-
ప్రేమపేరుతో అత్త కూతుర్ని మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ బాలికను మహరాష్ట్రకు తీసుకెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై నరేష్ కథనం మేరకు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్కు చెందిన లక్ష్మణ్ దమాయ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అతని కుమారుడు కరణ్ పరియార్ హిమాయత్నగర్లోని మెమోస్లో పనిచేస్తున్నాడు. స్థానికంగా 9వ తరగతి చదువుతున్న తన అత్త కుమార్తెను అతను ప్రేమిస్తున్నాడు. అదను చూసుకుని కరణ్ పరియార్ సదరు బాలికను మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి తీసికెళ్లాడు. ఓ గది అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరణ్ పరియార్ అన్న రాము పరియార్ ఫేస్బుక్లో తండ్రిపై, అన్నపై కేసు నమోదు అయ్యిందని, ఏ క్షణానైనా అరెస్ట్ చేయవచ్చునని పోస్ట్ చేశారు. ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడంతో కరణ్ పరియార్ తన సోదరుడు రాముకు ఫోన్ చేసి తాము కళ్యాణ్లో ఉన్నట్లు తెలిపాడు. ఎస్సై నరేష్ సూచన మేరకు సమీపంలోని ఉల్లాస్నగర్ పీఎస్లో లొంగిపోయాడు. అప్పటికే ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కరణ్ పరియార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..
సాక్షి, హిమాయత్నగర్: డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చి మరో ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానంటూ చెప్పి బయటకు వచ్చిన యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం మేరకు ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య డీఆర్డీఏ పరివార్ ప్రాంతంలో నివాసం ఉండే నిధా రెహమాన్(34) అబిడ్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో ఐదు నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి.. యూసఫ్గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ రోడ్డులో తన ముందు వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. చదవండి: పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనక చక్రాల కింద పడటంతో.. తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కొండపల్లి నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ సాయంతో యువతి మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నెల రోజుల్లో పెళ్లి... యూసఫ్గూడలో నివాసం ఉండే పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ మృతురాలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు వివాహానికి కూడా ఒప్పుకున్నారు. మరో నెల రోజుల్లో వివాహం కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవాబ్ఖాన్ను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇంతటి ఘోరం జరిగిందని నవాబ్ఖాన్ తెలిపారు. -
నాకిక ఓపిక లేదు.. ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్స్టా లైవ్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. చదవండి: కడతేర్చి.. కట్టుకథ చెప్పాడు.. చివర్లో బండారం ఇలా బయటపడింది నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్స్టా ఐడీలో లైవ్లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
‘దాడి చేస్తే శిక్ష తప్పదు.. ఓ సెల్ ఏర్పాటు చేశాం’
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నాడు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, శాడిస్టులు దాడి చేస్తున్నారు. (చదవండి: గ్రేటర్ టెన్షన్..!) వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ల కుటుంబాల్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేసిన పేషంట్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశాం. కరోనా సోకినవారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. వారికి రక్తం అవసరం. రక్తం కొరత రాకుండా బ్లడ్ డొనేట్ చేసేందుకు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే టీఎన్జీవో ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్లు) -
‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’
సాక్షి, కాచిగూడ : ఓ హాస్టల్ నుంచి యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా..అంటూ సూసైడ్ నోట్ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్ యాజమాన్యం అప్రత్తమైంది. ఎస్ఐ లిఖితరెడ్డి తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన మౌనిక(19) హిమాయత్నగర్లో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే హాస్టల్ ప్రాంగణంలో ఉండే బాయ్స్ హాస్టల్లో చదువుతున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్ రికార్డ్స్లో సంతకం చేసి బయటకు వచ్చిన మౌనిక.. ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్ వద్ద దిగింది. అక్కడ నుంచి కాలినడకన ట్యాంక్బండ్ చిల్డ్రన్పార్క్ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ నేతృత్వంలో ఎస్.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదవండి : వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే హైదరాబాద్లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా.. బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement