-
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్, అహ్మద్, స్వామిచారి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు గజ్వేల్లో బీఆర్ఎస్ ప్రచార రథాలు -
అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం
సిద్దిపేట ఫైర్ ఇన్చార్జి అధికారి నరేష్ సిద్దిపేటకమాన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అగ్నిమాపక శాఖ ఇన్చార్జి అధికారి నరేష్ సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని సిబ్బంది, ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం ఫైర్ సిబ్బందితో కలిసి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పట్టణంలోని పలు ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలన్నారు. పట్టణంలో ఎక్కువగా విద్యుత్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ఐఎస్ఐ మార్క్ కలిగిన వైర్లు, ఉపకరణాలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో షాపుల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ నరేష్, సిబ్బంది సంపత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముహూర్త బలం
● నేటి నుంచి నామినేషన్లు ● మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లుసాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్ కలెక్టరేట్లో, జహీరాబాద్ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. సమాయత్తమవుతున్నారు.. అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్ గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు. నామినేషన్ల ప్రారంభం 18న దాఖలుకు చివరి తేదీ 25 పరిశీలన 26 ఉపసంహరణ 29 పోలింగ్ మే 13కౌంటింగ్ జూన్ 4ముఖ్యనేతల రాక ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు. -
ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి
జహీరాబాద్ టౌన్: ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. పట్టణంలో గడి వీధి హరి మసీద్ కమిటీ సభ్యులు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా బుధవారం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా దర్శనం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనికుమార్ యాత్రీకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తంజీమ్, మచ్చేందర్, సంజీవ్రెడ్డి, అక్బర్, ముర్తుజా, మిథున్రాజ్, పర్వేజ్, అలీ, హాశం, జప్పార్ పాల్గొన్నారు. -
కలెక్టర్ సారూ.. థ్యాంక్స్
స్పెషల్ గ్రాంట్తో మల్లన్నగుట్టతండా వాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం మద్దూరు(హుస్నాబాద్): కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు కలెక్టర్ నిధుల ద్వారా పరిష్కారం లభించింది. వివరాలిలా.. దూళ్మిట్ట మండలం కొండాపూర్ పంచాయతీకి చెందిన మల్లన్న గుట్ట తండా ప్రజలు కొద్ది నెలలుగా తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంపీటీసీ ఇస్లావత్ నమ్ముకు సమస్య వివరించగా ఆయన ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ నిధుల నుంచి తండాకు తాగునీటి లైన్కు కావాల్సిన పైపులు సమకూర్చారు. బుధవారం పైప్ లైన్ పనులను మల్లన్న గుట్ట తండాలో ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ మనుచౌదరి, ఎంపీటీసీ ఇస్లావ త్ నమ్ము, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మీ, పంచాయ తీ సెక్రటరీ అశోక్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం రానుందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వట్టిపల్లికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు 30 మంది కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నర్సారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్లో కాంగ్రెస్కు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజితరాజిరెడ్డి, ఉపసర్పంచ్ మునీర్, నాయకులు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఎంపీటీసీ మహేందర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్నింట్లో రాణించాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటుగా సాంస్కృతిక, క్రీడా రంగాల్లో రాణించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, చదువులో పై తరగతులకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, చదువుకున్న పాఠశాలకు, కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
మూడు సార్లు పర్వతారోహణ
ఎన్సీసీ క్యాడెట్ కార్పోరల్ రాజేష్ను కొనియాడిన ఎన్సీసీ లెఫ్టినెంట్ ఆఫీసర్గజ్వేల్రూరల్: గజ్వేల్లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ కార్పోరల్ రాజేష్ వరుసగా 3 సార్లు పర్వతారోహణ చేసినట్లు ఆ కళాశాల ఎన్సీసీ లెఫ్టినెంట్ ఆఫీసర్ డాక్టర్ భవాని బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కళాశాలకు చెందిన రాజేష్ 2022 అక్టోబర్ 1 నుంచి 26 వరకు సుమారు 26 రోజుల పాటు హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో బేసిక్ మౌంటెనీరింగ్ శిబిరాన్ని 2023లో ఏప్రిల్ 1 నుంచి 28వ వరకు సుమారు 28రోజుల పాటు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో అడ్వాన్స్ మౌంటెనీరింగ్ క్యాంప్ను, 2024లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 11వరకు సుమారు 20 రోజుల ఉత్తరాఖాండ్లోని ఉత్తర కాశీలో సెర్చ్ అండ్ రెస్క్యూ క్యాంప్ను పూర్తి చేశారన్నారు. అనంతరం క్యాడెట్ కార్పోరల్ రాజేష్ మాట్లాడుతూ బీఎంసీ క్యాంప్లో భాగంగా రాక్ లైమింగ్స్(పర్వతారోహణ), రివర్ క్రాసింగ్, మంచు పర్వతాలు అధిరోహించినట్లు తెలిపారు. సుమారు 14 వేల అడుగుల ఎత్తును, ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో సుమారు 17 వేల అడుగుల పర్వతారోహణ గావించానన్నారు. అత్యవసర సమయంలో ఆదుకునే సెర్చ్ అండ్ రెస్క్యూ శిబిరంలో రాక్, హెలికాప్టర్ రెస్క్యూ .. నూతన పద్ధతుల ద్వారా శిక్షణ పొందానన్నారు. అయితే 3 నెలల పాటు ఈ క్యాంప్ల అవకాశాన్ని కల్పించిన సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ పీఎస్ నందాకు కృతజ్ఞతలు తెలిపారు. రాజేష్ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు. -
కమనీయం.. రమణీయం
గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వైభవంగా సీతారాముల కల్యాణం ప్రశాంత్నగర్(సిద్దిపేట)/చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామాలయం, హనుమాన్ ఆలయాలు, వెంకటేశ్వర ఆలయాలు, శివాలయాలు, వైష్ణవ ఆలయాలు, గణపతి ఆలయం, శివాలయాలు, షిర్డీ సాయి ఆలయం, సంతోషిమాత ఆలయం, పార్వతీదేవి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, మార్కండేయ ఆలయంతో పాటుగా అమ్మవార్ల ఆలయాలలో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న, తీర్థ ప్రసాదాలు అందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన రాములోరి కల్యాణానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రామ నామం సకల పాపాలను హరించి వేస్తుందన్నారు. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం బోధిస్తుందన్నారు. కష్టంలో భర్తతో కలిసి నడవాలన్నది సీతతత్వమన్నారు. రాముడు కష్టాల్లో మనో నిబ్బరంతో ముందుకు సాగి విజయం సాధించారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాముని అనుగ్రహంతో అన్నింటా శుభం జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కాగా, పట్టణంలోని ఆలయాల వద్ద పోలీస్లు గట్టి బందోబస్తు నిర్వహించారు. చిన్నకోడూరులో..చిన్నకోడూరు మండలం మాచాపూర్, కస్తూరిపల్లి, మేడిపల్లి, రామన్నపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ప్రత్యేక పూజలు చేశారు.చంద్లాపూర్లోని హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాచగిరి నవమి శోభితం వర్గల్(గజ్వేల్): సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం శ్రీరామనవమి పర్వదిన వేళ నాచగిరి మహామండపం వేదికగా నిర్వహించిన కల్యాణోత్సవం భక్తజనావళికి నేత్రపర్వం చేసింది. ఉదయం 10.30 గంటలకు పురోహిత, భక్తజన పరివారం నడుమ సర్వాలంకార శోభితులైన సీతారామచంద్రమూర్తులు గర్భగుడి నుంచి కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ, కల్యాణ దాతలు గంప శివకుమార్ దంపతులు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు గోపాలకృష్ణ శర్మ, రమేష్శర్మ నేతృత్వంలో శ్రీసీతారాముల ఎదుర్కోలు ఘట్టం, యజ్ఞోపవిత ధారణ, కంకణ ధారణ తదితర వివాహ తంతు నిర్వహించారు. సుముహుర్త వేళ ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీరామచంద్రమూర్తి.. సీతమ్మ మెడలో మంగళ సూత్ర ధారణ గావించారు. -
అవన్నీ ప్రజలను మోసం చేసిన పార్టీలే
సీపీఎం నేత గోపాలస్వామి కొమురవెల్లి(సిద్దిపేట): బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిన పార్టీలేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కాముని గోపాలస్వామి అన్నారు. సోమ వారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో బోడుగం సురేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్తిరెడ్డి, శశిధర్, కృష్ణారెడ్డి, యాదవ రెడ్డి, శారద, రవీందర్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. దేశం బాగుండాలంటే బీజేపీకే ఓటు వేయాలి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు గజ్వేల్రూరల్: దేశం బాగుండాలంటే బీజేపీకే ఓటు వేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. గజ్వేల్లో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో భాగంగా ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డి 10 ఏళ్లు కలెక్టర్గా పనిచేసి రాజ్పుష్ప కంపెనీ పేరుతో రూ.100 కోట్లకు ఎకరా చొప్పున 10ఎకరాల భూమిని కొనుగోలు చేశారని విమర్శించారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి జైలు పాలైందని, వారి కాలంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. బీజేపీ 400 సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పంజాల అశోక్గౌడ్ పాల్గొన్నారు. నేడు రక్తదాన శిబిరం సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని సూచించారు. -
No Headline
ఒగ్గుడోలు శిక్షణలో విద్యార్థులు అద్భుతంగా రాణించారు. చండీశ్వర ఒగ్గు కళాసేవా సమితి మాణిక్యపురం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఒగ్గుడోలు శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. పది రోజులు పాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఒగ్గుడోలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మయ్య పాల్గొని మాట్లాడారు. మొదటి సారిగా కళాశాల స్థాయిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు ఒగ్గుడోలు నేర్పించడం గొప్ప పరిణామమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కళారూపాల్లో విద్యార్థులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. – సిద్దిపేట ఎడ్యుకేషన్ -
5 ఇసుక లారీల పట్టివేత
గజ్వేల్రూరల్: అనుమతులు లేకుండా ఇసుక రవాణాచేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమతులు, వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 5లారీలను సోమవారం రాజీవ్ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పట్టుకున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ రవాణా చేసినా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కలిగిఉన్నా చర్యలు తప్పవన్నారు. సమాచారం ఉంటే 8712667445, 87126 67446, 8712667447 నెంబర్లకు తెలియజేయాలని ప్రజలను కోరారు. -
బీటీ రోడ్డు నిర్మాణం కలేనా?
● నరకప్రాయంగా చిన్నగుబ్బడి మట్టిరోడ్డు ● రూ.1.50కోట్లతో బీటీ రోడ్డు మంజూరు ● శంకుస్థాపనకే పరిమితం: స్థానికులు అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామ పరిధిలోని చిన్నగుబ్బడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయోనని స్థానికులు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు. బీటీ రోడ్డు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు ప్రారంభించకపోవడం ఏమిటని వాపోతున్నారు. ఈ బిటీ రోడ్డు నిర్మాణ పనులకు జనవరి 29న మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అంతక్కపేట గ్రామం నుంచి చిన్నగుబ్బడి వరకు దాదాపు 2కిలో మీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డుకు రూ.1.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే రెండు నెలలు దాటుతున్నా కాంట్రాక్టర్ మాత్రం పనులు ప్రారంభించలేదు. ప్రయాణం.. నరకప్రాయం ప్రస్తుతం ఉన్న మట్టిరోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోడ్డంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షాలు కురిస్తే చాలు రోడ్డు బురదమయంగా మారుతుందని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. రాత్రిపూట గుంతలు కనబడక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బీటీ రోడ్డు నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని చిన్నగుబ్బడి ప్రజలు అంటున్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయడం లేదు బీటీ రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. కానీ సదరు కాంట్రాక్టర్ పనులు చేయడం లేదు. వేరేచోట రోడ్డు పనులు జరుగుతున్నాయని చెబుతున్నాడు. టెండర్ ప్రకారం ఏడాదిలోపు బీటీ రోడ్డు పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేస్తాం. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించేలా చూస్తాం. – స్నేహ, ఏఈ పంచాయతీరాజ్, అక్కన్నపేట మండలం -
No Headline
● ఓబీసీ ఇన్చార్జిగా డా.సూర్యవర్మ ప్రశాంత్నగర్(సిద్దిపేట): మెదక్ పార్లమెంట్ ఓబీసీ ఇన్చార్జిగా జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ సూర్యవర్మను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ ఓబీసీ సెల్ చైర్మన్, తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. ● బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడుగా రమణారెడ్డి దుబ్బాక: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడుగా స్థానిక మల్లుగారి రమణారెడ్డి నియామకం అయ్యారు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ● కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం మిరుదొడ్డి(దుబ్బాక): శ్రీరామనవమి సందర్భంగా 17న నిర్వహించే కల్యాణ మహోత్సవాలకు ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం కల్యాణోత్సవ పత్రాలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు అప్పన్కందాడై పార్థ సారథి, ఆలయ కమిటీ సభ్యులు అంజిరెడ్డి, నారాయణ, భిక్షపతి, మల్లేశం, వెంకట్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ● ధ్వజస్తంభ యంత్రవిగ్రహ ప్రతిష్ఠ దుబ్బాక: పట్టణంలోని మహంకాళి దేవాలయంలో 3రోజులుగా గణపతి సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం వేదపడింతులు జయరామశర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● 50 మందికి నేత్ర పరీక్షలు మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్లో సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 50మందికి నేత్ర పరీక్షలుచేసి అవసరమైన 10మందికి ఉచితంగా ఆపరేషన్ కోసం రిఫర్ చేశారు. వైద్యులు పావని, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ నరేశ్, పంచాయతీ కార్యదర్శి అశోక్, మాజీ ఉపసర్పంచ్ బావు కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. ● బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 16 నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 16న ధ్వజారోహణం, 17న కల్యాణోత్సవం, 17న సామూహిక కుంకుమార్చనలు, 19న గరుఢ రథంపై ఊరేగింపు, 21న పూర్ణాహుతి ఉంటుందని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ● ఆలయ నిర్మాణానికి విరాళం నంగునూరు(సిద్దిపేట): జేపీ తండాలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గా, వీరాంజనేయ స్వామి దేవాలయానికి రంగదాంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్రెడ్డి సోమవారం రూ.50వేలు విరాళం అందజేశారు. మాజీ సర్పంచ్ బుక్యా భిక్షపతినాయక్, లక్ష్మణ్నాయక్, వీరానాయక్, గౌరబోయిన రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ● మెదక్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్దే ప్రశాంత్నగర్(సిద్ధిపేట): మెదక్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీదేనని ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 17లోక్సభ స్థానాలను కై వసం చేసుకుంటుందన్నారు. సంక్షిప్త వార్తలు -
ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలి
సిద్దిపేటకమాన్: వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో ఓఆర్ఎస్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టాఫ్ నర్సులు, సీనియర్ నర్సింగ్ అధికారులతో డీఎంహెచ్ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ప్రతి బుధవారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించాలన్నారు. గర్భిణుల వివరాలను ఎప్పటికపుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన క్షయ, డయాబెటిస్, బీపీ, ఎన్సీడీ కేసులు, స్క్రీనింగ్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ విజయరాణి, డాక్టర్ రజని, డాక్టర్ శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ -
రోడ్డు కోత.. ప్రమాదాల మోత
● భయాందోళనలో వాహనదారులు ● పట్టించుకోని అధికారులుఅక్కన్నపేట మండలం పోతారం(జే)–ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. 8నెలల కిందట కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురై పెద్దగుంత ఏర్పడింది. అప్పటి నుంచి ఆ రోడ్డును పట్టించుకునే నాథుడులేడు. దీంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
ఎంపీ విజయాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి
ఎన్ఎస్యూఐ నేత ప్రశాంత్ కొండపాక(గజ్వేల్): మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపును కాంగ్రెస్ పార్టీకి గిప్టుగా ఇచ్చేలా ఎన్ఎస్యూఐ కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రవీంద్రనగర్లో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ బలోపేతం కోసం కాంగ్రెస్ సహకరించడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్కు ఎంఎల్సీ పదవిని ఇచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల మండల ఇన్చార్జిలుగా రవి, భానును నియమించినట్టు చెప్పారు. -
గోటి తలంబ్రాలు అప్పగింత
గజ్వేల్రూరల్: రామకోటి భక్తసమాజం ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి అన్నారు. గజ్వేల్కు చెందిన రామకోటి భక్తసమాజం సిద్ధం చేసిన గోటి తలంబ్రాలను (150 కిలోల వడ్లను) సోమవారం భద్రాచలంలో దేవస్థానంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తూ రామకోటి భక్తసమాజం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గుట్టపైకి వేంచేసిన లక్ష్మీనృసింహుడు బెజ్జంకి(సిద్దిపేట): లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఉత్సవమూర్తులను సోమవారం గుట్టపైకి మేలతాళాలు, కోలాటాలతో రథంపై తీసుకెళ్లారు. ఏటా బ్రహోత్సవాలకు గ్రామంలోని ఆలయం నుంచి గుట్టపైకి స్వామి వారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ అని అర్చకుడు మధుసూదనాచారి తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తనిఖీల్లో నగదు పట్టివేత సిద్దిపేటకమాన్: పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కాంచీట్ చౌరస్తా సమీపంలో సీఐ, ఎస్ఐ నరసింహారావు, తమ సిబ్బందితో కలిసి సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్రెడ్డి తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా లక్ష రూపాయలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లుగానే.. కాంగ్రెస్లోకి మదన్రెడ్డి నర్సాపూర్: అంతా అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత నెల చివరి వారం నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డిని సైతం కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించారు. కాగా సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించినా అవకాశం కుదరకపోవడంతో చివరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి, మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్లో చేరారు. ఆయన వెంట నర్సాపూర్ పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ఎంపీపీ అధ్యక్షురాలు లలిత, ఎంపీటీసీ సంధ్యరాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ హబీబ్ఖాన్, కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ పీఎసీఎస్ చైర్మన్ గోవర్దన్రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ పద్మ, చిలప్చెడ్ ఎంపీపీ అధ్యక్షురాలు వినోద, కొల్చారం ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సావిత్రి, హత్నూర బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్లో చేరారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి తెలిపారు. -
ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి
కొంగరి వెంకట్మావోచేర్యాల(సిద్దిపేట): మండలంలోని ఆకునూర్లో ధాన్యం కొనగోలు ప్రారంభించాలని సీపీఐ(యం)మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు. సోమవారం ఆకునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇతర నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నామ మాత్రంగా ప్రారంభించారని, తాగునీరు, గన్నీబ్యాగులు, జల్లి మిషన్లు అందుబాటులో లేవని వాపోయారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్, ఐలయ్య, భూమయ్య, కనకయ్య పాల్గొన్నారు. చేర్యాల(సిద్దిపేట)లో.. స్థానిక వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పది రోజులైనా కొనుగోలు ప్రారంభించలేదని మండిపడ్డారు. రాములు, లింగయ్య, మల్లవ్వ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ నీటిని పొలాలకు ఉపయోగించొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి గ్రామాన్ని మిషన్భగీరథ ఈఈ శ్రీనివాస్, డీఈ వేణుగోపాల్, ఏఈ దినేశ్తో కలిసి సోమవారం పరిశీలించారు. ఆదివారం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మిషన్ భగీరథ ఏయిర్ వాల్వ్ ఓపెన్చేసి తమ పొలాలకు నీటిని మళ్లిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి ఏయిర్వాల్వ్ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో మిషన్భగీరథ నీరు గ్రామస్తులకు ఏవిధంగా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. భగీరథ నీటిని పొలాలకు ఉపయోగించకూడదని, ఎవరైనా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఓ దేవకి దేవి, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్లు అందజేత సిద్దిపేటకమాన్: పోగొట్టుకున్న సెల్ఫోన్లను ఆధునిక టెక్నాలజీ సాయంతో గుర్తించి వన్టౌన్ పోలీసులు బాధితులకు అప్పగించారు. సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఆరుగురు వివిధ కారణాలతో తమ సెల్ఫోన్లను పొగొట్టుకున్నారు. అనంతరం వారి ఫిర్యాదుపై పోలీసులు సీఈఐఆర్ యాప్లో వివరాలను నమోదుచేసి వాటిని బ్లాక్ చేయించారు. తర్వాత వాటిని గుర్తించి సోమవారం స్థానిక స్టేషన్లో బాధితులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన సిద్దిపేటకమాన్: అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా స్థానిక మోడ్రన్ బస్టాండ్, ఆర్టీసీ డిపోలో ఫైర్ సిబ్బంది ప్రయాణికులకు సోమవారం అవగాహన కల్పించారు. సిద్దిపేట ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ కె.నరేశ్ మాట్లాడుతూ వేసవిలో అజాగ్రత్తగా పొగతాగడం వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయన్నారు. ప్రమాదం జరిగినపుడు నివారణ చర్యలు చేపడుతూనే ఫైర్ స్టేషన్ 87126 99250, లేదా డయల్ 101కు ఫోన్చేసి సమాచారం తెలపాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నరేశ్, రవి, యాదగిరి, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్కు జాతీయ పురస్కారం అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని చౌటపల్లి మాజీ సర్పంచ్ గద్దల రమేశ్కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. సోమ వారం ఆయన మాట్లాడుతూ ఉగాది క్రోదినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని జాతీ య తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాయ గానసభ వెంటకదీక్షితులు కళావేదికలో ఈ పురస్కారాన్ని అందుకున్నానన్నారు. గ్రామాభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం లాంటి సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు చెప్పారు. స్వచ్ఛ దుబ్బాకే లక్ష్యం మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ దుబ్బాకటౌన్: స్వచ్ఛ దుబ్బాకే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో డైన్రేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకను స్వచ్ఛతలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచడానికి ప్రజలు సహకరించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, మురుగు కాలువల్లో చెత్తను పారవేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. -
మినీ సిలిండర్లు బహిరంగంగా విక్రయాలు
పట్టణ, మండల కేంద్రాలలో మినీ గ్యాస్ సిలిండర్ల విక్రయాలు బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లోని గ్యాస్ను రీ ఫిల్లింగ్ చేసి హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లను వినియోగించవద్దని, రీ ఫిల్లింగ్ చేసే సమయంలో ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం
అయ్యా.. ముఖ్యమంత్రి గారూ.. ● హామీలు నెరవేర్చండి.. ● నేటికీ బోనస్ రాలే.. రుణమాఫీ చేయలే ● సీఎం రేవంత్రెడ్డికిపోస్టు కార్డుల్లో రైతుల వినతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. మా విన్నపం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చకపోవడంతో రాస్తున్న ఉత్తరం.. ఉత్తరం రాస్తున్న రైతుచిన్నకోడూరు (సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరులో రైతులతో కలిసి సీఎం రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో సర్కారు మోసాలను ఎండగడతామన్నారు. రైతు బీమా వర్తింపజేయాలని, వరి ధాన్యానికి ఇస్తామన్న బోనస్ రూ.500 చెల్లించాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉమేష్ చంద్ర, రైతులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ -
డెలివరీ బాయ్స్పై కేసు నమోదు
రాయపోలు(దుబ్బాక): వంటగ్యాస్ రాయితీ సిలిండర్లలోంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ రీఫిల్ చేసిన ఉదంతంపై అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం జిల్లా పౌరసఫరాలశాఖ అధికారి తనూజ తన సిబ్బందితో రాయపోలులోని సదరు కార్యాలయం, గోదాంలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి రీఫిల్ చేస్తున్న సిలిండర్లను సీజ్ చేశారు. నిండుగా ఉన్న 11కమర్షియల్ సిలిండర్లు, సగం నింపిన మరో 64 సిలిండర్లు, 561 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఇద్దరు డెలివరీ బాయ్స్పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలుంటాయని తనూజ తెలిపారు. -
యథేచ్ఛగా గ్యాస్ అక్రమ దందా
● సబ్సిడీ పక్కదారి ● కమర్షియల్, మినీ సిలిండర్లలోకి ఫిల్లింగ్ ● బహిరంగంగానే విక్రయాలు ● పట్టించుకోని సివిల్ సప్లయ్ అధికారులు సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణ కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల నడుమ అక్రమదందా నడుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేజీ గ్యాస్ రూ.125లకు చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్లో 2 నుంచి 3 కేజీల గ్యాస్ను నింపుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్లోని పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తులు అక్రమార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ పెరగడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500లకే గ్యాస్ సిలిండర్ను అందిస్తుండటంతో రీ ఫిల్లింగ్ దందా ఉధృతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ను తక్కువగా వినియోగించుకునే వారిని గ్యాస్ డెలివరీ బాయ్స్, ఏజెన్సీ నిర్వాహకులు గుర్తించి వారిచే గ్యాస్ బుక్ చేపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీని మీరే తీసుకోండి అని వినియోగదారులకు ఆఫర్ ఇచ్చి గాలం వేస్తున్నారు. దీంతో వారి వైపు మొగ్గు చూపి గ్యాస్ బుక్ చేస్తున్నారు. ఇలా వచ్చిన గ్యాస్ సిలిండర్ను రీ ఫిల్లింగ్, వాణిజ్య అవసరాలకు వినియోగించేవారికి రూ.1,100లకు విక్రయిస్తున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ గ్యాస్ వాణిజ్య అవసరాలకు వినియోగంకేసులు నమోదు చేస్తున్నాం గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. సబ్సిడీ గ్యాస్ వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దు, చిన్న సిలిండర్లలో నింపవద్దు. అలా చేయడం నేరం. – తనూజ, డీఎస్ఓ -
ఏపీఓ నర్సింగరావును బర్తరఫ్ చేయండి
కలెక్టర్కు కాంగ్రెస్ నేతల వినతి సిద్ధిపేటరూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏపీఓ నర్సింగరావును విధుల నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ మనుచౌదరికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఉద్యోగులతో ఇటీవల సమావేశమైన క్రమంలో 106 మంది ఉద్యోగులను గుర్తించి సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది ఉద్యోగులు తప్పించుకున్నారని, ఏపీవో నర్సింగరావు పదిమంది ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని సస్పెన్షన్ చేయకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. నర్సింగరావుతోపాటు సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై విచారణ చేయించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదారి మధు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాయసుద్దీన్, ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాషద్ పాల్గొన్నారు. -
హామీలను అమలుచేయాలని ఉత్తరాలు
నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన ఉత్తరాలను సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రూ.500 బోనస్, రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా ఒక్క హామీకూడా నెరవేర్చలేదని వాపోయారు. అందుకే తమ ఆవేదనను సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల రూపంలో వెల్లడించామని చెప్పారు. రాఘవాపూర్లో... సిద్దిపేటరూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ, పలు పథకాలను అమలు చేయాలని కోరుతూ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాల ద్వారా విన్నవించారు. సోమవారం మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలోని రైతులు మాట్లాడుతూ హామీలను అమలుచేసి, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాంచందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదయ్య, డైరెక్టర్ తిరుపతి, గ్యార తిరుపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
బూస్టర్ మోటార్ ఏర్పాటు
● తండాలకు నీటి సరఫరా ● భగీరథ డీఈ బాలరాజ్అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గండిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారులు బూస్టర్ మోటార్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రామపరిధిలో ఐదారు గిరిజన తండాలు ఉన్నాయి. దీంతో మిషన్ భగీరథ నీళ్లు బోరింగ్తండా, సరిరాంతండాలకు సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ తండాలకు భగీరథ నీళ్లు ట్యాంకులకు ఎక్కేలా బూస్టర్ మోటర్ను ఏర్పాటు చేసినట్లు భగీరథ డీఈ బాలరాజ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తండాతండాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. నీళ్లను ఎవరూ వృథా చేయొద్దని సూచించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement