-
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్తో క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్గానూ రాణించాడు.గిల్క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం -
T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్డౌన్లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్డౌన్ బ్యాటర్కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్మన్ గిల్పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్కప్లో ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు."అశ్విన్ వైట్బాల్ క్రికెట్కు సెట్ కాడు. అశ్విన్కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్ ఈ ఏడాది సీజన్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
అప్పుడు సెహ్వాగ్కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)
-
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్గా, కెప్టెన్గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్లలో ముంబై ఓడింది.ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. గతంలో కెప్టెన్గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
ఓ జట్టు నుంచి నాకు ఆఫర్ వచ్చింది.. నా పార్టీ బిల్ కంటే: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత మైలురాయిలను అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచూరియాన్గా వీరేంద్రుడు కొనసాగుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20ల్లొ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్లో కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో చిట్ చాట్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.గతంలో బిగ్ బాష్ లీగ్ నుంచి తనకు వచ్చిన గొప్ప ఆఫర్ను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్లో భారత ఆటగాళ్లు ఆడే అవకాశముందా అన్న ప్రశ్న సందర్భంగా సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గిల్క్రిస్ట్, సెహ్వాగ్ మధ్య జరిగిన చిట్చాట్పై ఓ లుక్కేద్దాం.ఆడమ్ గిల్క్రిస్ట్: భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్ల్లో ఆడే ఛాన్స్ ఉందా?వీరేంద్ర సెహ్వాగ్: "లేదు , మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా రిచ్. పేద దేశాలకు వెళ్లి ఆడము (నవ్వుతూ). నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత మొత్తం ఇస్తారని నేను ఆడిగాను. అందుకు వారి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.వారు నాకు లక్ష డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షలు) ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకుని అంతకంటే ఎక్కువ డబ్బులను నా సెలవుల్లో ఖర్చుచేస్తానని, గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటిందని వారికి చెప్పానని" సెహ్వాగ్ తెలిపాడు. -
అప్పుడు సెహ్వాగ్కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం!(ఫొటోలు)
-
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్ కామెంట్స్ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు ప్రశ్నలు సంధించిన స్పోర్ట్స్ ప్రజెంటర్ను సరదాగా ట్రోల్ చేశాడు. కావాలనే కఠినమైన ప్రశ్నలు వేసి తమను బ్యాడ్ చేసేందుకు చూస్తున్నారంటూ ఆటపట్టించాడు. కాగా సెహ్వాగ్ ప్రస్తుతం ఐపీఎల్-2024 కామెంటేటర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఒక్కడే లాక్కొచ్చాడు ఇక రాజస్తాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అవును.. ఈరోజు కోహ్లి శతకం బాదాడు. ఆర్సీబీ తరఫున ప్రస్తుతం అతడు ఒక్కడు మాత్రమే ఫామ్లో ఉన్నాడు. మిగతా వాళ్లలో ఎవరూ కూడా పరుగులు చేయడం లేదు. నిజానికి కోహ్లి ఆఖరి వరకు క్రీజులో ఉండటం మంచిదైంది. మిగతా వాళ్ల నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా ఒంటరిగా లాక్కొచ్చాడు. కానీ కోహ్లి చేసిన తప్పు అదే మాక్స్వెల్, గ్రీన్ అసలు ప్రభావం చూపలేదు. మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్ ఏమయ్యారో అర్థం కాలేదు. వాళ్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరు బ్యాటింగ్కు వచ్చినా బాగుండేది. ఇక కోహ్లి హాఫ్ సెంచరీ(39 బంతుల్లో 50) తర్వాత వేగం పెంచాల్సింది. అలా చేయకుండా కోహ్లి తప్పు చేశాడు. అతడి స్ట్రైక్రేటు పెరిగితే ఆర్సీబీ 200 పరుగులు మార్కు చేరుకునేది ’’ అని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. కాగా జైపూర్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోగా.. ఆర్సీబీ ఈ సీజన్లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో హార్దిక్ బౌలర్గా తన మార్క్ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు. -
అతడు చాలా బాధపడ్డాడు.. అందుకే చెలరేగిపోయాడు: సెహ్వాగ్
ఐపీఎల్-2024 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా ఆరంభించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన పృథ్వీ షా.. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్కు ఢిల్లీ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా సద్వినియోగ పరుచుకున్నాడు. షా అద్బుతమైన ఇన్నింగ్స్తో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు,2 సిక్స్లతో అతడు 43 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్తో కలిసి ఢిల్లీ జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ముంబైకర్. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తనలో ఉన్న బాధనంతా తన ఇన్నింగ్స్ రూపంలో చూపించాడని సెహ్వాగ్ అన్నాడు. "ప్రతీ టీమ్ మేనేజ్మెంట్ తమ ఆటగాడు రిథమ్లో ఉన్నాడా లేదా నెట్స్లో ఎప్పుడూ పరిశీలిస్తుంటుంది. ఈ ఇన్నింగ్స్ పృథ్వీకి చాలా ముఖ్యమైనది. గత సీజన్లో కూడా పెద్దగా జట్టులో షా కన్పించలేదు. ఈ ఏడాది సీజన్లో కూడా తొలి రెండు మ్యాచ్ల్లో అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ విషయంలో అతడు బాధపడి ఉండవచ్చు. అందుకే తన బాధను ఆట రూపంలో చూపించాడని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
బజ్ బాల్ బద్దలైంది.. అతడే ఇంగ్లండ్ కొంపముంచాడు: సెహ్వాగ్
భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. "భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ ఇంకా బజ్బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. -
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ జురెల్కు తీవ్ర అన్యాయం'
ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్ను కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు. "ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. "ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు. -
సెహ్వాగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్
India vs England, 4th Test Day 2- Yashasvi Jaiswal: వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఏమాత్రం బెదురు లేకుండా బ్యాట్ ఝులిపించడమే తనకు తెలిసిన విద్య అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్. అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు జైస్వాల్. తొలి మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 15, 209, 17, 10, 214(నాటౌట్). తాజాగా రాంచి మ్యాచ్ సందర్భంగానూ కూడా విలువైన అర్ధ శతకం బాదాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఈ ఓపెనింగ్ బ్యాటర్ పట్టుదలగా నిలబడ్డాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 117 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా అద్భుత రీతిలో బాదాడు ఆ సిక్స్ను జైస్వాల్. తద్వారా టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్గా అవతరించాడు. సెహ్వాగ్ 14 మ్యాచ్లు ఆడి 27 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ నమోదు చేస్తే.. జైస్వాల్ ఐదో మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు ►యశస్వి జైస్వాల్- 23* సిక్సర్లు- 2024లో ►వీరేంద్ర సెహ్వాగ్- 22 సిక్సర్లు- 2008లో ►రిషభ్ పంత్- 21 సిక్సర్లు- 2022లో ►రోహిత్ శర్మ- 20 సిక్సర్లు- 2019లో ►మయాంక్ అగర్వాల్- 18 సిక్సర్లు- 2019లో. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్జున్వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. -
'వారిద్దరూ అద్భుతం.. కచ్చితంగా వరల్డ్ క్రికెట్ను ఏలుతారు'
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్(209) విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్లో గిల్(104) సైతం శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో యశస్వీ, శబ్మన్ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తారని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. "అతి చిన్న వయస్సులోనే గిల్, జైశ్వాల్ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారు. వారు ఆటతీరును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం వారి స్పెషల్. వీరిద్దరూ రాబోయే రోజుల్లో కచ్చితంగా వరల్డ్ క్రికెట్ను ఏలుతారు" అని ఎక్స్(ట్విటర్)లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. ఇక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మరో విజయాన్ని తమఖాతాలో వేసుకోవాలంటే 332 పరుగులు చేయాల్సింది. ఒకవేళ ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే భారత గడ్డపై టెస్టు క్రికెట్లో ఈ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత్లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్యం 387గా ఉంది. 2008లో చెన్నైలో ఇంగ్లాండ్పై భారత్ ఈ ఛేదన చేసింది. చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్ చేరుకోగా.. టీమిండియా సోమవారం భాగ్యనగరానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 14 సిక్స్లు బాదితే టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(91) రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 77 సిక్సర్లతో మూడో స్ధానంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు రెండో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(78) ఉన్నాడు. కాగా రోహిత్కు టెస్టుల్లో ఇంగ్లండ్పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇంగ్లండ్తో 9 మ్యాచ్లు ఆడిన రోహిత్ 49.80 సగటుతో 747 పరుగులు చేశాడు. -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హవెలాక్తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డు ముంగిట కోహ్లి
India Vs South Africa 1st Test: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు ప్రొటిస్ దేశానికి వెళ్లింది. పరిమిత ఓవర్ల సిరీస్లో మరోసారి సత్తా చాటి ఇందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డేలను 2-1 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తదితర కీలక ఆటగాళ్లు లేకుండానే సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి ఈ విజయాలు సాధించింది. అయితే, వరల్డ్కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ ముగ్గురు స్టార్లు టెస్టు సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. కాగా సఫారీ గడ్డపై ఇంతవరకు టెస్టు సిరీస్ గెలిచిన ఘనత ఏ భారత జట్టుకూ లేదు. అయితే, రోహిత్ సేన ఆ అపవాదును చెరిపివేయాలని భావిస్తోంది. ఈ సిరీస్లో కోహ్లి 70 పరుగులు చేశాడంటే ఇందుకోసం ఇప్పటికే బాక్సింగ్ డే నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లో కోహ్లి ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ ఆడి 1236 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా అతడు.. 70 రన్స్ చేయగలిగితే... సఫారీ జట్టుతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించి దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు. (ఒకవేళ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమై కేవలం 15 పరుగులకే పరిమితమైతే సెహ్వాగ్ తర్వాతి స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ను కూడా అధిగమించలేడు). సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు 1.సచిన్ టెండుల్కర్- 24 టెస్టుల్లో 1741 రన్స్ 2.వీరేంద్ర సెహ్వాగ్- 15 టెస్టుల్లో 1306 పరుగులు 3.రాహుల్ ద్రవిడ్- 21 టెస్టుల్లో 1252 పరుగులు 4.విరాట్ కోహ్లి- 14 ఇన్నింగ్స్లో 1236 పరుగులు 5.వీవీఎస్ లక్ష్మణ్- 17 మ్యాచ్లలో 976 పరుగులు 6. సౌరవ్ గంగూలీ- 17 మ్యాచ్లలో 947 పరుగులు 7. అజింక్య రహానే- 13 టెస్టుల్లో 884 పరుగులు. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement