సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Apr 5 2024 3:30 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 22,526 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 77 పాయింట్లు దిగజారి 74,306 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, బజాన్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి.

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాన్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీసుజుకీ, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, నెస్లే, ఎన్‌టీపీసీ సంస్థకు చెందిన షేర్లు నష్టాలబాటపట్టాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement