-
‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేయద్దు కన్ఫ్యూజన్లో ఎక్కువగా తినేస్తాం’
సాక్షి, సిటీబ్యూరో: ‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేయద్దు కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా’ అంటాడో సినిమాలో హీరో. చుట్టూ హ్యాపీనెస్ ఉండాలి.. ఉంటే ఎక్కువ తినేస్తాం అంటున్నారు నగరవాసులు. సిటిజనుల చిరుతిళ్ల సరదాకు హ్యాపీ మూడ్ ఒకింత ఊపునిస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. అలా హ్యాపీ–టేస్ట్లో మునిగి తేలుతున్న సిటిజనుల సంఖ్యలో దేశంలోనే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని కూడా తేల్చింది. మానసిక స్థితికి, తినే తిండికి మధ్య బలమైన సంబంధం ఉంది. నిజానికి ఒత్తిడి ఆకాశాన్నంటుతున్నప్పుడు, మానసిక స్థితి క్షీణిస్తున్నప్పుడు, ఆలోచనలు చిరుతిండి వైపు మళ్లుతాయనేది ఎప్పటి నుంచో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నదే. సంతోషంగా ఉన్నప్పుడు కూడా చిరుతిండి అధికం అవుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అభి‘రుచుల’తో భావోద్వేగాలు.. అంతర్జాతీయ సంతోష దినోత్సవం (మార్చి 20) సందర్భంగా మూడ్ అప్లిఫ్టర్’ పేరిట గోద్రెజ్ యుమ్మీజ్ నిర్వహించిన ది ఇండియా స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం.. 72 శాతం భారతీయులు తమ అభిరుచులను భావోద్వేగాలతో అనుసంధానిస్తున్నారు. తాము సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ తీసుకుంటున్నారు. చిరుతిళ్లు మానసిక ఆనందపు స్థాయిని మరింత పెంచే సాధనంగా అత్యధికులు భావిస్తున్నారు. చిరుతిండిని వారి మానసిక స్థితితో అనుసంధానిస్తున్న వారిలో 70 శాతం స్నాక్స్ తిన్న తర్వాత మరింత సంతృప్తిగా, ఉత్సాహంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. తూర్పు భారతంలో ఎక్కువ.. ప్రాంతాలవారీగా పోల్చినప్పుడు, తూర్పు భారతంలో 75 శాతం మంది సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ అల్పాహారం తీసుకుంటారని నివేదిక తేల్చింది. ఇక పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల్లో ఇది 72, 67, 74 శాతాలుగా లెక్కగట్టారు. నగరాల వారీగా చూసినప్పుడు ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కోల్కతా ప్రజలు సంతోషాన్ని బట్టి ఎక్కువ స్నాక్స్ తినేస్తారు. ఈ విషయంలో ఢిల్లీ 81 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, చైన్నె, హైదరాబాద్లు ఒక్కొక్కటి 77 శాతం, కోల్కతా 75 శాతంతో టాప్లో ఉన్నాయి, ఈ నగరాల్లోని స్థానికులు స్నాక్స్ను మూడ్ అప్లిఫ్టర్లుగా భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అదే క్రమంలో ముంబై సగటు 68 శాతంగా అహ్మదాబాద్ 67 శాతం. దీని తర్వాత పుణె, బెంగళూరు 66, లక్నో 62, జైపూర్ 61 శాతాల చొప్పున ఉన్నాయి. నివేదికలో మరో విశేషం.. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ తీసుకునేవారిలో మహిళలే కొంచెం అధికంగా ఉన్నారు. ఫుడ్– మూడ్ కనెక్షన్కు సంబంధించి 74 శాతం మహిళలు 70 శాతం పురుషులు ఉన్నారు. అధికమైతే అనారోగ్యమే.. చిరుతిళ్లు అధికంగా తినడం అనారోగ్యకారకంగా మారుతుందని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.రమేష్ చెప్పారు. సంతోషంగా లేదా కొంత ఒత్తిడిలో ఉన్నప్పుడు స్నాక్స్ తీసుకునే క్రమంలో పరిమితి తప్పే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని తద్వారా ఊబకాయం సహా పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు సోషల్ మీడియా తోడుగా... సంతోషాన్ని పంచుకోవడానికి తాము ప్రాధాన్యమిచ్చే వాటిలో సోషల్ మీడియా తొలి స్థానంలో ఉందని ఆధునికులు అంటున్నారు. యూగోవ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా స్నాప్ చాట్ ను తాము హ్యాపీ నెస్ షేరింగ్ వేదికగా ఎక్కువగా వినియోగిస్తామని 87 శాతం నెటిజనులు వెల్లడించారు.. -
సిర్రోసిస్తో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం
సిర్రోసిస్ అన్నది ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం స్థానంలో అనారోగ్యకరమైన (ఫైబ్రస్ స్కార్ టిష్యూ) పెరగడం వల్ల వచ్చే సవుస్య. విపరీతంగా వుద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీలివర్ అనే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి ఎలాంటి కారణం తెలియకపోవచ్చు కూడా. ఇలాంటి కండిషన్ను క్రిప్టోజెనిక్ అంటారు. సిర్రోసిస్ వల్ల కడుపులో నీరు చేరడం, కాలేయ–వుూత్రపిండాల సవుస్యలు లాంటి ఎన్నో సవుస్యలు వస్తాయి. సిర్రోసిస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్లను బట్టి ఆహార నియవూలు పాటించాల్సి ఉంటుంది. సిర్రోసిస్ సవుస్య వచ్చినవాళ్లకు సాధారణ సవుతుల ఆహారం ఇవ్వాలి. అంటే... అన్ని రకాల పోషకాలు సమంగా అందేలా... ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. లివర్ సిర్రోసిస్ వచ్చినవాళ్లలో కడుపులో ద్రవాలు చేరడం, కాలేయవాపు, పోర్టల్ రక్తనాళంలో ప్రెషర్ ఉన్నట్లయితే... అలాంటివారికి ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. అంటే వారికి ఆహారంలో పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఐటమ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ (సాల్టెడ్ చిప్స్), ఉప్పులో వేయించిన జీడిపప్పు (సాల్టెడ్ నట్స్), సాస్లు, జామ్లు వంటివాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సిర్రోసిస్వల్ల హెపాటిక్ ఎన్కెఫలోపతి అనే వూనసిక సవుస్య వస్తే నాన్వెజిటేరియన్ ప్రోటీన్స్ ఇవ్వడం సరికాదు. -
ఆరోగ్యం ‘దుమ్ము’కొట్టుకుపోతోంది.. తాండూరులో రోజూ 100 మంది..
Unhygienic Hotels And Roadside Foods: హోటల్ ఫుడ్ తింటున్నారా.. అయితే అంతే సంగతి.. ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రిలో చేరాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఆహార భద్రతాప్రమాణాలను పాటించకుండా ఫ్రిజ్లో నిల్వ చేసిన పదార్థాలను, రోడ్డుపై చేసిన పదార్థాలను తిని జనాలు రోగాలబారిన పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కుళ్లిన, కలుషిత ఆహారాన్ని రుచికరంగా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలోని హోటళ్లు, రోడ్సైడ్ ఫుడ్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, వికారాబాద్: జిల్లాలోనే పారిశ్రామిక పట్టణంగా పేరున్న తాండూరు మున్సిపాలిటీలో హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యాపార పరంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తుంటారు. వచ్చిన వారు తాండూరు ప్రాంతంలోని ఏదో ఒక హోటల్లో కడుపు నింపుకోవాలి. అయితే హోటల్ నిర్వాహకులు వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంలేదంటూ విమర్శలు ఉన్నాయి. కలుషిత ఆహారం తిన్న ఎంతోమంది ఫుడ్ పాయిజన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు హోటళ్లను తనిఖీ చేయగా కుళ్లిన పదార్థాలతో పాటు కుళ్లిపోయిన చికెన్, మటన్ను గుర్తించారు. అప్పట్లో పలు హోటళ్లను సీజ్ చేశారు. అలాగే రోడ్సైడ్ ఉండే టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లలో సైతం నాణ్యమైన పదార్థాలను అందించడం లేదనే విమర్శలున్నాయి. ( చదవండి: తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే? ) రెండేళ్లుగా పర్యవేక్షణ కరువు జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లాకు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. అయితే జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఫుడ్ సెఫ్టీ అధికారిని నియమించలేదు. దీంతో తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులే హోటళ్లలో తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్ అధికారులు కూడా హోటళ్లను తనిఖీ చేయడం లేదు. మున్సిపాలిటీలో ఇన్చార్జి కమిషనర్ ఉండటంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రోగాలబారిన పడుతున్న ప్రజలు తాండూరు ప్రాంతంలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం తిని ప్రతిరోజు 100 మందికి పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణంలో అధికంగా రోడ్లపైనే టిఫిన్ సెంటర్లు, చాట్ బంఢార్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలో దుమ్ము, కాలుష్యం అధికంగా ఉంది. గాలిలో ఉన్న దుమ్ము మొత్తం ఆహార పదార్థాలపై పడి కలుషితం అవుతోంది. అది తిన్నవారు ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారులు ఆహార భద్రతపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హోటళ్లపై దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’ -
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత
బూర్గంపాడు: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(65) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతి చెందారు. బూర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989, 1994 ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా బూర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో రెండేళ్లు పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే -
కే4 పులికి ఒంట్లో బాగోలేదా.. ?
సాక్షి, భీమారం(చెన్నూర్): రెండేళ్లుగా భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి హతమార్చిన కే4 పెద్దపులి ఆరోగ్యం వేటకు సహకరించట్లేదు. దీంతో మరో పులి దానికి ఆహారం అందిస్తోంది. శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. రెండేళ్ల క్రితం ఈప్రాంతానికి వచ్చిన ఆడపులికి వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు శరీరం చుట్టూ ఉండి తీవ్ర గాయాలయ్యాయి. పులి ఉచ్చుని తొలగించేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలించలేదు. పెద్దపులిని బంధించి దానికి ఉన్న ఇనుప వైర్లు తొలగించేందుకు అడవుల్లో బోన్లు ఏర్పాటు చేసి ఎరగా దూడలు కట్టేసి ఉంచినా అధికారుల పాచికలు పారలేదు. అనేక నెలల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించినా పులి చిక్కలేదు. దీంతో పులికి చికిత్స చేయించాలనే ఆలోచనని అటవీశాఖ పక్కకు పెట్టింది. (భూపాలపల్లి అడవుల్లో మగ పులి) గొల్లవాగు ప్రాజెక్ట్ కేంద్రంగా భీమారం సమీపంలోని గుట్టల మధ్య నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్ నీటివనరులు పెద్దపులికి అనుకూలంగా మారాయి. ప్రాజెక్ట్కు అతి సమీపంలో ఉన్న పులిఒర్రెలో పెద్దపులి నివాసం ఏర్పర్చుకొని అక్కడనుంచి చెన్నూర్ మండలం బుద్దారం, కోటపల్లి మండలంలోని అడవుల్లో సంచరిస్తోంది. అయితే సంవత్సరం క్రితం వచ్చిన మగపులి ఆడపులిని అక్కున చేర్చుకుంది. కొన్నాళ్ల పాటు రెండు వేర్వేరుగా తిరిగి వచ్చి ఆవాసానికి చేరుకునేవి. ప్రతిరోజు వేర్వేరుగా ఆహారం వేటాడి తినేవి. రెండు నెలల క్రితం ఏ2 మగపులి మరొకటి ఈప్రాంతానికి వచ్చినా ఆవాసం లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది. క్షీణిస్తున్న ఆరోగ్యం ఆడపులి శరీరం చుట్టూ ఉన్న ఇనుప వైరు కారణంగా అది ఇంతవరకూ గర్భం దాల్చడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆరునెలల నుంచి కే4 ఆడపులి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆహారం కోసం వేట కూడా చేయలేని స్థితికి అది చేరుకుంది. తోడుగా ఏ1.. క్షీణిస్తున్న ఆరోగ్యంతో వేటాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపులికి మగ పులి తోడుగా ఉంటూ అడవిజంతువులతో పాటు పశువులపై దాడి చేసి ఆహారం అందిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కాజిపల్లి వద్ద రెండు పశువులను చంపిన పులి వెంట ఉన్న దానికి మరొక దానిని అప్పగించిందని వారు తెలిపారు. దాడి తరువాత భీమారానికి కాజిపల్లి వద్ద రెండు గేదెలను హతమార్చిన పులులు సాయంత్రం గొల్లవాగు ప్రాజక్ట్ సమీపంలోని వాగుకి వచ్చాయని చేపల వేటకు వెళ్లిన వారు పేర్కొన్నారు. చేపలు పడుతుండగా పులుల గాండ్రింపులు వినబడ్డాయని.. దాంతో పరుగెత్తుంటూ గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. భయంభయం గతంలో వేర్వేరుగా సంచరించిన పులులు ఇప్పుడు జతకట్టి తిరుగుతుండటంతో భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోనే అడవి ఉంటుందని పశువులను ప్రతి రోజూ అడవికి పంపిస్తుంటామని ఆందోళన చెందుతున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement