ఏపీఓ నర్సింగరావును బర్తరఫ్‌ చేయండి | Sakshi
Sakshi News home page

ఏపీఓ నర్సింగరావును బర్తరఫ్‌ చేయండి

Published Tue, Apr 16 2024 6:45 AM

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు  - Sakshi

కలెక్టర్‌కు కాంగ్రెస్‌ నేతల వినతి

సిద్ధిపేటరూరల్‌: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏపీఓ నర్సింగరావును విధుల నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ మనుచౌదరికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఉద్యోగులతో ఇటీవల సమావేశమైన క్రమంలో 106 మంది ఉద్యోగులను గుర్తించి సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది ఉద్యోగులు తప్పించుకున్నారని, ఏపీవో నర్సింగరావు పదిమంది ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌ చేయకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. నర్సింగరావుతోపాటు సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై విచారణ చేయించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదారి మధు, పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాయసుద్దీన్‌, ఎన్‌ఎస్‌యుఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాషద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement