పెమ్మసాని ఓ రాజకీయ అజ్ఞాని | Sakshi
Sakshi News home page

పెమ్మసాని ఓ రాజకీయ అజ్ఞాని

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వలి

లక్ష్మీపురం: అమెరికాలో డబ్బు కూడా బెట్టి ఆ డబ్బుతో రాజకీయం చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు వచ్చారని, పెమ్మసాని ఒక రాజకీయ అజ్ఞాని అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెమ్మసాని అనే వ్యక్తి 30 ఏళ్లగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు వేసి ఎరగడని ఆరోపించారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ అడుగు పెట్టి గుంటూరు బాగు చేస్తానని చెబితే ఎవరు నమ్ముతారని అన్నారు. రేపటి రోజు గెలిచిన ఓడిన మీ కంటికి కనబడరని జోష్యం చెప్పారు. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో ప్రజలు గమనించి మీ అమూల్యమైన ఓటు అనే ఆయుధం డబ్బుతో రాజకీయం చేయడానికి వచ్చిన వ్యాపారస్తులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Advertisement
Advertisement