-
పారిస్ ఒలింపిక్స్కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్లో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్కు అర్హత పొందారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి సందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల పీవీ సింధు మీడియాతో మాట్లాడారు. ‘‘ శ్రీ రామ నవమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మలేసియా, ఇండోనేషియాలో టోర్నమెంట్స్, ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లలో బాగా రాణించాలని కోరుకున్నా’’ అని పీవీ సింధు తెలిపారు. -
ముగిసిన భారత్ పోరు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రణయ్... మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఆరో సీడ్ హాన్ యువె (చైనా)తో జరిగిన మ్యాచ్లో సింధు 18–21, 21–13, 17–21తో ఓటమి చవిచూసింది. ఏడో సీడ్ ప్రణయ్ 18–21, 11–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అశ్విని –తనీషా జోడీ 17– 21, 12–21తో మూడో సీడ్ నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా ఓటమి పాలైనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈనెల 30న విడుదలయ్యే ర్యాంకింగ్స్లో టాప్– 16లో ఉన్న డబుల్స్ జోడీలకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. అశ్విని–తనీషా ద్వయం 20వ ర్యాంక్లో ఉన్నప్పటికీ... ఒక దేశం నుంచి గరిష్టంగా రెండు జోడీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్లో అశ్విని ద్వయం 12వ స్థానంలో ఉండటం... ఇదే చివరి అర్హత టోర్నీ కానుండటంతో భారత జోడీ ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పు ఉండదు. -
శ్రమించి గెలిచిన సింధు, ప్రణయ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే బరిలో మిగిలారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 64 నిమిషాల్లో 18–21, 21–14, 21–19తో ప్రపంచ 33వ ర్యాంకర్ గో జిన్ వె (మలేసియా)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 90 నిమిషాల్లో 17–21, 23–21, 23–21తో ప్రపంచ 16వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)పై గెలుపొందారు. గతంలో గ్వాంగ్ జుతో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ నాలుగో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్ను కోల్పోయిన ప్రణయ్ రెండో గేమ్లో, మూడో గేమ్లో మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక (భారత్) 18–21, 19–21తో సిమ్ యు జిన్ (కొరియా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 10–21, 11–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్ 19–21, 15–21తో టాప్ సీడ్ షి యుకీ (చైనా) చేతిలో, కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో రెండో సీడ్ జిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాన్షు 9–21, 13–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 2–21, 12–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
ఉబెర్ కప్ టోర్నీకి సింధు దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో ఈసారి భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరగనుంది. సింగిల్స్ విభాగం నుంచి స్టార్ ప్లేయర్ పీవీ సింధు తప్పుకోగా... డబుల్స్ విభాగం నుంచి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు కూడా వైదొలిగాయి. పారిస్ ఒలింపిక్స్కల్లా తన ఆటలో మరింత పదును పెరిగేందుకు, పూర్తి ఫిట్గా ఉండేందుకు సింధు ఉబెర్ కప్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు ఇతర క్వాలిఫయింగ్ టోర్నీలపై దృష్టి పెట్టాయి. భారత మహిళల జట్టు ఉబెర్కప్లో మూడుసార్లు (1957, 2014, 2016) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. భారత మహిళల జట్టు: అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి బారువా (సింగిల్స్); శ్రుతి మిశ్రా, ప్రియా కొంజెంగ్బమ్, సిమ్రన్, రితిక (డబుల్స్). భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు, కిరణ్ జార్జి (సింగిల్స్); సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున్, ధ్రువ్ కపిల, సాయిప్రతీక్ (డబుల్స్). ఆసియా చాంపియన్షిప్ నుంచి వైదొలిగిన సాత్విక్ జోడీ భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో రెండో సీడ్, భారత స్టార్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–12తో హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీ ఎదురైంది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ సింధు దూకుడు కొనసాగింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్ ప్లేయర్ సుపనిదతో సింధు ఆడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–3తో ఆధిక్యంలో ఉంది. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ ద్వయం 22–20, 21–18తో ప్రెస్లీ స్మిత్–అలీసన్ లీ (అమెరికా) జంటపై గెలిచింది. అశ్విని–తనీషా జోడీ గెలుపు మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జంట 21–14, 21–8తో టిఫానీ హో–గ్రోన్యా సోమర్విల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–అర్జున్ (భారత్) ద్వయం 21–17, 21–19తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్) జంటపై నెగ్గగా... గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జోడీ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్–తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
సింధు శుభారంభం
బాసెల్ (స్విట్జర్లాండ్): మాజీ చాంపియన్ పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–12, 21–13తో పోర్న్పిచా చొయ్కీవోంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ తొమోకా మియజకీతో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. 2015లో స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ 21–17, 21–18తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గగా... లక్ష్య సేన్ 21–19, 15–21, 21–11తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రౌండ్లో అశి్వని–తనీషా ద్వయం 21–18, 12–21, 21–19తో మెలీసా పుస్పితాసారి–రేచల్ రోజ్ (ఇండోనేసియా) జంటపై... గాయత్రి–ట్రెసా జోడీ 21–15, 21–12తో అనీ జు–కెరీ జు (అమెరికా) ద్వయంపై గెలుపొందాయి. -
సింధు ఏడో‘సారీ’...
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో భారత కథ ముగిసింది. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గత ఐదేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కొరియా ప్లేయర్ ఆన్ సె యంగ్ చేతిలో సింధు వరుసగా ఏడోసారి ఓడిపోయింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింధు 19–21, 11–21తో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ ఆన్ సె యంగ్ చేతిలో ఓటమి పాలైంది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో ఆన్ సె యంగ్కు గట్టిపోటీనిచ్చిన సింధు రెండో గేమ్లో మాత్రం తడబడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 3,900 డాలర్ల (రూ. 3 లక్షల 23 వేలు) ప్రైజ్మనీతోపాటు 4800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వ్యోన్ లీ (బెల్జియం)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు తొలి గేమ్ను 14 నిమిషాల్లో 21–10తో సొంతం చేసుకుంది. ఈ దశలో గాయం కారణంగా వ్యోన్ లీ వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు. ఆకర్షి కశ్యప్ 16–21, 11–21తో పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–14, 13–21, 13–21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. ప్రపంచ నంబవర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 9–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ ఏ దశలోనూ డెన్మార్క్ స్టార్కు పోటీనివ్వ లేకపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది 11వ ఓటమి కావడం గమనార్హం. -
'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్విల్ అంబాసిడర్గా పీవీ సింధు..
గత 18 ఏళ్లగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ 'ఎర్త్ అవర్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024కు గాను'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికైంది. మార్చి7న అంబాసిడర్గా బాధ్యతలు చేపట్టిన సింధు.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగహన కల్పించే పనిలో పడింది. తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్ దియా మీర్జా, హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్ 'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్విల్ అంబాసిడర్లగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘు దీక్షిత్ మాట్లాడుతూ.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా అంబాసిడర్గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యవరాణాన్ని రక్షించేందుకు మనమందరం ఏకం కావల్సిన సమయం అసన్నమైంది. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవహగహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. సహజ వనరులు, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరది. కాబట్టి అందరూ గంట సమయం పాటు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగమవుతరాని ఆశిస్తున్నానని" పేర్కొన్నాడు. చాలా సంతోషంగా ఉంది.. "డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది .ఈ ప్రాతిష్టత్మక ఈవెంట్లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్కు ధన్యవాదాలు. ప్రతీ ఏడాది కూడా నేను ఈ ఎర్త్అవర్ కార్యక్రమంలో పాల్గోంటున్నాను. గతం కంటే ఈసారి ఎక్కువమంది ఈ కార్యక్రమంలో భాగమవుతారని ఆశిస్తున్నాను. నా వరకు అయితే ఈ ఏడాది అన్ని లైట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఒక గంట పాటు ఆపివేసి, నా కుటుంబంతో కలిసి క్యాండిల్లైట్ డిన్నర్ చేస్తాను. పర్యావరణాన్ని, ఈ భూమిని కాపాడే బాధ్యత మనందరది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను వాడడం మానేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో మేలు చేస్తోంది. ప్రతీ ఏడాది ఒక గంట మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని" దీయా మీర్జా పేర్కొంది. దుల్కర్ సల్మాన్ సైతం ఎర్త్ అవర్ గుడ్విల్ అంబాసిండర్గా ఎంపికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు అందరూ గంట సేపు లైట్లను ఆపి ఈ కార్యక్రమంలో భాగం కావాలని అభిమానులను దుల్కర్ కోరాడు. అస్సలు ఏంటి ఈ ఎర్త్ అవర్? కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సుమారు 187 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గంట పాటు లైట్లను ఆర్పివేసి విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ నాడు ఎర్త్ అవర్ ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందే ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది. అంటే మార్చి 23న సాయంత్రం 8:30 గంటల నుంచి 9: 30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది. -
French Open: పీవీ సింధుకు పరభావం.. క్వార్టర్స్లో ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. ఆఖరికి 24-22,17-21, 18-21తో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో 24-22 తేడాతో చెన్ యు ఫీని ఓడించిన సింధూ.. రెండు, మూడు సెట్లను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్ధి చెన్ యు ఫీ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సెమీస్బెర్త్ను ఖారారు చేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ 21-19, 21-13తో సుపక్ జొంకో, కెడ్రెన్(థాయ్లాండ్) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్ను కష్టంగా గెలిచిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్ను అలవోకగా దక్కించుకున్నారు. సెమీస్లో మిన్ హ్యుక్ కాంగ్, సెయింగ్ జయె(కొరియా) జోడీతో తలపడనున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? -
గట్టెక్కిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్ 17–21, 17–21తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్లాండ్ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్కోల్ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్జల్లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్లో గెలుపొంది, టైటిల్ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్పిచా చోయికీవాంగ్పై వరుస గేమ్లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఫైనల్లో!
Badminton Asia Team Championships: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్స్కు దూసుకెళ్లింది. మలేషియా వేదికగా శనివారం జరిగిన సెమీస్లో జపాన్ బృందాన్ని భారత జట్టు ఓడించింది. తద్వారా 3-2 తేడాతో విజయ దుందుభి మోగించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో థాయ్లాండ్తో భారత మహిళా జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. పసిడి పతకమే లక్ష్యంగా సింధు సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ముందుకు సాగుతోంది. కాగా అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్పై భారత మహిళా జట్టు గెలుపొందిన విషంయ తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన సింధు బృందం
ఆలమ్ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్ ఆడుతుంది. హాంకాంగ్తో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్ యాన్పై నెగ్గి భారత్కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్ టింగ్–యెంగ్ పుయ్ లామ్ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్లో అషి్మత 21–12, 21–13తో యెంగ్ సమ్ యీపై గెలిచి భారత్కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది. గెలుపు వాకిట శ్రీకాంత్ బోల్తా భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్ ఫైనల్లో 2–3తో జపాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్లో శ్రీకాంత్ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్ను 22– 20తోపాటు మ్యాచ్ను 3–2తో జపాన్కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు. అంతకకుముందు తొలి మ్యాచ్లో ప్రణయ్ ఓడిపోగా... రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్లో లక్ష సేన్ నెగ్గగా... నాలుగో మ్యాచ్లో ధ్రువ్ కపిల–అర్జున్ జంట ఓటమి పాలైంది. -
చైనాను చిత్తు చేసిన భారత్..
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్-2024 టోర్నీలో భారత మహిళా జట్టు అదరగొట్టింది. మలేషియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో టాప్ సీడ్ చైనా జట్టును ఓడించి టేబుల్ టాపర్గా క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. దాదాపు మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఒలింపియన్ 21-17, 21-15తో హాన్ను ఓడించి భారత్కు 1-0 ఆధిక్యం అందించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో యూతో బుధవారం తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పదిహేడేళ్ల ఈ యువ ప్లేయర్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈ క్రమంలో చైనాను 3-2తో చిత్తు చేసిన భారత మహిళా జట్టు ఆసియా చాంపియన్షిప్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్లో ఇదొక చారిత్రక దినమంటూ అభిమానులు మురిసిపోతున్నారు. We enter quarterfinals as table toppers after beating 🇨🇳 3-2, let that sink in 🔥 Proud of you girls, keep it up! 👊#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/ysFhXwICTw — BAI Media (@BAI_Media) February 14, 2024 -
విజయ్ దేవరకొండ సినిమాలపై పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ సినిమాలపై భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ నటించిన సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదని చెప్పింది. అయితే నచ్చని సినిమాలు ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు క్రష్ అని మరోసారి వెల్లడించింది. అతని సినిమాలన్నీ చూశానని.. డైరెక్టగా కలిసే అవకాశం మాత్రం రాలేదని చెప్పింది. ‘బ్యాడ్మింటన్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సినిమాలు చూస్తాను. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ల యాక్టింగ్ నాకు చాలా ఇష్టం.విజయ్ దేవరకొండ సినిమాలు చూశాను కానీ కొన్ని నాకు అంతగా నచ్చలేదు. ఆ పేర్లు చెబితే కాంట్రవర్సీ అవుతుంది. నాకు నచ్చని సినిమాలు వేరే వాళ్లకు నచ్చొచ్చు. ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఏ హీరో అయినా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే సినిమా చేస్తారు. వాళ్లపై కూడా ఒత్తిడి ఉంటుంది. సినిమా హిట్ అవుతుందో..ఫ్లాఫ్ అవుతుందో తెలియదు.కానీ నెలల తరబడి షూటింగ్ చేస్తారు. వాళ్ల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు’అని సింధు చెప్పుకొచ్చింది. ఇకపోతే గతంలో సింధు సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని సింధు కొట్టిపారేసింది. నటించాలనే ఆలోచన తనకు లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని చెప్పింది. భవిష్యత్తులో సినిమాల విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని వెల్లడించింది. తన బయోపిక్ తీస్తే.. అందులో బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పడుకొణె లాంటి హీరోయిన్ నటిస్తే బాగుంటందని సింధు అభిప్రాయపడింది. -
22 ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్గా! బ్యాడ్మింటన్లో ఎన్నో సంచలనాలు
దాదాపు ఏడాది క్రితం... దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ జరుగుతోంది. భారత్, కొరియా మధ్య పోరు... మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు... ఎదురుగా ప్రత్యర్థి ఒక వర్ధమాన షట్లర్... ఆమె ఆట గురించి సింధుకు కూడా బాగా తెలుసు. అందుకే తనదైన వ్యూహాలతో సన్నద్ధమై బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్ను సింధు 21–18తో గెలుచుకుంది. కానీ అటు వైపు ఉన్న అమ్మాయి వెంటనే కోలుకుంది. అంతే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తర్వాతి రెండు గేమ్లను అలవోకగా 21–5, 21–9తో సొంతం చేసుకొని మ్యాచ్ను తన ఖాతాలో వేసేసుకుంది. సింధు ముఖంలో తీవ్ర నిరాశ... ఎందుకంటే ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇద్దరూ 6 మ్యాచ్లలో తలపడితే ఆరోసారి కూడా కొరియా ప్లేయరే విజయం సాధించింది. 2019 నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క మ్యాచ్లో కూడా సింధు గెలవలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, వరల్డ్ చాంపియన్, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్లు సాధించి వరల్డ్ బ్యాడ్మింటన్ గ్రేట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సింధును కూడా ఒక ఆటాడుకుంటున్న ఆ అమ్మాయి పేరే ఆన్ సె యంగ్... టీనేజ్ దాటకముందే టాప్ షట్లర్లందరినీ ఓడిస్తూ దూసుకు వచ్చి ఆపై విశ్వ విజేతగా కూడా నిలిచిన 22 ఏళ్ల కొరియన్ స్టార్ షట్లర్. ‘కొరియాను ఆదుకున్న స్కూల్ గర్ల్’... ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో గ్రూప్ దశలో డెన్మార్క్తో జరిగిన కీలక మ్యాచ్లో ఆన్ సె యంగ్ విజయం తర్వాత కొరియా అంతటా కనిపించిన హెడ్లైన్స్ ఇవి. ఈ పోరులో తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత టీమ్ స్కోరు 2–2తో సమంగా ఉన్న దశలో ఆఖరి మ్యాచ్లో ఆమె బరిలోకి దిగింది. తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటిన యంగ్ తన డెన్మార్క్ ప్రత్యర్థి లైన్ క్రిస్టోఫర్సెన్ను ఓడించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ఈ టోర్నీలో కొరియా జట్టుకు కాంస్య పతకం అందించడంలో కూడా 16 ఏళ్ల యంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొరియా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి స్కూల్గర్ల్గా ఈ అమ్మాయి గుర్తింపు పొందింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆపై ఇవే విజయాలను కొనసాగిస్తూ ఉన్నతస్థానానికి దూసుకుపోయింది. అంతకు ముందు ఏడాదే కొరియా జూనియర్ టీమ్ తరఫున ఆసియా చాంపియన్షిప్ గెలిచినప్పుడే ఈ టీనేజర్లో ఎంతో సత్తా ఉందని, సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్మారు. వాటిని వమ్ము చేయకుండా ఆన్ సె యంగ్.. నిజం చేసి చూపించింది. స్టార్ షట్లర్లను ఓడించి... కరోలినా మరీన్, అకీనా యమగూచి, సైనా నెహ్వాల్... బ్యాడ్మింటన్లో ఈ ముగ్గురూ సూపర్ స్టార్లు. ఎన్నో గొప్ప విజయాలు వీరి ఖాతాలో ఉన్నాయి. మరి ఈ ముగ్గురినీ ఒకే టోర్నమెంట్లో ఒక ప్లేయర్ ఓడగొడితే ఆ ప్లేయర్ స్థాయి ఏంటో ప్రపంచమంతటికీ అర్థమవుతుంది. ఆన్ సె యంగ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఉబెర్ కప్లో సీనియర్ల చాటున జూనియర్గా టీమ్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరచిన యంగ్ 2019 ఆరంభం నుంచే వ్యక్తిగత టోర్నీల్లో ప్రదర్శనతో సత్తా చాటింది. సూపర్–100 నుంచి సూపర్–300 స్థాయి వరకు వరుసగా నాలుగు టోర్నీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇందులో ఒక టోర్నీలో 2012 ఒలింపిక్స్ విజేత లీ జురుయ్ని ఫైనల్లో ఓడించగలిగింది. అయితే ప్రతిష్ఠాత్మక, పెద్ద టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో ఆటతో ఆన్ సె యంగ్ స్థాయి మరింత పెరిగింది. పై ముగ్గురు స్టార్లను ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడంతో యంగ్కు ఎదురు లేకుండా పోయింది. 2019లో ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకొని మరోదాంట్లో రన్నరప్గా నిలవడంతో సహజంగానే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఆమె ఎంపికైంది. ఈ అవార్డు సాధించడం అంటే ఈ అసాధారణ ప్లేయర్ ఇక ముందు ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించేందుకు సిద్ధంగా ఉందని అర్థం. యంగ్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాతి రెండేళ్లలో డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్, కొరియా ఓపెన్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్... ఇలా వేదిక మారడమే తప్ప యంగ్ విజయాల్లో మార్పు లేదు. వరుసగా టోర్నీలు ఆమె ఖాతాలో చేరాయి. 2022 ముగిసే సరికి సీనియర్ కెరీర్లో అప్పటికే 11 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలుచుకొని మరో 5 టోర్నీల్లో సె యంగ్ రన్నరప్గా నిలవడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. సూపర్ 2023... చాలామంది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్లతో పోలిస్తే ఆన్ సె యంగ్ ఆట శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ శారీరక కదలికలతోనే ప్రత్యర్థిని బోల్తా కొట్టించే తత్వం ఆమెది. కోర్టులో అన్ని వైపులా పరుగెత్తుతూ సమాధానమిచ్చే శైలికి యంగ్ దూరం. కెరీర్ తొలుతలో దూకుడుగా ఆడుతూ అటాకింగ్ను ఇష్టపడిన ఆమె ఇప్పుడు ఎక్కువ భాగం డిఫెన్స్తోనే పాయింట్లు రాబడుతోంది. అటు వైపు షట్లర్ ఎంత వేగంగా షటిల్ను సంధించినా ప్రశాంతంగా రిటర్న్ ఇవ్వగలదు. దాంతోనే వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఒత్తిడిలోకి నెట్టడం, ఫలితంగా విన్నర్ల ద్వారానే పాయింట్లు రాబట్టగలగడం యంగ్ ఆటతీరులో కనిపిస్తుంది. ఇదే ఆట ఆమెకు 2023లో అద్భుతాలను అందించింది. తిరుగులేని ఆటతో ఒకటి, రెండు కాదు... ఏకంగా 9 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ ఆమె గెలుచుకోగలిగింది. ఇందులో బ్యాడ్మింటన్లో అన్నింటికంటే అత్యున్నత స్థాయి అయిన సూపర్ 1000 టైటిల్స్ మూడు ఉన్నాయి. మరో రెండు టోర్నీల్లో యంగ్ రన్నరప్గా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో ప్లేయర్ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఏకఛత్రాధిపత్యంతో ఈ కొరియా అమ్మాయి ఆటను శాసించింది. విశ్వవిజేతగా... నంబర్వన్గా... ఆన్ సె యంగ్ సత్తా, స్థాయి ఏమిటో ఇతర అగ్రశ్రేణి స్టార్ షట్లర్లతో ముఖాముఖీ సమరాల్లోనే తెలుస్తుంది. పీవీ సింధుపై ఏకపక్ష ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచ బ్యాడ్మింటన్లో రికార్డు స్థాయిలో 214 వారాల పాటు వరల్డ్ నంబర్ ఉన్న తై జు యింగ్, మరీన్, ఒకుహారాలపై విజయాలపరంగా ఆమెదే పైచేయి. 2016 నుంచి ఇటీవలి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించిన తై జుపై 10–3 విజయాల ఆధిక్యం ఉందంటే ఆమె స్థానాన్ని యంగ్ అందుకొని కొత్త తరం ఘనతకు శ్రీకారం చుట్టినట్లే. 2023లో మరో మూడు ప్రత్యేకతలు యంగ్ను వరల్డ్ బ్యాడ్మింటన్లో హాట్ స్టార్ను చేశాయి. డెన్మార్క్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి కొరియా మహిళగా రికార్డులకెక్కింది. హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి ఇక్కడా కొరియా తరఫున తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇన్ని విజయాల తర్వాత సహజంగానే ర్యాంకింగ్స్లో శిఖరానికి చేరడం లాంఛనంగానే మిగిలింది. ఊహించినట్లుగానే ఆగస్టులో వరల్డ్ నంబర్వన్గా నిలిచి ఆపై వరుస టైటిల్స్లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఒలింపిక్స్లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగినా... ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ మాత్రం పతకం కోసం ఆమెను పిలుస్తోంది. యంగ్ ప్రస్తుత ఫామ్ చూస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కొరియా ప్లేయర్ ఇప్పటికే సాధించిన ఘనతలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో చెలరేగుతున్న ఆమె మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
పీవీ సింధు పునరాగమనం
న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్తో పునరాగమనం చేయనుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేసియాలోని షా ఆలమ్లో జరిగే ఈ టోరీ్నలో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను మంగళవారం ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్లో ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొన్నాక సింధు మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో పర్యవేక్షణలో సింధు శిక్షణ తీసుకుంటోంది. భారత మహిళల జట్టు: సింధు, అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ప్రియా దేవి, శ్రుతి మిశ్రా. భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోలా, పృథ్వీ రాయ్. -
ఏపీ సీఎం వైఎస్ జగన్తో పీవీ సింధు.. అరుదైన చిత్రాలు
-
పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్ ఇదే
PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని అడగగా.. సింగిల్ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్లో మరో మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది. అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్ స్టార్.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్ సర్ కేవలం తన మెంటార్, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది. చదవండి: WC T20: గాయాలతో హార్దిక్ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు.. -
అవును... ఆయన వద్దే శిక్షణ సాగుతోంది
హైదరాబాద్: ఈ సీజన్ ఆసాంతం నిరాశపరిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త సీజన్ కోసం కసరత్తు ప్రారంభించింది. భారత దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ చాంపియన్ ప్రకాశ్ పడుకోన్ వద్ద గత ఆగస్టు నుంచి ఆమె శిక్షణ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె నిర్ధారించింది. ‘ప్రకాశ్ సర్ మార్గదర్శనంలో నేను ట్రెయినింగ్ మొదలుపెట్టాను. ఆగస్టులోనే నా శిక్షణ ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే ఆయన నాకు కోచింగ్ గురువు కంటే ఎక్కువ. మెంటార్గా, మంచి గైడ్గా... అంతకుమించి నా నిజమైన శ్రేయోభిలాషిగా ఆయన నా ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారు. నాలోని పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. జపాన్లో ఉండగా కేవలం ఒక ఫోన్కాల్కే ఆయన స్పందించడం... ఇంతలా వ్యక్తిగత శ్రద్ధ కనబరచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సింధు వివరించింది. -
PV Sindhu-Carolina: బాక్సింగ్ కోర్టు కాదు.. బ్యాడ్మింటన్ కోర్టు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 సెమీఫైనల్.. ఒకవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరోవైపు స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్. తొలి సెట్ నుంచే హొరా హోరీ పోటీ. వీరిద్దరూ మధ్య ఫైట్ బాక్సింగ్ కోర్టును తలపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఆఖరికి సింధు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సలు ఏమి జరిగిందో ఓ లూక్కేద్దం. తొలిసెట్ ఓ రణరంగం.. తొలిసెట్లో మొదటి పాయింట్ మారిన్ ఖాతాలో చేరింది. దీంతో మారిన్ అనందానికి హద్దులు లేవు. మారిన్ పాయింట్ సాధించిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. సిందూ కూడా ప్రత్యర్ధికి తగ్గట్టే సంబరాలు జరుపుకుంది. సింధు కూడా పాయింట్ సాధించినా ప్రతీసారి బిగ్గరగా అరిచింది. మొదటి వార్నింగ్.. వీరిద్దరూ సెలబ్రేషన్స్ శృతిమించడంతో మొదటి సెట్లోనే అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరిని దగ్గరకి పిలిచి గట్టిగా అరవద్దూ అంటూ అంపైర్ హెచ్చరించాడు. దీంతో సింధు సైలెంట్ అయినప్పటికీ.. కరోలినాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. తన పంథాను కొనసాగించింది. తొలి సెట్లో ఓటమి.. మొదటి సెట్లో పీవీ సింధు చివరవరకు పోరాడినప్పటికీ కరోలినా ముందు తలవంచకతప్పలేదు. సింధు 18-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండో సెట్లో విజయం.. రెండో సెట్లో సింధు దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. ఈ సెట్ మొదటి నుంచే ప్రత్యర్ధిని సింధు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్ధి పుంజుకున్నప్పటికీ 21-19 తేడాతో సింధు విజయం సాధించింది. మూడో సెట్లో వాగ్వాదం.. నిర్ణయాత్మమైన మూడో సెట్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరోలినా పదే పదే గట్టిగా అరుస్తుండడంతో సింధు అంపైర్కు ఫిర్యాదు చేసింది. మరోసారి కరోలినాకు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ కరోనా తీరు మారలేదు. చివరి గేమ్లో మొదటి నుంచే సింధుపై కరోలినా పై చేయి సాధించింది. మారిన్ 9-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సింధు సిద్ధంగా ఉండటానికి తగినంత సమయం ఇవ్వకుండా మారిన్ గేమ్ను వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా సింధు కోర్టులో ఉన్న షటిల్ను తనవైపు తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో సింధుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో అంపైర్ జోక్యం ఇద్దరికి ఎల్లో కార్డు చూపించాడు. అదే విధంగా మూడో సెట్ ఆఖరిలో షటిల్ను సింధు ముఖంపై కొట్టింది. వెంటనే కరోలినా తన బ్యాట్ను పైకెత్తి సారీ చెప్పినప్పటికీ.. సింధు వైపు మాత్రం చూడలేదు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో అనవసర తప్పిదాలతో గేమ్తోపాటు మ్యాచ్నూ ప్రత్యర్థికి సమర్పించుకుంది. 7-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. క్షమాపణలు చెప్పిన కరోలినా.. ఇక ఈ మ్యాచ్ అనంతరం సింధుకు కరోలినా క్షమాపణలు చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పీవీ సింధు తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. అందులో "మ్యాచ్ ఓడిపోవడం బాధగా ఉంది. అయితే ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. కానీ బ్యాక్-టు-బ్యాక్ సెమీ-ఫైనల్కు క్వాలిఫై కావడం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా ఫిట్నెస్ కూడా మరింత మెరుగుపడింది. ప్రతీ ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఎదుటివారిని ద్వేషించడం సరికాదు " అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు కరోలినా స్పందిస్తూ.. "మ్యాచ్లో మంచి ఫైట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమద్దిరం ఆ గేమ్లో గెలవాలని పోరాడాం. కానీ నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకోలేదు. ఏదైమైనప్పటికీ అందరి ముందు నేను ఈ విధమైన ప్రవర్తన చూపినందుకు క్షమించండి. త్వరలో మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ రిప్లే ఇచ్చింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
తప్పక చదవండి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement