-
SRH: ధోని రావొద్దనే కమిన్స్ ‘కన్నింగ్’ ప్లాన్?!
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కమిన్స్ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ శుక్రవారం ఉప్పల్ వేదికగా సీఎస్కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్ మీద రన్స్ రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్ పరిస్థితులను రైజర్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు. శివం దూబే ఒక్కడు ధనాధన్ ఇన్నింగ్స్(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్ తన బౌలింగ్లోనే అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక పందొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జడ్డూ రనౌట్ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. దీంతో రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్ వచ్చింది. ఇక డారిల్ మిచెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్ కమిన్స్కు రెండు ప్రశ్నలు.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? ఒకవేళ టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్ పరోక్షంగా కమిన్స్ను తప్పుబట్టాడు. అదే సమయంలో.. వరల్డ్కప్ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్కప్నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. Two questions to Pat Cummins on withdrawing the obstructing the field appeal against Jadeja. Was it a tactical call to let a struggling Jadeja be the crease and keep Dhoni indoors? Would he have done the same if it was Virat Kohli at World T20? — Mohammad Kaif (@MohammadKaif) April 5, 2024 మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ మార్ష్. కమిన్స్ కాదు. మీరు కావాలనే విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో చెన్నైపై సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
పవర్ హిట్టర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్లో) ఏకంగా సగటు 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. యశస్వి జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైస్వాల్ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు. అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్గా డిఫెన్సివ్గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు. ఆండర్సన్ బౌలింగ్లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. చదవండి: శార్దూల్ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్ క్రికెట్పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్కప్లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
అతడి ఖేల్ ఖతం?!.. టీమిండియా సెలక్టర్లు ఏమైనా అనుకోని...
Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం. ఇక తన కెరీర్లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు. పరుగుల వరద పారించడమే పని ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు. Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5 — Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024 కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
తమ్ముడి అరంగేట్రం.. మహ్మద్ షమీ భావోద్వేగం!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్తో మహ్మద్ కైఫ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహ్మద్ షమీ భావోద్వేగ పోస్ట్ చేశాడు. "ఎట్టకేలకు నీవు అనుకున్నది సాధించావు. బెంగాల్ వంటి అద్బుత జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతీ మ్యాచ్లోను 100 శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ కైఫ్ అని షమీ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. కాగా మహ్మద్ కైఫ్ కూడా షమీ మాదిరే రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్కు ఈ ఏడాది రంజీ సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్లకు ప్రకటించిన బెంగాల్ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్ తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గతేడాది ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన
ICC CWC 2023 Winner Australia: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. మీరంటే నాకిష్టం అంటూనే.. అసలైన రోజున ఆడినవాళ్లకు మాత్రమే విజేతలుగా నిలిచే అర్హత దక్కుతుందని ఉద్ఘాటించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో లీగ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తద్వారా టేబుల్ టాపర్గా ఫైనల్ చేరింది భారత జట్టు. మరోవైపు.. ఆరంభంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్లు గెలిచి.. తుదిమెట్టుకు చేరుకుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లో టీమిండియాతో ఫైనల్లో జయభేరి మోగించి.. ఏకంగా ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టు వరల్డ్కప్ గెలిచిందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది’’ అని కైఫ్ అన్న క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గ్లెన్ మిచెల్ అనే యూజర్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. వార్నర్ స్పందించాడు. ‘‘నాకు ఎంకే(మహ్మద్ కైఫ్) అంటే ఇష్టమే.. అయితే.. పేపర్ మీద ఏం కనబడుతుందన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నిటికంటే కీలకం. అదే ఆటకు అర్థం. 2027లో చూద్దాం’’ అంటూ వార్నర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించాడు. చదవండి: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం? I like MK, issue is it does not matter what’s on paper. At the end of the day you need to perform when it matters. That’s why they call it a final. That’s the day that counts and it can go either way, that’s sports. 2027 here we come 👍 https://t.co/DBDOCagG2r — David Warner (@davidwarner31) November 22, 2023 -
కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు
"Stay on Instagram but be here as well": టీమిండియా క్రికెటర్ల ఆట తీరుపై మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. కండలు పెంచి ఫొటోలు షేర్ చేస్తే సరిపోదని.. మైదానంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యమంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఆసియా కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్లో భారత జట్టు సోమవారం నేపాల్తో తలపడిన విషయం తెలిసిందే. మూడు గోల్డెన్ క్యాచ్లు డ్రాప్ శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లను దింపినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తేల్(38), ఆసిఫ్ షేక్(58) మెరుగైన స్కోర్లు సాధించారు. PC: Star Sports ఆరంభంలో వీళ్లిద్దరు ఇచ్చిన మూడు గోల్డెన్ మ్యాచ్లను శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిస్ చేయడం వల్ల ఈ మేరకు భారత బౌలర్లకు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్.. క్యాచ్ డ్రాప్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెద్ద పెద్ద కండలు ఉంటే సరిపోదు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..‘‘మీరు ఎంత ఫిట్గా ఉన్నారన్న విషయంతో సంబంధం లేదు. మీకు పెద్ద పెద్ద కండలు ఉండొచ్చు. జిమ్లో వర్కౌట్లతో మీరు నిరంతరం శ్రమిస్తూ ఉండవచ్చు. అంతేనా... అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయనూ వచ్చు. అయితే, మైదానంలో మీరు చురుగ్గా కదలలేకపోతే.. ఏం లాభం? ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్లు ఇక్కడా ఫిట్గా ఉన్నామని నిరూపించుకోవాలి కదా!’’ అని అయ్యర్, కోహ్లి, ఇషాన్లను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. శ్రేయస్ అయ్యర్ కోహ్లికి ఇదేం మొదటిసారి కాదు అదే విధంగా స్టార్ బ్యాటర్, ఫిట్నెస్కు మారుపేరైన విరాట్ కోహ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేపాల్తో మ్యాచ్లో కోహ్లి నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. అయినా విరాట్ కోహ్లి క్యాచ్లు డ్రాప్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్లోనూ ఇలాగే చేశాడు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో మ్యాచ్లలోనూ ఇలాంటి తప్పులే చేశాడు. ఈ విషయంలో నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. వాస్తవం మాట్లాడుతున్నా’’ అంటూ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. సూపర్-4లో టీమిండియా ఎంట్రీ కోహ్లి ఫిట్గా ఉంటాడన్న విషయం అందరికీ తెలుసని, అయితే మైదానంలో కూడా ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ చురకలు అంటించాడు. కాగా టీమిండియాతో మ్యాచ్లో మెరుగైన ఆట తీరు కనబరిచిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... వర్షం అంతరాయం కలిగిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో విధించిన లక్ష్యాన్ని టీమిండియా 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. తద్వారా పది వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో ఎంట్రీ ఇచ్చింది. చదవండి: WC 2023: శ్రేయస్ అయ్యర్కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు.. ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
అతడు మళ్లీ వస్తాడన్న గ్యారంటీ లేదు.. కిషన్ వచ్చినా గానీ?
ఆసియాకప్-2023కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనమైంది. అయితే జట్టుతో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ శ్రీలంకకు వెళ్లలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ అయితే ఇంకా సాధించలేదు. దీంతో టోర్నీలో మొదటి రెండు మ్యాచ్లకు రాహుల్ దూరం కానున్నట్లు భారత హెడ్కోచ్ ద్రవిడ్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియా కప్లో మిగితా మ్యాచ్లకు కూడా రాహుల్ అందుబాటులో ఉంటాడనే నమ్మకం లేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. "ఆసియాకప్లో తొలి రెండు మ్యాచ్లకు రాహుల్ అందుబాటులో ఉండడని మెనెజ్మెంట్ చెప్పుకొచ్చింది. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ ఫిట్గా ఉన్న రాహుల్ మరో రెండు గేమ్ ల తర్వాత కోలుకుంటాడన్న గ్యారెంటీ లేదు. వన్డేల్లొ ఐదో స్ధానంలో రాహుల్ అద్భుత ఆటగాడు. అటువంటి ప్లేయర్ దూరం కావడం భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ. రాహుల్కు పెద్ద షాట్లు ఆడడమూ తెలుసు.. క్లిష్టపరిస్ధితుల్లో జట్టును అదుకోవడం తెలుసు. రాహుల్ స్ధానంలో కిషన్ వచ్చినప్పటికీ అతడి లోటును మాత్రం పూడ్చలేడు. రాహుల్ వికెట్ కీపింగ్తో పాటు ఫినిషింగ్ టచ్ కూడా అందించగలడని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. చదవండి: Asia Cup 2023: ‘ఆసియా’ సింహాల సమరానికి సై.. చరిత్ర టీమిండియాదే -
WC: సిరాజ్ కూడా ఉండకపోవచ్చు! వాళ్లకు జట్టులో చోటు దక్కినా కూడా..
ICC ODI World Cup 2023- Team India: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో కొత్త వాళ్లకు స్థానం ఉండే అవకాశమే లేదని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే యువ బ్యాటర్లు ఆశలు వదులుకోవాల్సిందేనని పేర్కొన్నాడు. అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్లోకి వస్తే మహ్మద్ సిరాజ్కు కూడా ఒక్కోసారి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత ఇండియాలో ఈ మెగా ఈవెంట్ జరుగనున్న తరుణంలో ఆతిథ్య జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరేబియన్ దీవిలో టీమిండియా ప్రయోగాలు ఈ క్రమంలో అన్ని రకాలుగా సన్నద్ధమయ్యే క్రమంలో మేనేజ్మెంట్ ఇప్పటికే వెస్టిండీస్ పర్యటనలో అనేక ప్రయోగాలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి యువకులను ఆడించింది. అయితే, ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ సిరీస్ను 2-1తో గెలవడంతో జట్టుకు కాస్త ఊరట లభించింది. బుమ్రా రీఎంట్రీ ఇస్తుండగా.. ఇదిలా ఉంటే.. ప్రధాన పేసర్ బుమ్రా సహా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ స్టార్ రిషభ్ పంత్ తదితరులు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బుమ్రా కోలుకుని ఐర్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే వాళ్లిద్దరు వస్తారు! మరోవైపు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న రాహుల్, అయ్యర్ సైతం ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా కప్ టోర్నీ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్ జట్టు కూర్పు గురించి మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే వాళ్లిద్దరు జట్టులోకి తిరిగివస్తారని అనుకుంటున్నా. కాబట్టి మెగా ఈవెంట్ నేపథ్యంలో... జట్టులోకి కొత్తగా వస్తున్న ఆటగాళ్ల గురించి చర్చ అనవసరం. వాళ్ల పేర్లు వరల్డ్కప్ టీమ్లో ఉండొచ్చు. కానీ తుదిజట్టులో మాత్రం వారికి చోటు దక్కడం కష్టం. ఒకవేళ అయ్యర్ తిరిగొస్తే కచ్చితంగా నాలుగో స్థానంలో ఆడతాడు. ఇక ఓపెనర్లు శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ ఉండనే ఉన్నారు. అంతటి సిరాజ్కు కూడా కష్టమే! మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/శార్దూల్ ఠాకూర్(పిచ్ స్వభావాన్ని బట్టి ఎనిమిదో నంబర్ ఆటగాడి ఎంట్రీ), కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా ఉంటారు. ఒక్కోసారి సిరాజ్కు కూడా తుదిజట్టులో ఛాన్స్ ఉండకపోవచ్చు. సిరాజ్ లాంటి సీనియర్నే అడ్జస్ట్ చేయలేని స్థితిలో ఇక కొత్తవాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్లో ఎలా చోటు దక్కుతుంది?’’ అని కైఫ్ పీటీతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు భారత జట్టులో చోటు దక్కినా వరల్డ్కప్ టోర్నీ ఆడే అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. చదవండి: పాకిస్తాన్కు బై బై.. యూఎస్ఏకు వలస వెళ్లిన స్టార్ క్రికెటర్ -
టీమిండియా వరల్డ్కప్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఆగస్టులో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు భారత జట్టు సారధిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్కు ముందు బుమ్రా తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో బుమ్రా పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్నెస్గా ఉండడం చాలా ముఖ్యమని, వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో అతడి సేవలు భారత జట్టుకు చాలా అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా 2019 వన్డే ప్రపంచకప్లో భారత్ టైటిల్ గెలవకపోయనప్పటికీ.. బుమ్రా మాత్రం తన ప్రదర్శనతో అందరినీ అకట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా నిలిచాడు. 9 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది ప్రపంచకప్లో కూడా బుమ్రా సత్తాచాటాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. వరల్డ్కప్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే.. "బుమ్రా తన ఫిట్నెస్ను తిరిగి పొందడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతడు ఆసియాకప్, వన్డే ప్రపంచకప్కు ముందు జట్టులోకి రావడం చాలా ముఖ్యం. బుమ్రా ఆసియాకప్కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నది ఐరీష్ గడ్డపై తేలిపోతుంది. బుమ్రా అక్కడ ఫిట్నెస్తో బౌలింగ్ చేసి వికెట్లు పడగొడితే, అతడిని అపడం ఎవరితరం కాదు. ముఖ్యంగా స్వదేశంలో అయితే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడని" కైప్ పేర్కొన్నాడు. వరల్డ్కప్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. :"ప్రస్తుతం భారత జట్టు అంత బలంగా కన్పించడం లేదు. ఎందుకంటే చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో పోరాడతున్నారు. ప్రపంచకప్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ సేవలను భారత్ కోల్పోయే ఛాన్స్ ఉంంది. అయితే బుమ్రా తిరిగి రావడం మాత్రం భారత్కు భారీ ఊరటను కలిగిస్తోంది. ఒక వేళ అతడు తిరిగి తన ఫిట్నెస్ను కోల్పోయి ప్రపంచకప్కు దూరమైతే.. మెగా టోర్నీలో పరాభవం తప్పదని" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో తొలి టీ20.. విండీస్ సిక్సర్ల కింగ్ వచ్చేశాడు! బౌలర్లూ జాగ్రత్త -
అతడు ప్రపంచకప్కు రెడీ.. సిక్సర్ల వర్షం కురిపిస్తాడు! వారిద్దరూ వద్దు..
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి రెండు మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లికి జట్టు మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వారి స్దానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. కొంతమెరకు టీమిండియా చేసిన ప్రయోగాలు ఫలించాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి ఆటగాడికి వరల్డ్కప్ ముందు తన సత్తా నిరూపించుకోవడానికి సువర్ణవకాశం దక్కింది. రెండో వన్డేలో విఫలమైన సంజూ.. నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 41 బంతుల్లో 51 పరుగులతో భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు ఎంపిక చేయాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్కప్ సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. సంజూ రెడీ.. "విండీస్తో ఆఖరి మ్యాచ్లో శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆట తీరు నన్ను ఎంతో గానే అకట్టుకుంది. సంజూకు నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అతడు గతంలో కూడా ఇదే బ్యాటింగ్ పొజిషేన్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ మిడిలార్డర్లో కిషన్ లేదా అక్షర్ పటేల్ను బ్యాటింగ్కు పంపాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. మిడిలార్డర్లో లెగ్ స్పిన్, లెఫ్ట్ఆర్మ్ స్పిన్కు బాగా ఆడే ఆటగాడు కావాలి. ఆ పని సంజూ చేయగలడు. సంజూ స్పిన్నర్ల బౌలింగ్లో సిక్సర్ల వర్షం కురిపించగలడు. కాబట్టి అతడిని కచ్చితంగా వరల్డ్కప్కు ఎంపిక చేయాలి. సంజూ కూడా సిద్దంగా ఉన్నాడని అమృత్ మాథుర్ పుస్తకం 'పిచ్సైడ్' ఆవిష్కరణ కార్యక్రమంలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక గురువారం నుంచి విండీస్తో మొదలు కానున్న టీ20 సిరీస్లో కూడా సత్తా చాటేందుకు సంజూ సిద్దమయ్యాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్ వద్దు! ఆ స్థానంలో అతడే బెటర్: కైఫ్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7న ఈ ఫైనల్ పోరు జరగనుంది. కాగా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా.. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్ను కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్కు సంబంధించి మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో వికెట్ కీపర్గా శ్రీకర్ భరత్ కంటే కిషన్కు అవకాశం ఇస్తే బాగుంటుందని కైఫ్ అబిప్రాయపడ్డాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ వచ్చి పంత్లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్ తెలిపాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ రావాలి. ఆ తర్వాతి స్థానంలో అనుభవం ఉన్న పుజారాను పంపాలి. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి, ఆ తర్వాత రహానే ఉండాలి. ఇక ఆరో స్థానంలో హిట్టింగ్ చేసే ఆటగాడు కావాలి. కాబట్టి నా వరకు అయితే భరత్ కంటే కిషన్ను అవకాశం ఇస్తే మంచిది. అతడు రిషబ్ పంత్ రోల్ను పోషిస్తాడు. అదే విధంగా ఏడో స్థానంలో నేను జడేజా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎనిమిదో స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి అశ్విన్ లేదా శార్దూల్ ఠకూర్ని పంపాలి. ఇక పిచ్ స్పిన్కు అనుకూలిస్తే.. అశ్విన్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఖవాజా వంటి లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్లను ఈజీగా పెవిలియన్కు పంపుతాడు. ఫాస్ట్బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్కు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులో శార్దూల్ ఠకూర్ అవకాశం ఇవ్వాలని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్లో లేరు.. అయినా ఫైనల్కు..! -
అతడి బౌలింగ్ చూస్తుంటే నాకు షమీ గుర్తుకు వచ్చాడు: భారత మాజీ బ్యాటర్
IPL 2023- Akash Madhwal: ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్ స్టైల్ భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీని గుర్తుకు తెచ్చిందన్నాడు. కీలక మ్యాచ్లో ఎంతో పరిణతి కలిగిన పేసర్లా అద్భుతంగా రాణించి ముంబైని గెలిపించాడని కొనియాడాడు. ఆకాశమే హద్దుగా ఆకాశ్ విజృంభణ ఐపీఎల్-2023 ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ బుధవారం తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అద్భుత: ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఆరంభంలోనే చుక్కలు చూపించాడు ఆకాశ్ మధ్వాల్. ఓపెనర్ ప్రేరక్ మన్కడ్ను పెవిలియన్కు పంపి ముంబైకి శుభారంభం అందించాడు. అదే జోరులో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 3.3 ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి సంచలన ప్రదర్శనతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లక్నో మీద గెలుపుతో ఐపీఎల్-2023లో రోహిత్ సేన మరో ముందడుగు వేసింది. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. షమీ గుర్తుకొచ్చాడు ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ మధ్వాల్ సరైన లైన్అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ శైలి నాకు మహ్మద్ షమీని గుర్తు చేసింది. అద్భుతమైన పేసర్. ముంబైకి కాస్త ఆలస్యంగానైనా దొరికిన ఆణిముత్యం. ప్రతి మ్యాచ్లోనూ మెచ్యూర్గా బౌలింగ్ చేశాడు’’ అని ముంబై పేస్ సంచలనం ఆకాశ్ను కొనియాడాడు. ముంబై క్వాలిఫయర్ చేరడారికి కారణం అతడే: పఠాన్ ఇక మరో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం.. ‘‘ఇలాంటి కీలక మ్యాచ్లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఇంత అద్భుతంగా ఆడటం మునుపెన్నడూ చూడలేదు. గత రెండు మ్యాచ్లలోనే 9 వికెట్లు తీశాడు. ముంబైని క్వాలిఫయర్కు చేర్చిన ఘనత ఆకాశ్కే దక్కుతుంది’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఉత్తరాఖండ్కు చెందిన ఆకాశ్ మధ్వాల్ ఐపీఎల్-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన అతడు 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మే 26 నాటి క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. చదవండి: సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం? Ind vs Aus: ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 -
IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు!
IPL 2023- Suryakumar Yadav: ‘‘సూర్యకుమార్ ఇంకో పన్నెండుసార్లు డకౌట్ అయినా.. అతడిని క్షమించేయొచ్చు. అలాంటి అద్భుతమైన ఆటగాడికి ఎన్ని అవకాశాలు అయినా ఇవ్వొచ్చు. అతడు డకౌట్ కావడం అన్నది పెద్ద విషయమేమీ కాదు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్కు అండగా నిలిచాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో సూర్య విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమైన ఈ మిస్టర్ 360.. తాజాగా ఐపీఎల్-2023 సీజన్లోనూ వైఫల్యం కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్లలో కలిపి చేసింది 16 పరుగులే ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో చేసిన మొత్తం పరుగులు 16. అత్యధిక స్కోరు 15. మూడు మ్యాచ్లలో వరుసగా అతడు నమోదు చేసిన స్కోర్లు 15, 1, 0. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లలో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన సూర్య.. ఐపీఎల్-2023లో ఆఖరిగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో అటు అంతర్జాతీయ స్థాయిలో.. ఇటు తనకు అచ్చొచ్చిన ఐపీఎల్లోనూ సూర్య విఫలం కావడం విమర్శలకు దారితీసింది. డకౌట్ అయితే.. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ సూర్యకుమార్ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంగ్లండ్, న్యూజిలాండ్ గడ్డపై ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం నాలుగుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తనకేమీ ఫరక్ పడదు. సూర్యకుమార్ గొప్ప ఆటగాడన్న విషయం అందరికీ తెలుసు. ఎవరైనా ఓ బ్యాటర్ ఫామ్లో లేడంటే విమర్శలు సహజం. అయితే, సూర్య విషయంలో ఫామ్ అనేది తాత్కాలికం.. క్లాస్ అనేది శాశ్వతం. వన్డేల్లో తను తడబాటుకు లోనవుతున్నాడన్నది వాస్తవమే. కానీ.. ప్రతి బ్యాటర్ జీవితంలో ఒకానొక దశలో ఇలాంటి గడ్డు పరిస్థితులు సహజం. అయితే, జట్టు యాజమాన్యం మద్దతుగా నిలబడితే ఈ మ్యాచ్ విన్నర్ కచ్చితంగా అద్భుతాలు చేయగలడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడికి మద్దతుగా నిలవడం అత్యవసరం’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్ హెడ్ కోచ్కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్! కోల్కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్ -
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ ఫోటోలు చూశారా
-
వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..
మహ్మద్ కైఫ్.. టీమిండియా క్రికెట్లో మేటి ఫీల్డర్గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ కంటే తన ఫీల్డింగ్ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్ ఫీల్డ్లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని వెళ్లడం అసాధ్యం. ఎన్నోసార్లు తన మెరుపు ఫీల్డింగ్తో అలరించిన కైఫ్ అద్భుతమైన క్యాచ్లు కూడా చాలానే తీసుకున్నాడు. 2002-06 మధ్యలో టీమిండియా తరపున కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా వింటేజ్ కైఫ్ను తలపించాడు. శనివారం ఆసియా లయన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కైఫ్ మూడు క్యాచ్లు తీసుకున్నాడు. ఇందులో రెండు క్యాచ్లు అయితే డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం విశేషం. స్టన్నింగ్ క్యాచ్లతో వయసు పెరిగినా వన్నె తగ్గలేదని నిరూపించాడు. తొలుత ఆసియా లయన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రజ్ఞాన్ ఓజా వేసిన 8వ ఓవర్లో ఉపుల్ తరంగను స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఓజా వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడాడు. బంతి వేగం చూస్తే కచ్చితంగా బౌండరీ వెళ్లేలా కనిపించింది. కానీ స్క్వేర్లెగ్లో ఉన్న కైఫ్ ఒక్క ఉదుటన డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కైఫ్ మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపెట్టాడు. ప్రవీణ్ తాంబే వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాఫ్ దిశగా ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న కైఫ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఇండియా మహరాజాస్ ఓటమి చవిచూసింది. 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆసియా లయన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 16.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. Vintage Kaif! 🔥@MohammadKaif #LegendsLeagueCricket #YahanSabBossHain pic.twitter.com/9Gc4qO5Cyl — FanCode (@FanCode) March 18, 2023 చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు LLC 2023: గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి -
BGT- 2023: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే..
India vs Australia, 1st Test- Nagpur: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇప్పటికైనా పర్యాటక జట్టుకు అశ్విన్ డూప్లికేట్కు.. అసలైన అశ్విన్కు ఉన్న తేడా ఏమిటో అర్థమై ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స్పిన్నర్ల దెబ్బకు విలవిల కాగా నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్ల దెబ్బకు పర్యాటక జట్టుబ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో.. ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించిన రోహిత్ సేన.. నాలుగు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అశూ, జడ్డూ అద్భుతం ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపం చూపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అశూ.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకుంది. మహేశ్ పితియాతో ప్రాక్టీస్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా నాగ్పూర్ టెస్టుకు వారం రోజుల ముందే ప్రాక్టీసు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక అశ్విన్ మాదిరి బౌలింగ్ చేస్తాడని పేరొందిన గుజరాత్ బౌలర్ మహేశ్ పితియాతో ప్రాక్టీసు చేసింది. అయినప్పటికీ అసలైన పోరులో అశ్విన్ స్పిన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు ఆసీస్ బ్యాటర్లు. అశ్విన్తో మహేశ్ పితియా ఈసారి జడ్డూ డూప్లికేట్ కోసం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్ జట్టుకు చురకలు అంటించాడు. ‘‘ఇప్పటికైనా డూప్లికేట్ అశ్విన్ బౌలింగ్లో ఆడటానికి.. నిజమైన అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఉన్న తేడా ఆస్ట్రేలియా తెలుసుకుని ఉంటుంది. ఆల్టైట్ గ్రేటెస్ట్ను ఎదుర్కొనేందుకు.. ఫస్ట్క్లాస్లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన యువ బౌలర్తో ప్రాక్టీసు చేస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేరన్న వాస్తవం గ్రహించాలి. విషయం అర్థమైంది కదా! ఇక ఢిల్లీ మ్యాచ్ కోసం వాళ్లు జడేజా డూప్లికేట్ను వెదుకుతారని మాత్రం నేను అనుకోవడం లేదు’’ అని కైఫ్ ట్విటర్ వేదికగా ట్రోల్ చేశాడు. Australia now know the difference between facing duplicate Ashwin and real Ashwin. You can't prepare to face one of all-time great by facing a young first-class player. Hope they not searching for a Jadeja duplicate in Delhi. — Mohammad Kaif (@MohammadKaif) February 12, 2023 కాగా తొలి టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్ను హస్తగతం చేసుకున్న సన్రైజర్స్ BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
Ind Vs SL: రాహుల్ ఇన్నింగ్స్ అంత గొప్పగా ఏమీలేదు.. కానీ!
India vs Sri Lanka, 2nd ODI: ‘‘గత కొంతకాలంగా అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. అంతేకాదు.. వైస్ కెప్టెన్గా తనకిప్పుడు హోదా లేదు. గత మూడు, నాలుగు నెలల కాలంగా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అయితే, ఇప్పుడు మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి తన సత్తా చాటాడు. సరైన సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. కేఎల్ రాహుల్ను ప్రశంసించాడు. శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కీలక సమయంలో సత్తా చాటి.. కోల్కతాలో జరిగిన గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంకను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు తీయడంతో.. 215 పరుగులకే పర్యాటక జట్టు కథ ముగిసింది. అయితే, లక్ష్యం చిన్నదే అయినా.. టీమిండియా టాపార్డర్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 103 బంతులు ఎదుర్కొని 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కాగా గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న రాహుల్ కీలక సమయంలో రాణించి తన విలువేమిటో చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ కర్ణాటక ప్లేయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గొప్పగా ఏమీ లేకపోవచ్చు! ‘‘జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆచితూచి ఆడాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్లో తన స్ట్రైక్ రేటు(134.48) బాగానే ఉంది. అప్పటికి ఇంకా వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ రెండో వన్డేలో పరిస్థితి వేరు. ఇక్కడ తన బ్యాటింగ్ తన అనుభవానికి అద్దం పట్టింది. తన ఇన్నింగ్స్ గొప్పగా ఏమీ లేకపోవచ్చు. అయితే, కేఎల్ రాహుల్ ఇప్పుడు పరిణతి చెందిన బ్యాటర్ అంటే ఎలా ఉండాలో చూపించాడు’’ అని కైఫ్ కొనియాడాడు. చేజారిన వైస్ కెప్టెన్సీ మొదటి వన్డేలో రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించిన వేళ.. రాహుల్ 29 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక బంగ్లా పర్యటన తర్వాత స్వదేశంలో లంకతో టీమిండియా టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. రాహుల్ను వైస్ కెప్టెన్గా తప్పించి ఆల్రౌండర్ పాండ్యాకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో కైఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో విజయంతో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: Ind Vs NZ 2023: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్.. తొలిసారి ఆ ఇద్దరికి చోటు.. దంచికొట్టిన సాల్ట్! సన్రైజర్స్కు తొలి మ్యాచ్లోనే చేదు అనుభవం -
చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్లలో ఆడించాలి
India tour of Bangladesh, 2022- Bangladesh vs India: టీమిండియా బ్యాటర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. బౌలర్లను తప్పుబట్టడం సరికాదని.. చెత్త బ్యాటింగ్ వల్లే బంగ్లాదేశ్ చేతిలో రోహిత్ సేన ఓడిపోయిందని పేర్కొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న కైఫ్,.. ఇకనైనా ‘హిట్మ్యాన్’ బ్యాట్ ఝులిపించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం నాటి తొలి వన్డేలోనే భారత్కు పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(27) సహా సీనియర్లు శిఖర్ ధావన్(7), విరాట్ కోహ్లి(9) విఫలమయ్యారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే అర్ధ శతకం(73 పరుగులు)తో రాణించడంతో ఈ మ్యాచ్లో టీమిండియా గౌరవప్రదమైన(186) స్కోరు చేయగలిగింది. అయితే, భారత బౌలర్లు ఫర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్య ఛేదనలో బంగ్లాను మెహదీ, ముస్తాఫిజుర్ ఆదుకోవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు.. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్తగా ఆడారు.. ఇక బుధవారం ఇరు జట్లు రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మనం ఎక్కువగా భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతున్నాం. నిజానికి మొదటి వన్డేలో బ్యాటర్లు చెత్తగా ఆడారు. కేవలం బ్యాటింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిపోయింది. విరాట్ కోహ్లి పరుగులు సాధించాలి. ముఖ్యంగా కెప్టెన్.. రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలి. గత కొంతకాలంగా తన వైఫల్యం కొనసాగుతోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు’’ అని కైఫ్.. రోహిత్ తీరును విమర్శించాడు. కుల్దీప్ను అన్ని మ్యాచ్లలో ఆడించాలి.. ఇక రెండో వన్డే నేపథ్యంలో.. యువ బౌలర్ కుల్దీప్ సేన్కు కైఫ్ మద్దతుగా నిలిచాడు. అతడిని సిరీస్ మొత్తం ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘ఒకవేళ వాళ్లు రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. గందరగోళం ఏర్పడుతుంది. యువ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కుల్దీప్ సేన్కు అన్ని మ్యాచ్లలో అవకాశం ఇవ్వాలి. తను మొదటి వన్డేతో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు. అయితే, పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. తన బౌలింగ్లో పేస్ ఉంది. కానీ ఒత్తిడిలో కూరుకుపోవడం వల్ల సరిగ్గా ఆడలేకపోయాడు. అయినా, తనకిది మొదటి మ్యాచ్. కాబట్టి మరో అవకాశం ఇవ్వాలి. నిజానికి ఒక్క మ్యాచ్ ఓడితే జట్టులో మార్పులు చేయడం సరికాదు. అలా చేస్తే ఆ జట్టు కెప్టెన్ లేదంటే సరైన వాళ్లు అనిపించుకోరు’’ అంటూ యువ పేసర్ కుల్దీప్ సేన్కు మాజీ బ్యాటర్ కైఫ్ అండగా నిలబడ్డాడు. కాగా మొదటి వన్డేలో 5 ఓవర్లు బౌల్ చేసిన కుల్దీప్ సేన్ 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! Hasan Ali: హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్ -
WC 2023: టీమిండియా ‘వైఫల్యం’! అసలు సమస్య అదే: మహ్మద్ కైఫ్
‘In search of diamond we lost gold’: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా సన్నద్ధతపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో అనుభవజ్ఞులైన సీనియర్లను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నాడు. ప్రయోగాలు చేసేందుకు సమయం లేదని, ఐసీసీ టోర్నీకి ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందని పేర్కొన్నాడు. సెమీస్లో నిరాశ టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన టీమిండియా... ఈసారి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన రోహిత్ సేన కనీసం ఫైనల్ చేరకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఓటమి బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వచ్చే ప్రపంచకప్లోనైనా ఇదిలా ఉంటే... స్వదేశంలో వచ్చే ఏడాది భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఎఫ్టీపీ క్యాలెండర్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ కంటే ముందు టీమిండియా సుమారు 25 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్తో వన్డేల్లో తలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రసారకర్త అమెజాన్ ప్రైమ్ వీడియోతో ముచ్చటించిన మహ్మద్ కైఫ్ జట్టు కూర్పు, వన్డే వరల్డ్కప్ సన్నద్ధతపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘వరల్డ్కప్ చాంపియన్గా ఉన్న ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్ల సగటు వయసు 31 ఏళ్లు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఒకవేళ టీమిండియా ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలనుకుంటే న్యూజిలాండ్ సిరీస్తోనే మొదలుపెట్టాల్సింది. టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అసలు సమస్య అదే ‘‘టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. ప్రస్తుత సిరీస్లో శార్దూల్ ఠాకూర్ విషయాన్నే చూడండి. మొదటి వన్డేలో ఆడించి రెండో మ్యాచ్కే పక్కన పెట్టారు. ఇక సిరాజ్ను ఇంటికి పంపేశారు. తనను వన్డేల్లో కూడా ఆడించాల్సింది. అసలు ఈ సిరీస్కు భువనేశ్వర్ కుమార్ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కాలేదు. తను మంచి బౌలర్. అయినా జట్టులో అతడికి చోటు లేదు. అదేదో సామెత ఉంటుంది కదా! వజ్రాల వేటలో పడి బంగారం పోగొట్టుకున్నారు అని! ప్రస్తుతం జట్టు పరిస్థితి అలాగే ఉంది. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. అయితే, అనుభవం ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. జట్టు సమతుల్యంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచకప్ ఈవెంట్కు సమయం తక్కువగా ఉన్నందున ఇప్పుడు ప్రయోగాలు పనికిరావు. కాబట్టి జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని పక్కనపెట్టాలో నిర్ణయించుకోండి. పేసర్లు అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్కుమార్, మహ్మద్ షమీలతో పాటు ఉమ్రాన్ మాలిక్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్ట్రా బౌలర్గా తనని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని మహ్మద్ కైఫ్ బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్ PT Usha: చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్తో మ్యాచ్లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్లో భాగంగా ఇండియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
ధవన్ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!
జింబాబ్వేతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా తొలుత శిఖర్ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్ను రాహుల్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కొనసాగవలసిందిగా కోరారు. ధవన్ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్ అయిన ధవన్ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. రాహుల్ ఫిట్గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్ నాయకత్వంలో రాహుల్ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్ సిరీస్లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. ఆసియా కప్కు ముందు రాహుల్కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్ కూల్ కాండిడేట్ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు. చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో -
'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'
టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫేలవ ఫామ్తో జట్టుకు దూరమైన పుజారా ఆ తర్వాత రంజీ ట్రోపీ, కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. కౌంటీలో ససెక్స్ తరపున నాలుగు సెంచరీలతో హోరెత్తించిన పుజారా ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. పూర్తి స్థాయి ఫామ్ అందుకున్న పుజారా ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా జూలై 1న ఎడ్జ్బాస్టన్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే మహ్మద్ కైఫ్ యువ ఆటగాళ్లనుద్దేశించి పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' పుజారా నుంచి యువ క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కసారి జట్టులో స్థానం కోల్పోతే ఒక బ్యాటర్గా మనం చేయాల్సిన పని ఏంటనేది పుజారాను చూసి నేర్చుకోవచ్చు. ఫామ్ కోల్పోయిన మాత్రానా ఆందోళన చెందొద్దు. స్వదేశానికి తిరిగి వెళ్లండి. రంజీల్లో ఆడండి.. లేదంటే కౌంటీల్లో ఆడి పరుగులు సాధించి తిరిగి ఫామ్ను అందిపుచ్చుకోండి. పుజారా విషయంలో అదే జరిగింది. ఫామ్ కోల్పోయి విమర్శలు మూటగట్టుకున్న అతను కొన్ని నెలల పాటు ఏం చేశాడన్నది ఆసక్తిగా గమనించండి. పుజారా యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం.. అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పుజారా గొప్ప ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టులో తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వాషింగ్టన్ సుందర్కు లక్కీ ఛాన్స్.. ప్రతిష్టాత్మక టోర్నీలో.. థాంక్యూ అంటూ భావోద్వేగం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్బాల్ ప్లేయర్ -
IPL 2022: గొప్ప నాయకుడు.. కెప్టెన్గా అతడికి వందకు వంద మార్కులు!
IPL 2022- Hardik Pandya- Gujarat Titans: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు. సారథిగా హార్దిక్కు వందకు వంద మార్కులు వేస్తానని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో వైఫల్యం.. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందుకు తోడు ఎన్నో ఏళ్లుగా అనుబంధం పెనవేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్లీగ్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును అగ్రపథాన నిలిపాడు. బ్యాటర్గానూ రాణించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ పద్నాలుగింట ఏకంగా పది మ్యాచ్లు గెలిచి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: IPL) ఇక ఆడిన 13 ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా 413 పరుగులు(అత్యధిక స్కోరు 87 నాటౌట్) సాధించి బ్యాటర్గానూ నిరూపించుకుని లీగ్ దశ ముగిసే సరికి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదకొండో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పాండ్యాకు కెప్టెన్గా వందకు వంద మార్కులు ఇస్తాను. అతడు గొప్ప నాయకుడు. బౌలర్లతో సమన్వయం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తాడు. సాధారణంగా బౌలర్లు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కెప్టెన్ వారి పక్కనే నిలబడి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటే ఎంతో ఊరటగా ఉంటుంది. కెప్టెన్గా హార్దిక్ తన బౌలర్లకు అలాంటి సౌలభ్యాన్ని ఇచ్చాడు’’ అని కొనియాడాడు. హార్దిక్ నాయకత్వం వల్లే జట్టు ఉన్నత శిఖరాన నిలిచిందని కితాబిచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించిన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం.. వేలంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగిందని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఆక్షన్ సమయంలో వాళ్ల ప్లాన్ తికమకపెట్టినప్పటికీ... పక్కా ప్రణాళికలతో దృఢమైన జట్టుగా నిరూపించుకున్నారని తెలిపాడు. కాగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫైయర్లో భాగంగా మంగళవారం(మే 24) రాజస్తాన్ రాయల్స్తో ఢీకొట్టనుంది. చదవండి👉🏾IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! చదవండి👉🏾IPL 2022- SRH: టీమిండియా లీడింగ్ ఆల్రౌండర్గా ఎదుగుతాడు.. ఎస్ఆర్హెచ్ స్టార్పై రవిశాస్త్రి ప్రశంసలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Back at a venue that's seen so many iconic moments over decades 🔥 Catch our Titans talking about this amazing vibe called Eden 😍💙#AavaDe #SeasonOfFirsts #TATAIPL #GTvRR pic.twitter.com/Y1P0jHrJ2B — Gujarat Titans (@gujarat_titans) May 24, 2022
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement