-
పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల (వీఎఫ్సీ) ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసే ఓటింగ్ గడువును ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీ(శుక్రవారం) వరకు పొడిగించిందని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. వాస్తవానికి బుధవారంతో గడువు ముగియగా.. ఎన్నికల కమిషన్ మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించిందని.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈనెల 7వ తేదీ వరకు 16,088 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 994 మంది.. ఓట్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఇంటినుంచే ఓటుహక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. సెకెండ్ ర్యాండమైజేషన్ పూర్తి.. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సాధారణ పరిశీలకులు రాజేందర్ కుమార్ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా సమక్షంలో అదనపు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో గల పరిగి, వికారాబాద్, తాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎంల స్థానంలో అదనంగా కేటాయించబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బుధవారం రెండవ విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే, నిమిషాల వ్యవధిలోనే సెక్టోరల్ అధికారులు సంబంధిత పోలింగ్ స్టేషన్కు చేరుకుంటే తమ వద్ద రిజర్వ్లో ఉండే కంట్రోల్ యూనిట్లను సమకూరుస్తారని కలెక్టర్ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సందర్శన.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్ను, కంట్రోల్ రూమ్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా బుధవారం పరిశీలించారు. ఎంసీఎంసీలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్ రూంను సందర్శించారు. 1950 టోల్ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్పోస్ట్ల వద్ద తనిఖీ బృందాల పని తీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును కంట్రోల్ రూంలో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. 10వ తేదీ వరకు ఓటువేసే అవకాశం ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి: ఆర్ఓ, కలెక్టర్ శశాంక -
బీజేపీని బొందపెట్టాలి
ఇబ్రహీంపట్నం: మతోన్మాద బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపించాలని కోరుతూ బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ. విద్వేషాలను రెచ్చగొడుతోందని బీజేపీపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతు ఆదాయం రెట్టింపు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల కోసం ఢిల్లీలో ఆందోళన చేపట్టిన 760 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పాపం ఆ పార్టీదేనని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణకు లేకుండాపోయిందని, వీరిపై జరుగుతున్న అఘాయిత్యాల కేసుల్లో బీజేపీ నేతలే ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను అణగదొక్కేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీలో చేరని వారిపై వీటిని ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్ కుమార్తైపె కేసులు పెట్టిందన్నారు. ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసే విధంగా చట్టాన్ని మార్చారన్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలు ఆ పార్టీలో ఉంటారనే గ్యారంటీలేదని ఎద్దేవా చేశారు. అధికారంతో ప్రమేయం లేకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసేదే ఎర్రజెండా అని తెలిపారు. 2006లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైఒత్తిడి తెచ్చి ఉపాధి హామి పథకం చట్టాన్ని తెచ్చేలా చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని స్పష్టంచేశారు. అటవీ చట్టాన్ని అమలు చేసేలా కేసీఆర్పై ఒత్తిడి చేసింది తామేనన్నారు.పార్లమెంట్లో మాట్లాడలేని అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రయోజనం లేదని తెలిపారు. ప్రజల, కార్మికుల పక్షాన పోరాడే ఆదర్శ కమ్యూనిస్టు ఎండీ జహంగీర్ను భువనగిరి నుంచి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్, నేతలు సామేల్, పి.యాదయ్య, కే. జగన్, జగదీశ్, అలంపల్లి నర్సింహ్మ, కవిత, జయలక్ష్మి పాల్గొన్నారు. ఆ పార్టీ మాట వినని వారిపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోంది ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్ కూతురుపై కేసులు పెట్టింది రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
స్వాగత తోరణం కూలి మహిళ మృతి
మొయినాబాద్: బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల స్వాగత తోరణం ఈదురు గాలులకు కూలి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జహీరాబేగం(45) మంగళవారం రాత్రి కూరగాయలకు వెళ్తుండగా వేగంగా ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో గ్రామంలో ఇటీవల బీరప్ప బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుద్దీపాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈదురు గాలికి ఆ తోరణం కూలి మహిళపై పడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.చిన్నమంగళారంలో ఈదురుగాలుల బీభత్సం -
మెజార్టీ సీట్లు సాధిస్తాం
కొత్తూరు: దేశ రక్షణ కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, ప్రపంచంలో భారత దేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్లనే ఒక ప్రత్యేకత వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గత పదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినప్పటికీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అదేపనిగా ఎన్డీఏ సర్కార్ను విమర్శిస్తున్నాయన్నారు. అయితే ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారని.. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీవర్ధన్రెడ్డి, నర్సింహగౌడ్, సదానంద్గౌడ్, రమేష్, మాణిక్యం, నాగరాజుచారి తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో విప్లవాత్మక మార్పులు షాద్నగర్: దేశం మరింత అభివృద్ధి సాధించాలంటే కేవలం బీజేపీ ద్వారానే సాధ్యమని ప్రముఖ నటి, ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నిర్వహించిన రోడ్షోలో నవనీత్ కౌర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. తద్వారా పదేళ్లలో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కమలం పుప్పు గుర్తుకు ఓటువేసి డీకే ఆరుణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు.. అందెబాబయ్య, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ -
కేశంపేటలో టెన్షన్.. టెన్షన్
కేశంపేట: ఆ రెండు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో షాద్నగర్ నియోజకవర్గం కేశంపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాలు.. జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుధవారం దాదాపు ఒకే సమయంలో ప్రచారం చేపట్టాయి. ప్రచారానికి సంబంధించి ఆయా పార్టీల నాయ కులు అనుమతులు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణతో పాటు ఆ పార్టీ ముఖ్యనాయకులు కేశంపేటకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీజీపీ నాయకులు కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ వైపు వెళ్లకుండా వైఎస్సార్ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వారిని నిలువరించారు. అయితే ఈ మార్గం గుండా ర్యాలీ నిర్వహించేందుకు తమకు అనుమతులు ఉన్నాయని, ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నినాదాలు.. ఈ క్రమంలో వైఎస్సార్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో పాటు పోలీసు లను తోసుకుంటూ బీజేపీ నాయకులు.. కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ జరుగుతున్న అంబేద్కర్ చౌరస్తా వైపు దూసుకెళ్లారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకేచోటకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు జై మోదీ, జై బీజేపీ, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్, జై సోనియా అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటకముందే పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఒకే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచారం కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ వైపు దూసుకెళ్లేందుకు కమలదళం యత్నం బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లిన నేతలు పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలు -
కొండాను గెలిపించండి
కందుకూరు: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు బుధవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. లేమూరు ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, అగర్మియాగూడ మాజీ ఉపసర్పంచ్ ఆదీబ్ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్రెడ్డి, సీనియర్ నాయకులు భిక్షపతి, జగదీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, యాదగిరిరెడ్డి, నారాయణ, వెంకటేశ్, బాలకృష్ణ, శ్రీకాంత్, రవీందర్రెడ్డి, రాజు, రాఘవేందర్, ఆకాష్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. శంషాబాద్లో బీఆర్ఎస్కు షాక్ కాంగ్రెస్లో చేరిన కారు పార్టీ కౌన్సిలర్లు శంషాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్లో బీఆర్ఎస్కు ఎదురుదెెబ్బ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ రోడ్షో సక్సెస్ అయిందన్న సంతోషంలో ఉన్న బీఆర్ఎస్కు మరుసటిరోజే కౌన్సిలర్లు షాకిచ్చారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ భద్రునాయక్, 22 కౌన్సిలర్ ఎం.శ్రీకాంత్యాదవ్, 23వ వార్డు కౌన్సిలర్ శ్రవంత్శ్రీకాంత్రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ మస్రజ్జాతాజ్బా సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంజయ్యాదవ్, పీసీసీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే బీసీలకు గుర్తింపు పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని హుడాకాంప్లెక్స్: బీఆర్ఎస్ పార్టీతోనే బీసీలకు గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం సరూర్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఉచితాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలు, బీసీల గళం వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు గోపాల్, అంకిరెడ్డి, అరవింద్కుమార్, జహీర్, రుషిగుప్తా, సలీం, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాలను తరలించుకుపోయారు.. కందుకూరు: బీఆర్ఎస్ హయాంలో తాము కందుకూరులో శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రులను.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ నిర్మించకుండా రద్దుచేసి కొడంగల్ తరలించుకుపోయారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బుధవారం రాత్రి కందుకూరులో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్తో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు సేకరిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసిందని.. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనర్సింహారెడ్డి, అంజయ్యగౌడ్, దశరథ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మహిళా నాయకురాలు జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
ఇబ్రహీంపట్నం: భువనగిరి ప్రాంత అభివృద్ధిపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చర్చకు రావాలని సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పాషానరహరి స్మారక కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి లోక్సభ పరిధిలో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇబ్రహీంపట్నం వేదికగా ఈ అంశంపై చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. స్థానిక సమస్యలపై ఎటువంటి అవగాహన లేని నాయకులు కేవలం డబ్బుతోనే ఎన్నికల్లో గెలవచ్చనే అపోహలో ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సీపీఎంకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్వెస్లీ, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలోమ్మ, జిల్లా కార్యదర్శి భాస్కర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, నాయకులు.. సామేల్, యాదయ్య, జగదీశ్, నర్సింహ, కవిత, జగన్, జంగయ్య, ఎల్లేశ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకుసీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ సవాల్ ఇబ్రహీంపట్నంలో ముమ్మర ప్రచారం -
కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి కేశంపేట: దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి రావాలని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని సంగెం, కేశంపేట, కొండారెడ్డిపల్లిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డితో కలసి చల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే షాద్నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటువేసి చల్లాను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని పొల్కొనిగుట్ట తండాకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ జిల్లా చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రావణ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, నాయకులు.. శ్రీధర్రెడ్డి, ఆనంద్కుమార్, సుందరయ్య, రూప్లానాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.. షాబాద్: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి నగంరంలో శ్రీనివాస్గౌడ్, జీఎంఎస్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్, ఫహీమ్ ఖురేషీ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హస్తం గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షరీఫ్, జాకీర్షరీఫ్, నాయకులు తదితరులున్నారు. రంజిత్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.. మొయినాబాద్ రూరల్: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ అన్నారు. మొయినాబాద్ మండలంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి, మిగతా ప్రజా సంఘాలన్నిటికి సంబంధించి పీసీసీ కార్యవర్గం తనను కమిటీ సభ్యుడిగా నియమించిందనితెలిపారు. అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. తన నియామకానికి సహకరించిన మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
మంచాల: అకాల వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కొంగర విష్ణువర్ధన్రెడ్డి కోరారు. బుధవారం బండలేమూర్, చెన్నారెడ్డి గూడ, ఆరుట్ల గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతికి వచ్చిన వరి పంట వానకు పాడైపోయి రైతులు నష్టపోయారన్నారు. చెన్నారెడ్డిగూడలో గాలి వానకు పౌల్ట్రీఫాం రేకులు ధ్వంసమయ్యాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పంట నష్ట వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, నరేందర్రెడ్డి, రాంరెడి, బుగ్గరాములు, హన్మంత్రెడ్డి, వెంకటేష్, చంద్రయ్య, యాదయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఆదుకోవాలి వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాండాల జంగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆరుట్ల గ్రామంలో వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న బొప్పాయి, మామిడి తోటలను పరిశీలన చేశారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేసి రైతులు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్రెడ్డి, వెంకట్ రెడ్డి, సత్తిరెడ్డి, భగవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికసాయం అందజేత వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వాలు అండగా నిలవాలని బీఆర్ఎస్ నాయకుడు మొద్దు సికిందర్రెడ్డి కోరారు. చెన్నారెడ్డిగూడలో వర్షాలకు పౌల్ట్రీఫాం దెబ్బతిని నష్టపోయిన రైతు మహేష్కు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బహుదూర్ రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం కూడా వెంటనే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జానిపాషా, రాము, జంగయ్య, శ్రీశైలం, శ్రీకాంత్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. గాలికి ఎగిరిన ఇంటి పైకప్పు కొందుర్గు: కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో మంగళవారం కురిసిన గాలి వానకు తీరని నష్టం వాటిల్లింది. కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామానికి చెందిన బేగరి రామకిష్టయ్య ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయింది. ఇంటిలోనే ఉన్న అనంతమ్మ చేతికి గాయాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతాంగం తీరని నష్టాన్ని చవి చూసింది. మంగళవారం రాత్రి కురిసిన వానకు చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. విపరీతమైన ఈదురుగాలులకు చెట్లు, షెడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల రాజకీయ నాయకులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధ్వంసమైన పంట పొలాలు నేలరాలిన మామిడి కాయలు బాధిత రైతులను ఆదుకోవాలని నాయకుల డిమాండ్ -
కాంగ్రెస్తోనే సమన్యాయం
ఆమనగల్లు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె, పార్టీ రాష్ట్ర నాయకురాలు వెన్నెల పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని ఆమె అన్నారు. ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాలు, పట్టణంలోని పలు కాలనీలలో బుధవారం నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి డా.మల్లురవికి మద్దతుగా ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందిందన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోసం ఏనాడూ పని చేయలేదని, కేవలం కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే పనిచేశారని విమర్శించారు. విభజన రాజకీయాలు సాగించే బీజేపీకి పార్లమెంటు ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ అనంతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, నాయకులు మానయ్య, ఖాదర్ఖాద్రి, కృష్ణనాయక్, ఫిరోజ్, రాజు, షర్ఫుద్దీన్, కుమార్గౌడ్, అలీం, ఖాదర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకురాలు వెన్నెల -
మైనింగ్ కంపెనీ రద్దు చేయాలి
కడ్తాల్: మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేయవద్దని మండల పరిధిలోని ముద్వీన్ గ్రామస్తులు మొర పెట్టుకున్నారు. గ్రామ సమీపంలో నల్లగుట్టపై మైనింగ్ కంపెనీ ఏర్పాటు అంశంపై పార్లమెంట్ ఎన్నికల లోపు అధికారులు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్తో పాటు, కందుకూరు ఆర్డీఓ సూరజ్కుమార్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో మైనింగ్ క్రషర్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని, 2022 జూలైలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి జిల్లా అదనపు కలెక్టర్తో పాటు, మైనింగ్, పొల్యూషన్ కంట్రోలు అధికారులకు గ్రామస్తులు ముక్త కంఠంతో నివేదించామన్నారు. అప్పట్లోనే జిల్లా కలెక్టర్కు సైతం వినతిపత్రాలు అందించామన్నారు. గ్రామానికి కిలో మీటర్ దూరంలో ఉన్న నల్లగుట్టపై మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, సమీప వ్యవసాయ పొలాలు, వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. కుల వృత్తుల వారు జీవనోపాధి కోల్పోతారని వివరించామన్నారు. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం కొంత మంది నల్లగుట్ట సమీప రైతులను కలిసి మైనింగ్ చేపట్టడానికి వచ్చామని తెలపడంతో గ్రామస్తులు భయాందోళన గురయ్యారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు నిలిపి వేయాలని కోరారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని ముద్వీన్ గ్రామస్తులు పేర్కొన్నారు. నల్లగుట్టను పరిశీలించిన ఆర్ఐ స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నల్లగుట్టను స్థానిక ఆర్ఐ వాహిద్ సందర్శించారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. ఎలాంటి మైనింగ్ పనులు చేపట్టలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ఆర్ఐని కలిసి, మైనింగ్ కంపెనీకి అనుమతులు నిలిపి వేయాలని వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్, ఆర్డీఓకు ముద్వీన్ గ్రామస్తుల వినతి -
రాత్రంతా జాగారమే!
1500కిపైగా ఫీడర్లలో నిలిచిన విద్యుత్ సరఫరా సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈదురు గాలి సృష్టించిన బీభత్సానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. గ్రేటర్ సహా శివారు జిల్లాల్లో రాత్రంతా సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల బుధవారం తెల్లవారుజామున సరఫరా పునరుద్ధరించినప్పటికీ.. మరికొన్ని నివాసాల్లో ఇప్పటికీ అంధకారమే రాజ్యమేలుతోంది. ఉక్కపోతకు తోడు దోమలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మంగళవారం సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. రంగారెడ్డి జోన్ పరిధిలోనే 350ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోయింది. 20కిపైగా ఎల్టీ పోల్స్ పడిపోగా, 11 కేవీ పోల్స్ ఎనిమిది పడిపోయాయి. రెండు డీటీఆర్ నేలకూలాయి. మంగళవారం మధ్నాహ్నం 3.30 గంటల వరకు వరకు 4300 మెగావాట్లకు పైగా ఉన్న విద్యుత్ డిమాండ్ సాయంత్రం ఆరు తర్వాత ఏకంగా 1000 మెగావాట్లకు పడిపోయింది. విద్యుత్ లైన్లకు ఫెక్సీల షాక్ పోలెపల్లి–కడ్తాల్ 33 కేవీ ఫీడర్ లైన్పై హోర్డింగ్ పడటంతో శంషాబాద్, చిన్న గోల్కొండ సహా పలు ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లకు సరఫరా నిలిచిపోయింది. శివరాంపల్లి – మీరాలం 33 కేవీ ఫీడర్లైన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దీని పరిధిలోని ఐదు 11 కేవీ ఫీడర్లకు ఇన్ కమింగ్ నిలిచిపోయింది. నార్సింగిలోని 11 కేవీ లైన్లు తెలిపడ్డాయి. తారామతి భారదరి–కిలావత్ 33 కేవీ లైన్కు పతంగి దారం చుట్టు కోవడంతో వైర్లు మెలికపడి షార్ట్సర్క్యూట్ సమస్య తలెత్తింది. సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పర్యవేక్షణకు తోడు డైరెక్టర్లు, సీజీఎంలు, ఎస్ఈల చొరవతో చకచక లైన్లను పునరుద్ధరించారు. కిరాణాషాపులో చోరీ రూ.లక్ష విలువైన సిగరెట్ ప్యాకెట్ల అపహరణ ఆమనగల్లు: పట్టణంలో జాతీయ రహదారిపై ఉన్న ఓ కిరాణాషాపులో మంగళవారం రాత్రి దుండగులు షట్టర్ను పగులకొట్టి రూ.లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. బాధితుని వివరాల ప్రకారం.. ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఏపీజీవీబీ బ్యాంకు పక్కన క్రాంతికుమార్ కిరాణాషాపు ఉంది. మంగళవారం రాత్రి క్రాంతికుమార్ షాపునకు తాళం వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి దుండగులు షాపు షట్టర్ను పగులకొట్టి సిగరెట్ కాటన్ బాక్స్లను ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే షాపునకు వచ్చిన క్రాంతికుమార్ దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.లక్ష విలువ ఉంటుదని తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ బాల్రాం, క్లూస్టీం పరిశీలించి వివరాలు సేకరించారు. ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి దొంగతనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
కయ్యాల కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
ఇబ్రహీంపట్నం: కయ్యాల కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భువనగిరి లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి ఇబ్రహీంపట్నంలో కార్నర్ మీటింగ్ను బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు కోట్లాటలు పంచాయితీలతో ఆరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఐ, ఏసీపీ, తహసీల్దార్లను ఈ ఐదు నెలల కాలంలోనే పలుసార్లు మార్చారని అన్నారు. రూ.470 కోట్ల నిధులు నియోజకవర్గానికి మంజూరు చేయిస్తే తట్టెడు మట్టి పోసి పనులు ప్రారంభించిన దాఖలాలు నియోజకవర్గంలో లేదన్నారు. క్యామ మల్లేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంచిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, మల్లేశ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసిని మీ మనిషిని నన్ను ఆశీర్వదించండని అభ్యర్థించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. తానను గెలిపిస్తే రియల్ ఎసే్ట్ట్, వ్యాపార, పరిశ్రమల రంగాలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఫాక్స్కాన్ కంపెనీ ఇక్కడి తీసుకోస్తే దాని ఉనికిలేకుండా చేశారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కిషన్రెడ్డి భువనగిరి ఎంపీగా క్యామ మల్లేశ్ను ఆశీర్వదించండి -
మీ ఇంటికే వస్తున్నామమ్మా..
కందుకూరు: ప్రశాంతంగా దైవ దర్శనాన్ని చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో కాసేపట్లో తమ కుమార్తె ఇంటికి చేరుకుంటామని ఆ భార్యాభర్తలు మురిసిపోయారు. కానీ లారీ రూపంలో వచ్చిన మృత్యువు భర్తను కబళించగా, భార్యను తీవ్ర గాయాల పాలు చేసింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు బుధవారం చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేక్మహ్మద్పేటకు చెందిన చింతలపూడి దుర్గాప్రసాద్(65) భార్య సరోజతో కలిసి హైదరాబాద్ మలక్పేటలో నివసిస్తున్నారు. దుర్గాప్రసాద్ ప్రభుత్వ ఆడిట్ డిపార్టుమెంట్లో పని చేసి రిటైరయ్యారు. కుమారుడు అమెరికాలో సెటిల్ అవగా.. కుమార్తె తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రాంకీ విల్లా వెంచర్లో ఉంటున్నారు. గత సోమవారం దుర్గాప్రసాద్ దంపతులు కారులో దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. కందుకూరు వద్దకు రాగానే సమీపంలో ఉన్న కూతురుకు ఫోన్ చేసి ‘మీ ఇంటికే వస్తున్నామమ్మా’ అని చెప్పారు. మరికొద్ది క్షణాల్లో గమ్యం చేరుకోవాల్సి ఉండగా.. శ్రీశైలం రహదారిపై పెద్దిరెడ్డి వెంచర్– కొత్తూర్ వాగు మధ్య ఎదురుగా వస్తున్న లారీ వీరి కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ సీటులో ఉన్న దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడి ఇరుక్కుపోయారు. సరోజకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వాహనంలో ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ను, సరోజను స్థానికులు అతికష్టంగా బయటకు తీసి 108 అంబులెన్స్ వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దుర్గాప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరోజ చికిత్స పొందుతోంది. ఈ మేరకు సీఐ మక్బూల్జానీ ఆధ్వర్యంలో ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూతురుకు ఫోన్చేసి చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత కొద్ది క్షణాలకే రోడ్డు ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ తండ్రి దుర్మరణం, తీవ్ర గాయాలపాలైన తల్లి -
సమష్టి కృషితో బీజేపీని గెలిపిద్దాం
మొయినాబాద్రూరల్: బీజేపీ గెలుపే లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్, జిల్లా నాయకుడు చిలుకూరు గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మధుసుధన్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అజీజ్నగర్ చౌరస్తాలో పార్టీ ఎన్నికల కార్యాలయంలో జిల్లా ఎస్సీ మోర్చా కమిటీని జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ నాయకులతో కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్లలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మే స్థితిలో లేరన్నారు. నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు ఎంతో వృద్ధి చెందాయన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు వెంకటేష్గౌడ్, మాధవరెడ్డి, రాజమల్లేష్, మహేందర్ముదిరాజ్ పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్ -
గుర్రంగూడలో కారు బీభత్సం
మీర్పేట: అతివేగంగా వచ్చిన కారు పల్టీకొట్టి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్రంగూడకు చెందిన జ్ఞానేశ్వర్ తన సోదరుడి కోసం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంతో వేచిఉన్నారు. అదే సమయంలో ఓ కారు అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో పాటు అక్కడే బైకుపై ఉన్న జ్ఞానేశ్వర్ను ఢీ కొట్టింది. దీంతో జ్ఞానేశ్వర్కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వేగానికి విద్యుత్ స్తంభం కూలి మూడు ముక్కలైందని, ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు వివరించారు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపారు. అతివేగంతో అదుపు తప్పిన వాహనం విద్యుత్ స్తంభం, బైక్ను ఢీకొట్టిన వైనం -
విద్యుదాఘాతంతో గేదె మృతి
మొయినాబాద్: ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలి ఓ గేదె మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి రామకృష్ణ బుధవారం ఉదయం గేదెలను పొలం వద్దకు తీసుకెళ్తున్నారు. మంగళవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గమనించకుండా గేదె వెళ్లి విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన గేదె విలువ సుమారు రూ.1లక్ష ఉంటుందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
హుడాకాంప్లెక్స్: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఎంతో ఉపయోగపడుతుందని శిక్షకుడు గురూజీ ఇస్మాయిల్ అన్నారు. సరూర్నగర్ హుడాకాంప్లెక్స్ లోటస్ల్యాప్ స్కూల్లో ఉచిత యోగా శిక్షణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. కొద్దిపాటి శారీరక శ్రమతో వాటన్నింటిని దూరం చేసుకోవడానికి యోగా గొప్ప ఆయుధమన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో నరేందర్, దయాదేవి, ఉపేందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవాలి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంచాల: ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల్లో మరింత మార్పు వస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో వీఆర్వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కల్యాణోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతంగా జరుపుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకటేష్, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో మోదీ హవా నడుస్తోంది
మీర్పేట: మీర్పేట కార్పొరేషన్ 6వ డివిజన్ కార్పొరేటర్ మమత ప్రవీణ్ తమ అనుచరులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం మోదీ హవా నడుస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కాలం చెల్లిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 నుంచి 15 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములుయాదవ్, శంకర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్రెడ్డి, నాయకులు నర్సింహ, నీలారవినాయక్, నాగరాజు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి -
గాయపడిన వ్యక్తి మృతి
ధారూరు: చికెన్ వండిన పాత్రలో పడి తీవ్ర గాయాలైన వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన గొర్రెంకల మల్లయ్య(45) ఈ నెల 2న మండల కేంద్రంలో బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగియగానే అందరితో పాటు భోజనానికి వెళ్లారు. ఒక్కసారిగా గుంపుగా జనాలు భోజనం కోసం ఎగబడ్డారు. అక్కడ మల్లయ్య అతికష్టం మీద భోజనం వడ్డించుకుని చికెన్ కోసం వేడిగా ఉన్న పాత్ర దగ్గరికి వెళ్లారు. ఆ తోపులాటలో అదుపు తప్పి చికెన్ పాత్ర(బొగవాన)లో పడిపోయారు. వేడి ఎక్కువ ఉండడంతో ఆయన కాళ్లు, చేతులు, నడుము భాగం కాలిపోయింది. వెంటనే 108 వాహనంలో వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మరోపక్క ఆయనకు తోడుగా ఉన్న తల్లి రాజమ్మ అదృశ్యమైంది. ఆమె రెండో కుమారుడు కృష్ణ అప్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో మల్లయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మరుగుతున్న కూర పాత్రలో పడి చికిత్స పొందుతూ మృత్యువాత -
మేం సిద్ధం
● ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు ● దేశభక్తి ఉన్నవారు ఓట్లేయండి ● అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ● దివ్యాంగులకు ఉచిత రాకపోకల సదుపాయం ● జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి భద్రత.. డీఆర్సీలు, స్ట్రాంగ్రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరంగా 383 సమస్యాత్మక కేంద్రాలు సహా మొత్తం 1,046 పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. 14వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు వైన్ షాపులు పోలింగ్కు 48 గంటల ముందే మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. నగరంలో పోలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం సీపీ శ్రీనివాస్రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 45 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని చెబుతూ, ఈసారి పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అయిదేళ్లకోసారి లభించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, దేశభక్తి, దేశంపై ప్రేమ ఉన్న వారు దేశం కోసం ఓటు వేయాలన్నారు. జిల్లాలోని 3,986 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ స్క్రీనింగ్ ఆడియోతో సహ ఉంటుందని, రాజకీయ పార్టీలు కోరితే ఫీడ్ అందజేస్తామని తెలిపారు. ఇంటింటికీ ఓటరుస్లిప్పుల పంపిణీ 81 శాతం పూర్తయిందని, 95 శాతం వరకు జరిగే వీలుందన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 47 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో 16,776 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుండగా, ఇప్పటివరకు 9,266 మంది ఓట్లు వేశారన్నారు. మిగతావారికి 10వ తేదీ వరకు అ వకాశం కల్పిస్తామన్నారు. వికలాంగులు ‘సాక్షం’ యాప్లో పేరు నమోదు చేసుకుంటే ఇంటినుంచి పోలింగ్ కేంద్రం వరకు ఉచితంగా రాకపోకల సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 288 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. హోమ్ ఓటర్లు 571మందికి గాను ఇప్పటి వరకు 532 మంది ఓట్లు వేశారన్నారు. విధులకు హాజరు కాని సిబ్బందిలో వందమందికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేయని హౌసింగ్ సొసైటీలు హౌసింగ్ సొసైటీలు కోరితే పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఉన్నప్పటికీ, జిల్లాలో తమకు పోలింగ్ కేంద్రం కావాలంటూ ఏ ఒక్క సొసైటీ కూడా లిఖితపూర్వకంగా కోరలేదన్నారు. పోలింగ్ రోజున వాణిజ్య దుకాణాలు, హోటళ్లు బంద్ పాటించాలన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ● ఎండలు తీవ్రంగా ఉన్నందున బాధితులకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వైద్యసాయమందేలా ఏర్పాట్లు. ఇంటింటికీ ఓటరు స్లిప్లతోపాటు పోలింగ్కు సంబంధించి సమాచార పుస్తకాలు, స్టిక్కర్ల పంపిణీ. ● క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 1,250 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎన్నికల సిబ్బంది అందరికీ అవసరమైన శిక్షణలు పూర్తి. ● గత అసెంబ్లీ ఎన్నికల మాదిరే పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసుకునేలా పోల్క్యూ రూట్ యాప్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ మ్యాప్తో పోలింగ్ కేంద్రం దారి కూడా తెలుసుకోవచ్చు. ● హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఉల్లంఘనల కేసులు నమోదు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా మహిళా సిబ్బంది ఉండేలా ఏర్పాటు. వేలిపై పురుషులు ఇంక్మార్క్ వేస్తే ఇబ్బంది పడే వారుంటే.. మహిళా సిబ్బందితోనే ఇంక్ వేయించే ఏర్పాటు. ● ప్రచార గడువు ముగిశాక కూడా పత్రికలు, సోషల్ మీడియాలో ‘సైలెన్స్ ప్రచారం’ చేసుకోవచ్చు. వాటికి ముందస్తు అనుమతి అవసరం. ఏఎస్డీ(ఆబ్సెంట్,షిఫ్టెడ్,డెత్)ఓటర్లుగా ఇప్పటి వరకు 18వేల మందిని గుర్తించాం. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. ● సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ తేదీ తెలిపే ఓటరు స్టిక్కరు, ‘ఐ ఓట్ ఫర్ షూర్’ తదితర స్టిక్కర్లను ప్రదర్శించారు. -
ఐపీఎల్ మ్యాచ్కు ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీన జరుగనున్న ఐపీఎల్–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లకిడికాఫూల్, కూకట్పల్లిహౌసింగ్బోర్డ్, జూబ్లీబస్స్టేషన్,హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్,తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. అలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. -
No Headline
నియోజకవర్గం 18–19 20–29 30–39 40–49 50–59 60–69 70–79 80–89 90–99 100–120 మహేశ్వరం 50,963 1,04,113 1,64,775 1,21,057 77,682 45,610 22,465 6,400 1,236 95 రాజేంద్రనగర్ 55,568 1,13,241 1,92,334 1,41,689 80,468 45,070 20,191 4,522 791 65 శేరిలింగంపల్లి 54,138 1,12,281 2,39,949 1,93,788 99,951 59,885 30,233 7,779 1,304 08 చేవెళ్ల 28,822 57,685 70,239 55,732 39,153 23,535 11,353 3,339 578 93 పరిగి 10,368 62,369 77,230 50,845 33,269 20,423 9,483 2,249 321 00 వికారాబాద్ 7,081 50,173 69,561 44,148 31,551 18,491 8,390 1,937 301 05 తాండూరు 8,716 57,625 71,011 47,974 32,034 17,191 7,556 1,754 228 03 -
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెబుదాం
షాబాద్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెబుదాం.. కష్టపడి పనిచేయండి గెలుపు మనదే అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి రోడ్డుషో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ.. గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని చెప్పారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఈ నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. పేదల వర్గాలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు పోయినా, నీరు రాకపోయినా, పంటలు ఎండియినా పట్టించుకునే దిక్కే లేదని విమర్శించారు. కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ కష్టాలు చెబుతున్నారని చెప్పారు. నమ్మిన పార్టీని, కేసీఆర్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రాముడి గుడి, రాముడి పేరు చెప్పి ఓట్లు వేయాలని అడుగుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడిగా ఈ ప్రాంత గొంతుకుగా ఉంటానన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసన మండలి మాజీ చెర్మన్ స్వామిగౌడ్, జెడ్పీటీసీ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని తమ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్కు బహుమతి ఇస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, నాయకులు నక్క శ్రీనివాస్గౌడ్, రాజేందర్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
చేవెళ్ల అభివృద్ధే లక్ష్యం
మొయినాబాద్: చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజలకోసమే నిరంతరం పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం ఇప్పటికే పలు కంపెనీలను తేవడం జరిగిందని.. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్లు రామకృష్ణగౌడ్, వీరభద్రస్వామి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే సంక్షేమం మీర్పేట: కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమం కోరుకునేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మీర్పేట కార్పొరేషన్లో జరిగిన బైకుర్యాలీలో ఆయన పాల్గొని నందిహిల్స్ కూడలిలో మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేవని, వారు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, పెన్షన్లు, సిలిండర్లు వద్దంటున్నారని, ఏ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో, అభ్యర్థి ఏం చేస్తాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధితో పాటు ప్రజలకు సాయం చేశానని తెలిపారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి అందుబాటులో ఉండడు.. అపాయింట్మెంట్ అడుగుతాడని ఎద్దేవా చేశారు. గెలిచిన వెంటనే నందిహిల్స్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ ముద్దా పవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు సామిడి గోపాల్రెడ్డి, సిద్దాల దశరథ, జిల్లెల నరేందర్రెడ్డి, జెటావత్ రవినాయక్, చల్లా బాల్రెడ్డి, సురేందర్రెడ్డి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి
Pagination
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement