-
సడెన్గా విమాన ప్రయాణం క్యాన్సిల్ : పాపం ఆ జంట!
ఓ జంట సరదాగా గడిపేందుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అనుకోని విధంగా భయానక వ్యాధి బారినపడటం సడెన్గా తిరిగొచ్చాయల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అయితే సదరు విమానయాన సంస్థ ఆ జంట నుంచి నిర్థాక్షిణ్యంగా లక్షల్లో చార్జీలు వసూలు చేసింది. వారి పరిస్థితి ఇది అని వేడుకున్న ససేమిరా అంది విమానాయన సంస్థ. పాపం ఆ దంపతులుకు ఆ వ్యాధి వచ్చినందుకు బాధపడాలో లేక ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అయ్యినందుకు బాధపడాలో తెలియని స్థితి ఎదురయ్యింది. ఈ చేదు ఘటన న్యూయార్క్ దంపతులకు ఎదురయ్యింది. జనవరిలో టోడ్(60) ప్యాట్రిసియా కెరెక్స్(70) దంపతులు జనరిలో న్యూయార్క్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజలాండ్లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ వరకు అక్కడే ఆక్లాండ్లోనే గడపాలని అనుకున్నారు. అయితే ఆరువారాలకే ప్యాట్రిసియా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు పిత్తాశయం క్యాన్సర్ ఉందని నిర్థారణ అయ్యింది. నాలుగు నెలల కంటే ఎక్కువ బతకదన్నా విషాదవార్త ఆ దంపతులను నిలువున కుంగదీసింది. పైగా వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయాలని ఫ్యామిలీ డాక్టర్ కూడా సూచించడంతో తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది ఆ జంట. అందుకోసమని తాము ముందుగా బుక్ చేసిన విమాన టికెట్లను క్యాన్సిల్ చేసి రీ షెడ్యూల్ చేయామని సదరు విమానయాన సంస్థను కోరారు. అయితే సదరు విమానాయన సంస్థ రిటర్న్ టికెట్లు ధర ఏకంగా రూ. 18 లక్షలు దాక అవుతుందని స్పష్టం చేసింది. షాక్కి గురయ్యిన ఆ దంపతులు తమ పరిస్థితిని వివరించి వేడుకున్నారు. టోడ్ తన భార్య అనారోగ్య పరిస్థితి కారణంగా తమ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నామని విమానాయన అధికారులకు తెలిపారు. ఇంతటి విషాదంలో ఇంతలా ఆర్థిక భారం మోపొద్దని ఎంతలా అభ్యర్థించినా సదరు విమానయాన అధికారులు అంగీకరించ లేదు. అయినా ఒక కస్టమర్ అనారోగ్య రీత్యా లేదా అనుకోని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఉండే కస్టమర్ ఎమర్జెన్సీ పాలసీని వర్తింపచేయొచ్చు. అయితే అధికారులు ఆ పాలసీని ఫాలో అవ్వకపోగా వేరే విమాన టికెట్లు బుక్ చేయాలంటే కనీసం రూ. 6.5 లక్షలు చెల్లించక తప్పదని తెగేసి చెప్పేసింది ఎయిర్ న్యూజిలాండ్. పాపం ఆ దంపతులు హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా అంతమొత్తం చెల్లించి వెనక్కి వచ్చేశారు. అసలు న్యూజిలాండ్ వాసులు ఇంత కఠినంగా వ్యవహిరస్తారని మాకు తెలియదు అన్నారు ఆ దంపతులు. ఇది న్యూజిలాండ్ స్థాయికి తగని పని అని ఆవేదనగా చెప్పారు ఆ దంపతులు. ఇలాంటి విపత్కర స్థితిలో ఇంతలా వసూలు చేయడం అనేది ఏవిధంగా చూసిన సరైనది కాదన్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలుసుకున్న ఎయిర్ న్యూజిలాండ్ వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పింది. వేరే విమాన టిక్కెట్లు బుక్ చేసేందుకు అయ్యిన అదనుపు టిక్కెట్లు ఖర్చులను కూడా వాససు ఇస్తామని స్పష్టం చేసింది. నిజానికి ఒక కస్టమర్కి ఏదైన విపత్కర పరిస్థితి ఎదురయ్యితే చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసి మరోక విమానంలో ప్రయాణించేలా చేసే వెసులబాటు ఉందని చెప్పడమే గాక ఆ దంపతులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాని పేర్కొంది. పైగా మరోసారి క్షమాపణలు చెప్పింది ఎయిర్ న్యూజిలాండ్. బస్, ట్రెయిన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు పోయినా అంత భయం అనిపించదు కానీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుందిగానీ లేదంటే ఖర్చులు తడిసిమోపడవ్వడం గ్యారంటీ. (చదవండి: బట్టతలపై జుట్టు పెరిగెలా చెయ్యొచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్లా డ్రస్లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్టాక్లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
ఎవరీమె? ఆమె స్పీచ్కి..పార్లమెంటే దద్దరిల్లింది!
పార్లమెంట్లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటు చేసకుంది. ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్. కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్కి ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్లో పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్ను కూడా మైపీ క్లార్క్ నడుపుతోంది ఏం మాట్లాడారంటే.. ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. నిజానికి ఈ పార్లమెంట్లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. కానీ నేను ఈ ఛాంబర్లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా! అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే. New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke — Enez Özen | Enezator (@Enezator) January 4, 2024 (చదవండి: మహిళా భద్రతలో టాప్.... చెన్నై!! హైదరాబాద్ స్థానం...??) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్లో ఆక్లాండ్లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement