-
క్యూలో నిలబడి ఓటు వేసిన ద్రవిడ్.. పవర్ఫుల్ మెసేజ్
టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బెంగళూరులో ఓటు వేశాడు.ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్బూత్కు తరలివచ్చిన ద్రవిడ్.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.‘‘ఇది నా ఓటు. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అవకాశం. కాబట్టి కచ్చితంగా నేను దీనిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పోలీసులు బాగా పనిచేస్తున్నారు.ఈసారి పోలింగ్ విషయంలో బెంగళూరు రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తరలిరావాలి. తమ హక్కును ఉపయోగించుకోవాలి. పౌరులను అప్రమత్తం చేయడంలో మీడియా కూడా ఇంకాస్త చొరవ తీసుకోవాలి’’ అని ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు.కాగా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే రాహుల్ ద్రవిడ్కు ప్రస్తుతం విరామం దొరికింది. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆటగాళ్లంతా క్యాష్ రిచ్ లీగ్లో భాగమైన వేళ.. ద్రవిడ్ కుటుంబానికి సమయం కేటాయించాడు.అయితే, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, మే 1 లోగా జట్ల వివరాలను సమర్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి గడువు విధించిన వేళ టీమిండియా ఎంపిక గురించి రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెలక్టర్తో భేటీ అయినట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్కాస్ట్లో మైకేల్ వాన్, ఆడం గిల్క్రిస్ట్లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్లో కోహ్లి తను రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్ను ఫైనల్కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్గా ఉన్నాడా? లేడా? ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్కు తోడు అదనపు సీమర్గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్టింగ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement