-
No Headline
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలాయి. వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువగా పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం కాగానే ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పుకునే ప్రయత్నం చేయగా అవి గాలికి ఎగిరిపోయి మరింత అవస్ధలు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జేసీబీల సాయంతో తొలగించి సమస్యను పరిష్కరించారు. విద్యుత్శాఖ అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. -
ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి
మహబూబాబాద్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టోప్పో వివిధ శాఖల నోడ్ అధికారులతో కలసి ఈనెల 13న నిర్వహించే పోలింగ్ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కొత్తగూడ: మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎన్నికల పరిశీలకుడు రితిక్రాజ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్నికల సమయంలో సిబ్బందికి కావాల్సిన వసతులు, భద్రత, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారులకు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రితిక్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర, ములుగు అదనపు కలెక్టర్ శ్రీజ, ములుగు ఎస్డీపీఓ రవీందర్, సీఐ బాబూరావు, తహసీల్దార్ రమాదేవి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు దిలిప్, రవీందర్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలి డోర్నకల్: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని మహబూబా బాద్ డీఎస్పీ తిరుపతిరావు కోరారు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, సీరోలు మండలం అందనాలపాడు గ్రామాల్లో డోర్నకల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలు, అక్ర మ వ్యాపారాలతో ఇబ్బందులపాలవుతారని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్ సీఐ ఉపేందర్రావు, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. కేయూ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు షురూ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఇంజనీరింగ్ బీటెక్ నాల్గోవ సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు మంగళశారం ప్రారంభమయ్యాయి. కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆచార్య నర్సింహాచారి , అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక పరిశీలించారు. కాళేశ్వరంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, కాళేశ్వరం జ్యూడీషియల్ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్–డెబ్జాని దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయ రాజగోపురం వద్దకు రాగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. వారికి అర్చకులు స్వామివారి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ పీసీ ఘోష్ దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణౖమూర్తిశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని దంపతులకు బహూకరించారు. ఆయనతో పాటు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు వేర్వేరుగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
గూడూరు: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల గూర్చి డాక్టర్ యమునను అడిగి తెలుసుకున్నారు. ఆశలు, ఏఎన్ఎంలు సూపర్వైజర్లు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రా మ్ ఆఫీసర్ బిందుశ్రీ, డీపీహెచ్ఎన్ మంగమ్మ, సిబ్బంది కోమల, లోక్యానాయక్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు గార్ల: వైద్యులు, వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీషా అన్నారు. మంగళవారం మండలంలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సబ్సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గర్భిణును గుర్తించి నార్మల్ డెలివరీల వలన కలిగే ఉపయోగాల గురించి వివరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డాక్టర్ పృథ్వీ, సీహెచ్ఓ కృష్ణార్జున్రావు, ఎస్యూఓ శ్రీనివాస్, సీహెచ్ఓ సక్కుబాయి, హెచ్ఈఓ శ్రీహరి, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి -
బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం
తొర్రూరు రూరల్: కాంగ్రెస్ గేట్లు తెరవకముందే బీఆర్ఎస్ నాయకులు వెల్లువలా పార్టీలో చేరుతున్నారని, ఇక గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి దయాకర్రావు ముఖ్య అనుచరుడు రామసహాయం కిశోర్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని వెలికట్ట శివారు శ్రీనివాస గార్డెన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మడిపల్లి, కంఠాయపాలెం, మాటేడు, తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. మంచి ఉద్ధేశంతో పార్టీలో చేరుతామన్న వారికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో గులాబీ పార్టీకి నూకలు చెల్లాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు 50వేల మెజార్టీ తగ్గకుండా కృషి చేయాలని కోరారు. నిరంజన్రెడ్డి, హరిప్రసాద్, తిరుపతిరెడ్డి, సంతోష్, రామచంద్రయ్య, సాయిలు, ఐలయ్య, రామలింగం, అనిల్రెడ్డి, వెంకటస్వామి, రాంబ్రహ్మచారి పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
పదేళ్లలో మోదీ చేసింది ఏమీ లేదు
సాక్షి, మహబూబాబాద్: పది సంవత్సరాల మోదీ పాలనలో చేసింది ఏమీలేదని, ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలతో ఎన్నికల ప్రచారం, మిగిలిన నాలుగు రోజుల ప్రణాళికపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని అన్నారు. గత రెండు రోజుల నుంచి రైతులకు రైతు బంధు కూడా పడుతుందని చెప్పారు. కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులు ఇప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. రైతుబంధు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని పరిపాలించడం పక్కన పెట్టిన ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబాని తిట్టడం, విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారని అన్నారు. దేశంలో వచ్చేది ఇండియా కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరీ, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దీపాదాస్ మున్షీకి ఘన స్వాగతం మహబూబాబాద్ రూరల్ : మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చిన దీపాదాస్ మున్షీకి మంగళవారం ఘనస్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, జాటోత్ రామచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement