నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్ ద్వారా శాఖకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ బయటకు వెళ్లిందనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని టీఎన్జీవోస్ నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించారు. ఉత్తర్వుల కాపీ బయటకు వెళ్లడానికి మహేశ్కు ఎలాంటి సంబంధం లేదని, అకారణంగా డిప్యుటేషన్పై పంపించారని టీఎన్జీవోస్ అధ్యక్షుడు అలుక కిషన్ కలెక్టర్కు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేయించి వాస్తవాలు తెలుసుకోవాలని విన్నవించారు.
డిప్యుటేషన్ను రద్దు చేయాలి
నిజామాబాద్అర్బన్: జిల్లా విద్యాశాఖలో ఇటీవల ఓ ఉద్యోగికి డీఈవో అక్రమంగా డిప్యుటేషన్ వేశారని, వెంటనే వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అక్రమ డిప్యుటేషన్, షోకాజ్ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.