-
Ind Vs Aus: పూర్తిగా అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! నా వల్ల కాదు!
India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపు.. మూడో మ్యాచ్లో కోహ్లి సేన ఘన విజయం.. ఇంకొక్క అడుగు పడితే.. ట్రోఫీ గెలిచే అవకాశం.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 9 వికెట్లతో చెలరేగి కంగారూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాపై భారీ అంచనాలు. సిడ్నీలోనూ సత్తా చాటుతాడని అభిమానుల ఆశలు.. అయితే, పిచ్ మాత్రం పేసర్లకు మరీ అంత అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా కంగారు పడ్డాడు. వెంటనే బౌలింగ్ కోచ్ దగ్గరికి వెళ్లి కాస్త మొహమాటపడుతూనే తన మనసులో మాట బయటపెట్టాడు. అలసిపోయాను సర్.. నా వల్ల కాదు ‘‘సర్.. వికెట్ అనుకున్న విధంగా లేదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు చేయగలిగిందేమీ లేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ బలహీనం అయిపోయాను. ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ. పిచ్ మరీ డల్గా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నన్నేం చేయమంటారు సర్? కాస్త నెమ్మదిగా బౌలింగ్ చేయనా? నాకు ఏది సరైంది అనిపిస్తే అలాగే చేయమంటారా?’’ అని భరత్ అరుణ్ని అడిగాడు. ఎవరేం చెప్పినా ఓపికగా వినే భరత్ అరుణ్.. బుమ్రా మాటలను ఆసాంతం విన్నాడు. అయితే, తనేం చెప్పదలచుకున్నాడో పూర్తిగా అర్థమయ్యాక.. బుమ్రాను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్ చేసేందుకు సమ్మతించాడు. స్పిన్నర్ల విజృంభణ బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. పేసర్ షమీకి రెండు, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కగా.. బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్కు 4 వికెట్లు దక్కాయి. టీమిండియా మాజీ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్ ఈ మేరకు బుమ్రా- భరత్ మధ్య జరిగిన సంభాషణ గురించి తన పుస్తకం.. ‘‘కోచింగ్ బియాండ్’లో ప్రస్తావించాడు. ముందు మ్యాచ్లో అత్యద్భుతంగా ఆడిన బుమ్రా.. మరుసటి మ్యాచ్లో ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యాడో వివరించాడు. సత్తా చాటిన బుమ్రా.. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో.. కాగా నాటి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నుంచి జట్టుకు దూరమైన భారత పేసు గుర్రం బుమ్రా ఇంతవరకు పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులోకి రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు. స్వదేశంలో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు సైతం బుమ్రా దూరం కావడంతో అతడి ఫిట్నెస్పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్లో) ఘనత సాధించాడు. చదవండి: Women T20 WC: 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్కు 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
Virat vs Rohit: రోహిత్, విరాట్ మధ్య గొడవలు నిజమే.. చక్కదిద్దింది అతడే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుత భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తుంటే.. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక చాలా మ్యాచ్ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో అద్భుతవిజయాలను అందించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతంరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పటిలో ఊహాగానాలు వినిపించాయి. డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలగా విడిపోయారని.. రోహిత్ గ్రూప్, విరాట్ గ్రూప్ ఉన్నయాని తెగ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్ మధ్య మనస్పర్థలున్న మాట నిజమేనని శ్రీధర్ సృష్టం చేశాడు. అయితే వీరిద్దరి మధ్య అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కరమైంది అని శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు. "2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం కాస్త గందరగోళం నెలకొంది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ఉన్నాం. అటువంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త మమ్మల్ని మరింత కలవరపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని మాకు తెలిసింది. అదే విధంగా సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లి ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన 10 రోజుల తర్వాత మేమే వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్కి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే రవిశాస్త్రి కోహ్లి, రోహిత్ను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం ఉండాలంటే.. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలని అతడు సూచించాడు. వారిద్దరి ఎంతోగానే రవి నచ్చచెప్పాడు. సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి. మీరిద్దరూ చాలా సీనియర్ క్రికెటర్లు కాబట్టి ఇటువంటి మనస్పర్థలు మీ మధ్య ఉండకూడదు అని రవి చెప్పాడు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించడంలో కృషి చేయండి అని రోహిత్, విరాట్కు శాస్త్రి సలహా ఇచ్చినట్లు శ్రీధర్ తన తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. చదవండి: BBL 2023: చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్గా! -
'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'
శుబ్మన్ గిల్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న గిల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మూడో టి20లో సుడిగాలి శతకంతో అలరించిన గిల్ తాను టి20ల్లో కూడా ఎంత ప్రమాదకారి అనేది చెప్పకనే చెప్పాడు. అతని ప్రదర్శనపై టీమిండియా దిగ్గజాలు సహా కోహ్లి, రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రెండేళ్ల కిందట ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కోహ్లి, గిల్ల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. ''మార్చి 2021లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్లో ఉన్నాం.నరేంద్ర మోదీ స్టేడియంలో అదే మొదటి మ్యాచ్. అదీ కాకుండా భారత్లో జరిగే రెండో డే నైట్ టెస్టు. అప్పటికీ మనకు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం. పింక్ టెస్టు కావడంతో స్టేడియంలో సీట్లకు పింక్ కలర్ వేశారు. కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందికి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. ఒక చైర్కు పింక్ కలర్ వేసి మరో చైర్ను నార్మల్గా వదిలేశారు.ఈ విషయంపై చాలా పెద్ద చర్చే నడిచింది. పింక్ బాల్ టెస్టులో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి ఏ దిశలో వస్తుందో పసికట్టడం చాలా కష్టం. అందుకే ఫీల్డింగ్ సెషన్ సమయంలో విరాట్ కోహ్లీ, నాతో కలిసి క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సెషన్లో దాదాపు 200 క్యాచులను అందుకున్నాడు కోహ్లి. రేపు టెస్టు అనగా ప్రాక్టీస్ సెషన్స్లో అంత కష్టపడడం రిస్క్ అని నేను చెప్పినా వినలేదు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు శుబ్మన్ గిల్ కొద్ది దూరంలో నిలబడి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి క్యాచ్ ప్రాక్టీస్లో పాల్గొనాలనుకున్నాడు. గిల్ అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ నవ్వుతూ అతని వైపు చూసి.. ''నీకు పదేళ్లు ఇస్తా.. తమ్ముడు! ఇందులో సగం క్యాచులైనా నువ్వు పట్టుకో చూద్దాం'' అంటూ నవ్వాడు. విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచులు అలాంటివి. అప్పటికి సెషన్స్ సమయం ముగియడంతో అందరం కలిసి టీమ్ బస్సులో బయలుదేరి పది నిమిషాల్లో హోటల్కి చేరిపోయాం'' అంటూ రాసుకొచ్చాడు. చదవండి: తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్ అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్లపై ప్రాక్టీస్ -
బుమ్రా నువ్వు చీట్ చేశావు.. ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటి..?
లండన్: ఆతిధ్య ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత పేసు గుర్రం బుమ్రా, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ల మధ్య జరిగిన మాటల యుద్ధం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచి, ఆతర్వాత పలు వివాదాలకు కూడా దారి తీసింది. అయితే, వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందన్న విషయాన్ని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా ప్రమాదక వేగంతో బౌలింగ్ చేశాడని, దీంతో బెంబేలెత్తిపోయిన ఆండర్సన్.. బుమ్రా నువ్వు చీటింగ్ చేస్తున్నావు.. ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటని ప్రశ్నించాడని, అక్కడి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైందని అసలు విషయాన్ని రివీల్ చేశాడు. బుమ్రా కెరీర్ ఆరంభం నుంచి 80 నుంచి 85 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశాడని, అయితే ఆ మ్యాచ్లో ఆండర్సన్కు బౌలింగ్ చేసేటప్పుడు బుమ్రా ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులను సంధించడంతో ఆండర్సన్ దడుసుకున్నాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్లో బుమ్రా భీకరమైన వేగంతో సంధించిన బంతుల ధాటికి ఆండర్సన్ పలు మార్లు గాయపడ్డాడు. ఆతర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆండర్సన్ కూడా బుమ్రాను భౌతికంగా టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినప్పటికీ అతని పాచిక పారలేదు. ఫలితంగా షమీ సహకారంతో బుమ్రా 9వ వికెట్కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
ఫీల్డర్ల ఏకాగ్రతకు పరీక్ష.. వైరలవుతున్న కొత్త ఫీల్డింగ్ డ్రిల్
లండన్: టీమిండియా ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్ను ఉంచాడు. How is that for a drill? Fielding coach @coach_rsridhar keeping the boys on their toes. #TeamIndia #ENGvIND @RishabhPant17 • @Wriddhipops • @prasidh43 • @Hanumavihari pic.twitter.com/LjER4lgFV0 — BCCI (@BCCI) August 10, 2021 బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బంతిని విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విటర్లో సంబంధిత వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఐడియా అదుర్స్ అంటున్నారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా లార్డ్స్ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్, బౌలింగ్లో ఆటగాళ్లు చమటోడుస్తున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
Advertisement