-
సెమీస్లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్ను నేను గమనించాను. కోచ్గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
తమిళనాడు 146 ఆలౌట్
ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్ తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కొంత పోరాడినా...మిగతావారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ పాండే 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తనుష్ కొటియాన్, ముషీర్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ముంబై బ్యాటింగ్ కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. పృథ్వీ షా (5) విఫలం కాగా...ముïÙర్ ఖాన్ (24 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడని కారణంగా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సెమీ ఫైనల్ మ్యాచ్లో బరిలోకి దిగాడు. విదర్భ 170 ఆలౌట్... నాగ్పూర్: మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ (4/49) పదునైన బౌలింగ్ ముందు విదర్భ బ్యాటర్లు విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్లో విదర్భ తమ తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అథర్వ తైడే (39) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 101/2తో మెరుగైన స్థితిలో కనిపించిన విదర్భ 36 పరుగుల వ్యవధిలో తర్వాతి 6 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్, కుల్వంత్ ఖెజ్రోలియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సరికి మధ్యప్రదేశ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. -
Ranji Trophy 2024: కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. సెమీస్కు ముంబై
భారత దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీ చివరి దశకు చేరింది. ఈ సీజన్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, విదర్భ, ముంబై జట్లు సెమీస్కు చేరుకున్నాయి. సౌరాష్ట్రను ఓడించి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్పై నెగ్గి మధ్యప్రదేశ్.. కర్ణాటకను చితు చేసి విదర్భ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకోగా.. బరోడాపై తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ్ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 243 (మయాంక్ అగర్వాల్ 70, హర్ష్ దూబే 4/65) 127 పరుగుల తేడాతో గెలుపొందిన విదర్భ డ్రాగా ముగిసిన బరోడా-ముంబై మ్యాచ్.. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (విక్రమ్ సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై రెండో ఇన్నింగ్స్ 569 (తుషార్ దేశ్పాండే 123, భార్గవ్ భట్ 7/200) బరోడా రెండో ఇన్నింగ్స్ 121/3 (ప్రియాన్షు్ మోలియా 54, తనుశ్ కోటియన్ 2/16) తొలి ఇన్నింగ్స్లో లభించిన లీడ్ ఆధారంగా సెమీస్కు చేరిన ముంబై ఏడేళ్ల తర్వాత సెమీస్కు చేరిన తమిళనాడు.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 183 (హార్విక్ దేశాయ్ 83, సాయికిషోర్ 5/66) తమిళనాడు తొలి ఇన్నింగ్స్ 338 (బాబా ఇంద్రజిత్ 80, చిరాగ్ జానీ 3/22) సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్ 122 (పుజారా 46, సాయికిషోర్ 4/27) ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో తమిళనాడు విజయం ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో ఓడిన ఆంధ్ర.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 234 యశ్ దూబే 64, శశికాంత్ 4/37) ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 172 (కరణ్ షిండే 38, అనుభవ్ అగార్వల్ 3/33) మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 107 (హిమాన్షు మంత్రి 43, నితీశ్ రెడ్డి 4/28) ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ 165 (హనుమ విహారి 55, అనుభవ్ అగర్వాల్ 6/52) 4 పరుగుల తేడాతో గెలుపొందిన మధ్య ప్రదేశ్ సెమీస్ మ్యాచ్లు ఇలా.. మార్చి 2-6: విదర్భ వర్సెస్ మధ్యప్రదేశ్ (1st semi final) మార్చి 2-6: ముంబై వర్సెస్ తమిళనాడు (2nd semi final) -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
సెమీస్కు చేరువలో ఆంధ్ర..
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్ను దెబ్బ తీశారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 66 కేజీల క్వార్టర్స్లో అరుంధతి 5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75 కేజీలు), నవీన్ (92 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్ 5–0తో సుల్తాన్ (కిర్గిజిస్తాన్)పై, నవీన్ 5–0తో వొయిస్నరొవిక్ (లిథువేనియా)పై గెలుపొందారు. చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్ను సెమీస్కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్.. సెమీస్ బెర్త్ ఖారారు
బ్లూమ్ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్లో యువ భారత్ అజేయంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–1 సూపర్ సిక్స్ పోరులో భారత్ 132 పరుగుల భారీ తేడాతో నేపాల్పై జయభేరి మోగించడంతో సెమీస్ స్థానం ఖాయమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సచిన్ దాస్ (101 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 215 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. కెప్టెన్ దేవ్ ఖానల్ (53 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IND vs ENG: ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. టోర్నీ నుంచి జకోవిచ్ అవుట్
ఆస్ట్రేలియన్ ఓపెన్-2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్వన్ నొవాక్ జకోవిచ్కు ఊహించని పరాభావం ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇటలీకి చెందిన యువ ప్లేయర్ జనిక్ సినర్ చేతిలో జకో ఓటమి పాలయ్యాడు. తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి సినర్ బ్రేక్లు వేశాడు . తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో సిన్నర్కు కోల్పోయిన జకోవిచ్.. మూడో సెట్లో అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చి 7-6తో విజయం సాధించాడు. అయితే నిర్ణయాత్మక నాలుగో సెట్లో మాత్రం సినర్ 6-3తో జకోవిచ్ను చిత్తు చేశాడు. దీంతో జకోవిచ్ ఇంటిముఖం పట్టగా.. సినర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 22 ఏళ్ల సిన్నర్... మెద్వెదెవ్/జ్వెరెవ్ లలో ఒకరిని సినర్ ఎదుర్కొంటాడు. శుక్రవారం రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. చదవండి: AUS vs WI: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
U19 Asia Cup: సెమీస్కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్తో మ్యాచ్లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన నేపాల్ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్లో అఫ్గనిస్తాన్ను భారత యువ జట్టు చిత్తు చేసింది. గ్రూప్-ఏ టాపర్గా పాకిస్తాన్ ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్గా నిలిచి సెమీస్లో అడుగుపెట్టింది. ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
China Masters: సెమీస్లో సాత్విక్–చిరాగ్..
షెన్జెన్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జోడీ ఈ ఏడాది మరో టైటిల్పై కన్నేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్సీడ్ భారత ద్వయం సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్కి క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–16, 21–14తో ఇండోనేసియాకు చెందిన లియో రాలీ కార్నడో–డానియెల్ మారి్టన్ జంటపై అలవోక విజయం సాధించింది. ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన సాత్విక్–చిరాగ్ వరుస గేముల్లో 46 నిమిషాల్లో మ్యాచ్ను ముగించింది. తొలి గేమ్లో 14–14 స్కోరు దాకా ఇండోనేసియన్ జోడీ నుంచి కొంతవరకు పోటీ ఎదురైనా... ఆ తర్వాత భారత షట్లర్ల ధాటికి ప్రత్యర్థి జంట చతికిలబడింది. తర్వాత రెండో గేమ్ను సాత్విక్–చిరాగ్లు రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టారు. 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. నెట్వద్ద పొరపాట్లతో కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకొని ఆడటంతో మళ్లీ ఆధిక్యం 11–6కు పెరిగింది. ఇండోనేసియన్ షట్లర్లు ఆ తర్వాత కోలుకోలేదు. 17–10తో గేమ్ను చేతుల్లోకి తెచ్చుకున్న భారత అగ్రశ్రేణి జంట నిమిషాల వ్యవధిలోనే 21–14తో మ్యాచ్ను మగించేశారు. ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న భారత జంట ఇండోనేసియా సూపర్–1000, కొరియా సూపర్–500, స్విస్ సూపర్–300 టైటిళ్లను సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనాకు చెందిన జి తింగ్–రెన్ జియాంగ్ యు జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ తలపడుతుంది. పురుషుల సింగిల్స్ ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్కి క్వార్టర్స్లో ఏదీ కలిసిరాలేదు. 31 ఏళ్ల భారత షట్లర్ 9–21, 14–21తో జపాన్ ఆటగాడు, మూడో సీడ్ కొడయ్ నరవొక చేతిలో సులు వుగానే ఓడిపోయాడు. తొలిగేమ్లో నరవొకకు 9–8తో పోటీ ఇచ్చిన భారత ఆటగాడు తర్వాత వరుసగా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ నరవొక తొలిగేమ్లో తన రాకెట్ను నెట్పై పరిధి దాటిరావడంతో చైర్ అంపైర్ అతని పాయింట్ను తిరస్కరించాడు. అయితే ప్రణయ్ అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టలేక పదేపదే పొరపాట్లు చేసి మ్యాచ్ను అప్పగించాడు. -
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు. దీంతో ప్రోటీస్ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు. 1999 వరల్డ్కప్లో షేన్ వార్న్ మ్యాజిక్.. కాగా 1999 వరల్డ్కప్ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మ్యాజిక్ చేసి మ్యాచ్ను డ్రాగా ముగించారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్ వార్న్ మళ్లీ తన స్పిన్ మయాజాలంతో కల్లిస్ను ఔట్ చేశాడు. వెంటనే రోడ్స్ కూడా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్కు త్రో చేశాడు. గిల్క్రిస్ట్ను స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే రన్రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్ ఓవర్ రూల్ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్లో షేన్ వార్న్ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్ లాంటి మ్యాజిక్ ప్రోటీస్ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
వరల్డ్ క్రికెట్లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్కప్-2023లో ఈడెన్గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్లో మాత్రం కంగారుల ముందు తలవంచింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్కప్ లీగ్ మ్యాచ్ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్లో మాత్రం చేతులెత్తేసింది. చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి.. -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్కప్ ఫైనల్ బెర్త్ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్ను బ్యాక్ఫుట్లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్ను కొయెట్జీ పెవిలియన్కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్వెల్ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్లో పెవిలయన్కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్వుడ్ బౌలింగ్లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్వుడ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్న్యూస్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరుకుంటుంది. మ్యాచ్కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. -
శ్రేయస్, రాహుల్ అత్యద్భుతం.. కివీస్ నుంచి గట్టి పోటీ తప్పదు..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) జరిగే సెమీఫైనల్ మ్యాచ్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్పై గంభీర్ విశ్లేషణ చేస్తూ ఇలా అన్నాడు. సెమీఫైనల్లో కచ్చితంగా భారత జట్టే ఫేవరెట్. ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని కంగుతినిపించడమే కాదు... భారత్తో ఢీ అంటేనే కష్టం అనిపించేలా మనోళ్లు జైత్రయాత్ర సాగించారు. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత బౌలింగ్ నన్ను ఆకట్టుకుంది. బౌలర్లు జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. ఈ ప్రపంచకప్ గెలిస్తే మాత్రం దేశంలో బౌలింగ్ విప్లవం ఖాయం. ఇంతవరకు మనలో చాలామంది సచినో, కోహ్లినో కావాలనుకునే క్రికెట్లో అడుగుపెట్టేవారు. కానీ ఈ వరల్డ్కప్ తర్వాత బౌలర్ల లక్ష్యంతో అకాడమీలు కళకళలాడుతాయంటే ఆశ్చర్యం లేదు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కళ్లప్పగించేలా చేసింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్పై బాదిన శతకం (102) అయితే హైలైట్ అని చెప్పొచ్చు. చక్కని ఫుట్వర్క్, పరిణతితో కూడిన ఫ్లిక్ షాట్స్తో ఫోర్లు, సిక్సర్లు అదరగొట్టాడు. మణికట్టు స్ట్రోక్ప్లేతో పరుగులు సాధించిన తీరు అద్భుతం. దీంతో రాహుల్ను ఇప్పుడు 360 డిగ్రీ ప్లేయర్ అనొచ్చు. 160 స్ట్రయిక్రేట్ అతని టాప్గేర్ను సూచిస్తోంది. అలాగని శ్రేయస్ అయ్యర్ ఏం తక్కువ కాదు. డచ్పై అతని ఆయుధం పుల్ షాట్లే. 128 పరుగుల్లో 42 ఆ షాట్లతో వచ్చినవే! అవే అతని సెంచరీని తేలిక చేశాయి. షార్ట్పిచ్ బంతులపై అయ్యర్ కనబరిచిన నైపుణ్యం మురిపించింది. ఏ బంతుల్ని ఎలా ఆడాలో... ఏవి వదిలేయాలో వివేకం చూపించాడు. అయితే కివీస్తో జరిగే సెమీస్లో మాత్రం అతనికి బౌన్స్, స్వింగ్ పరీక్షలు ఎదురవొచ్చు. తప్పకుండా న్యూజిలాండ్ నుంచి భారత్కు సవాల్ ఎదురవుతుంది. ప్రపంచకప్ కోసం బాగా సన్నద్ధమై వచ్చారు. వంద శాతం నిబద్ధతతో మెగా ఈవెంట్ ఆడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లో న్యూజిలాండ్ మోహరింపు కట్టుదిట్టంగా ఉంటోంది. భారత టాప్–3 కోసం ఇదివరకే కసరత్తు చేసే వుంటారు. ఇందులో ఏ సందేహం లేదు. బౌలింగ్ ఫ్రెండ్లీ వాంఖెడే పిచ్పై భారత బ్యాటర్లకు చేజింగ్ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే మనవాళ్లు బాగా ఆడితే ఎవరైనా ఏమీ చేయలేరు. -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?
వన్డే ప్రపంచకప్-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్-నెదర్లాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజి ముగియనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే భారత్-కివీస్ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే ఏంటి పరిస్థితి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే వరల్డ్కప్ సెమీఫైనల్స్, ఫైనల్కు ఐసీసీ రిజర్వ్డే కేటాయించింది. అంటే బుధవారం(నవంబర్ 15) వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే.. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి గురువారం(నవంబర్ 16) తిరిగి కొనసాగించనున్నారు. రిజర్వ్ డే రోజున ఆడే సమయం మ్యాచ్కి షెడ్యూల్ చేయబడిన రోజు మాదిరిగానే ఉంటాయి. అంతేకాకుండా అదనంగా మరో రెండు గంటల సమయాన్ని కూడా ఐసీసీ కేటాయించింది. రిజర్వ్డే రోజున ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజర్వ్డే రోజు కూడా ఆటసాధ్యపడకపోతే పాయింట్లపట్టికలో లీడింగ్లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం -
వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్తో మ్యాచ్లో 332 పరుగుల లక్ష్యాన్ని 6. 4 ఓవర్లలో చేజ్ చేయకపోవడంతో పాక్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు సెమీస్కు చేరాలంటే కొన్ని సమీకరణాలు ఉండేవి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేస్తే టార్గెట్ బట్టి ఎన్ని ఓవర్లలో పూర్తి చేయాలన్నది నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 300 పరుగులు సాధిస్తే.. 6.1 ఓవర్లలో ఛేజ్ చేయాలి. 6.4 ఓవర్లలో 338 టార్గెట్.. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఏకంగా 337 పరుగులు చేసింది. దీంతో ఐసీసీ సమీకరణాల ప్రకారం.. పాకిస్తాన్ సెమీస్కు చేరాలంటే లక్ష్యాన్ని కేవలం 6.4 ఓవర్లలో ఛేదించాలి. పాక్ 6.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి ఔటైంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పాకిస్తాన్ ఇంటముఖం పట్టడంతో.. న్యూజిలాండ్ నాలుగో జట్టుగా ఈ మెగా టోర్నీలో సెమీఫైన్లకు అర్హత సాధించింది. నవంబర్ 15న వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం రెండో సెమీఫైనల్లో కోల్కతా వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలోనే -
టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలవడం ఖాయం! కానీ..
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అన్నాడు. ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయొద్దని రోహిత్ సేనకు విజ్ఞప్తి చేశాడు. అలా అయితే మొదటికే మోసం వస్తుందని విండీస్ లెజెండరీ ఆల్రౌండర్ రిచర్డ్స్ హెచ్చరించాడు. కాగా ప్రపంచకప్-2023లో లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలోనూ టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఇప్పటికే టేబుల్ టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ విజయంతో అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. నెదర్లాండ్స్ వంటి పసికూనతో మ్యాచ్లో భారత జట్టుకు ఇదేమీ అంతకష్టమని పనికాదు. న్యూజిలాండ్తో మ్యాచ్ అంటేనే ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్ధమైంది. శ్రీలంకపై ఘన విజయంతో అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న కివీస్.. రోహిత్ సేనతో తలపడటం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే, 2015, 2019 టోర్నీల్లో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి ఏం జరుగుతుందోననే ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వివియన్ రిచర్డ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలా అయితేనే ఆఖరి వరకు అజేయంగా ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా చివరి దాకా అజేయంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అయితే, కొన్నిసార్లు.. ‘మేము ఇక్కడిదాకా బాగానే ఆడాం.. కానీ సెమీ ఫైనల్లో ఏం జరుగుతుందో’ అనే భయాలు ఉండటం సహజం. కానీ ఇలాంటి ప్రతికూల అంశాల గురించి ఎంత పక్కనపెడితే అంత మంచిది. ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో ఎలా ఆడారో ఇక ముందు కూడా అలాగే ఆడాలి. వాళ్ల మైండ్సెట్లో ఎలాంటి మార్పూ రాకూడదు’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. నెగటివ్గా అనిపించే ప్రతి విషయాన్ని భారత ఆటగాళ్లు పక్కనపెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ -
కివీస్కు సెమీస్ పిలుపు!
గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ కీలక సమరంలో తమ సత్తా చాటింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాల తర్వాత నాలుగు పరాజయాలతో తమ పరిస్థితిని క్లిష్టంగా మార్చుకున్న కివీస్ ఆఖరి ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చి దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు మరే జట్టుపై ఆధారపడకుండా తమ సెమీస్ అవకాశాలను తానే సృష్టించుకుంది. కివీస్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు చేజారాయి. సాంకేతికంగా, అంకెల ప్రకారం పాక్ పూర్తిగా, అధికారికంగా నిష్క్రమించకపోయినా... అసాధ్యమైన, ఊహకు కూడా అందని తరహాలో ఆ జట్టు తర్వాతి మ్యాచ్లో గెలవాల్సిన నేపథ్యంలో వాస్తవికంగా చూస్తే పాక్ ఆట ముగిసినట్లే! బెంగళూరు: పదునైన బౌలింగ్, ఆపై దూకుడైన బ్యాటింగ్తో న్యూజిలాండ్ వరల్డ్కప్ లీగ్ దశను ఘనంగా ముగించింది. సెమీస్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో చెలరేగిన ఆ జట్టు తమ లక్ష్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. 10 ఓవర్లలోపే 70/5 స్కోరుతో కుప్పకూలేందుకు సిద్ధమైన లంక... చివర్లో మహీశ్ తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/37)తో పాటు ఇతర కివీస్ బౌలర్లూ సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. కాన్వే (42 బంతుల్లో 45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 74 బంతుల్లోనే 86 పరుగులు జోడించి విజయానికి పునాది వేయగా, మిచెల్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో న్యూజిలాండ్ సెమీస్కు చేర డం దాదాపుగా ఖాయం కాగా... కివీస్ ఓటమిపై ఆశలు పెట్టుకున్న పాక్, అఫ్గానిస్తాన్కు నిరాశ తప్పలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) లాథమ్ (బి) సౌతీ 2; పెరీరా (సి) సాన్ట్నర్ (బి) ఫెర్గూసన్ 51; మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) (బి) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 19; కరుణరత్నే (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మదుషంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–3, 2–30, 3–32, 4–70, 5–70, 6–104, 7–105, 8–113, 9–128, 10–171. బౌలింగ్: బౌల్ట్ 10–3–37–3, సౌతీ 8–0–52–1, ఫెర్గూసన్ 10–2–35–2, సాన్ట్నర్ 10–2–22–2, రచిన్ 7.4–0–21–2, ఫిలిప్స్ 1–0–3–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–86, 2–88, 3–130, 4–145, 5–162. బౌలింగ్: మదుషంక 6.2–0–58–0, తీక్షణ 7–0–43–1, ధనంజయ 2–0–22–0, చమీర 4–1–20–1, మాథ్యూస్ 4–0–29–2. ప్రపంచకప్లో నేడు దక్షిణాఫ్రికా x అఫ్గానిస్తాన్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CWC 2023 Semis Race: కివీస్.. శ్రీలంక చేతిలో ఓడినా పర్లేదు.. !
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో ముందువరుసలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లంకపై కివీస్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోటీ ఉండదు. ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్కు చేరుకుంటుంది. లంక చేతితో ఓడినా సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్.. శ్రీలంక చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. సెమీస్ రేసులో ఉన్న మిగతా రెండు జట్లు తమతమ ప్రత్యర్దుల చేతుల్లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, పాక్, ఆఫ్ఘనిస్తాన్కు సమానంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. ఎవరు గెలిచినా సెమీస్లో టీమిండియానే ప్రత్యర్ధి.. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న మూడు జట్లలో (కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్) ఏ జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించినా అక్కడ వారి ప్రత్యర్ది టీమిండియానే అవుతుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు మరో సెమీస్లో తలపడతాయి. ప్రస్తుత ఎడిషన్లో వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచిన భారత్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలుస్తుంది. అలాగే రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సైతం మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. గెలుపోటములు వారి స్థానాలపై ప్రభావం చూపవు. కాబట్టి రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖరారైపోయింది. సెమీస్ ఎప్పుడు, ఎక్కడ అంటే.. ప్రస్తుత వరల్డ్కప్లో రెండో సెమీస్లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. తొలి సెమీస్లో భారత్తో తలపడబోయే జట్టు ఏదో తేలాల్సి ఉంది. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఏ జట్టు సెమీస్కు చేరినా ముంబై వేదికగా నవంబర్ 15న భారత్తో తలపడాల్సి ఉంటుంది. కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖాయమైపోయింది. ఈ రెండు సెమీస్లలో గెలిచే జట్లు నవంబర్ 19న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ ఘోర ఓటమి.. సెమీస్ రేసులోకి పాకిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ప్రోటీస్ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. పాకిస్తాన్ సెమీస్కు చేరాలంటే? ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్కు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్పై కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడు పాక్ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ కివీస్, అఫ్గాన్ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ కివీస్ ఒక్క మ్యాచ్, అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్రేట్ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్కు ఈజీగా చేరే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి సెమీస్కు అసీస్ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది. చదవండి: World Cup 2023: న్యూజిలాండ్ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం -
వరల్డ్ కప్లో సగం మ్యాచ్లు పూర్తి.. సెమీఫైనల్కు వచ్చేది ఎవరు?
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్తో ఈ మెగా టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లతో కలిపి ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 23 మ్యాచ్లు పూర్తయ్యాయి. కాగా ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీ మొదటి అర్ధబాగంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ వంటి పసికూనలు వరల్డ్క్లాస్ జట్లను మట్టికరిపించాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఆఫ్గానిస్తాన్ చిత్తుచేయగా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది. సెమీఫైనల్స్కు చేరేది ఎవరు? ఈ ఏడాది వరల్డ్కప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన భారత్.. ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత జట్టు పటిష్ట ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఇక పాయింట్ల పట్టికలో టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికా ఉంది. దక్షిణాఫ్రికా కూడా సూపర్ ఫామ్లో ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన ప్రోటీస్.. నాలుగింట విజయం సాధించింది. ఇక మూడో స్ధానంలో కివీస్ ఉంది. కివీస్ కూడా టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతోంది. భారత్తో మినహా మిగితా మ్యాచ్లన్నింటిలోనూ బ్లాక్ క్యాప్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక కివీస్ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడిన ఆసీస్.. ఆ తర్వాత తిరిగి గాడిలో పడింది. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ఆసీస్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ అర్హత సాధిస్తాయి. అయితే హాఫ్ స్టేజి ముగిసేటప్పటికి సెమీఫైనల్ చేరే జట్లపై ఇంకా సృష్టత రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో సెమీఫైనల్ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్.. నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. చదవండి: ఐపీఎల్ ఆడిన అనుభవం కలిసొచ్చింది.. అతడు మాత్రం అద్బుతం: సౌతాఫ్రికా కెప్టెన్
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement