-
గుడుంబాపై ఎక్సైజ్ ఉక్కుపాదం
కాటారం: గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవపూర్, పలిమెల మండలాల్లో గుడుంబా, బెల్టుషాపుల నియంత్రణ దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కాటారం ఎకై ్సజ్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సిబ్బంది నిత్యం గ్రామాల్లో దాడులు నిర్వహిస్తూ గుడుంబా తయారీదారుల్లో గుబులు పుట్టిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గుడుంబా తయారీ, రవాణా, బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు దృష్టిసారించారు. కాటారం ఎకై ్సజ్ పరిధిలోని గ్రామాల్లో దాడులు విస్తృతం చేసి పెద్దఎత్తున గుడుంబా, బెల్లం పానకం, మద్యం స్వాఽధీన పర్చుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా ఇప్పటివరకు గుడుంబా తయారీ, విక్రయం, బెల్టుషాపుల నిర్వహణకు సంబంఽధించి 50 రోజుల్లో 117 కేసులు నమోదు చేసినట్లు కాటారం ఎకై ్సజ్ సీఐ నరేందర్ తెలిపారు. 40 మందిని అదుపులోకి తీసుకొని 29 మందిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసి ఒకరిపై బైండోవర్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 56,300 లీటర్ల చక్కర పానకం, 580 లీటర్ల కల్లు, 707 లీటర్ల గుడుంబా, 565 కిలోల బెల్లం, 6 బైక్లు, 46 లీటర్ల బీర్లు, 120 కిలోల చక్కెర స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం, ధ్వంసం చేసిన మద్యం విలువ సుమా రు రూ.63,84,675 ఉంటుందని సీఐ పేర్కొన్నారు. 50రోజుల్లో 117కేసులు నమోదు -
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి: నియోజకవర్గ కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, మెటీరియల్ పంపిణీకి ఇబ్బందులు రావొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడామైదానంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటుచేసే స్థలాన్ని అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి 12వ తేదీన ఎన్నికల సామగ్రి అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక రోజు ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 317 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిని 30 సెక్టర్లుగా విభజించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో 30 కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్ల ద్వారా ఎన్నికల విధులలో పాల్గొనే ిపీఓ, ఏపీఓ, ఓపీఓలు, సిబ్బందికి పోలింగ్ సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల ద్వారా అందించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ రోజు సెక్టార్ అధికారులు ఈవీఎంలు, యంత్రాల, పోలింగ్ సామగ్రి ప్రభుత్వ వాహనాల్లో పటిష్ట పోలీస్ భద్రత నడుమ తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ ప్రదీప్ పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, కాళేశ్వరం జ్యూడీషియల్ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్–డెబ్జాని దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయ రాజగోపురం వద్దకు రాగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. వారికి అర్చకులు స్వామివారి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ పీసీ ఘోష్ దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణౖమూర్తిశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని దంపతులకు బహూకరించారు. ఆయనతో పాటు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు వేర్వేరుగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇరిగేషన్శాఖ ఈఎన్సీలు అనిల్కుమార్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందరావు, సీఈ సుధాకర్రెడ్డి, ఈఈ తిరుపతిరావు, డీఈ, ఏఈలు ప్రకాశ్, పవన్, కిరణ్, భరత్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రాజేశ్వరావు, ఎస్సై భవానిసేన్ ఉన్నారు. -
నిండు వేసవిలో..
భూపాలపల్లి అర్బన్: నిండువేసవిలో మంగళవారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాస్తూ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహాముత్తారం, మొగుళ్లపల్లి మండలాల్లో అత్యధికం వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఈదురుగాలులతో పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.అకాలవర్షంతో తడిసిన ధాన్యం ● వరి పంట నేలవాలి.. రాలిపోయిన వడ్లు ● జిల్లాలో 53.8 మిల్లీమీటర్ల వర్షపాతం -
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024
తడిసిన ధాన్యం మహాముత్తారం: మండలంలోని నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరిధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. నల్లగుంట మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి మాల్లారెడ్డి నాలుగు ఎకరాల్లో వరి పొలం వేశాడు. నాలుగు రోజుల క్రితం వరి ధాన్యాన్ని మీనాజీపేటలోని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. ధాన్యం కాంటా వేద్దామనే క్రమంలో అకాల వర్షంతో వంద క్వింటాళ్ల ధాన్యంలో సుమారు 50 క్వింటాళ్ల వరకు వరదకు కొట్టుకుపోయాయి.జిల్లాలో నమోదైన వర్షపాతం (మి.మీ)మహాముత్తారం 53.8 మొగుళ్లపల్లి 19.3 కొత్తపల్లిగోరి 14.8 టేకుమట్ల 14.8 రేగొండ 12.3 చిట్యాల 12.0 మహదేవపూర్(పెద్దంపేట) 9.5 భూపాలపల్లి 4.8 మహదేవపూర్ 4.3 కాళేశ్వరం 3.3 మల్హర్(కొయ్యూరు) 3.0 పలిమెల(సర్వాయిపేట) 2.5 మల్హర్ 2.0న్యూస్రీల్ -
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
భూపాలపల్లి అర్బన్: పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ భవేష్మిశ్రా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 2,245 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జారీచేయగా సోమవారం 511 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 934 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయని, మిగిలిన వారు ఈ నెల 8వ తేదీ వరకు వినియోగించుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు 54మంది, దివ్యాంగులు 24మంది హోం ఓటింగ్ దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 76 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇంకా రెండు రోజులు సమయం ఉన్నందున రేపటి నుంచి అధికసంఖ్యలో ఓటర్లు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మండుటెండలో జలధార
గతేడాది ఆగస్టు తర్వాత జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో చెరువులు, కుంటల్లో నీరులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేటలో విద్యుత్ లేకుండా 100 ఫీట్ల లోతు నుంచి బోరు పైపు ద్వారా నీరు ఏకదాటిగా పైకి వస్తోంది. విద్యుత్శాఖలో లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ రాఘవరెడ్డిపేట శివారులో నూతన భవన నిర్మాణం చేపట్టాడు. రెండు రోజుల క్రితం 300 ఫీట్ల లోతు బోరు వేశారు. ఆదివారం బోరుబావికి మోటర్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి మోటార్తో సంబంధం లేకుండానే బోరు పైపు ద్వారా నిరంతరంగా జలధార వస్తోంది. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంటే.. బోరు నుంచి నీరు రావడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. – టేకుమట్ల -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
చిట్యాల: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్.విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని మహిళలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. మండలకేంద్రంలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. తాగునీటి సౌకర్యాల పట్ల పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఆమెవెంట ఎంపీడీఓ జయశ్రీ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, సిబ్బంది ఉన్నారు. జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి -
క్రికెట్ బెట్టింగ్.. ఆరుగురి అరెస్టు
టేకుమట్ల: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేసి తహశీల్దార్ విజయలక్ష్మి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై గోగికారి ప్రసాద్ తెలిపారు. ఈ నెల 4వ తేదీన జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో మండలంలోని ఆశిరెడ్డిపల్లి, వెలిశాల, పంగిడిపల్లి, పెద్దంపల్లి గ్రామాలకు చెందిన బండారి శివ, దామరవేని నారాయణరావు, గంధం సరోత్తం, చిలువేరు కుమార్, గంధం సుమన్, పల్లె రమేష్ బెట్టింగ్కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు పట్టుకుని బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు. రామప్పలో అర్చకుల సమావేశంవెంకటాపురం(ఎం): దేవాదాయ ఽశాఖ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సోమవారం జిల్లాకు చెందిన ధూపదీప ఆలయాల అర్చకులు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను రిజిస్ట్రేషన్ చేపించాలని, దేవాలయాల పేరిట భూములు ఉంటే వాటి వివరాలను ఎండోమెంట్ శాఖలో నమోదు చేయించాలని డివిజనల్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, రామప్ప ఈఓ బిల్లా శ్రీనివాస్ అర్చకులకు సూచించారు. దేవాలయాల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరవాల ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ముడుంబా రఘునాథచార్యులు, హరీశ్శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది మార్క సంతోష్, అవినాష్రెడ్డి, దామోదర్పాల్గొన్నారు. -
దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకోవాలి
చిట్యాల: రైతులు అధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్భాస్కర్ అన్నారు. మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన పొన్నం అశోక్ వేసిన కేఎన్ఎం, 12368, డబ్ల్యూజీఎల్–1537, జేజీఎల్–28639, ఆర్డీఆర్ 1200 విత్తనాలతో విరివిగా పండించిన పంటను పరిశీలించారు. అనంతరం వ్యవసాయాధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వరి విత్తనాలను ఎంచుకుని సాగుచేసుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఆయన వెంట కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు కొడెల సమ్మయ్య, జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రముఖులు కనుగుల రాంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. -
ప్రచారం పీక్స్..
సాక్షి, వరంగల్: గత ఎన్నికల్లో బహిరంగ సభలతో జనాలను సమీకరించి సభా ప్రాంగణాలకు రప్పించుకుని ఉపన్యాసాలు దంచిన ముఖ్యనేతలు.. ఇప్పుడు (లోక్సభ ఎన్నికలు) కార్నర్ మీటింగ్లు, రోడ్డు షోల పేరుతో జనాల వద్దకే వెళ్తున్నారు. తమ పార్టీ గెలిస్తే చేయబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ.. ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హనుమకొండలో రోడ్డు షో చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా వరంగల్ తూర్పు, పశ్చిమలో రేవంత్రెడ్డి రోడ్డు షో, కార్నర్ మీటింగుల్లో పాల్గొనేందుకు మంగళవారం రానున్నారు. ఇంకోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ వరంగల్ నగరంతో పాటు వివిధ మండలాల్లో కార్నర్ మీటింగ్లతో జనాలకు దగ్గరవుతున్నారు. నామినేషన్ సమయంలో హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు అరూరికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ధామీ పాల్గొని బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. మామునూరులోని లక్ష్మీపురంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననుండడంతో రాజకీయ కాకా తారస్థాయికి చేరుకుంటోంది. పని ప్రదేశాల్లో కూలీల వద్దకు.. ఓవైపు భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిథులు ప్రచార తీరు మార్చారు. ఇన్నిరోజులు ఫంక్షన్హాల్లో సమావేశాలు, సభలు నిర్వహించి ఎన్నికల సమీపిస్తుండడంతో వేగం పెంచారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని వారివద్దకే వెళ్లి తమ పార్టీకి ఓటేయాలంటూ అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాలకే వీరు వెళ్లి అక్కడి వసతులను తెలుసుకుంటూ తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. వారు వెంట తెచ్చుకున్న మజ్జిగ ప్యాకెట్లను కూలీల కు అందిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీల అడ్డాను రాజకీయ ప్రచార వేదికగా మలుచుకుంటున్నారు. వందలసంఖ్యలో జనాలు ఉండడంతో తమ పార్టీ మేనిఫెస్టో నేరుగా వెళ్లే అవకాశముందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకోవైపు ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు గడపగడపకూ ఉదయం, సాయంత్రం వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాలే లక్ష్యంగా... నగరాల్లోనూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఉదయం వేళలో పార్కులు, వాకింగ్ మైదానాలు, ఇండోర్ స్టేడియం ఉన్న ప్రాంతాలకు రాజకీయ నేతలు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో తమ పార్టీ విజయానికి లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అక్కడా జనాలను ఆకర్షించేందుకు బ్యాట్లు పడుతున్నారు. జిమ్ చేస్తున్నారు. షటిల్ ఆడుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. ఇంకోవైపు కార్నర్ మీటింగ్లతో చౌరస్తాలను అడ్డాగా చేసుకొని జనాలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మార్కెట్లకు వెళ్లి రైతులు, వ్యాపారులు, విక్రయదారులతో మాట్లాడుతున్నారు. కొందరు నేతలైతే ఆయా పండ్లు, కూరగాయలు అమ్ముతూ.. హోటళ్లలో పూరీలు కాలుస్తూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కులసంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ యూనియన్లతో సమావేశమవుతూ తమ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది మారుతున్న నేతల ప్రచారం రాజకీయ వేదికలుగా ఉపాధి హామీ పని ప్రదేశాలు మైదానాలు, పార్కులు, మార్కెట్లలో క్యాంపెయిన్ ఇంకోవైపు కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో మమేకం -
ఇసుక తవ్వకాల అడ్డగింత
కాళేశ్వరం: అంబట్పల్లి ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. మనుషులతో ఇసుకను తవ్వి వాహనాల్లో పోయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో తాత్కాలికంగా పనులను నిలిపేశారు. ఇంత జరుగుతున్నా టీఎస్ ఎండీసీ అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వారి ఇష్టారాజ్యంగానే కాంట్రాక్టర్లు నడుచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తమకు ఉపాధి కల్పించకపోతే పనులు జరుగనివ్వమని తేల్చిచెప్పారు. -
బాధితుల సమస్యలు నేరుగా తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: వివిధ సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన 12 ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు పోలీస్స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. -
పొరపాట్లకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ
భూపాలపల్లి అర్బన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా కమిషనింగ్ పూర్తిచేసి.. బ్యాలెట్ యూనిట్లలో ఓటర్లకు గుర్తులు స్పష్టంగా కనిపించేలా పకడ్బందీగా అమర్చాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న ఈవీఎం, వీవీప్యాట్ల కమిషనింగ్ రెండో రోజు కమిషనింగ్ ప్రక్రియ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్మిశ్రాతో కలిసి తనిఖీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 42మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియకు 1,236 బ్యాలెట్ యూనిట్లు, 412 కంట్రోల్ యూనిట్లు, 412 వీవీ ప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. కమిషనింగ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామని చెప్పారు. కమిషనింగ్ ప్రక్రియకు 30 సెక్టార్లుగా విభజించి టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ 10 టేబుల్స్ పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వీవీ ప్యాట్లను, కంట్రోల్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారీగా నంబర్లను వేసి భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున కమిషనింగ్ కేంద్రంలో అత్యవసర చికిత్స కేంద్రం, చల్లదనం కోసం కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో హెల్ప్లైన్ ఏర్పాటు ద్వారా ఓటరు పరిశీలన చేస్తున్నారని, తదుపరి పోలింగ్ కేంద్రం వారీగా ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన తదుపరి స్ట్రాంగ్ రూములో పటిష్ట భద్రత, వీడియోగ్రఫీ నడుమ భద్రపరచనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు జరిగిన పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా మాట్లాడుతూ.. 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం ఉందని తెలిపారు. నిర్ణీత పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఓటర్లకు చివరి నుండి ముందుకు క్రమసంఖ్య వారీగా స్లిప్పులు జారీ చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం పర్యవేక్షణకు డీపీఓ నారాయణరావును నోడల్ అధికారిగా నియమించామన్నారు. ప్రతీ పోలింగ్ బూత్లో ఓటరు ధృవీకరణ చేయాల్సి ఉన్నందున గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి మంగీలాల్, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ -
ఎన్నికల హామీగానే..
భూపాలపల్లి అర్బన్: రామగుండం–మణుగూరు, జమ్మికుంట–కొత్తగూడెం రైల్వేలైన్లు వేయాలని చాలా ఏళ్లుగా జిల్లా ప్రజల్లో డిమాండ్ ఉంది. రెండింటిలో ఏదో ఒకటి కావాలని జిల్లా ప్రజలు బలంగా కోరుతున్నారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్కు ఇదివరకే పలుమార్లు సర్వేలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఈ అంశాన్ని ప్రతిసారీ నాయకులు లేవనెత్తుతున్నారు.. తప్పితే పార్లమెంట్లో గళం ఎత్తడం లేదు. 2002 నుంచి 2004 వరకు బండారు దత్తాత్రేయ రైల్వే సహాయ మంత్రిగా ఉన్న సమయంలో రామగుండం–మణుగూరు రైల్వేలైన్ సర్వే జరిగింది. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు. బొగ్గు సరఫరాకు ఉపయోగం.. భూపాలపల్లి మీదుగా రామగుండం నుంచి మణుగూరు రైల్వేలైన్ ప్రతిపాదించి ఏళ్లు గడుస్తోంది. కార్యరూపం దాలిస్తే బొగ్గు రవాణాతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. రామగుండం, భూపాలపల్లి, మణుగూరు రైల్వేలైన్తో కోల్బెల్ట్ ప్రాంతంలో బొగ్గు రవాణా సులువవుతుంది. కార్మికులకు, ప్రజలకు ప్రయాణపరంగా ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రస్తుతం భూపాలపల్లిలోని కేటీపీపీ విద్యుత్ కేంద్రానికి రామగుండం నుంచి, భూపాలపల్లి నుంచి రామగుండం, ఇతర ప్రాంతాలకు ఎక్కువగా బొగ్గు రవాణా సాగుతోంది. రోజుకు వందల లారీల ద్వారా ఇక్కడి నుంచి ఉప్పల్కు బొగ్గును రవాణ ఇబ్బంది అవుతుంది. ఉప్పల్ వరకు లారీల ద్వారా రవాణ చేసి అక్కడి నుంచి గూడ్స్ రైల్ ద్వారా పంపిస్తున్నారు. ప్రతిపాదిత రెండు రైల్వే లైన్లలో ఏ ఒక్కటి నెరవేరినా బొగ్గు రవాణాకు ఇబ్బందులు ఉండవు. కలగానే రామగుండం–మణుగూరు రైల్వేలైన్ సర్వేలకే అధికారులు పరిమితం దత్తాత్రేయ రైల్వే సహాయమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపాదనప్రజలకు సౌకర్యం భూపాలపల్లి మీదుగా రామగుండం నుంచి మణుగూరు రైల్వేలైన్ ఏర్పడితే ఈ ప్రాంతాల్లోని ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. రామగుండం, భూపాలపల్లి, మేడారం, పస్రా, ఏటూరునాగారం మీదుగా మణుగూర్ వరకు రైలు సౌకర్యం ఏర్పడితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు వెళ్లడానికి చాలా సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, రామగుండం నుంచి కొత్తగూడెం, విజయవాడ వెళ్లాలంటే వరంగల్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపాదిత రామగుండం–మణుగూర్ లైన్ ఏర్పాటైతే దూరం సగానికి పైగా తగ్గుతుంది. -
ఉచిత ఆన్లైన్ దరఖాస్తు
కాటారం: రైల్వే పోలీస్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులకు కాటారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తు చేయనున్నట్లు కాటారం డిఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు నోటిఫికేషన్కు సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తిచేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆర్పీఎఫ్లో 4,208 కానిస్టేబుల్ పోస్టులు, 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ జారీ అయినట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండి పదో తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు విద్యార్హత, కులం సర్టిఫికెట్, తెలుపు బ్యాక్ గ్రౌండ్లో ఉన్న పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్కార్డు, ఈ మెయిల్ అడ్రస్, మొ బైల్ నంబర్తో డీఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుంటే పోలీస్శాఖ ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్ చివరి గడువు ఉందని చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
టేకుమట్ల: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ ధీరజ్సింగ్ అన్నారు. ఓటు హక్కుపై తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును ప్రలోభాలకు లొంగి అమ్ముకోరాదన్నారు. ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉంటుందన్నారు. ప్రజలకు ప్రజా పాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు చక్కటి అవకాశమని చెప్పారు. అనంతరం గర్మిళ్లపల్లిలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించి, మద్యం, నగదు రవాణా చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాస్రావు, లైజనింగ్ అధికారి నయిం, నోడల్ అధికారి శైలజ, ఆర్ఐ సంతోష్, రెవెన్యూ సిబ్బంది తిరుపతి ఉన్నారు.పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ ధీరజ్సింగ్ -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
భూపాలపల్లి: ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా సూచించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హల్లో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవేష్మిశ్రా మాట్లాడుతూ.. కమిషనింగ్ చేసే ముందు ప్రతీ ఈవీఎం, వీవీ ప్యాట్లను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ ఒక్క చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా చేపట్టాలని చెప్పారు. బీయూలలో అభ్యర్థుల గుర్తులు స్పష్టంగా కనిపించేలా బ్యాలెట్ పేపర్ సక్రమంగా అమర్చాలన్నారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లకు ట్యాగింగ్ చేసేటప్పుడు పోలింగ్స్టేషన్ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించి సీల్ వేయాలన్నారు. 30 సెక్టార్లుగా విభజించి అత్యంత భద్రత, వీడియోగ్రఫీ మధ్య కమిషనింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాల కూర్పు సక్రమంగా చేపట్టి, బ్యాలెట్ స్క్రీన్ని అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాలన్నారు. బ్యాలెట్ యూనిట్లో అవసరమయ్యే సంఖ్య వరకు అభ్యర్థుల గుర్తులు తదుపరి నోటాతో సహా అప్ లోడ్ చేయాలన్నారు. అనంతరం భూపాలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి వచ్చే ఓటరు సౌకర్యార్థం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు ధృవీకరణ చేసేందుకు గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొత్తం నాలుగు పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అర్జీ పెట్టుకున్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,245 నమోదు కాగా ప్రారంభం రోజున 423 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగానికి అవకాశం ఉందని ప్రతీరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటుహక్కు వినియోగానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 వరకు బ్యాలెట్ వినియోగానికి అవకాశం కలెక్టర్ భవేష్మిశ్రా -
పోలింగ్ సమయం గంట పెంపు
● వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం: కాకతీయుల కట్టడమైన కోటగుళ్లు శిల్పసంపద మహా అద్భుతమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె.జయరాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాంచంద్రారావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను ఆదివారం వారు కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. మొదట ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు. కాకతీయులు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి కట్టడాలు, శిల్పసంపద ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. ఈ అద్భుత కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. అనంతరం వారిని ఆలయ అర్చకుడు నరేష్ శాలువాతో సత్కరించారు. వారి వెంట ఎస్ఐ మచ్చ సాంబమూర్తి ఉన్నారు. ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలు భూపాలపల్లి అర్బన్: ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ఆదివారం ముగిసినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాంకుమార్, ఏసీఈజీ రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసి మూడు పరీక్ష కేంద్రాల్లో ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు వివరించారు. విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు కాటారం: అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చరించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో వన్యప్రాణుల వేట నిర్మూలన, అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల వేట చట్టరీత్య నేరం అన్నారు. ఎవరైనా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు అమర్చడం కారణంగా వన్యప్రాణులు, మూగజీవాలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, అటవీశాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సి పల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్చైర్మన్ గండ్ర హరీశ్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ న్ బుర్ర రమేష్గౌడ్, పీఈసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, మాజీ జెడ్పీటీసీ లట్ట రాజ బాబు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ‘బీజేపీతోనే అభివృద్ధి’ రేగొండ: దేశంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి అన్నారు. మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిశిధర్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త బూత్ స్థాయిలో కృషి చేయాలన్నారు. ఈ నెల 8న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాపయ్య, పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్రావు, ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, సరోత్తమ రెడ్డి, బుచ్చిరెడ్డి, గన్రెడ్డి లింగారెడ్డి, తూర్పాటి మల్లేష్, కౌడగాని రాకేష్, గాలిఫ్, దేశ్మి రాజు, కురాకుల మల్లయ్య, మచ్చిక సత్యం, రంజిత్ పాల్గొన్నారు. -
మోదీ పాలనలోనే దేశం సుభిక్షం
భూపాలపల్లి రూరల్/టేకుమట్ల/మొగుళ్లపల్లి: మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని.. మూడోసారి మోదీనే ప్రధాని కావాలంటే ప్రజలు నిండుమనసుతో తనను ఆశీర్వదించాలని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ కోరారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి రమేశ్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వేలైన్ ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు. మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోవడం ఖాయమన్నారు. మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ప్రతీ కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో లేకున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం వరంగల్పై ప్రేమతో మోదీ ములుగులో గిరిజన యూనివర్శిటీ, భూపాలపల్లి డిగ్రీ కళాశాల ఏర్పాటు, జాతీయ రహదారులు, గ్రామాల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అంబాల చంద్రమౌళి, బీజేపీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, కన్నం యుగేందర్, బట్టు రవి, దొంగల రాజేందర్, మందల రఘునాథరెడ్డి, మారెల్ల సేనాపతి, రాంరెడ్డి, సర్కిల్ సుధాకర్, రాంరెడ్డి, కంబాల రాజయ్య, ఊనగొండ రామకృష్ణ, ఆయా మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ -
గ్రామాల్లో హోం ఓటింగ్
రేగొండ(కొత్తపల్లిగోరి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లిగోరి మండలంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన ఆరుగురి ఇంటి వద్దకు చేరుకుని ఆదివారం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మండలంలోని చెన్నాపూర్, కొత్తపల్లిగోరి, చిన్నకోడేపాక, రాజక్కపల్లి, నిజాంపల్లి గ్రామాలలో ఐదుగురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, మండల రూట్ ఆఫీసర్ ఆర్ఐ నరేష్, పంచాయతీ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు. -
వాహనాల తనిఖీ
రేగొండ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని చిట్యాల క్రాస్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రవాణా చేసే చర్యలు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై తెలిపారు. ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని చెప్పారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు. -
సూర్యప్రతాపం
కాళేశ్వరం: సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా వేసవి ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా 40డిగ్రీల సెల్సియస్ను దాటి కొడుతున్న ఎండలతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల తీరప్రాంతంలో ఇసుక మేటలు భారీగా ఉండడంతో కాళేశ్వరంతోపాటు పరిసర ప్రాంతాలన్ని హీటెక్కుతుండడంతో కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాక తగ్గిపోయింది. భక్తుల రాకపై ప్రభావం.. నిత్యం కాళేశ్వరాలయానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఎండల తీవ్రతతో వందల సంఖ్యలోనే వస్తున్నారు. ఏప్రిల్ నుంచి భక్తుల రాక తగ్గుతూ వస్తోంది. ఎండ తీవ్రతకు ఉదయం 10గంటల లోపు వరకు, సాయంత్రం 5గంటల తర్వాత దర్శనానికి వస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ఆలయ ఆదాయం కూడా తగ్గుతుందని తెలిపారు. పెరిగిన విద్యుత్ వినియోగం భానుడు తన ప్రతాన్ని చూపడంతో జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలర్లు, ఏసీలతోపాటు, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని మార్చి– ఏప్రిల్లో 663.54లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఏప్రిల్– మే(ఇప్పటివరకు) నెలలో 805.2లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రిసైతం తప్పని ఉక్కపోత పెరిగిన విద్యుత్ వినియోగం మండుతున్న సూరీడు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవా రం జిల్లాలో గరిష్టంగా 46.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 7మండలాలు రెడ్ అలర్ట్లోకి వెళ్లాయి. గణపురం మండలం చెల్పూర్, మొగుళ్లపల్లిలో 46.3, రేగొండ, తాడిచర్లలో 45.6, చిట్యాలలో 45.3, కాటారంలో 45.2, మల్హర్ మండలం మల్లారంలో 45.1, మహా ముత్తారంలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడితో జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
భూపాలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. స్వీప్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానం నుంచి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో శుక్రవారం నిర్వహించిన 5కే రన్ను ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతం అధికంగా నమోదయ్యేలా సహకరించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఏర్పాట్లు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి పాఠశాలలో ఏర్పాట్లును పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లాలో 2,072 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మూడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ బూతులో రద్దీ నియంత్రణకు రెండు బాక్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సమయం కేటాయించినట్లు తెలిపారు. 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న హోం ఓటింగ్లో నియోజకవర్గంలో 78మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేక అధికారుల నియామకం ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు, నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పోలింగ్ ఏర్పాట్ల పరిశీలనకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీరు, విద్యుత్, ర్యాంపు, వీల్ చైర్, క్యూలో ఫ్యాన్లు వంటి సౌకర్యాలను ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ నాటికి ఓటరు స్లిప్ల పంపిణీ పూర్తి కావాలన్నారు. 12, 13 తేదీల్లో పోలింగ్ సిబ్బంది బస, భోజన ఏర్పాట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎంల కేటాయింపు.. సప్లిమెంటర్ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియకు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ స్థానానికి 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని 317పోలింగ్ కేంద్రాలకు 127శాతంతో ఈవీఎంలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అభినందన ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులను శుక్రవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్లో అభినందించారు. చిట్యాల కస్తూర్భా గాంధీ విద్యాలయానికి చెందిన కొత్తూరు అంజన, పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఊరుగొండ సాహిత్య, గాంధీనగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన గడ్డం అక్షయ, ముత్యాల అభినయలకు కలెక్టర్ శాలువాలు కప్పి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీఓ శామ్యూల్ ఆర్డీఓ, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంగీలాల్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్ధార్ శ్రీనివాస్, డీఈఓ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.మండలాల ప్రత్యేక అధికారులు వీరే.. నారాయణరావు, డీపీఓ, భూపాలపల్లి మండలం నరేష్, డీఆర్డీఓ, గణపురం శ్యామూల్, సీపీఓ, రేగొండ విజయభాస్కర్, డీఏఓ, కొత్తపల్లిగోరి వెంకటేశ్వర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, చిట్యాల శైలజ, బీసీ సంక్షేమ అధికారి, టేకుమట్ల సునీత, ఎస్సీ అభివృద్ధి అధికారి మొగుళ్లపల్లి సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శాయంపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా వెల్లడి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement