నేడు నామినేషన్‌ వేయనున్న కిషన్‌రెడ్డి  | Sakshi
Sakshi News home page

నేడు నామినేషన్‌ వేయనున్న కిషన్‌రెడ్డి 

Published Fri, Apr 19 2024 5:03 AM

Kishan Reddy will be nominated today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో ఆయన తన నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరుకానున్నారు. ముందుగా ఆయన సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి 11 గంటల సమయంలో మెహబూబ్‌ కాలేజీ వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రసంగిస్తారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement