బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. కేవ‌లం 45 బంతుల్లోనే | Sakshi
Sakshi News home page

#Jonny Bairstow: బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. కేవ‌లం 45 బంతుల్లోనే

Published Sat, Apr 27 2024 12:12 AM

Jonny Bairstow Roars Back In Form With Blistering Century Vs KKR

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ జానీ బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 262 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో బెయిర్ స్టో.. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఈ క్ర‌మంలో బెయిర్ స్టో.. కేవ‌లం 45 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఫాస్టెస్ సెంచ‌రీ చేసి బెయిర్ స్టోకు ఇది రెండో ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

కాగా అత‌డి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా పంజాబ్‌ 262 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. దీంతో  టీ20 క్రికెట్ చ‌రిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేజ్ చేసిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్‌స్టోతో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్‌(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

Advertisement
Advertisement