అక్కన్నపేట మండలం పోతారం(జే)–ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. 8నెలల కిందట కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురై పెద్దగుంత ఏర్పడింది. అప్పటి నుంచి ఆ రోడ్డును పట్టించుకునే నాథుడులేడు. దీంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్)