కల్యాణం.. వైభోగం | Sakshi
Sakshi News home page

కల్యాణం.. వైభోగం

Published Thu, Apr 18 2024 10:30 AM

ధర్మపురి: దొంతాపూర్‌లో రాములవారి కల్యాణానికి తరలివచ్చిన అశేష భక్తజనం
 - Sakshi

జగిత్యాలటౌన్‌/జగిత్యాలరూరల్‌/ధర్మపురి/గొల్లపల్లి/కొండగట్టు/మేడిపల్లి: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై స్వామివారల కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. తిమ్మాపూర్‌లోని అనుబంధం సీతారామాంజనేయస్వామి ఆలయ ప్రాంగనంలో వేడుకలు నిర్వహించారు. ధర్మపురి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హాజరయ్యారు. మాజీమంత్రి, పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ వేడుల్లో పాల్గొన్నారు. మల్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తుల మధ్య రాములోరి కల్యాణాన్ని జరిపించారు. జగిత్యాల మండలం వ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement