-
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్లో ఓ నటి హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..హెల్మెట్ లేకుండా..కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్ అనే వ్యక్తి ఈ సీన్ను లైట్ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్ డైరెక్టర్పై, సదరు ఛానల్పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బండి యజమానికి సైతం ఫైన్దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్లో షూట్ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.చదవండి: భర్త కోసం స్పెషల్ పోస్ట్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా? -
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. నటుడిపై దాడితిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్లో ఓ మహిళ కూడా ఉంది.న్యాయం కావాలితనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.నిందితుడు అరెస్ట్చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra) -
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్న్యూస్ చెప్పిన సీరియల్ జంట -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్!
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు కోలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్స్టార్ శివరాజ్ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ పడకి దర్శకత్వంలో కేఆర్జీ స్టూడియోస్ పతాకంపై కార్తీక్గౌడ, యోగి జి రాజ్ కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్ జీవి ప్రకాష్కుమార్తో కలిసి నటించిన డియర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి: -
పెళ్లై రెండేళ్లు.. పిల్లలు పుట్టాలంటే ముందు ఆ కండీషన్!
పెళ్లైన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏమైనా విశేషం ఉందా? అని! ఒకప్పుడు డజను కొద్దీ పిల్లల్నీ కనేవారు.. కానీ ఇప్పుడు సంతానం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్నటివరకు ఇద్దరు ముద్దు అనుకునేవారు కూడా ఒక్కరు చాలని భావిస్తున్నారు. మరికొందరైతే లైఫ్లో సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తామంటున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం ఓ కండీషన్ పెట్టుకుని మరీ ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నారట! కండీషన్ కన్నడ బుల్లితెర జంట లావణ్య- శశి హెగ్డే కన్నడ సీరియల్స్ ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయగా ఇద్దరూ రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే అందరి జంటలకూ మాదిరే ఈ జంటకు కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి లావణ్య బదులిస్తూ.. 'నేను, నా భర్త ఇప్పటివరకు హనీమూన్కు వెళ్లనేలేదు. రెండుసార్లు ప్లాన్ చేసుకుని వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. బ్రో అని పిలిచి.. హనీమూన్కు వెళ్లాకే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్త కండీషన్ పెట్టాడు. అలాగే నేనూ ఓ కండీషన్ పెట్టాను. నన్ను హనీమూన్కు మనాలీయో లేదంటే విదేశాలకో తీసుకెళ్లిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేద్దామన్నాను. జూన్లో హనీమూన్కు వెళ్లబోతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా రాజారాణి సీరియల్ సెట్స్లో వీరి పరిచయం బలపడింది. ఈ సీరియల్లో లావణ్య.. శశిని బ్రో అని పిలిచేది. తర్వాత అతడే భర్త అవడం విశేషం! చదవండి: చెల్లితో హీరోయిన్ రీల్.. నెట్టింట ట్రోలింగ్ -
హీరోయిన్తో సీక్రెట్ పెళ్లి?
తమిళ నటుడు దర్శన్ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ వార్త వైరల్గా మారింది. ఇగ్లూ హీరోయిన్ అంజు కురియన్తో దర్శన్ పెళ్లిపీటలపై కూర్చున్నాడు. కొందరు నిజంగానే వారికి పెళ్లయిపోయిందని భావిస్తున్నారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా యాడ్లో భాగంగానే ఈ పెళ్లి జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలో భాగంగా వీరిద్దరూ పెళ్లి గెటప్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ రూమర్స్ గురించి అటు దర్శన్, ఇటు అను ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. కాగా దర్శన్.. కనా అనే క్రికెట్ మూవీలో కీలక పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు. తునివు (తెగింపు), అయలాన్ చిత్రాల్లోనూ మెరిశాడు. అను కురియన్ విషయానికి వస్తే.. నేరం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఓజ్లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ -
'పిల్లలను కనాలని లేదు.. ఎందుకంటే?'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ కన్నడ నటి, హీరోయిన్ హితా చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం శాండల్వుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటుడు సిహి కహీ చంద్రు కుమార్తె అయిన ముద్దుగుమ్మ 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ శ్రీనివాస్ను పెళ్లాడింది. పెళ్లయి ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావొస్తున్నప్పటికీ పిల్లలు లేరు. అయితే బంధుమిత్రుల నుంచి మనవడిని ఎప్పుడు ఇస్తావ్? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షోలో పాల్గొన్న హిత చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హితా మాట్లాడుతూ.. "ఫస్ట్ నాకు పిల్లలను కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించారు. మాకు పిల్లలు ఎందుకు కావాలి? నాకు అందరిలా పిల్లలు కనాలని ఏం అనిపించడం లేదు. ప్రస్తుతం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూస్తున్నాయో నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఇంకో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అన్నది నా ఆలోచన. కిరణ్కి కూడా అలాగే అనిపించింది" అని చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ..'మాతృత్వాన్ని ఆస్వాదించాలంచే మనమే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్కపిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు. మనకు వృద్ధాపం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో ఎవరు చూసుకుంటారని చాలా మంది అంటుంటారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధ లేదు" అని తెలిపింది. అంతే కాకుండా ఈరోజు ఎంత మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు? అని హితా ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో కొడుకు, కూతుళ్లు అమెరికాలో ఉంచే వారి తల్లితండ్రులు ఎక్కడో ఒకచోట ఉంటున్నారు. కేవలం ఆ ఇద్దరు దంపతులు మాత్రమే కలిసి ఉంటున్నారు.. అలాంటప్పుడు పిల్లలు ఉన్నా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతుందని హిత అన్నారు. ఇక్కడ పిల్లలను కనొద్దని నేను చెప్పట్లేదు.. కానీ ఇది నా నిర్ణయం అని మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. హితా చంద్రశేఖర్ శాండల్వుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Hitha Chandrashekar K (@thehithaceee) -
సడన్గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వినయ్ రాజ్కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. -
ఒకప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఐఏఎస్గా..
సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం.. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సినిమాలు వదిలేసి రోడ్డునపడ్డవాళ్లమూ చూశాం.. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయసులో సినిమాలు చేసింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఏఎస్ సాధించింది. బాలనటిగా బోలెడు సినిమాలు.. ఆవిడే హెచ్ఎస్ కీర్తన.. బాల్యంలో నటనతో అందరినీ కట్టిపడేసింది. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిపైనా తళుక్కుమని మెరిసింది. కన్నడలో సీరియల్స్తో పాటు సినిమాలు చేసింది. కర్పూరద గోంబే, గంగ-యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, ఎ, కనూర్ హెగ్గడటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగె, లేడీ కమిషనర్, హబ్బ, డోరె, సింహాద్రి, జనని, చిగురు, పుతని ఏజెంట్.. ఇలా పలు చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. ఆరో ప్రయత్నంలో.. రానురానూ తనకు చదువుపై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశంలోనే అతి క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసారి(2020లో) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆలిండియా లెవల్లో 167వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్ అయింది. రెండేళ్లు ఆ పని చేశాక ఐఏఎస్ అయితే దీనికంటే ముందు 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్(KAS) కూడా రాసింది. ఈ పరీక్షలో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా సేవలందించింది. ఆ తర్వాత ఐఏఎస్ జాబ్ కొట్టింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యామని చతికిలపడేవారికి కీర్తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! చదవండి: చులకన, వేధింపులు.. చాలా ఏళ్లు బాధపడ్డా.. ఇకపై అస్సలు ఊరుకోను! -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
స్టార్ హీరో ట్వీట్కు సచిన్ రిప్లై.. అదేంటో తెలుసా!
కన్నడ స్టార్ సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్తో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా ఆస్క్ కిచ్చా అనే సెషన్లో పాల్గొన్నారు. ఈ సెషన్కు హాజరైన పలువురు నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు. అయితే ఈ ట్వీట్ చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ట్వీట్కు కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. This pic is just looking like a wowwwwwwwww... 😁 One fond memory my friend . https://t.co/y4C1a0LkPi — Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024 It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM — Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024 Woaaa!!! ♥️♥️.. Didn't expect this ... You jus gifted me another memorable moment... Mch luv and wshs always @sachin_rt sir. https://t.co/tWXaV8Givs — Kichcha Sudeepa (@KicchaSudeep) February 2, 2024 -
నేను రామభక్తుడిని.. అయోధ్యలోనే నా పెళ్లి..: నటుడు
పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపేందుకు జనాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొందరైతే తమ స్థోమతకు మించి అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. సామాన్య జనాలే ఇలా ఉంటే సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. హల్దీ దగ్గరి నుంచి రిసెప్షన్ వరకు అంతా ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు తమ స్వస్థలాలలో కాకుండా ఏదైనా ప్యాలెస్లోనో లేదంటే వేరే దేశంలోనో వివాహం చేసుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించడానికి కూడా వెనుకాడటంలేదు. రామభక్తుడిని.. అందుకే.. అయితే కన్నడ నటుడు రామ గౌడ మాత్రం అక్కడో, ఇక్కడో ఎందుకు అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నటుడు రామ గౌడకు ఐశ్వర్య అనే అమ్మాయితో సోమవారం (జనవరి 22న) నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ మధ్యే అయోధలో రామమందిరం ప్రారంభం కావడంతో ఆ ప్రదేశంలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అరుణ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. 'నేను రామభక్తుడిని. అందుకే అయోధ్యలో ఆ రాములవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. యాక్టింగ్తో పాటు బిజినెస్ మేమిద్దరం పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కెరీర్లో స్థిరపడ్డాకే జీవితంలో ముందడుగు వేయాలనుకున్నాం. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తున్నాం. ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధపడటంతో మా కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య చాలా నిజాయితీగా ఉంటుంది. ఎంతో అర్థం చేసుకుంటుంది. నాకంటూ ఓ రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది. అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఆరు నెలల్లో దర్శకుడిగా ఓ సినిమా తీయబోతున్నాను. దాని తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో మేము అయోధ్యలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు. చదవండి: బామ్మ మరణంతో బాధలో కూరుకుపోయా.. అర్థం చేసుకుని.. మిల్కీబ్యూటీ ఇలా మారిపోయిందేంటి? ఇదంతా దాని కోసమేనా? -
హీరో భార్యకు ఇచ్చిపడేసిన హీరోయిన్.. మాది పవిత్ర బంధమంటూ..
కన్నడ స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా దర్శన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ ఒక చేట చేర్చి దాన్ని వీడియోగా ఇన్స్టాగ్రామ్లో వదిలింది. పదేళ్ల రిలేషన్.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని రాసుకొచ్చింది. ఇంకేముంది.. దర్శన్ భార్య విజయలక్ష్మికి ఒళ్లు మండిపోయింది. తన భర్తతో కనిపించొద్దని సెట్కు వెళ్లి మరీ హీరోయిన్ పవిత్రకు వార్నింగ్ ఇచ్చిందని, అవసరమైతే కేసు కూడా పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఖుషి దర్శన్ కూతురు కాదు దీనిపై పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ షేర్ చేసింది. 'నా పేరు పవిత్ర గౌడ. గతంలో నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లాడాను. మా ఇద్దరికీ కలిగిన సంతానమే ఖుషి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సంజయ్కు విడాకులిచ్చాను. నేను ఎప్పుడూ ఎక్కడా ఖుషి.. దర్శన్ కూతురని చెప్పలేదు. అయితే దర్శన్, నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ మా మధ్య ప్రేమ, కేరింగ్ మాత్రం అలాగే ఉన్నాయి. మా రిలేషన్ను తను అంగీకరించింది ఇంకా చెప్పాలంటే దర్శన్ భార్య విజయలక్ష్మికి మా గురించి అంతా తెలుసు. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. అలాగే నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. అవమానిస్తున్నారు విజయలక్ష్మి నా గురించి చెడుగా పోస్టులు పెడుతుంటే బాధేస్తోంది. చాలామంది నన్ను, నా కూతురు ఖుషిని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను' అని వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వివాదంపై దర్శన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.. -
అమ్మను బతికించుకుందామనుకున్నా.. ఆస్పత్రికి తెలిసి తెల్లారేసరికి..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి క్రేజ్ తెచ్చుకుంది నటి లతాశ్రీ. ఈమె అసలు పేరు పద్మలత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మొదట శ్రీలతగా, తర్వాత లతా శ్రీగా మార్చుకుంది. తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్గా చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఈమెకు నాగశౌర్య మేనల్లుడు అవుతాడు. తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అందరిముందే తిట్టాడు లతా శ్రీ మాట్లాడుతూ.. 'హీరోయిన్గా తెలుగులో నా తొలి సినిమా మన్మథ సామ్రాజ్యం. కన్నడలో హీరోయిన్గా ఎక్కువ అవకాశాలు వచ్చేవి. కానీ అమ్మ తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. అలా ఇక్కడ మొదట్లో హీరోయిన్గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. కానీ ఎన్నడూ నా పాత్రలకు నేను డబ్బింగ్ చెప్పలేదు. మలయాళంలో మమ్ముట్టితో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే సెట్స్లో డైరెక్టర్ నా నటనకు వంకలు పెట్టాడు. అందరిముందే తిట్టడంతో ఏడ్చేశాను. నన్ను ఇబ్బందిపెట్టడంతో సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ మలయాళ సినిమాల జోలికి పోలేదు. జిమ్ ట్రైనర్తో ప్రేమ, పెళ్లి ఆ రోజుల్లో ఉదయం పూట ఏరోబిక్స్కు వెళ్లేదాన్ని. అక్కడ ఉండే జిమ్ ట్రైనర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఏడాదిపాటు ప్రేమించుకున్నాం. ఆ సమయంలో సినిమా ఛాన్సులు రిజెక్ట్ చేశాను. అమ్మకు అసలు విషయం లీకవడంతో కోపంతో ఒక్కటిచ్చింది. ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. వాళ్ల నాన్న డిప్యూటీ కలెక్టర్. బాగా చదువుకున్న కుటుంబం. కానీ అమ్మకు ఇష్టం లేక నన్ను ఢిల్లీ పంపించేసింది. చివరకు ఎలాగోలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. పెళ్లయ్యాక కూడా తను మాతోనే ఉంది. ఓరోజు విజయవాడ వెళ్లిన అమ్మకు అక్కడ గుండెపోటు వచ్చింది. అప్పుడు అమ్మ వెంట అన్నయ్య, నేను ఎవరమూ లేము. అమ్మ కోలుకున్నా ఐసీయూలోనే.. ఛాతీలో నొప్పిగా ఉన్నా అదే తగ్గిపోతుందని ఊరుకుంది. రాత్రంతా ఆ నొప్పి భరించింది. తెల్లవారినా నొప్పి తగ్గకపోవడంతో అన్నయ్యకు ఫోన్ చేసింది. అప్పుడు అన్నయ్య వెంటనే తనను ఆస్పత్రిలో చేర్పించాడు. అమ్మను ఐసీయూలో చేర్చారు. విషయం తెలియగానే నేను షిరిడీ నుంచి విజయవాడ వెళ్లిపోయాను. అమ్మ నన్ను చూడగానే కోలుకుంది. మామూలు మనిషైపోయింది. బాగానే మాట్లాడింది. అయినా సరే ఆస్పత్రి వైద్యులు డబ్బుల కోసం తనను ఐసీయూలోనే ఉంచారు. మాట్లాడటానికి వీల్లేకుండా నోట్లో పైప్ పెట్టారు. ఓరోజు సడన్గా కోమాలోకి వెళ్లిపోయిందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. కానీ రెండు రోజుల్లో మళ్లీ కోలుకుంది. ఆస్పత్రి వాచ్మెన్ మాటలతో షాక్ 18 రోజులపాటు తనను ఐసీయూలో నుంచి బయటకు రానివ్వలేదు. హైదరాబాద్కు తీసుకెళ్తామన్నా ఒప్పుకోలేదు. ఒకరోజు ఆ ఆస్పత్రి వాచ్మెన్.. 'చూస్తే చదువుకున్నవాళ్లలా ఉన్నారు. ఈ ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ డబ్బులు గుంజుతారు, కానీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వరు. బతికుండగానే చంపేస్తారు' అని చెప్పాడు. భయంతో ఆ ప్రాంతంలో ఉండే నటి జయలలితకు ఫోన్ చేశాను. ఆమె సాయంతో ఆ ఆస్పత్రి నుంచి వేరే హాస్పిటల్కు మార్చడానికి సిద్ధమయ్యాము. షిఫ్ట్ చేద్దామనుకునేలోపు చంపేశారు అయితే దీన్ని సీక్రెట్గా ఉంచమన్నారు. కానీ ఇంతలో ఈ విషయం అమ్మ ఉన్న ఆస్పత్రి మేనేజ్మెంట్కు తెలిసింది. వేరే హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నారా? అని అడిగారు. లేదని అబద్ధం చెప్పాను. ఆ మరుసటిరోజే అమ్మ చనిపోయింది. ఆస్పత్రి వైద్యులే తనను బతికుండగానే చంపేశారు. ఆమె చనిపోయాక ఏడాదిన్నరపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. డబ్బులకోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం చాలా దారుణం' అని ఎమోషనలైంది లతా శ్రీ. చదవండి: నా తల్లి ముందే అలాంటి బూతులు విన్నాను.. ఆపై తేజూను తీసుకెళ్తామంటూ..: అమర్ -
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
పాఠశాలను దత్తత తీసుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి
-
యష్ టాక్సిక్ మూవీ స్టోరీలో బిగ్ ట్విస్ట్..!
-
'కరావళి' ప్రోమో అదిరిపోయిందంతే!
డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ అనే కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గాణిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిలింస్ బ్యానర్తో కలిసి గురుదత్త గాణిగ ఫిలిం బ్యానర్ మీద గురుదత్త గాణిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబళ పోటీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని లుక్లో కనిపించారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే. ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా అదే రేంజులో ఉన్నాయి. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గాణిగ తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ప్రియాంకకు సపోర్ట్ చేయను.. గీతూ ప్రశ్నలకు సమాధానాలు దాటేసిన శోభ -
లేటు వయసులో పెళ్లి చేసుకున్న దండుపాళ్యం హీరోయిన్
హీరోయిన్ పూజా గాంధీ లేటు వయసులో పెళ్లి చేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఓ ఇంటికి కోడలిగా వెళుతోంది. దండుపాళ్యం సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ బ్యూటీ బిజినెస్మెన్ విజయ్ ఘోర్పడేను పెళ్లాడింది. బుధవారం(నవంబర్ 29) నాడు బెంగళూరులో వీరి వివాహం జరిగింది. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా వీరి పెళ్లి తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా పూజా గాంధీ.. ఖత్రోన్ కె ఖిలాడీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. బెంగాలీ, తమిళ భాషల్లోనూ నటించినా కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు పొందింది. ముక్కంటి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తగ్గేదేలే సినిమాలోనూ నటించింది. కన్నడ దండుపాళ్యం సినిమా తెలుగులో డబ్ అవగా ఈ మూవీ హీరోయిన్కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. కాగా పూజాకు 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత విజయ్ను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది పూజా గాంధీ. చదవండి: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీకి.. వాళ్లే శాశ్వతంగా దూరమయ్యారంటూ నరేశ్ ఎమోషనల్ -
ఓటీటీలు అలా చేయడం మంచిది కాదు: రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్
కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్ పీకాక్(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 -
'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో సుమారు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
కాంతార2 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..
-
ప్రశ్నలతో తరచూ వివాదాల్లోకి! చేతన్ అహింస బ్యాక్గ్రౌండ్!
ముక్కుసూటిగా మాట్లాడే వైఖరి.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ధైర్యం.. నటుడు చేతన్ కుమార్ సొంతం. కానీ దీనివల్ల ఎన్నో సార్లు విమర్శలు, వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. అయినా వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. భారత క్రికెట్ జట్టులో రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో చేతన్ కుమార్ అలియాస్ చేతన్ అహింస ఎవరనేది ఓసారి చూద్దాం.. అమెరికా నుంచి వచ్చి.. చేతన్ కుమార్ 1983 ఫిబ్రవరి 24న అమెరికాలో జన్మించాడు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వీరు కర్ణాటక నుంచి వలస వెళ్లినవారే! 2005లో యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చేతన్ అక్కడ చదువుకునే సమయంలో కుల, మత, లింగ బేధాల గురించి అధ్యయనం చేశాడు. ఫుల్బ్రైట్ స్కాలర్ అందుకున్న ఇతడు ఈ ప్రాజెక్ట్పై మరింత అధ్యయనం చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక సమాజంలో జరుగుతున్న సమస్యలు తనను నిద్ర పోనీయకుండా చేశాయి. ఆ రెండే ఇష్టం చేతన్కు రెండే రెండు ఇష్టం.. ఒకటి నటన, రెండు సామాజిక సేవ. 2005లోనే చికాగో వదిలేసి పూర్తిగా ఇండియాకు షిఫ్ట్ అయిన ఇతడు తన కలలను సాకారం చేసుకున్నాడు. ముందుగా మైసూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న ముల్లూరు అనే గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. తర్వాత విస్తారా అనే థియేటర్ గ్రూపులో చేరి నటుడిగా మారాడు. ఇక తన ప్రాజెక్టు కోసం కర్ణాటక అంతా తిరుగుతున్న సమయంలో డైరెక్టర్ కేఎమ్ చైతన్యను కలిశాడు. అతడు చేతన్ను హీరోగా పెట్టి ఆ దినగాలు అనే కన్నడ సినిమా చేశాడు. ఇది అగ్ని శ్రీధర్ అనే అండర్ వరల్డ్ డాన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 2007లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. అలా అహింస తోడైంది తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఇతడికి హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఎనిమిది సినిమాలు చేశాక చేతన్ కుమార్ తన పేరు పక్కన అహింస అనే పదాన్ని జోడించాడు. సామాజిక కార్యకర్తగా తన ఆశయాన్ని, లక్ష్యాన్ని తన పేరులో ఇనుమడింపజేసేందుకు చేతన్ కుమార్ అహింసగా మారాడు. లింగాయత్, ఎల్జీబీటీక్యూఐ, దళితులు, ఆదివాసీలు, రైతులు.. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటినుంచో ముందుండి పోరాడుతున్నాడు. తను నమ్మే సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. గర్భిణీల వెంట్రుకలు తినాలట.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు దేనిపైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ చేతన్ మాత్రం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్తాడు. 2017లో అజ్జలు పద్ధతి అనే సాంప్రదాయాన్ని బహష్కరించేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ సాంప్రదాయం ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన గర్భిణీల వెంట్రుకలు, గోళ్లను తక్కువ వర్గానికి చెందినవారు తినాలి. దీన్ని రూపుమాపాలంటూ చేతన్ చేసిన పోరాటం ప్రభుత్వాన్నే కదిలించింది. ఆ సాంప్రదాయన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఎన్నో పోరాటాలు చేశాడు. ఓసారి ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. పలుమార్లు అసందర్భ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలు కూడా అయ్యాడు. పెళ్లిలో అదే స్పెషల్ చేతన్ 2020 ఫిబ్రవరి 2న మేఘ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా అనాథాశ్రమంలో జరిగింది. పెళ్లి పత్రికలు కూడా విభిన్నంగా రూపొందించారు. వాటిని మట్టిలో పాతిపెట్టితే మొలకలు వచ్చేలా వెడ్డింగ్ కార్డ్లో విత్తనాన్ని పొందుపరిచారు. ట్రాన్స్జెండర్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం విశేషం. చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
వరల్డ్కప్లో భారత్ ఓటమి.. నటుడి సంచలన వ్యాఖ్యలు
కోట్లాది మంది కల ఒక్కసారిగా బుగ్గిపాలైంది. గెలుపును మాత్రమే కలగన్నవారికి ఒక్కసారిగా భంగపాటు ఎదురైంది. అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్పు ఎగరేసుకుపోయింది. టీమిండియా ఓటమితో యావత్ భారత్ ఉద్వేగానికి లోనైంది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్ అభిమానులు కలత చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ చెప్తున్నా.. క్రికెట్ క్రీడలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. ఆ రిజర్వేషన్స్ ఈపాటికే అమలై ఉంటే భారత్ వరల్డ్ కప్ సులువుగా గెలిచేది' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అందరూ బాధలో ఉంటే నీ గోల ఏంటి?', 'ఇక్కడ కూడా రిజర్వేషన్లా?', 'పెద్ద సైకోలా ఉన్నావే?' అని ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. 'ఈ రోజు క్రికెటర్లు బంతి క్యాచ్ చేస్తారు, లేదంటే విసురుతారు.. దాన్ని బ్యాట్తో కొడతారు.. అంతే తప్ప దేశ నిర్మాణం కోసం ఇసుమంత సాయం కూడా చేయరు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ అని ఓ దళిత క్రికెటర్ సామాజిక కార్యకర్తగా చురుకుగా పనిచేశాడు. డబ్బు, ఫేమ్ కోసం పాటుపడే వాళ్లు కాకుండా ఇతడిలా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లే దేశానికి అవసరం' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. I repeat, India needs reservations in cricket If India had cricket reservations, India would’ve easily won this #WorldCup ನಾನು ಮತ್ತೆ ಹೇಳುತಿದ್ದೇನೆ, ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಅಗತ್ಯವಿದೆ ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಇದ್ದಿದ್ದರೆ ಭಾರತ ಸುಲಭವಾಗಿ ಈ ವಿಶ್ವ ಕಪ್ಪನ್ನು ಗೆಲ್ಲುತ್ತಿತ್ತು — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 Indian cricketers today can throw/catch/hit a ball but dont contribute much to nation-building 100+ yrs ago, Palwankar Baloo—Dharwad-born bowler & India’s 1st Dalit cricketer—was an activist & acquaintance of Babasaheb India needs cricketrs who care fr society—not money & glory pic.twitter.com/L0Rs08LzxU — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 చదవండి: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement