అట్టహాసంగా ఫుట్‌బాల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఫుట్‌బాల్‌ పోటీలు

Published Fri, Apr 19 2024 1:45 AM

పోటీలు ప్రారంభిస్తున్న జీఎం రవిప్రసాద్‌ - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో గురువారం వేణుగోపాల్‌ మెమోరియల్‌ ఫుట్‌బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి, చంద్రపూర్‌, వరంగల్‌, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు పోటీల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం తిరుమల్‌రావు, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి, పీవో ఉమాకాంత్‌, పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మురహరిరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement