-
అల్లూరికి అర్ధ శతాబ్దం
‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్లో స్కెచ్తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్ వాహినీ స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్లు లేకపోవడంతో యూనిట్లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసేందుకు రెండే లెన్స్లు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్కి కెమెరా వ్యూఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు. అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్ హిట్. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా, ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్ల్యాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’ తీయను’’ అన్నారు ఎన్టీఆర్.మహారథి చేతికి స్క్రిప్ట్ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. -
సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'సీతా కల్యాణ వైభోగమే'. ఈ చిత్రాన్ని సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకముంచిన నిర్మాత రాచాల యుగంధర్కు థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ మంచి కమర్షియల్ సినిమా తీశారు. గగన్ విహారి చాలా వైల్డ్గా నటించారు. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతమందించారు. -
అల్లు అర్జున్కు అరుదైన గౌరవం.. తొలి నటుడిగా రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న బన్నీకి అరుదైన గౌరవం లభించింది. దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వయంగా అల్లు అర్జున్ హాజరైన తన రూపాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో ఫోటోలో కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి నటుడిగా రికార్డ్ కాగా.. టాలీవుడ్ ఫ్యాన్స్ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ తనదైన నటనతో ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. భారతదేశంలో అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండియా నుంచి ఏ ఒక్క నటుడికి ఇలాంటి గౌరవం దక్కలేదు. తొలిసారి మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తన విగ్రహాన్న చూసిన బన్నీ.. నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందని.. చాలా రియలిస్టిక్గా చేశారని వారిని ప్రశంసించారు. విగ్రహం ప్రత్యేకతలు ఈ మైనపు విగ్రహం ఫర్ఫెక్ట్గా రావడం కోసం 200 రకాల మేజర్మెంట్స్ను అల్లు అర్జున్ నుంచి సేకరించారు. తన డాన్స్ మూమెంట్స్ను కూడా సేకరించడం జరిగిందని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మేనేజర్ అయిన సనాజ్ కోల్స్రడ్ వెల్లడించారు. Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO — Allu Arjun (@alluarjun) March 28, 2024 View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
టాలీవుడ్లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ!
టాలీవుడ్లో మరో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ‘శివమ్ మీడియా’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. తాజాగా శివమ్ మీడియా లోగో, బ్యానర్ను ప్రముఖ నటుడు అలీ, నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. 'శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనిల్ కడియాల మాట్లాడుతూ– 'శివమల్లాల మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. 'ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్గా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్ని పెట్టింది అనిపిస్తోంది. ఈ విషయంలో నేను ఎంతో ఫీలవుతున్నా. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. 'నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్ని ప్రారంభించటం చాలా సంతోషం. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్పై మంచి సినిమాలు చేస్తా' అని అన్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్హిట్గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నయ్ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 29 నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
మెగాస్టార్ ప్లేస్ కోసం ఆ స్టార్ వేట..!
-
సెన్సేషన్ సృష్టిస్తున్న ఇళయరాజా బయోపిక్
-
ఫ్యామిలీ స్టార్ టైటిల్.. విజయ్ దేవరకొండ కోసం కాదు: దిల్ రాజు ఆసక్తకర కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఐడీ, హెల్త్ కార్డ్, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్గా చూపించేందుకు చేసిన సినిమా కాదని.. ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ..'ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్గా చూపించేందుకు చేస్తున్న సినిమా కాదు. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి చెప్పని విషయాన్ని ఈ వేదిక మీద రివీల్ చేస్తున్నా. మీరంతా ఎక్కడో ఉన్న మీ కుటుంబాలను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. ఈ వేదిక మీద ఉన్న ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ఆర్ నారాయణమూర్తి మేమంతా సాధారణ జీవితాలతో మొదలై మా రంగాల్లో కష్టపడి ప్రయోజకులమై పైకి వచ్చాం. మా కుటుంబాలకు ఈ సొసైటీలో ఒక పేరు దక్కేలా చేశాం. అలాంటి వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే ఫ్యామిలీ స్టార్ కథాంశం' అని అన్నారు. -
నా మాటలు అపార్థం చేసుకున్నారు.. కానీ మా నాన్న: మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే తన తండ్రి మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో ఏర్పాటు సమావేశంలో పొలిటికల్ కామెంట్స్ చేశారు. మంచి చేసే వాళ్లకే ఓటేయండి అంటూ యువతకు సలహా ఇచ్చారు మంచు మనోజ్. అయితే అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా మంచు మనోజ్ వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మిత్రులకు, శ్రేయోభిషులకు, మీడియా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నా. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. దానిపైనే స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడింది. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని' అని అన్నారు. నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టంగా చెబుతున్నా. నా సందేశం కేవలం ఐక్యత, అవగాహనతో సార్వత్రిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యం. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. పూర్తి అవగాహన కోసం నా ప్రసంగాన్ని ఎవరైనా పూర్తిగా వీక్షించడానికి నా ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశా. ఒక సినిమా నటుడిగా, సినిమా మాధ్యమం ద్వారా ఏకం చేయడం, వినోదం అందించడం నా ముందున్న లక్ష్యం. మీ మద్దతు, నా కుటుంబం, నా పట్ల మీరు చూపే అపారమైన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. కులం, మతం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించారు. ఒక కుటుంబంగా దానిని మేము విశ్వసిస్తాం. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని పోస్ట్ చేశారు. మనోజ్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ వివాదానికి దారితీయడంతో ట్వీట్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Dear Friends, Well-wishers, and Esteemed Members of the Press, I hope this message finds you all in good spirits and health. I wish to address recent events and clarify misunderstandings stemming from my Father’s Birthday Celebrations. Firstly, I want to address the confusion… — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 21, 2024 -
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. తెలుగులో ఆ ఒక్క సినిమా మాత్రమే!
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) -
తెలుగులో వస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్!
కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం పా..పా. ఈ చిత్రాన్ని గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన దా..దా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్. రెడ్డి తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను డైరెక్టర్ త్రినాధ రావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ.. 'తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన దా..దా మూవీని తెలుగులో పా..పా..గా మన ముందుకు తీసుకొస్తున్నారు. డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు.ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు.. ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ కథ. ఈ సినిమా నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ త్రినాధరావుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో సాహసం చేయరా డింభక అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో వస్తున్నాం. ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను. ఒక మంచి సినిమా చూశానని అనిపించింది. చెప్పగానే నా యూఎస్ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యి తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
'వీ లవ్ బ్యాడ్ బాయ్స్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: వీ లవ్ బ్యాడ్ బాయ్స్ నటీనటులు: బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ తదితరులు నిర్మాణసంస్థ: బీఎం క్రియేషన్స్ నిర్మాత: పప్పుల కనకదుర్గా రావు దర్శకత్వం: రాజు రాజేంద్ర ప్రసాద్ మంచి ఎమోషన్స్తో అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన చిత్రం 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్'. ఈ చిత్రం నేటి యువత, ప్రేమకు అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాను ఎమోషనల్గా మలిచినా కూడా మన మూలాల్ని చూపించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు, యువత తప్పకుండా చూడదగ్గ చిత్రంగా థియేటర్లోకి వచ్చింది. బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏకసిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీ రోల్స్ పోషించారు. బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ చిత్రానికి రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అసలు కథేంటంటే.. ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) రూమ్మేట్స్ పైగా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురూ నిజమైన, స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ ఆ ముగ్గురి ప్రేమలో పడతారు. అంటే దివ్య ప్రశాంత్తో, రమ్య వినయ్తో, పూజ అరుణ్లతో ప్రేమలో పడతారు. దీంతో వారి తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారు ఇష్టపడ్డ వారితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రశాంత్, వినయ్ వారిని వివాహం చేసుకోవడానికి విస్మరిస్తారు. ప్రశాంత్, వినయ్ పెళ్లిని ఎందుకు నిరాకరించారు? అసలు ఈ జంటల మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. నేటి యువతకు సరిపోయేలా ఈ సినిమాను దర్శకుడు ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నేటి యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా.. ఎంతో వినోదభరితంగా సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. క్లైమాక్స్లో ఇటు యూత్కి.. అటు పేరెంట్స్కి ఇచ్చిన సందేశం అందరినీ కదిలిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్స్,వేశ్య సన్నివేశం, అలీ ఎపిసోడ్లు, క్లైమాక్స్ ఎపిసోడ్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు రాజు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అందించారు. ఇది రొటీన్ సినిమా కాబట్టి ఓవరాల్గా బాగుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే.. అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుత యువత ఈ పాత్రలలో బాగా కనెక్ట్ అవుతారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపించారు. పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి, శివారెడ్డి తమ పరిధిలో ఆకట్టుకున్నారు. సాంకేతికత విషయానికొస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజ్ చేస్తుంది. లొకేషన్స్, విజువల్స్ అందంగా కనిపిస్తాయి. అయితే ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ సారి ఏకంగా వీకెండ్ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్ ప్లాన్ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్గా స్ట్రీమింగ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్ వీకెండ్ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. నెట్ఫ్లిక్స్ మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08 లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్ (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08 లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08 షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08 అమెజాన్ ప్రైమ్ ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్) -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
కింది నుంచి పై స్థాయికి చేరుకున్న స్టార్స్
-
భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ఇటీవలే న్యూజిలాండ్కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కన్నప్ప రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇవాళ తన 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య విరానికా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్లో ఆమెను తీసుకెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో కన్నప్ప షూట్లో ఉన్న మంచు విష్ణు భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విరానికా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. కాగా.. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరానికా రెడ్డిని మార్చి 1, 2009న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరో వైపు.. విష్ణు భార్య విరానికా ఫ్యాషన్ డిజైనర్గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
పాన్ ఇండియా మూవీగా వస్తోన్న రికార్డ్ బ్రేక్..!
నిహార్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. మళ్లీ పుట్టి వచ్చినవా అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తోంది. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాని బ్యూటిఫుల్ లొకేషన్స్లో చిత్రీకరించాం. అతి త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో 8 భాషల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలత పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్వర్త్ SSMB29 ప్రాజెక్ట్లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది. Legendary Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/IH2wEYI6IM — Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 29, 2024 -
నిర్మాత మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్ (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్. ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు. అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్: టీమిండియా మాజీ క్రికెటర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల గుండెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తన అభిమాన హీరోలని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ లిస్ట్లో మరో క్రికెటర్ చేరిపోయారు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీశాంత్ జూనియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారని.. మీ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెళ్తూ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. 'ఆయనకు గుర్తు ఉందో లేదో తెలియదు కానీ.. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ను కలిశా. అక్కడే ప్రియమణి, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లా. మీరు డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని చెప్పా. థ్యాంక్యూ శ్రీశాంత్ అన్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆయనను చూస్తే చాలా మోటివ్గా అనిపించింది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాలో చిన్న అవకాశమొచ్చిన నటిస్తా' అని అన్నారు. -
'రామ్ చరణ్కు ఫోన్ చేయి అన్నా'.. వరుణ్ తేజ్ రిప్లై ఇదే!
మెగా హీరో వరుణ్తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులో రామ్ చరణ్ చేతుల మీదుగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ను రిలీజ్ చేయగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో మెగా హీరో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న వరుణ్ తేజ్కు అభిమానుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అక్కడే ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ అడుగన్న ప్లీజ్.. అంటూ వరుణ్ తేజ్కు రిక్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ అన్నకు ఫోన్ చేసి కనుక్కో అన్నా అని అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నా.. ఈ రోజే షూటింగ్ స్టార్ట్ అయిందనుకుంటా.. అక్కడి నుంచి ఈరోజే ఉదయం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అంటూ ఫ్యాన్స్కు సమాధానమిచ్చారు. ఈ రోజును మీకు అన్ని అప్డేట్స్ వస్తాయని వరుణ్ తేజ్ అన్నారు. Mega Prince @IAmVarunTej about #GameChanger UPDATE.#RamCharan #VarunTej #OperationValentine #TeluguFilmNagar pic.twitter.com/12u478l8h6 — Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2024
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement