బోధన్రూరల్(బోధన్): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైనట్లు రూరల్ ఎస్సై నాగనాథ్ శనివారం తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గాంధారికి చెందిన వ్యక్తి..
కామారెడ్డి క్రైం: గాంధారికి చెందిన బూస సాయిలు కామారెడ్డిలో అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి శనివారం తెలిపారు. సాయిలుకు మతిస్థిమితం లేకపోవడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అతని తమ్ముడు భూపతి ఈ నెల 5న సాయంత్రం కామారెడ్డికి తీసుకువచ్చాడు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో బస్సు దిగిన తర్వాత గుట్కా తెచ్చుకుంటానని చెప్పి బస్టాండ్ బయటకు వెళ్లిన సాయిలు తిరిగి రాలేదు. సాయిలు ఆచూకీ లభించకపోవడంతో భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.