-
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత
బూర్గంపాడు: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(65) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతి చెందారు. బూర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989, 1994 ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా బూర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో రెండేళ్లు పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే -
రాజకీయాల్లో విలువలు దిగజారాయి
బూర్గంపాడు: ‘ ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు దిగజారాయి. నాటికి నేటికి రాజకీయాల్లో ఎంతో వ్యత్యాసం వుంది. గిరిజనులకు రిజర్వ్ అయిన నియోజకవర్గాలలో కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యాపారధోరణితో వ్యవహరిస్తున్నాయి.’ అని చెబుతున్నరు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం. సాక్షి: ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? కుంజా: సీపీఐ నుంచి బూర్గంపాడులో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాను. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ రోజుల్లో ఎమ్మెల్యే కాగలిగాను. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో నమ్ముకున్న పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం నాయకులు, కార్యకర్తలు పాటుపడ్డారు. నేడు అంత వ్యాపారమయమైంది. సాక్షి: పదేళ్లు శాసనసభ్యునిగా పనిచేసిన మీరు కనీసం ఓ మంచి ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. కారణం? కుంజా: పదేళ్లు శాసనసభ్యునిగా పనిచేసిన నేను ఏ రోజు ఎవరి వద్ద రూపాయి తీసుకోలేదు. నాడు సీపీఐ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే జీతం కూడా పార్టీకి ఇచ్చి, అక్కడ్నుంచి నా కుటుంబ ఖర్చులకు కొంతమొత్తాన్ని తీసుకున్నాను. 1989నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాను. పార్టీ సిద్ధాంతాల కోసం నిబద్ధతో నిజాయితీగా ప్రజాసేవ చేశాను. అందుకే నేను ఆర్థికంగా ఏమీ సంపాదించుకోలేకపోయాను. కనీసం ఓ మంచి ఇల్లుకూడా కట్టించుకోలేకపోయాను. అయినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేననే సంతృప్తి, గౌరవం మాత్రం మిగిలింది. సాక్షి: ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు. మీ అల్లుడు చందా సంతోష్ బీజేపీ అభ్యర్థిగా పినపాక నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు.? కుంజా: నేను, నా వియ్యంకులు చందా లింగయ్య బీజేపీలో ఉండటంతో నా అల్లుడు సంతోష్కు బీజేపీ టిక్కెట్ సాధించుకోగలిగాం. వైద్యవృత్తి నుంచి ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతో సంతోష్ రాజకీయాలలోకి వచ్చాడు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రణాళికలను అతను సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలో నిలిచాడు. నిస్వార్థ ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీలో నిలిచిన అతనిని ప్రజలు ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నాను. సాక్షి: ప్రస్తుత ఎన్నికలపై మీ అభిప్రాయం? కుంజా: ఈ ఎన్నికలను చూస్తుంటే భయమేస్తోంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. కోట్ల రూపాయలు ఎన్నికల్లో కుమ్మరిస్తున్నారు. నాడు లక్షరూపాయ లు ఖర్చుచేస్తే గొప్పగా అనుకునేవాళ్లం. ఇప్పు డు రిజర్వ్డ్ నియోజకవర్గాలలో పదికో ట్లు, ఇరవైకోట్లు అని ప్రచారం సాగుతోంది. ఈ «ధోరణి ఏ మాత్రం మంచిది కాదు. రానున్న రోజులలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. -
ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం
రైల్వేకోడూరు/తిరుపతిక్రైం: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవ డానికి వచ్చి తప్పిపోయిన తెలంగా ణలోని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షంను గుర్తించినట్లు టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో సోమవారం ఆయన విలే కర్లతో మాట్లాడారు. బిక్షంకు మతిస్థిమితం సరిగాలేదని, తిరుమలలో స్వామిని దర్శించుకుని వెళుతుండగా ఆది వారం సాయంత్రం తప్పిపోయారని సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం కరకంబాడి అటవీ సమీపంలో గుర్తించామన్నారు. ఆయనను వారి బంధువులకు అప్పగిస్తామన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement