డెలివరీ బాయ్స్‌పై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

డెలివరీ బాయ్స్‌పై కేసు నమోదు

Published Tue, Apr 16 2024 6:45 AM

వివరాలు సేకరిస్తున్న డీసీఎస్‌ఓ తనూజ - Sakshi

రాయపోలు(దుబ్బాక): వంటగ్యాస్‌ రాయితీ సిలిండర్లలోంచి కమర్షియల్‌ సిలిండర్‌లలోకి గ్యాస్‌ రీఫిల్‌ చేసిన ఉదంతంపై అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం జిల్లా పౌరసఫరాలశాఖ అధికారి తనూజ తన సిబ్బందితో రాయపోలులోని సదరు కార్యాలయం, గోదాంలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి రీఫిల్‌ చేస్తున్న సిలిండర్లను సీజ్‌ చేశారు. నిండుగా ఉన్న 11కమర్షియల్‌ సిలిండర్లు, సగం నింపిన మరో 64 సిలిండర్లు, 561 డొమెస్టిక్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఇద్దరు డెలివరీ బాయ్స్‌పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలుంటాయని తనూజ తెలిపారు.

Advertisement
Advertisement