Sakshi News home page

చావు నుంచి తప్పించుకున్నా.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

Published Sun, Feb 18 2024 9:36 AM

Rashmika Mandanna Flight Makes Emergency landing - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న మిమానంలో సాకేంతిక సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలో ఉన్న రష్మిక.. షూటింగ్‌ కోసం శనివారం ఉదయం ఫ్లైట్‌లో హైదరాబాద్‌ బయలు దేరారు. ఆమెతో పాటు మరో హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ కూడా అదే విమానం ఎక్కారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో తిరిగి ముంబైలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఇదే విషయాన్ని రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘ఈ రోజు మేం చావు నుంచి తప్పించుకున్నాం’అంటూ శ్రద్ధాకపూర్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసింది. దీంతో రష్మిక పోస్ట్‌ వైరల్‌ అయింది. 

సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల యానిమల్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న రష్మిక..ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. దీంతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. 

Advertisement

What’s your opinion

Advertisement