-
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
PM Narendra Modi: డరో మత్.. భాగో మత్
బర్ధమాన్/కృష్ణనగర్/చైబాసా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా ్రస్తాలు విసిరారు. డరో మత్.. భాగో మత్(భయపడొద్దు.. దూరంగా పారిపోవద్దు) అంటూ రాహుల్కు సూచించారు. కేరళలోని వయనాడ్లో పోలింగ్ పూర్తికాగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకుముందే చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్లో ఓటమి తప్పదని గ్రహించి రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్కు పారిపోయాడని, ఇప్పుడు అక్కడినుంచి రాయ్బరేలీకి వచ్చాడని పేర్కొన్నారు. ఈసారి అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్బరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు. భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని, తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు. ఇకనైనా భయపడడం, దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శుక్రవారం పశి్చమ బెంగాల్లోని బర్ధమాన్–దుర్గాపూర్, కృష్ణనగర్, బీర్భుమ్, బోల్పూర్ లోక్సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో, జార్ఖండ్లోని చైబాసాలో ‘మహా విజయ్ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతోందని, ప్రజాదరణ కోల్పోతోందని, ఈ ఎన్నికల్లో ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కనీసం 50 సీట్లయినా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు(సోనియా గాం«దీ) లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి, రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా మాట్టాడారంటే.. దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ‘ఓటు జిహాద్’ దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్లో పాలుపంచుకున్నవారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలూ పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సందపపై ముమ్మాటికీ పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు. 15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మాత్రమే ఉంది. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది. ఎన్నికల్లో ఆ పారీ్టకి బుద్ధి చెప్పాలి. చిత్తుచిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. మూడు సవాళ్లపై సమాధానమేదీ? దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది. అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారీ్టలకు కట్టబెట్టాలని పథకం వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘జిహాదీ ఓటు బ్యాంక్’ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం. కాంగ్రెస్తోపాట విపక్ష కూటమికి నేను 3 సవాళ్లు విసురుతున్నా. మొదటిది.. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతం ఆధారం రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని, మతం ఆధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. మూడోది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కలి్పంచబోమని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదు. నాకు సమాధానం ఇవ్వడం లేదు. -
కేంద్రంలో కాంగ్రెస్ రావడం అనివార్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనివార్యమని, జనాభాలో అధిక శాతం ఉన్న పేద వర్గాలకు సామాజిక న్యాయం కలి్పంచేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను అమ్మడమే తప్ప.. మోదీ సర్కార్ కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థలేమీ లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో మధుయాష్కీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ ధ్వజమెత్తారు. విదేశాలనుంచి నల్లదనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే మోదీ.. ఓబీసీలకు ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేసీఆర్ అప్పుల్లో ముంచారు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, అవినీతి.. అక్రమాలతో తెలంగాణను సర్వనాశనం చేశారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ ఒకదిక్కు బీఆర్ఎస్, మరోదిక్కు బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చా రు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
మోదీది సవతి తల్లి ప్రేమ
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల: ప్రధాని మోదీ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాడని, పదేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మోదీ తరచుగా చెప్పే ఐదు ట్రిలియన్ల ఎకానమీకి ఆద్యుడు ఒకప్పటి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని గుర్తుచేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాలనాగు అని దాన్ని ఈసారి ఎన్నికల్లో తలమీదే కొట్టాలని పిలుపునిచ్చారు. జనజాతర సభలో భాగంగా శుక్రవారం «జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని రాజారాంపల్లి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభ, కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఏమన్నారంటే.... నేను మధ్యాహ్నం రెండు గంటలకే రావాల్సి ఉన్నా.. రాయ్బరేలిలో రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావడం, విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. బీఆర్ఎస్ చచ్చిన పాము. తోక మీద కాదు.. పడగ మీద కొట్టండి. కాలనాగు పీడ విరగడవుతుంది. ఇక బీజేపీ నోరు తెరిస్తే.. అబద్ధాలే. ఎన్టీపీసీలో 4,000 మెగావాట్లకుగాను పదేళ్లలో 1,600 మెగావాట్ల ప్లాంట్ మాత్రమే నిర్మించారు.దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉండాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలి. గాంధీ కుటుంబానికి తోడుగా నిలబడాలి. మా ప్రభుత్వం జోలికొస్తే కార్యకర్తలు ఊరుకోరు’’అని ముగించారు. అనంతరం బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, గిరిజన వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఇలా ఏది అడిగినా.. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని సభికులతో సీఎం రేవంత్ అనిపించారు. కారు ఢిల్లీకి పోతే.. కమలం అవుతుంది ‘తెలంగాణలో కారు ఢిల్లీకి పోతే కమలం అవుతుంది. 2014, 2019లో రెండుసార్లు 12 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు ఇస్తే.. కేసీఆర్ ఏం చేశాడు..ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టుపెట్టాడు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచి్చన నల్లాచట్టాలు, నోట్ల రద్దుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. కరీంనగర్లో పోటీచేసిన ఒక్కరు అపరమేధావి, మరొకరు అరగుండు మేధావి అని, ఇద్దరూ పాతవారే, ఎంపీలుగా పనిచేసిన వారే కదా అని ప్రశ్నించారు.ఎంపీలుగా ఉన్నప్పుడు ఏమీ చేయనోళ్లు.. ఇప్పుడు మళ్లీ గెలిచి ఏం చేస్తారన్నారు. పదేళ్లు తెలంగాణను నిర్లక్ష్యం చేసి, తెలంగాణ పునరి్వభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీకి ఓట్లు ఎట్లా వేస్తామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ రైల్వే కోచ్ ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ కారిడార్ వంటి తెలంగాణ పునరి్వభజన చట్టంలోని ఒక్కదాన్ని కూడా బీజేపీ ఇవ్వలేదని చెప్పారు. ఉద్దెరోడు పెట్టిన రూ.40 వేల కోట్లు కట్టలేక పోతున్నా.. రాష్ట్రంలో ఈ ఉద్దెరోడు పెట్టిపోయిన రూ.40వేల కోట్లు కట్టలేక పోతున్నానని, సిరిసిల్ల నేతన్నలకు రూ.275 కోట్లు బకాయి పెట్టిపోయిండని రేవంత్రెడ్డి అన్నారు. నేత, గీత కార్మికులను ఆదుకోవాలని నేతకార్మికులకు ఇటీవల రూ.50కోట్లు మంజూరు చేశామని, ఎన్నికల ముగిసిన తర్వాత మిగతా బకాయిలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచి్చన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement