అన్నారు. కొందరు మాత్రం సినిమాను ఆస్వాదించారు. లొసుగులు వెతకడం మాని సినిమాను సినిమాలా ఆదరించారు. మొదట్లో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. నెగెటివిటీని దాటుకుని వందల కోట్లు రాబడుతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. 'సినిమా రిలీజ్కు ముందు కొంత భయపడ్డాను. ఏడేళ్లుగా డైరెక్షన్కు దూరంగా ఉండటం వల్లో, లేదంటే మూడేళ్లుగా ఆందోళనతో బాధపడుతున్నందుల్లో.. ఎందుకో తెలియదు కానీ నాలో ఒకరకమైన భయం, నీరసం ఆవహించింది. అసలే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నాం. ఏదైతేనేం.. ఒకరకమైన డోలాయమానంలో ఉన్నాను. కానీ జూలై 23 శుక్రవారం.. నాలో ఎక్కడలేని ఉత్తేజం వచ్చి చేరింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రేమ, ఎనర్జీతో పనిచేసిన టీమ్ అందరి కృషి వల్ల దక్కిన ఫలితమే ఈ చిత్రం. ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన శషాంక్ ఖైతన్, సుమిత్ రాయ్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మొదటి నుంచి వాళ్లు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కామెడీని రెట్టింపు చేసేలా స్క్రీన్ప్లేలో ప్రధాన పాత్ర పోషించిన ఇషిత మైత్ర గురించి స్పెషల్గా చెప్పుకుని తీరాల్సిందే! సోమెన్ మిశ్ర ఈ టీమ్కు ఆధ్వర్యం వహించి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు' అని రాసుకొచ్చాడు. కాగా రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని' చిత్రం జూలై 28న విడుదలైంది. జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, అంజలి ఆనంద్, చుర్నీ గంగూలి, రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చిన నటుడు, వీడియో వైరల్ -
'మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తెస్తా, దానికి సిగ్గెందుకు?'
టాలీవుడ్లో బేబీ సినిమా ఆడుతోంటే బాలీవుడ్లో రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రం ఆడుతోంది. జూలై 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. సెంచరీ దాటేసి రికార్డులు సృష్టించాలన్న కసితో ఏదో ఒకరకంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ముంబైలో ప్రెస్మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'నేను మా అమ్మకు లోదుస్తులు కొనిస్తాను. అదేమీ అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ నా స్నేహితులు మాత్రం తనకోసం షాపింగ్ చేస్తున్నప్పుడు తెగ భయపడిపోతారు. ఎవరికైనా అమ్మాయికి చెప్పి తనతో కొనిపించవచ్చుకదా అని సూచిస్తారు. మా అమ్మ నన్ను తీసుకురమ్మని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి అజమాయిషీ చేయడమెందుకు? మా అమ్మకు ఇప్పుడు 81 ఏళ్లు. తనకు ఏది కావాలన్నా నేనే స్వయంగా వెళ్లి తీసుకొస్తాను. అది లోదుస్తులే కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ అందరూ దాన్ని అసౌకర్యంగా ఫీలవుతారు' అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ ముఖ్యపాత్రలు పోషిస్తారు. వయాకామ్18 స్టూడీయోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించగా మనూశ్ నందన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. చదవండి: గతేడాది ప్రియుడితో పెళ్లి.. ఇంతలోనే నటికి అన్యాయం చేస్తూ.. బేబీ హీరోయిన్కు బంపరాఫర్ -
రిటైర్ అయిపోతే మంచిది
‘కరణ్ జోహార్.. ఫస్ట్ నువ్వు రిటైర్ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. రణవీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ జోహార్పై మండిపడ్డారు కంగనా రనౌత్. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్తో డైలీ సీరియల్స్ తీస్తున్నారు. 1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్తో సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే రణ్వీర్ సింగ్ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్ విషయంలో కరణ్ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా. -
'ఆ సినిమాకు రూ.250 కోట్లా? జనాలేమైనా పిచ్చోళ్లా? సిగ్గనిపించట్లేదా?'
సౌత్ సినిమాలు హిందీలో రిలీజై అక్కడి బాక్సాఫీస్ను రఫ్ఫాడించినప్పటి నుంచి బాలీవుడ్కు గడ్డుకాలం మొదలైంది. అక్కడి ప్రేక్షకులు హిందీ సినిమాలకంటే కూడా డబ్బింగ్ సినిమాలపైనే మోజు చూపించారు, వాటినే ఆదరిస్తూ వస్తున్నారు. పైగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో బాలీవుడ్పై వ్యతిరేకత, ద్వేషం మరింత పెరిగింది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఏవో కొన్ని మాత్రమే గట్టెక్కాయి. అందులో కొన్ని బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి. రెండు సినిమాలు అంతంతమాత్రమే ఇకపోతే ఇటీవల బాలీవుడ్లో ఓ కొత్త సినిమా రిలీజైంది. అదే 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని'. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 28న రిలీజైంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా తొలి రోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీనిపై సినీ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, బ్రో సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందువల్ల అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ ఓపెన్హైమర్ మీదే ఉంది' అని ట్వీట్ చేశాడు. ఈ స్క్రీన్షాట్ను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సినిమాలపై కౌంటర్లు వేసింది. ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా? 'జనాలేమీ పిచ్చోళ్లు కారు. ఇలాంటి పేలవమైన సినిమాలను వారు తిరస్కరిస్తారు. అసలు ఆ కాస్ట్యూమ్స్, సెట్ అంతా కూడా ఫేక్. కరణ్ జోహార్ 90వ దశకంలో ఏం చేశాడో ఇప్పుడూ అదే చేస్తున్నాడు. నీ పని నువ్వు కాపీ చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టావో? ఏంటో?! నిజంగా టాలెంట్ ఉన్నవాళ్లు ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే వీళ్లేమో కోట్ల కొద్ది డబ్బు ఎలా గుమ్మరిస్తున్నారో?' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో ఓ స్టిల్ రిటైర్మెంట్ తీసుకో అక్కడితో ఆగకుండా.. 'మూడు గంటల నిడివి ఉన్నా సరే జనాలు ఓపెన్హైమర్ సినిమానే చూస్తారు. అత్తాకోడళ్ల డ్రామాపై సినిమా తీయడానికి రూ.250 కోట్లు అవసరమా? నీకు నువ్వేదో పెద్ద ఫిలిం మేకర్ అని చెప్పుకుంటావు కానీ నీ పతనం ఆల్రెడీ మొదలైంది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా రిటైర్మెంట్ తీసుకో. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వు. అలాగే రణ్వీర్ సింగ్కు నా నుంచి ఓ విన్నపం. కరణ్ జోహార్ బాటలో నువ్వు నడవకు. అతడిలా రెడీ అవకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలా మంచి బట్టలు వేసుకో. సౌత్ హీరోలు ఎలా రెడీ అవుతారో కనీసం వారిని చూసైనా నేర్చుకో. నీ వేషధారణతో మన సంస్కృతిని నాశనం చేయకు' అని కౌంటర్లు ఇచ్చింది కంగనా. చదవండి: పెళ్లైన ఆరేళ్లకు భర్తతో విడాకులు.. మమ్మల్ని ద్వేషించకండి అంటూ నటి పోస్ట్ -
అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!
బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది. (ఇది చదవండి: ఉపాసనపై రామ్చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్ను పూర్తిగా తొలగించాలని మేకర్స్ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది. (ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. -
మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్కు షాకిచ్చిన నెటిజన్!
బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ దాదాపుగా అందరికీ సుపరిచితమే. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాను నిర్మించారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్, నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా కనిపించనున్నారు. అయితే కరణ్ జోహార్కు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ అప్డేట్స్ ఇస్తుంటారు. (ఇది చదవండి: 25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ) అయితే తాజాగా ట్విటర్కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. థ్రెడ్స్లోకి ఎంట్రీ ఇచ్చిన కరణ్.. అభిమానులు తనను ఏదైనా అడగాలంటూ ఛాన్స్ ఇచ్చారు. పది నిమిషాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం చాలా ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. మీరు గే కదా? అని మెసేజ్ చేశాడు. అతనికి కూడా అదేరీతిలో దిమ్మదిరిగేలా కౌంటరిచ్చాడు కరణ్. నీకు ఆసక్తిగా ఉందా? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొత్త యాప్లో ఎంట్రీ ఇవ్వగానే కరణ్కు ఇలాంటి షాకిచ్చాడేంట్రా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్) -
సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బీ టౌన్ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటోంది. ఇప్పటికే పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా మరోసారి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ రణ్బీర్ కపూర్ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) తాజాగా కంగనా రనౌత్ రణబీర్ను 'దుర్యోధనునితో' పోలుస్తూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ను శకునిగా అభివర్ణించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది. వారి పేర్లు చెప్పకుండానే వైట్ ర్యాట్, పాపా జో అంటూ సంభోధిస్తూ కామెంట్స్ చేసింది. కంగనా తన ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి. అయితే ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక),శకుని (పాప జో) జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి. వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు. బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే. అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే. నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు. నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు. గతంలో హృతిక్ రోషన్తో వివాదంలో కూడా వీరిద్దరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించింది. బాలీవుడ్ క్వీన్గా పేరొందిన కంగనా తన సంచలన కామెంట్స్తో మరోసారి బీటౌన్లో చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించారని పరోక్షంగా రణ్బీర్, కరణ్ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారనుంది. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
ఓ ఛానెల్లో నన్ను అవమానించారు.. కరణ్పై కంగనా ఫైర్
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ బీ టౌన్లో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా నిర్మాత కరణ్ జోహార్పై విమర్శల వర్షం కురిపించింది. ఇటీవలే కరణ్ జోహార్ చేసిన పోస్ట్పై కంగనా స్పందించారు. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని.. అందుకే ఆమె బాలీవుడ్ను వదిలి వెళ్లిందని కంగనా సంచలన ఆరోపణలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనుష్క శర్మ కెరీర్ను దెబ్బతీశాడని ఆరోపించింది. దీనికి బదులిస్తూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదంటూ రిప్లై ఇచ్చారు. తాజాగా కరణ్ పోస్ట్పై స్పందించిన కంగనా..కరణ్ పోస్ట్ స్క్రీన్ షాట్ను తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది . అంతే కాకుండా ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడుతూ తనను అవమానించాడని కంగనా ఆరోపించింది. కంగనా ఇన్స్టాలో స్టోరీస్లో రాస్తూ..' కరణ్ నన్ను ఓ జాతీయ మీడియాలో అవమానించాడు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. అందుకే ఇలాంటి నెపో మాఫియా వ్యక్తులు నన్ను అవమానించారు. వేధింపులకు కూడా గురి చేశారు.' అని పోస్ట్ చేశారు. కరణ్ జోహార్ పోస్ట్ ప్రియాంక, అనుష్కల కెరీర్ను నాశనం చేశారన్న ఆరోపణలపై చిత్రనిర్మాత కరణ్ ఘాటుగానే స్పందించారు. అలాంటి అబద్ధాలతో తనకేలాంటి నష్టం కలగదన్నారు.తనను ఎవరు ఎంత దూషించినా.. చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదన్నారు. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై కూడా కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది. -
అనుష్క కెరీర్ అంతం చేయాలనుకున్నా, తెర వెనుక కుట్ర చేశా: నిర్మాత
ఇన్సైడర్స్, అవుట్సైడర్స్ అంశంపై బాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ సినీపరిశ్రమలో ఉన్న తారల వారసులకు ఇచ్చిన విలువ, హోదా.. బయట నుంచి వచ్చిన నటీనటులకు ఉండదనేది బలమైన వాదన. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా సెలబ్రిటీల వారసులకే సినిమా అవకాశాలిస్తారు, కానీ ఎంత టాలెంట్ ఉన్నా సరే బయటవాళ్లను పట్టించుకున్న పాపాన పోరనే అపవాదు చిత్రపరిశ్రమలో ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది. అయితే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గతంలో అనుష్క శర్మ కెరీర్ను అంతం చేయాలనుకున్నాడట. ఆమెకు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం తన టాలెంట్తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చింది. అలాంటి ఆమెను తక్కువ అంచనా వేసిన కరణ్ తనకు సినిమా అవకాశమే ఇవ్వకూడదని భావించాడట. ఈ విషయం స్వయంగా అతడే చెప్పాడు. 'రబ్నే బనాదీ జోడీ సినిమా కోసం అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఆమె ఫోటో చూపించాడు. అది చూసిన నేను.. నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆమె వద్దే వద్దు. తనకు ఈ సినిమా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వేరే హీరోయిన్కు ఈ సినిమా ఇద్దామని ఉండేది. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు చేశాను. సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ బ్యాండ్ బాజా బారత్ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్ అయ్యా. ఇంత మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానన్న గిల్టీతో క్షమాపణలు చెప్పాను. సినిమా చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2016లో 18వ ఎమ్ఏఎమ్ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో కరణ్ పై వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను దర్శకరచయిత అపూర్వ అస్రానీ ట్విటర్లో షేర్ చేశాడు. 'కరణ్ జోహార్ అనుష్క శర్మ కెరీర్ను అంతమొందించాలని అనుకున్నట్లు కరణ్ జోహార్ గతంలో అంగీకరించాడు. నాకు తెలిసి ఇన్సైడర్, అవుట్సైడర్ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే' అని ట్వీట్ చేశాడు. దీనిపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'మంచి కెరీర్ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్ చేయడం వల్లే బాలీవుడ్ ఇలా తయారైంది' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా అనుష్క శర్మ 'రబ్నే బనా దీ జోడీ' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. Someone’s only hobby is to make or break careers. If Bollywood is in gutter, it’s because of some people’s dirty ‘backroom’ politics against talented outsiders. https://t.co/GNPRjiW5ry — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 6, 2023 -
ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడు: కంగన సంచలన ఆరోపణలు
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్పై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్ను వదిలి వెళ్లిందని చెప్పింది. తాను బాలీవుడ్కు దూరం కావడంపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. ఓ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. దీనిపై కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది. ‘బాలీవుడ్లో కొందరు గ్యాంగ్గా మారి ప్రియాంకను అవమానించారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశారనే విషయం అందరికి తెలుసు. షారుఖ్ ఖాన్తో ప్రియాంక ఫ్రెండ్షిప్ చేయడం కరణ్కు నచ్చలేదు. అందుకే ఆమెను దూరం పెట్టాడు. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేసినందుకు కరణ్ బాధ్యత వహించాలి. అమితాబ్, షారుఖ్ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’అని కంగనా వరుస ట్వీట్స్ చేసింది. This is what @priyankachopra has to say about bollywood, people ganged up on her, bullied her and chased her out of film industry” a self made woman was made to leave India. Everyone knows Karan Johar had banned her (1/2) https://t.co/PwrIm0nni5 — Kangana Ranaut (@KanganaTeam) March 28, 2023 -
పెళ్లిలో సందడి చేసిన సౌత్, బాలీవుడ్ హీరోలు
బాలీవుడ్ నటులు మరో పెళ్లి ఫంక్షన్లో సందడి చేశారు. ఇటీవల కియారా- అద్వానీ పెళ్లిలో బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్లో జరిగిన మరో వివాహా వేడుకలోనూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులంతా ఓకే వేదికపై మెరిశారు. రాజస్థాన్లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్,అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్టార్ హీరోలు సందడి చేశారు. అక్షయ్ కుమార్, మోహన్లాల్ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోనూ అక్షయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీతో చేసిన ఈ డ్యాన్స్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కె మాధవన్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా మేనేజింగ్ ప్రెసిడెంట్. రాజస్థాన్లో పలువురు ప్రముఖులు హాజరైన ఆయన పెద్ద కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. I’ll forever remember this dance with you @Mohanlal Sir. Absolutely memorable moment 😊🙏 pic.twitter.com/GzIwcBbQ5H — Akshay Kumar (@akshaykumar) February 10, 2023 -
కరణ్ జోహార్ కవలల బర్త్డే పార్టీలో మెరిసిన తారలు..ఫోటోలు వైరల్
-
కరణ్ జోహార్ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్: ఫరా ఖాన్
బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా కరణ్ డ్రెస్సింగ్ స్టైల్పై ఆమె మాట్లాడారు. కరణ్ తాను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ల మాదిరిగానే డ్రెస్ వేసుకుంటాడని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ ఇటీవల కరణ్ జోహార్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనను గుర్తు చేసుకుంది. ఫరా ఖాన్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్లో జరిగిన ఓ హోటల్ లాంఛ్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈవెంట్లో ఆమె ధరించిన దుస్తులపై కరణ్ ఎలా స్పందిస్తారని అడగ్గా..' కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారని చెప్పింది. నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ కనిపించడం. అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ లాగా దుస్తులు ధరిస్తాడు.' అంటూ నవ్వుతూ చెప్పింది. ఫరా ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్లో పని చేస్తోంది. ఆమె చివరిగా దర్శకత్వం వహిచిన 2014 చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా నటించారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రానికి పని చేయడానికి విరామంలో ఉన్నందున ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ 16కి హోస్ట్గా వ్యవహరిస్తోంది. -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia)
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement