కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి

Published Mon, Apr 29 2024 6:29 PM

Kejriwal has Directed to Ensure Adequate Water Supply in Summer Says Atishi

ఆప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రి అతిషి సోమవారం తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను కలిశారు. వేసవిలో నగరవాసులు నీటి కష్టాలను ఎదుర్కోకుండా చూడాలని ఆయన ఆదేశించారని తెలుస్తోంది.

జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత మీడియా సమావేశంలో అతిషి మాట్లాడుతూ.. తన క్షేమం గురించి అడిగినప్పుడు, నా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ చెప్పినట్లు చెప్పారు. అంతే కాకుండా పాఠశాల పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయా? పిల్లలు చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మొహల్లా క్లినిక్‌లలో మందుల సమస్య పరిష్కారమైందా? కేజ్రీవాల్ తనను అడిగినట్లు అతిషి చెప్పారు.

వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన నీటి సరఫరా ఉండేలా చూడాలని కేజ్రీవాల్ తనను కోరినట్లు ఆమె తెలిపారు. ఇక మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 1000 గౌరవ వేతనం అందిస్తామని, త్వరలోనే బయటకు వస్తానని చెప్పినట్లు కూడా అతిషి వెల్లడించారు.

కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వానికి ద్వేషం ఉందని, వారు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన భార్యకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారని ఆప్ ఆదివారం తెలిపింది. అయితే దీనిని జైలు అధికారులు తోసిపుచ్చారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం (ఏప్రిల్ 30) ఆప్ అధినేతను కలవనున్నారు.  ప్రధానితో ఇది రెండో భేటీ కావడం విశేషం. చివరిసారిగా ఏప్రిల్ 15న పార్టీ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌తో కలిసి కేజ్రీవాల్‌ను కలిశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement