-
పిడుగులున్నారు... హై‘టేక్ కేర్’..!
సోషల్ మీడియాలో తిరుగుతోన్న ఓ జోక్ చూడండి. ఏడేళ్ల పిల్లాడు ఫొటో దిగడానికి వాళ్ల నాన్నతో కలిసి స్టూడియోకి వెళ్లాడు. పిల్లాడు కుదురుగా కూచుంటాడో లేదోనని కంగారు పడుతున్న వాళ్ల నాన్నని చూసి ఫొటోగ్రాఫర్ ‘‘మై హు“ నా.. ’’ అన్నట్టు కళ్లతో సైగ చేస్తూ.. చిరునవ్వుతో పిల్లాడితో ఇలా అన్నాడు.‘‘ఇటు చూడమ్మా.. కెమెరానే చూడాలి.. ఫ్లాష్ వస్తుంది.. కళ్లు మూయకూడదు. ఇలా అలా కదలకూడదు. చూడు కెమెరాలోంచి పిట్టలొస్తాయి....’’ తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ ఏడేళ్ల్ల పిల్లాడి జవాబు ఇది.. ‘‘ఏం కతలు పడుతున్నావా.. సరిగా ఫోకస్ చెయ్యి..పోట్రెయిట్ మోడ్ యూస్ చెయ్యి. ఐఎస్ఓ 200 కంటే తక్కువ పెట్టు. హై రెజల్యూషన్ పిక్ కావాలి. ఫేస్బుక్ ప్రొఫైల్ కోసం. ముచ్చట్లాపి సరిగ్గా తియ్యి.. పిచ్చుకలెలా వస్తాయి కెమెరాలోంచి ఏం మీ అయ్యగూడు పెట్టిండా కెమెరాలోపల...’’– ఫొటోగ్రాఫర్ ఫేస్ ఫీలింగ్స్... పిల్లాడి నాన్న కళ్లలో భయం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా... పిల్లలు పిడుగులవుతున్నారు.. నిన్నటి చందమామ కథలు ఇకవారి దగ్గర నడవవు.సమస్త ప్రపంచం, టెక్నాలజీ వారి చేతిలోకి వచ్చింది.ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మామూలే.. ఓ చిన్నారి.. ఏవో చిన్నచిన్న వస్తువులతో రోబో వంటి ఆకృతిని తయారు చేసింది. సముద్రాలెన్ని, ఖండాలెన్ని, వాటి పేర్లేమిటన్న పాఠాలనూ అప్పజెప్తోంది. మరో చిన్నారి ఉన్నట్టుండి చక్కగా బొమ్మలు వేయడం మొదలుపెట్టేసింది. ఇంకో చిన్నారి పేపర్ను మడిచి విభిన్న ఆకృతులను (ఒరిగామి) తయారు చేస్తోంది. ఇవేవీ బడిలో చెప్పినవి కాదు. తల్లిదండ్రులు నేర్పినవీ కాదు.. మరెక్కడివి? యూట్యూబ్లో ఎడ్యుకేషన్ వీడియోలు చూశారు. తామూ సొంతంగా ఏదో చేయాలనుకున్నారు. అంతే.. ఇలాంటి చిన్నారులెందరో ‘టెక్నాలజీ’ గురువుకు ఏకలవ్య శిష్యులు. రోజూ మూడు గంటలు సోషల్ మీడియాలో... గత ఏడాది మన దేశంలో పిల్లల సోషల్ మీడియా అలవాట్లపై సర్వే జరిగింది. అందులో 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 60 శాతం మంది రోజూ 3 గంటలకుపైనే సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు తేలింది. ► 13–17 ఏళ్ల మధ్య టీనేజర్లలో 95 శాతం 8–12 మధ్య పిల్లల్లో 40 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ► పిల్లల్లో 15 శాతం మంది రోజూ 6 గంటలకుపైగా ఫోన్ తో గడిపితే.. 46 శాతం మంది మూడు నుంచి ఆరు గంటల వరకు వాడుతున్నారు. మరో 39 శాతం మంది గంట నుంచి 3 గంటల వరకు వినియోగిస్తున్నారు. ► 18 ఏళ్లలోపువారు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేయాలని 73 శాతం తల్లిదండ్రులు సర్వేలో పేర్కొనడం గమనార్హం. టెక్... కిక్... ప్రముఖ ప్యూ రీసెర్చ్ సంస్థ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. టీనేజ్ పిల్లలు తాము సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 49 శాతం మంది తాము సాధించినది చెప్పుకొంటుంటే.. 44 శాతం మంది కుటుంబానికి సంబంధించిన పోస్టులు..విహార యాత్రలు, సంబరాలు, ఫంక్షన్లు వంటివి చేస్తున్నారు. ► 34 శాతం మంది తమ ఎమోషన్లను సోషల్మీడియాలో పంచుకుంటుంటే.. అందులో పర్సన ల్ విషయాలనూ ప్రస్తావిస్తున్నవారు 13 శాతం ఉన్నారు. ► మతపరమైన అంశాలపై 11 శాతం, రాజకీయ అంశాలపై 9 శాతం టీనేజర్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఎడ్యుకేషన్, సోషల్, ఎంటర్టెయిన్మెంట్ వంటి ఇతర అంశాలపై 28 శాతం మంది పోస్టులు పెడుతున్నారు. డిజిటల్ ఏజ్ తగ్గుతోంది... ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. పిల్లల చేతికి ‘టెక్’ అందుతున్న వయసు క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆధారిత పరికరాల విస్తృతే దీనికి కారణం. ఆడుతూ, పాడుతూ నేర్చుకునే క్రమంలో.. ఇటు ఇళ్లలో, అటు స్కూళ్లలో కూడా డిజిటల్ పరికరాల వినియోగం బాగా పెరిగింది. నడక నేర్చుకునే కంటే ముందే.. ‘ఫోన్ ’ను ఆపరేట్ చేయడం, గేమ్స్ ఆడటం నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. కరోనా లాగా స్పీడ్గా... కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏడాదికిపైగా లాక్డౌన్లు పెట్టాయి. పెద్దవాళ్లకు కాస్త వెసులుబాటు ఇచ్చినా.. పిల్లల బడులైతే ఏడాదిన్నర పాటు నడవలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏదీ ఆగలేదు. ఆన్ లైన్ క్లాసులతో పిల్లల చదువులు భేషుగ్గా సాగాయి. సరికొత్త బోధన దిశగా అడుగులు పడ్డాయి. అదే సమయంలో పిల్లలు తోటివారితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం ద్వారా ఒంటరితనాన్ని అధిగమించగలిగారు... అక్కడ నుంచి సోషల్ మీడియా వేగంగా అంటుకుంది. నిపుణుల అబ్జర్వేషన్ ఇదీ.. ► టెక్నాలజీ చిన్నారులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు అద్భుత అవకాశాలను ఇస్తోంది. ఎడ్యుకేషన్ యాప్స్, వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కొత్త, కఠినమైన అంశాలను కూడా అరటిపండు ఒలిచి నోటికి అందించినట్టుగా అతి సులువుగా, సొంతంగా నేర్చుకోగలిగిన సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. ► విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉండటంతో పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. ఏదైనా ఓ అంశానికి సంబంధించిన కొత్త కొత్త సంగతులను శోధించి తెలుసుకునే అవకాశాలు ఉంటున్నాయి. ► టెక్నాలజీ పిల్లల్లో చిన్ననాటి నుంచే సృజనాత్మకతకు పదును పెడుతోంది. కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయగలిగే సామర్థ్యాన్ని ఇస్తోంది. ► సొంతంగా కంటెంట్ను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా పంచుకోగలగడంతో పిల్లల్లో వినూత్న ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెరగడానికి తోడ్పడుతోంది. ► పజిల్స్ను పరిష్కరించడం, ఎడ్యుకేషన్ సంబంధిత గేమ్స్ ఆడటం ద్వారా.. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అలవడుతోంది. ఏదైనా సమస్యకు కొత్త తరహాలో, సులువైన పరిష్కారం కనుగొనే దిశలో ఏకాగ్రత పెంపొందుతోంది. ► ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విభిన్న నేపథ్యాలున్న పిల్లలను కలిసే అవకాశంతో సామాజిక సంబంధాలపై, భిన్నమైన ప్రాంతాల్లో పరిస్థితులపై అవగాహన ఏర్పడుతోంది. విభిన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఎలా స్నేహం చేయాలనే సామర్థ్యం సమకూరుతోంది. వారి సూచన ఇదీ... ఇదే సమయంలో కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వంటి పరికరాల అతి వినియోగం కాస్త చేటుకూ దారితీస్తోంది. పిల్లల శారీరక, మానసిక అంశాలపై ముఖ్యంగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతోంది. చిన్నవయసులోనే టెక్నాలజీ వాడకంతో దుష్ప్రభావాలపైనా చాలా అధ్యయనాలు జరిగాయి. ఇబ్బందికరమైన, తప్పుడు సమాచారం, సైబర్ బుల్లీయింగ్ వంటివి పిల్లల మానసిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతున్న ఘటనలూ ఉన్నాయి. రూపాయికి బొమ్మా బొరుసు రెండూ ఉన్నట్టే.. టెక్నాలజీ వెంట మంచి, చెడు రెండూ వస్తున్నాయి. తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. - సరికొండ చలపతి -
‘ఓల్డ్’ నాట్ గోల్డ్.. నడిసంద్రంలో ‘నౌక’రీ..!
ఫ్లయింగ్ కిస్ ఇది మనం మాట్లాడుకునే అంశానికి సంబంధించింది కాదు... అయినా ఓసారి! మన సమాజంలో యాభై దాటితే వృద్ధులు, అరవైదాటాక రిటైర్ కావల్సిన వారు అని అంటారు కానీ రాజకీయాలకు మాత్రం ఇదే అనువైన వయస్సు. యాభైకి దగ్గరవుతున్న యువనేతలు ఫ్లయింగ్ కిస్లు కూడా విసరొచ్చు. దానికి తగ్గ హుషారు వయస్సే అది. వైన్ గ్లాస్... మిడిల్ ఏజ్ బ్లూస్! ఇది కూడా మన టాపిక్కు కాసింత దూరమే అయినా మిడిల్ ఏజ్ కదా సరదాగా! ఓ 80 ఏళ్ల వృద్ధుడు జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతని ఆరోగ్యమూ, సరదా చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్ నడివయస్సులో ఉన్నాడు. కావల్సినంత బీఎమ్ఐ, ఉన్నంతలో మాంచి బీపీతో అప్పడప్పుడే ఆరోగ్యం అలారం మోగిస్తోంది. ‘మీ ఆరోగ్య రహస్యం ఏమిటి....?’ – వృద్ధుడిని ఆసక్తిగా డాక్టర్ అడిగాడు. ‘నేను సూర్యుడు ఉదయించక ముందే లేచి సైకిల్ తొక్కడానికి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి రెండు గ్లాసుల వైన్ తాగుతాను! బహుశా ఇదే నా ‘ఆరోగ్య రహస్యం.’ ‘సరే, అయితే మీ నాన్నగారు చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎంత?’ ‘నాన్న చనిపోయారని మీకు ఎవరు చెప్పారు?’ ‘మీకే 80 ఏళ్లు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నారా ..ఇంతకీ అతని వయసు ఇప్పుడు ఎంత....? – ఆశ్చర్యంగా, ఆసక్తిగా డాక్టర్. ‘అతనికి 102 సంవత్సరాలు, ఈ ఉదయం నాతో సైకిల్ తొక్కాడు, ఆపై రెండు గ్లాసుల వైన్ తీసుకున్నాడు.’ ‘దీర్ఘాయువు మీ కుటుంబ జన్యువులలో ఉందని దీని అర్థం. ఇంతకీ మీ తాత చనిపోయినప్పుడు ఆయన వయస్సు ఎంత...?‘ ‘అరే ఇప్పుడు తాతయ్యను ఎందుకు చంపు తున్నారు...?’ ‘మీకు 80 ఏళ్లు, మీ తాత ఇంకా బతికే ఉన్నారా! అతని వయసు ఎంత...?’... డాక్టర్ అయోమయం. ‘అతని వయస్సు 123 సంవత్సరాలు.’ ‘అతను కూడా ఈ ఉదయం మీతో సైకిల్ తొక్కేసి వైన్ కూడా తీసుకుని ఉంటాడని అనుకుంటున్నా.....?’ డాక్టర్ అన్నాడు. లేదు, ‘తాత ఈ ఉదయం వెళ్లలేకపోయాడు! ఎందుకంటే అతను ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాడు... రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఆమె గర్భవతి కూడా!’ అప్పటి నుంచి డాక్టర్ రోజూ సైకిల్ తొక్కుతూ వైన్ తాగుతున్నాడు. నడివయస్సును జయించే తాపత్రయం. నడి ‘సంద్రం’ ఇది మాత్రం అచ్చంగా మన టాపిక్కే! ఈఎమ్ఐలు, బీఎమ్ఐలు పీక్స్ కొచ్చే ఏజ్ ... అదే మిడిల్ ఏజ్. మిడిల్ క్లాస్ వాళ్లకు ఓ పరీక్షా సమయం. చచ్చీ చెడీ ఏ ముప్పై ఏళ్ల బార్డర్లోనో పెళ్లైతే.. నలభై, యాభై ఏళ్ల మధ్య వయస్సులో పిల్లల చదువులు ఖర్చు భారీగా ఉంటుంది. ఇంటి ఈఎమ్ఐల నుంచి ఇంకా విముక్తి లభించదు. కారుంటే... దానిæలోన్ తీరదు. ఓ పక్క పెరిగిన బీఎమ్ఐతో ఆరోగ్యం అలారం మోగిస్తుంటుంది. ఇంకా చదువు పూర్తవ్వని కొడుకు, పెళ్లికి ఎదిగిన కూతురు... కొలువు మెడపై వేలాడుతున్న కత్తి... పింక్ స్లిప్. వెరసి నడి వయస్సు... నడిసంద్రం. దీనికి తోడు కొలువుల పరిస్థితి మారుతోంది చూడండి...సీనియారిటీ సీన్ మిస్..అప్పుడే కాలేజీ పూర్తి చేసి వస్తే.. ఫ్రెషర్స్ ఉద్యోగాలు దొరకడం కష్టం. కాస్త అనుభవముంటే ఫుల్లు డిమాండ్. కొంచెం ప్రాధాన్యత.. అదే ఇంకొంత కాలం గడిచి మధ్య వయసుకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడుతోంది. మెల్లగా ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇంకొన్నేళ్లు గడిస్తే ఉద్యోగంలో ఉంచడమా, ఏదో కారణంతో పంపించేయడమా అన్నట్టుగా మారిపోతోంది. ఉద్యోగుల వయసుపై వివక్ష కనిపిస్తోంది. ...కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ట్రెండ్ ఇది. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతికతలను, సరికొత్త పనితీరును పాత ఉద్యోగులు సరిగా అందిపుచ్చుకోలేరనే భావనే దీనికి కారణం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కంపెనీలకు రెవె‘న్యూ’ పేస్కేల్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారిలో మిలీనియల్స్ (1980–96 మధ్య పుట్టినవారు) 68% నుంచి 70% వరకు ఉంటే.. జనరేషన్ జెడ్ (1996–2010 మధ్య పుట్టినవారు) 18% నుంచి 20% వరకు ఉన్నారు. అగ్రశ్రేణి కంపెనీలైన ఫేస్బుక్, లింక్డ్ ఇన్ , స్పేస్ఎక్స్ సంస్థల్లో ఉద్యోగుల సగటు వయసు కేవలం 29 ఏళ్లే. ఐబీఎం, ఒరాకిల్, హెచ్పీ వంటి సంస్థల్లోనూ ఇది 33 ఏళ్లే. అంటే కొత్త జనరేషన్ కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఓల్డ్... నాట్ గోల్డ్! ఉద్యోగులపై ‘వయసు వివక్ష’ మన దేశంలోనూ పెరుగుతోంది. ఏఐఎం సంస్థ అధ్యయనం ప్రకారం.. మన దేశంలోని చాలావరకు ఐటీ కంపెనీల్లో 50 ఏళ్లు పైబడిన ఉద్యోగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. –ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగులు 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయసువారే. మరో 40 శాతం మంది 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవారు. 50 ఏళ్లు దాటినవారిసంఖ్య 10 శాతమే. – ఐబీఎంలో మాత్రం 20–35 ఏళ్ల మధ్యవారు 45 శాతం, 35–50 ఏళ్ల మధ్యవారు 30 శాతం ఉంటే... 50 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నారు. –ఇక ముందూ ఈ కంపెనీల్లో ‘యంగ్’ జనరేషన్ను పెంచే పని జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1.57 లక్షల మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. 33 శాతం మందికి వివక్ష జాబ్బజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం...ఇండియాలో 33 శాతం మంది ఉద్యోగులు వయసుకు సంబంధించిన వివక్షను ఎదుర్కొంటున్నారు. మధ్యవయసు దాటినవారిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడం, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం, కొన్నిసార్లు రాజీనామా చేసేలా ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ‘‘కొన్ని దేశాల్లో ఇలాంటి వయసు వివక్షకు వ్యతిరేకంగా కఠినచట్టాలు ఉన్నాయి. మన దేశంలోనూ అలాంటివి రావాల్సి ఉంది..’’ ఓ విశ్లేషకుడి మాట. ఇటీవల ఓ కంపెనీ అమెరికాలో పనిచేస్తున్న 80 మంది ఉద్యోగులను ‘వయసు, సీనియర్లు’ కారణంతో భారత్లోని కార్యాలయాలకు బదిలీ చేయడం ‘వయసు వివక్ష’ అంశంపై చర్చను రేపింది. 2018 లోనూ ఇదే కంపెనీ 40 ఏళ్లు దాటిన 20 వేల మంది ఉద్యోగులను తొలగించడం వివాదాస్పదమైంది కూడా! ప్రతిష్ఠాత్మక గూగుల్ సంస్థ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటంతో 227 మంది కోర్టులో కేసులు వేశారు. 2019లో వారికి సుమారు రూ. 90 కోట్లు పరిహారంగా ఇచ్చి కేసుల నుంచి బయటపడింది. కంపెనీలు ఖర్చు తగ్గించుకునే క్రమంలో ప్రధానంగా సీనియర్లపైనే వేటు వేస్తున్నాయి.తక్కువ వయసున్న వారు చురుగ్గా, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేస్తారన్న భావనే దీనికి కారణం. దీనితోపాటు సీనియర్లకు ఎక్కువ జీతాలు, అలవెన్సులు ఉండటం, పరిస్థితులకు అనుగుణంగా మారలేరనే ఆలోచన కూడా కారణం. ‘ఓల్డ్’ స్టాక్! ఇది కూడా మన స్టోరీకీ సంబంధించింది కాదు.. అయినా చదవొచ్చు.పూర్వకాలంలో సౌత్సీ దీవుల్లో వయస్సు మళ్లిన వారిని చెట్టు పైకి ఎక్కించేవారట. వారు ఎక్కిన తర్వాత బలమైన యువకులు ఆ చెట్టును ఊపేవారట. ఆ ఊపునకు కింద పడిపోకుండా నిలబడగలిగితే విడిచిపెట్టేవారట. నిలబడక పోయిన వారిని చంపివేసే వారట... అంతే! -సరికొండ చలపతి -
...అంతా కిల్‘బిల్’పాండేలే!
కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్న సామెత ఉంది. మనం చెప్పిన దానికి కాసింత కాళిదాసు లాంటి పెద్దవాళ్ల పేరు జోడించి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంటుంది. తద్వారా చెప్పిన దానికి మరింత ప్రాచుర్యం వస్తుందని.. అలాంటిదే ఒకటి చూద్దాం.. అనగనగా ఆ కాలంలో ఓ ఆకతాయి యువకుడు ఉండేవాడు. ఆ ఆకతాయి వీధిలో వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి రావే.. రావే అని కామెంట్ చేశాడు.. ఆ అమ్మాయికి ఒళ్లుమండి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. ఇప్పటిలా ఎంపీ లకైనా సమన్లు జారీ చేసి ‘ముద్దు ముచ్చట్ల’కు జవాబు చెప్పండి అని ఆదేశించే మహిళా కమిషన్లు అప్పట్లో లేవు. ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి మీడియా కూడా లేదు. పైగా ధైర్యం ఉన్న ఇప్పటి ‘నవ్య’ తరం కూడా కాదు. ఆడియో, వీడియోలు షేర్ చెయ్యడానికి సోషల్ మీడియా కూడా లేదు. అప్పట్లో న్యాయాధికారి, ఆపై మహారాజు గారే యాక్షన్ తీసుకోవాలి. న్యాయాధికారి విషయాన్ని సీరియస్గానే తీసుకుని విచారణకు రమ్మని ఆకతాయిని ఆదేశించాడు. ఇది తెలిసిన ఆకతాయి తండ్రి కంగారు పడిపోయాడు. ఇంట్లోనే ఆకతాయికి దేహశుద్ధి చేశాడు. కానీ, రాజదండన నుంచి ఎలా తప్పించడమో పాలు పోలేదు. ఆయనకు తెలిసిన కవి ఒకరు రాజు గారి ఆస్థానంలో ఉన్నారు. కవి గారి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. కవి సాంతం విని, కొడుకును దార్లో పెట్టుకుంటానని తండ్రి వద్ద గట్టిగా మాట తీసుకుని ఓ ఐడియా చెప్పాడు. ‘‘నేను ఓ శ్లోకం చెబుతా, న్యాయవిచారణ సమయంలో మీ కొడుకును చెప్పమను..’’ అంటూ, దానితో పాటు ముందుగా బాధితురాలైన అమ్మాయి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆయన చెప్పినట్టుగా చేసి ఆకతాయితో శ్లోకం బట్టీ పట్టించాడు. న్యాయవిచారణ జరుగుతున్నపుడు.. ‘నేను రావే రావే అని ఊరికే అనలేదు, నేను అప్పుడు చదివిన శ్లోకంలో భాగమే అది..’ అని కవి చెప్పిన శ్లోకం చదివాడు. గేహే గేహే జంగమా హేమవల్లీ వల్లా్యం వల్లా్యం పారణశ్చంద్రబింబః బింబే బింబే కోకిలా మంజురావః రావే రావే జాయతే పంచబాణః (ప్రతి ఇంట్లోనూ ఒక కదిలే బంగారు తీగ ఉంది. ప్రతి తీగలోనూ ఒక పూర్ణ చంద్రబింబం ఉంది. ప్రతీ చంద్ర బింబంలోనూ ఒక కోకిల స్వరం ఉంది. ఆ ప్రతీ ధ్వనిలోనూ మన్మథుడు ఉన్నాడు.) ఈ శ్లోకం చదువుతుండగా ఆమెకు రావే రావే అని మాత్రమే వినిపించిందని వివరణ ఇచ్చాడు. అంతకు ముందే ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన కారణంగా ఆ అమ్మాయి కూడా మరింత రెట్టించ లేదు. ఇప్పటి ‘నవ్య ’తరంలాగా.. ‘‘మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా, కిరోసిన్ పోసి నిప్పంటిస్తా...’’ అని ఘాటుగా హె చ్చరించలేదు గానీ బుద్ధిగా ఉండమని సూచించింది. కథ కంచికి వెళ్లింది. అందరూ ఇంటికి వెళ్లారు. ఈ శ్లోకం రాసిచ్చిన కవి ‘కాళిదాసే’ అని ప్రచారం. ఇది కాళిదాసు కవిత్వమా, ఎవరిదైనా పైత్యమా అన్న విషయం వదిలేస్తే.. ఆ కాలం నుంచీ అమ్మాయిలంటే చులకనగా చూసే ఆకతాయిలున్నారు, విచారణలున్నాయి, క్షమాపణలున్నాయి. ఇప్పటికీ పరిస్థితేం పెద్దగా మారలేదు. మెడికోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. ఎవరయినా అంతే. పైన చెప్పుకున్న దానికి.. కింద మనం మాట్లాడుకోబోయే విషయానికి క్లోజ్ రిలేషన్ ఉందా.. బాదరాయణ సంబంధమేనా..? మీరే తేల్చుకోండి. ఈ నెలలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనా వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఢిల్లీలో దీక్ష...దీని వెనుక వేరే కారణాలున్నాయని విమర్శలున్నాయనుకోండి. కాసింత చర్చయితే అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆశలు సాకారమైతే, వారి సాధికారతవైపు సమాజం అడుగులు వేస్తే... మహిళలపై వివక్ష తగ్గితే.. గౌరవం పెరిగితే పైన చెప్పుకున్న సంఘటనలు లాంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న ఆశలు కనిపించాయి. కానీ, ప్రతి మహిళా దినోత్సవం రోజు అన్ని పార్టీలు, సంఘాలు, ప్రముఖులు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించడం. కుదిరితే కాసిన్ని దీక్షలు.. ఆ తర్వాత మరిచి పోవడం.. అంతే, ఒకటి కాదు రెండు కాదు 26 ఏళ్లుగా ఇదే తంతు. ..ఎందుకంటే పైన మనం చెప్పుకున్న కామెంట్లూ, కథలూ కంచికిపోలే.. మన మధ్యే ఉన్నాయి. ఇవి ఆకతాయిల మాటలు కాదు.. మీరే చూడండి. – ఓ రోజు మహిళా బిల్లుపై సీరియస్ చర్చ జరుగుతోంది. సమర్థించే వారు గొంతు చించుకుంటున్నారు. ఇంతలో పార్లమెంట్ బయట తిరుగుతున్న ఎంపీని ‘మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి..’ అని మీడియా అడిగితే ఆయన సమాధానం... ‘మా ఆవిడ చేస్తున్న షాపింగ్ బిల్లు మీద తప్ప నాకే బిల్లుపై ఆసక్తి, ధ్యాసా లేవు..’ అని ఆ తర్వాత ఓ రోజు..‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్కు ఏం తెస్తుంది..? బ్యూటీపార్లర్లకు వెళ్లే బాబ్డ్ హెయిర్ మహిళలనా...’ మహిళా బిల్లుపై లాలూప్రసాద్ రియాక్షన్. చట్టసభల్లో కూర్చుని మన రాత రాసే నేతల ధోరణి ఇలా ఉంటే.. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ టీవీ చానల్ కామన్ పీపుల్తో పిచ్చాపాటిగా మాట్లాడింది.. వినండి. – పార్లమెంట్లో అంత చర్చ జరుగుతోందిగా, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే.. వారిలో కొందరి సమాధానాలు ఇవీ. – ‘అవునవును నేను కూడా విన్నాను. మా ఆవిడ కూడా అడిగింది. మరీ రచ్చ బాగా చేస్తున్నారు.. బిల్లు ఎక్కువ అయ్యిందా అని..’ (జోక్ ?) – ‘నాకు బిల్ క్లింటన్ మాత్రమే తెలుసు ఈ బిల్ గురించి ఐడియా లేదు..’ (లైట్?) – ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడొస్తుంది..? ‘వారికి అధికారం వచ్చేసిందిగా.. క్రెడిట్ కార్డ్ల రాకతో’ (వెటకారం?) – ఉమెన్ రిజర్వేషన్ వస్తుందా..? ‘లాలూ రైల్వే కోచ్లలో మహిళలకు కొన్ని కేటాయించా డుగా..’(సరదా?) – చట్టసభల్లో మహిళల కోటా గురించి చెప్పండి. ‘ఇప్పుడు ఇంట్లో అంతా వారి పెత్తనం.. ఇక రెండు సభల్లో వారిదే పెత్తనం అవుతుంది. దేశాన్ని వారే నడుపుతారు..’ (తేలిక భావం?) బిల్లు తేవాల్సిన చట్టసభల్లో నాయకులకూ, బయట సాధారణ ప్రజలకూ ఒకే రకమైన భావజాలం ఉన్నాక, 26 ఏళ్లే కాదు ఎన్నేళ్లయినా అలాగే ఉంటుంది. మహిళా దినోత్సవం రోజో, ఎన్నికల మేనిఫెస్టోల్లోనో, ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకోవడానికో ఓ సబ్జెక్ట్ అవుతుంది. ‘రాజ్యసభ నుంచి లోక్ సభకు నడిచి వెళ్లడానికి ఐదు నిమిషాలు పడుతుంది. కానీ, రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఇన్నేళ్లయినా (రాజ్యసభ ఆమోదించిన 2010 నుంచి) లోక్ సభకు చేరనే లేదు..’ – ఇది బృందా కారత్ ఆవేదన. పైన చెప్పుకున్నట్టుగా మన పరిస్థితి ఇలాగే ఉంటే, ఎన్నాళ్లయినా బిల్లు లోక్సభ వైపు నడుస్తూనే ఉంటుంది. మనమే కాదు.. అంతటా అంతే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజా నివేదిక చూడండి ప్రపంచవ్యాప్తంగా మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు 22.8 శాతమే. కేవలం 13 దేశాల్లోని కేబినెట్లలో మాత్రమే 50%, ఆపైన మహిళా మంత్రులు ఉన్నారు. మహిళలు మంత్రులుగా ఉన్నా వారికి కేటాయిస్తున్న శాఖల ప్రాధాన్యత తక్కువే. ప్రజలు నేరుగా ఎన్నుకునే దిగువ సభల్లో (లోక్సభ తరహాలో) మహిళా పార్లమెంటేరియన్లు 26.5 శాతమే. అయితే ఇది 1995లో 11%గానే ఉండగా ప్రస్తుతం కొంత మెరుగుపడింది. దిగువ సభలో 50%, అంతకన్నా ఎక్కువ మంది ఎంపీలున్న దేశాలు ఆరు మాత్రమే. రువాండాలో 61%, క్యూబాలో 53%, నికరాగ్వాలో 52%, మెక్సికో, న్యూజిలాండ్, యూఏఈలలో 50% మహిళా ఎంపీలున్నారు. ఈ ఆరింటితోపాటు మరో 17 దేశాల్లో 40% పైన మహిళా ఎంపీలు ఉన్నారు. 22 దేశాల్లో మహిళా ఎంపీలు 10% కన్నా తక్కువే -సరికొండ చలపతి -
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది. .... మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... ‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’ – ... దీనికి ఏమైందిరా? ‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’ – ...అవును, కానీ మంచి ఫోనురా... ‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’ – .. సరే, చూద్దాం... ఆ తర్వాత రోజు.. ‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’ – సరే ఫస్ట్కు చూద్దాం... ఓ నెల తర్వాత.. ‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’ – ..ఏదీ చూద్దాం.. ‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా. – ..అలాగే చూద్దాం.. మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట! కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని. విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే.. ఈసారైనా బడ్టెట్లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా.. కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది.. నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాం.. అని. అందుకే ప్రతి బడ్జెట్లో శాలరీ శ్లాబ్లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం.. నెక్స్ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస సరే చూద్దాం.. ఈ బడ్జెట్లో ఎలా ఉంటదో. వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ– ..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్వైపు ఆశగా చూస్తోంది. ‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్. కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి.. ‘‘సమాజాన్ని స్టేబుల్గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’ దీనికి సపోర్ట్గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ.. ‘‘సాధారణంగా పాలిటిక్స్కు, ఓటింగ్కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్ను విస్మరించడం మోదీ గవర్నమెంట్కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’ విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు.. ‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి.. కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది. ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి. కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం. మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి. కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి.. ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది. నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’ ఇదీ ఉద్యోగుల పరిస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు సరే చూద్దాం.. ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. -
మోదీ చేసిన అప్పు 100 లక్షల కోట్లు.. బీఆర్ఎస్ సర్కారు అప్పు ఎంతంతే?
ఇండియన్ ‘లోన్’ మోదీకి ముందున్న 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లయితే, మోదీ ఎనిమిదిన్నరేళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారు. పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల రూపాయల రుణభారం మోపారు. – కేటీఆర్ కామెంట్ ....... కౌంటర్.. ‘స్టేట్’మెంట్ తెలంగాణ అప్పు రూ. 3.12 లక్షల కోట్లయ్యింది. రెండేళ్లలోనే బీఆర్ఎస్ సర్కారు రూ. 87 వేల కోట్ల అప్పును చేసింది. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. మన పిల్లలకు అప్పు మిగులుస్తున్నారు. సరాసరి తలసరి రూ. 94 వేల అప్పును మోపుతున్నారు – బండి సంజయ్, కిషన్రెడ్డి విమర్శలు ....... అప్పుల ‘మధ్య’తరగతి.. ‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం..’’ అంటారు. కళ్ల తడి కామన్ కానీ, ఈ రోజుల్లో అసలు అప్పు చేయకుండా జీవితం దాటనేలేం. కుటుంబాలన్నీ అప్పుల కుప్పలే. ‘ఈఎంఐ’.. అని రుణాల పేరు పోష్గా మారిందంతే. వాయిదాల్లేకుండా బతికేదెవ్వరు.. ఇంటికి, బండికి, చదువుకు, పెళ్లికి.. చిట్లు.. ఒక్కటేమిటి ముఖ్యంగా మధ్యతరగతి బతుకంటేనే అప్పులు కదా...! చిన్నప్పుడు ‘తీసివేతలు’ నేర్పుతున్నప్పుడు లెక్కల మాస్టారు ‘ఒకటి అప్పు తీసుకోరా ..’ అని ఎప్పటి నుంచి చెప్పారో, అప్పటినుంచి బతుకు లెక్కంతా అప్పులే. రుణాలు తీసుకుంటూనే ఉన్నాం. వడ్డీలు, కిస్తులు కడుతూనే ఉన్నాం. అప్పూ గొప్పే... రిచ్ క్లాస్లో ఇదేం నామోషీ కాదు. అంబానీ నుంచి అదానీ దాకా అపరకుబేరులైనా అప్పు చేయా ల్సిందే. నిజానికి ఇలాంటి వారికే ఎక్కువ అప్పు లిస్తారు కూడా. ఈ రేంజ్లో ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేసి అప్పులిచ్చి గౌరవించడం, ఎగ్గొడితే ఫ్లయిట్లలో విదేశాలకు పంపడం కూడా మనకు తెలిసిందే కదా.. అప్పుకు మారుపేరైన.. ‘ఈఎంఐ’ల్లో పుట్టి (హాస్పిటల్ చార్జీలు కూడా ఈఎంఐలో కట్టేంతగా ఉంటాయి), ఈఎంఐల్లో పెరిగి, ఈఎంఐలతో చదువుకుని, ఈఎంఐల్లో పోవడమే మధ్య, పేద తరగతి జీవితం. కానీ, అప్పుల్లోనూ అంత ఖదర్గా బతికే బిజినెస్, రిచ్ క్లాసూ ఉంది. రుణ.. పురాణం నిజానికి ఈ అప్పు లొల్లి, అప్పుల్లోనూ పేద ధనిక తారతమ్యం పురాణాల కాలం నుంచీ ఉన్నట్టుంది. బూడిద పూసుకుని, కనీసం ఒంటిపై బ్రాండెడ్ బట్టల్లేకుండా పులి చర్మాలు, నారచీరలు ధరించి శ్మశానాల్లో తిరుగుతూ ఉండే ‘శంకరుడి’కి కుబేరు డెప్పుడయినా లోన్ ఆఫర్ చేసిన సందర్భాలు కనిపిస్తాయా..? గడ్డ కట్టుకు పోయే చలిలో హిమాలయాల్లో నివసించే శివుడు కనీసం ‘హోమ్లోన్’కు అప్లయి చేసుకున్న దాఖలాలూ లేవు. యుగాల తరబడి అదే నందీశ్వరుడిని యూజ్ చేశాడే కానీ, ఎవరైనా శివుడికి ‘వెహికల్ లోన్’ అరేంజ్ చేశారా..? పుష్పక విమానంలో తిరిగే కుబేరుడు ఆఫర్ చేశాడా.. ఎందుకంటే ఆయన పేద దేవుడు. పైగా ఎవరేం అడిగినా ఇచ్చేసే భోళా శంకరుడాయే.. ‘కొల్లాటరల్ సెక్యూరిటీ’ చూపే శక్తి లేదు. ప్రధానుల, ముఖ్యమంత్రుల రికమండేషన్ కూడా లేనట్టుంది. ... ఇప్పటి మన రైతులు, పేదోళ్ల పరిస్థితిలాగా! అదే, విష్ణుమూర్తిని చూడండి. ఆయన మ్యారేజీకి కుబేరుడు ఎంత డబ్బిచ్చాడు! తిరుపతి వెంకన్నఇంకా కిస్తులు కడుతూనే ఉన్నాడు. ఆయనకు ఆ అప్పెలా వచ్చింది. ఆ అప్పు ఎందుకు తప్పు కాలేదు..? ఎందుకంటే ఆయన బాగా రిచ్చి. స్వయంగా లక్ష్మీదేవియే అర్ధాంగి. దేవుళ్లలో బాగా పలుకుబడి ఉన్నవాడు. ఘనంగా అల వైకుంఠపురంలో ఆ మూల సౌధాల్లో నివసిస్తాడు. పెద్దోళ్లందరికీ కావలసినవాడు. ఇంకేం ఎంతైనా అప్పు పుట్టుద్ది... మన రిచ్ పీపుల్ లాగా. – ఇక మన ఆర్థిక మంత్రి సీతారామన్ లాంటి వాళ్లెవరైనా ఉంటే దేవుళ్లలో ఇప్పటికే వెంకన్న రుణం అంతా ‘రైటాఫ్ ’ అయిపోయేది. అప్పు.. సంపన్నం ఇది చూడండి.. మనం ఆరాధనగా చూసే అమెరికా, సింగపూర్ తలసరి అప్పులు ఎక్కువే. అక్కడ సింగపూర్లో ఒక్కొక్కరిపై 97.46 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. జపాన్, కెనడా, బెల్జియం వంటి సంపన్న దేశాల వారి తలసరి అప్పులు ఎక్కువ. రిచ్నెస్ అలా ఉంటది మరి. అప్పుల్లోనూ.. పూర్ ఆఫ్గానిస్థాన్ , డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, మడగాస్కర్, లైబీరియా వంటి చిన్న దేశాల్లో తలసరి అప్పు తక్కువే. విదేశాల నుంచి అప్పులు దొరకడం కష్టం. ఆదాయమే సరిగ్గా లేని వాళ్లకు అప్పులెలా ఇస్తారు.. అదీ సంగతి ....... .. ఇంతకీ బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా చెప్పొచ్చేదేమంటే.. ఎంత అప్పుంటే అంత దర్జా.. ఎంత దర్జా ఉంటే అంత అప్పు... కనుక ‘పక్కోడు చేసే అప్పులు..’ పెరుగుతున్నాయని చింతించవలదు. డబ్బున్నోడికి అప్పు ఈజీ కదా.. అంటే అప్పుంటే డబ్బు, దర్పం ఉన్నట్టే కదా! అంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటే సరి. ....... కానీ, ‘...మన మీద పడే అప్పులపై ’ చింతించే మిడిల్ క్లాస్ ఒకటి ఉందండోయ్.. ‘ఇప్పటికే ఏళ్ల తరబడి ఇంటి లోన్ కడుతున్నాను, ఈ మధ్యే పిల్లాణ్ణి స్కూల్లో వేయడానికి ఓ లక్ష అప్పు చేశాను, కరోనా మింగిన నాలుగు లక్షల తాలూకు అప్పు, వడ్డీ అలాగే ఉన్నాయి. రెండో అమ్మాయి స్కూల్లో చేరడానికి రెడీ అవుతోంది. ఈ ఖర్చులిలా ఉండగా మన ‘డబుల్ ఇంజన్ సర్కార్లు’ వాళ్లు చేసిన అప్పులన్నీ మనతోనే కట్టిస్తారు.. వాళ్ల జేబు లోంచి కట్టరుగా... అని మా ఆవిడ భయంగా అడుగుతోంది..’ – కేటీఆర్, సంజయ్ ΄పోటా పోటీ ‘అప్పుల’ విమర్శలు చూసి ఓ నెటిజన్ పోస్టు ఇది. ఆలోచించదగ్గ ఆందోళనే. అక్కడిదాకా రాకుండా చూడండి. ఇప్పటికే అప్పులు కట్టలేక చస్తున్నాం. (క్లిక్ చేయండి: బయటపడిన అమెరికా డొల్లతనం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement