భోగాపురంలో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

భోగాపురంలో వ్యక్తి దారుణ హత్య

Published Tue, Apr 23 2024 8:25 AM

రక్తపు మడుగులో రంగారావు మృతదేహం   - Sakshi

పెదవేగి: పాతకక్షల నేపథ్యంలో మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పెదవేగి ఎస్సై వి రాజేంద్రప్రసాద్‌ తెలిసిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన పామర్తి రంగారావు (44), అదే గ్రామానికి చెందిన మందపాక వరప్రసాద్‌ మధ్య పాతకక్షలు ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం రంగారావు గ్రామంలోని ఓ దుకాణం వద్దకు రాగా, అక్కడ వరప్రసాద్‌, రంగారావు మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. ఇది పెద్దదై వరప్రసాద్‌ కోపంతో తనకు అందుబాటులో ఉన్న కత్తితో దాడి చేసి రంగరావు పక్కటెముకల వద్ద పొడిచాడు. అనంతరం మెడపై కత్తితో నరకడంతో రంగారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్‌ వెంటనే ఘటనా స్థలానికి హత్యకు గల కారణాలపై స్థానికుల నుంచి వివరాలు ఆరా తీశారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పాతకక్షలే కారణం.. కత్తితో దాడి

ఘటనా స్థలంలోనే మృతి

Advertisement
Advertisement