నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసేందుకు నాల్గోరోజు సోమ వారం జిల్లా వ్యాప్తంగా 38మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో పార్లమెంటు నియోజకవర్గానికి ఎనిమిది మంది నామినేషన్లు వేయగా, మిగతా 30మంది వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు వేశారు. మొత్తంపై నామినేషన్లు వేసిన వారిలో 11 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు నామినేషన్లు వేయగా, నలుగురు టీడీపీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు నామినేషన్లు వేశారు. పార్లమెంటు సీటుకు లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున ముప్పాళ్ల సాంబశివరావు, లావు మేఘన తరపున పూదోట అర్లయ్య(టీడీపీ), డాక్టర్ గోదా రమేష్ కుమార్ (జాతీయ జనసేన పార్టీ), తోకల నాగరాజు (ఆల్ ఇండియా పార్వార్డ్ బ్లాక్), వేంపాటి వీరాంజనేయరెడ్డి, షేక్ అబ్దుల్ రజాక్ (ఇండిపెండెంట్), పప్పుల సాంబశివరావు (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ), సంగం శ్రీకాంతరెడ్డి (బీఎస్పీ) నామినేషన్ వేశారు. పెదకూరపాడు అసెంబ్లీకి నంబూరు శంకరరావు, నంబూరు వి.వసంతకుమారి (వైఎస్సార్ సీపీ), పమిడి నాగేశ్వరరావు (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), షేక్ యునాస్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్), నంబూరు కల్యాణ చక్రవర్తి, శెట్టి సింగరయ్య(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. చిలకలూరిపేట అసెంబ్లీకి కావటి శివనాగ మనోహరనాయుడు (వైఎస్సార్ సీపీ), నల్లపు కోటేశ్వరరావు (బీఎస్పీ), రావు సుబ్రమణ్యం (నవతరం), ఒంటారి విజయమ్మ(తెలుగు రాజాధికార సమితి) నామినేషన్లు వేశారు. నరసరావుపేట అసెంబ్లీకి మహమద్ మజూర్షేక్ (ఇండిపెండెంట్), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి సుష్మితారెడ్డి (వైఎస్సార్సీపీ), తల్లపునేని హరికృష్ణ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా) నామినేషన్లు వేశారు. సత్తెనపల్లి అసెంబ్లీకి సులమ్ రాజ్యలక్ష్మి(ఇండిపెండెంట్), కన్నా లక్ష్మినారాయణ (టీడీపీ), అంబటి రాంబాబు తరపున అంబటి విజయలక్ష్మి, యెండూరి ఉపేష్ చంద్రచౌదరి (వైఎస్సార్ సీపీ) నామినేషన్లు వేశారు. వినుకొండ అసెంబ్లీకి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా గిరిబాబు (వైఎస్సార్ సీపీ), ఉస్తల చినకాశయ్య, షేక్ బాజి, దాట్ల అంజిరెడ్డి(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. గురజాల అసెంబ్లీకి కాసు మహేష్రెడ్డి(వైఎస్సార్ సీపీ), యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ), నీరుమళ్ల శ్రీనివాసరావు(అఖిల భారతీయ జనసంఘ), పసుపులేటి పిచ్చయ్య (ఇండిపెండెంట్) నామినేషన్లు వేశారు. మాచర్ల అసెంబ్లీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్ సీపీ), యర్రమాల రామచంద్రారెడ్డి, యర్రమాల కృష్ణవేణి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) తరపున నామినేషన్లు దాఖలు చేశారు.
నాల్గోరోజు 38 నామినేషన్లు దాఖలు
Published Tue, Apr 23 2024 8:25 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement