-
ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ కైవసం
నేపాల్లో జరిగిన ముక్కోణపు సిరీస్ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. నేపాల్తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ వాన్ డర్ గుగ్టెన్ చివరి ఓవర్ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్గా మలిచి నెదర్లాండ్స్ను గెలిపించాడు. గుగ్టెన్ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్ను విజయతీరాలకు చేర్చాడు. The Nepal crowd is simply amazing in every manner! 🇳🇵pic.twitter.com/giCO1hA1oE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 గుగ్టెన్ మెరుపు ఇన్నింగ్స్కు ముందు సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. Netherlands' victory lap. - Nepal fans cheering and applauding them in numbers. 👏pic.twitter.com/uc8ch0XO52 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (47), గుల్సన్ ఝా (34), కుశాల్ మల్లా (26), రోహిత్ పౌడెల్ (25), కుశాల్ భుర్టెల్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. లెవిట్ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్ (48), గుగ్టెన్ (21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ ఓడౌడ్ (22), విక్రమ్జిత్ సింగ్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సిరీస్లో నేపాల్, నెదర్లాండ్స్తో పాటు నమీబియా పాల్గొంది. -
నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్
స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్ (50) అర్దసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. ఆఖర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్పాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
నేపాల్ బ్యాటర్ల వీరోచిత పోరాటం
నేపాల్ టీ20 ట్రై సిరీస్లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడి నేపాల్ను విజయానికి చేరువ చేశారు. అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్లో 9 పరుగులు, 18వ ఓవర్లో 18, 19వ ఓవర్లో 15, 20వ ఓవర్లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు. ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. విండీస్పై ఘన విజయం
Womens T20I Tri Series South Africa 2023: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో (వర్షం కారణంగా ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత్.. ఇవాళ (జనవరి 30) విండీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (4-2-11-3), పూజా వస్త్రాకర్ (4-1-19-2) గైక్వాడ్ (4-1-9-1) బౌలింగ్లో సత్తా చాటడంతో విండీస్ను 94 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) నియంత్రించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (34) విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా నిలిచింది. 95 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. జెమీమా రోడ్రిగ్స్ (42 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (32 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో రాణించడంతో 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి మంధన (5), హర్లీన్ డియోల్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. విండీస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో సంబంధం లేకుండా ఇదివరకే ఫైనల్కు చేరిన భారత్.. ఫిబ్రవరి 2న టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. -
Ind Vs Pak: భారత్తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
NZ- Ban- Pak Tri Series- T20 World Cup 2022- India Vs Pakistan: క్రికెట్ ప్రేమికుల హాట్ ఫేవరెట్ మ్యాచ్లలో అన్నింటి కంటే ముందు వరుసలో ఉండేది ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండటంతో దాయాదుల పోరుపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రెండు సార్లు తలపడిన రోహిత్ సేన- బాబర్ ఆజం బృందం.. టీ20 వరల్డ్కప్-2022లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న టీమిండియా- పాక్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఈ మెగా పోరుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహా ఇతర ఆటగాళ్లు.. మైండ్గేమ్ మొదలుపెట్టారు. టీమిండియాతో మ్యాచ్ కోసం ఇలా.. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్లో ట్రై సిరీస్ ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా భాగమైన ఈ సిరీస్లో కివీస్- పాక్ ఫైనల్కు చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్-2022 కోసం ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలోనే తాము ఈ సిరీస్లో పాల్గొన్నట్లు వెల్లడించాడు. ‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. అయితే, ఇలాంటి మ్యాచ్లో ప్రశాంతమైన మైండ్సెట్తో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మెరుగ్గా ఆడగలం. ఇండియాతో మ్యాచ్లో కచ్చితంగా పూర్తిస్థాయిలో.. వందకు వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’ అని తమ ప్రణాళిక గురించి చెప్పాడు. ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహం అదే విధంగా న్యూజిలాండ్లో ట్రై సిరీస్లో ఆడటం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని.. ఈ సిరీస్ ద్వారా మెగా టోర్నీకి ముందు తమకు మంచి అవకాశం దొరికింది అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా ట్రై సిరీస్లో భాగంగా శుక్రవారం (అక్టోబరు 14) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్లో కనీవినీ ఎరుగని రీతిలో ‘కోహ్లి సేన’ పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈలో పాకిస్తాన్తో మ్యాచ్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. చదవండి: Babar Azam: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ T20 WC 2022: మెగా టోర్నీలో అరుదైన ఘనతల ముంగిట రోహిత్ శర్మ! అదే జరిగితే రికార్డులన్నీ బద్దలే!
Pagination
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
Advertisement