-
నా పెళ్లిలో బాలీవుడ్ స్టార్స్ డ్యాన్స్.. అంతా ఆయనవల్లే!
బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. అందరూ సంతోషంగా స్టెప్పులేస్తుంటే.. చూడటానికి భలే ఉంటుంది కదూ! అంతా ఒకే కుటుంబంగా అనిపిస్తుంది. ఈ మధ్య అంబానీ ఇంట జరిగిన సెలబ్రేషన్స్లో బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. అయితే అప్పట్లోనే స్టార్ సెలబ్రిటీలు తన పెళ్లిలో సందడి చేశారంటోంది హీరో రణ్బీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్.స్టార్స్ డ్యాన్స్బాలీవుడ్ స్టార్ రిషి కపూర్- నీతూ కపూర్ల కూతురు రిద్ధిమా కపూర్ వివాహం 2006లో జరిగింది. ఈ పెళ్లిలో శ్రీదేవి నుంచి షారుక్ ఖాన్ వరకు అందరూ సందడి చేశారు. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది రిద్ధిమా. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవిగారు, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా అందరూ నా సంగీత్లో డ్యాన్స్ చేశారు. ఇదంతా నాన్న వల్లే సాధ్యమైంది.ఆయన వల్లే సాధ్యంఆయన ప్రేమ, సంకల్పం వల్లే ఆ వేడుక అంత ఘనంగా జరిగింది. వాళ్లంతట వాళ్లే ఇష్టంగా, మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేశారు. అదంతా ఎంతో సరదాగా జరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఆ ఫంక్షన్ను ఎంజాయ్ చేశారు. తమ ఇంటి పండుగ.. కాదు కాదు.. తమ కుటుంబంలోని షాదీలా ఫీలయ్యారు అంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కాగా రిద్ధిమా- భరత్ పెళ్లి చేసుకుని 18 ఏళ్లవుతోంది. వీరికి సమర అనే కూతురు పుట్టింది. ఫాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో త్వరలోనే నటనా రంగంలోకి ప్రవేశించనుంది. -
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్కపూర్ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్కపూర్తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్కపూర్తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్కపూర్ ప్రాణ్ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్సింగ్ వేషం వేసిన అంజాద్ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్ఖాన్ బ్లేమ్ గేమ్లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్పై ట్రోలింగ్
బాలీవుడ్ యంగ్ హీరో రణ్బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషి కపూర్ మరణించి రెండేళ్లు కావొస్తుంది. సుమారు రెండేళ్లు క్యాన్సర్తో పోరాడిన ఆయన 2020 ఏప్రిల్లో చనిపోయారు. అయితే తన భర్త మరణం తర్వాత ఇన్స్టాగ్రామ్లో తనను ట్రోల్ చేస్తున్నారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఇక లేరన్న బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అయితే భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్ట్లు పెట్టడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ట్రోలర్స్కు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది నీతూ కపూర్. ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న నీతూ మాట్లాడుతూ 'నేను ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. నేను నా ఫాలోవర్స్ను ప్రేమిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారిని బ్లాక్ చేస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారు. నేను ఏడుస్తూ, బాధపడుతూ, విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్నవారిని నేను బ్లాక్ చేస్తాను. నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటాను.' అని తెలిపారు. ఇంకా 'ఇలా ఉండటం వల్ల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరు ఏడుస్తూ, మరికొందరూ నవ్వుతూ బాధ నుంచి కోలుకుంటారు. నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో, నా పిల్లలతో జీవితాంతం ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చి సగం సమయం అతని గురించే మాట్లాడుతున్నాం. రణ్బీర్ ఇప్పటికీ తన మొబైల్ స్క్రీన్సేవర్లో అతని ఫొటోనే ఉంది. అంటే మేము అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. కానీ మేము అతన్ని మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు. మేము అతన్ని మిస్ అవడాన్ని కూడా సంతోషంగా భావిస్తాం. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం' అని పేర్కొన్నారు నీతూ కపూర్. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శర్మాజీ నమ్కీన్... ఓ రిటైరైన నాన్న కథ
‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా. ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్బన్’లోని క్లయిమాక్స్ను ఫోన్లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్బన్లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది. కథ ఏమిటి? ఢిల్లీలో మిడిల్క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు. 58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్. వారి మనసులో ఏముంది? ‘శర్మాజీ నమ్కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్గా నిలుస్తారు. అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు. రిషి చివరి సినిమా రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది. తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్లో మార్చి 31న విడుదలైంది. చూడండి. -
సహజీవనం చేస్తా.. కానీ పెళ్లి చేసుకోను.. వైరల్ అవుతున్న రిషి కపూర్ పాత ఇంటర్వ్యూ
Neetu Kapoor and Rishi Kapoor Throwback: బాలీవుడ్ యంగ్ హీరో రణ్బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషీ కపూర్ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లు క్యాన్సర్తో పోరాడిన ఆ నటుడు 2020 ఏప్రిల్లో చనిపోయాడు. అయితే గతంలో కరణ్ జోహర్ హోస్ట్గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో తన భార్య నీతూ కపూర్తో ప్రేమ, పెళ్లి జీవితం గురించి మాట్లాడాడు. ఆ ఇంటర్వూ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. మీ ప్రేమ బంధం గురించి చెప్పమని షోలో కరణ్ రిషికపూర్ణి అడడగా ఆయన అందరూ షాక్ అయ్యే బదులు ఇచ్చాడు. ‘మా కెరీర్ ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. చాలా సమయం గడిపేవాళ్లం. అనంతరం డేటింగ్ చేశాం. కానీ నీతో సహజీవనం చేస్తాను. కానీ పెళ్లి చేసుకోను’ అని భార్య నీతూతో చెప్పినట్లు నటుడు తెలిపాడు. ఆయన చాలా టఫ్ వ్యక్తినని, ఆయన ఇచ్చిన షాక్లను ఆమె తట్టుకొని నిలబడం వల్లే వారు ఇంకా కలిసి ఉండగలిగారని చెప్పాడు. అయితే ఈ విషయం గురించి మాట్లాడిన నీతూ..‘ రిషి చాలా మంచి భర్త. మంచి తండ్రి. కాబట్టి ఏమి జరిగినా ఆయనతో ఉండాలని నిర్ణయించుకన్నట్లు’ తెలపింది. అయితే 5ఏళ్లు సహజీవనం చేసిన అనంతరం వారిద్దరూ వివాహం చేసుకోగా, కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని, కొడుకు రణ్బీర్ కపూర్ పుట్టారు. రణ్బీర్ సైతం మంచి సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్గా ఎదిగాడు. చదవండి: ‘రణ్బీర్ నా దుస్తులను తన గర్ల్ప్రెండ్స్కు గిఫ్ట్గా ఇచ్చేవాడు’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement