తమిళసినిమా: డబ్బు మోసం కేసులో నటి నమిత భర్త వీరేంద్రచౌదరికి పోలీసులు విచారణకు రావలసిందిగా సమన్లు జారీ చేశారు. కాగా తాను ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆరోగ్యం చేకూరిన తరువాత విచారణకు హాజరవుతానని వీరేంద్ర చౌదరి పోలీసులకు లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన ముత్తురామన్, ముబారక్ అనే వ్యక్తులు చిరు, మధ్య తరహా వ్యాపార సంఘం జాతీయ అధ్యక్షులం అని తమను పరిచయం చేసుకుంటున్నారు. ఈ సంఘానికి తమిళనాడు విభాగం అధ్యక్షుడిగా నటి నమిత భర్త వీరేంద్ర చౌదరిని నియమించారు. కాగా ముత్తురామన్ గోపాలసామి అనే వ్యక్తికి రూ.3 కోట్లు ఇస్తే తమిళనాడులో ఉన్నత పదవిని ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన గోపాలసామి రెండు దఫాలుగా రూ.50 లక్షల చొప్పున పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముత్తుతరామన్ స్నేహితుడు దుశ్యంత్కు డబ్బు ను ఇచ్చారు. అయితే ముత్తురామన్ అతనికి ఎలాంటి ప్రభుత్వ పదవిని ఇప్పించలేదు. దీంతో గోపాలసామి సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా గత వారం సేలంలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సి ల్ పేరుతో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్, వీరేంద్ర చౌదరి సమావేశం అయ్యారు. విషయం తెలిసిన సూరమంగలం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ముత్తురామన్, దుశ్యంత్ యాదవ్లను పట్టుకుని విచారించారు. వారు వాడుతున్న ప్రభుత్వ ముద్రను, జాతీ య పతాకం వాడడం తెలియడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావలసిందిగా వీరేందర చౌదరికి సమన్లు పంపారు. అయితే సేలం పోలీసుల ఎదుట హాజరుకాని వీరేందరచౌదరి తాను అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు, ఆరోగ్యం చేకూరగానే హాజరవుతానని పోలీసులకు లేఖ రాశారు. ఆయన హాజరు కాకుంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నటి నమిత భర్తకు సమన్లు
Published Thu, Nov 16 2023 1:38 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
తప్పక చదవండి
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
- అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement