-
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్లో ఒక్కో సర్వింగ్లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
అరే బాప్రే.. నన్ను హంతకుణ్ని చేయకండి...! బుజ్జోడి వైరల్ వీడియో
అపుడే పుట్టిన బుజ్జాయిలు భలే ముద్దుగా ఉంటారు. బుజ్జి బుజ్జి..లేలేత కాళ్లు చేతులతో..ముట్టుకుంటే కంది పోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు. అపుడే విరిసిన పింక్ గులాబీల్లా, మెరిసిపోయే కళ్లతో మిటుకు మిటుకు చూస్తూ ఉంటారు. ‘‘ఎవర్రా మీరంతా.. నేను ఏ లోకంలోకి వచ్చాను’’ అన్నటు చూస్తూ ఉంటారు కదా. ఇంకొంతమంది ఉంటారు గడుగ్గాయుల్లాగా...డాక్టర్, నర్సుల డ్రెస్ గట్టిగా పట్టేసుకుంటారు. ఇంకొంతమందేమో అమ్మ స్పర్శ తగలగానే ఏడుపు మానేసి ముద్దుగా బజ్జుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని శిశువు ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కత్తెరను గట్టిగా పట్టుకుని వదలనే వదలడు. బొడ్డు పేగు కోసిన తరువాత ఆ కత్తెరను సిబ్బంది ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉన్న వీడియో వైరల్గా మారింది. ట్విటర్లో ఇది ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. Born braveheart! ❤️😂pic.twitter.com/Pam7maI7Ix — Figen (@TheFigen_) April 8, 2024 -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్గా తినండి లేదా సూప్లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్ను, ఓవులేషన్ పీరియడ్ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి! -
తల్లి కాబోతున్న దీపిక.. భర్తతో సంతోష క్షణాలు (ఫోటోలు)
-
కొందరూ నెలల పిల్లలు నవ్వితే వాంతులవుతుంటాయి ఎందుకు?
ఆరు నెలల లోపు చిన్నపిల్లలు కొందరిలో... వాళ్లు బాగా నవ్వుతున్నా, వేగంగా కాళ్లూచేతులు కదిలిస్తున్నా వెంటనే వాంతులు అవుతుంటాయి. అప్పటివరకూ వాళ్లు చురుగ్గా ఆడుతుండటం చూసిన తల్లిదండ్రులకు... అంతలోనే ఎదురైన ఆ సంఘటన ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. నిజానికి అది ఏమాత్రం అపాయకరం కాని ఒక కండిషన్. దాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్’ అంటారు. ఈ కండిషన్ కారణంగానే ఈ నెలల పిల్లలకు ఈ తరహాలో వాంతులవుతుంటాయి. చిన్నారుల పొట్ట కింది భాగంలో లోయర్ ఈసోఫేగస్ స్ఫింక్టర్ అనే కండరాలు పొట్టలోపలికి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా నొక్కిపెడతాయి. కొందరిలో ఈ స్ఫింక్టర్ కండరాలు ఉండవలసిన దాని కంటే వదులుగా (రిలాక్స్డ్గా) ఉండే అవకాశం ఉంది. అప్పుడు పాలు, ద్రవాలు (యాసిడ్ కంటెంట్స్) కడుపు లోంచి ఈసోఫేగస్ వైపునకు నెట్టినట్లుగా బయటకు వస్తాయి. అలా వెనక్కురావడాన్ని ‘రిఫ్లక్స్’ అంటారు. చిన్నతనంలో చాలా మంది పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య... వారికి మూడు నుంచి తొమ్మిది నెలలు వచ్చే నాటికి స్ఫింక్టర్ కండరం బలపడటంతో దానంతట అదే తగ్గిపోతుంది. వాంతులు అనే లక్షణం అనేక ఇతర ఆరోగ్య సమస్యల్లోనూ కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది పిల్లల్లో వాంతులతో పాటు ఒకవేళ పసరుతో కూడుకున్న వాంతులు (బిలియస్ వామిటింగ్), వాంతుల్లో రక్తపు చారిక కనిపించడం, వాంతులతో పాటు విరేచనాలు కనిపిస్తుంటే మాత్రం మరికొన్ని ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు అదేపనిగా అవుతున్నప్పుడు యాంట్రల్ వెబ్, ఇంటస్టినల్ మొబిలిటీ డిజార్డర్స్ (పేగు కదలికల్లో సమస్యలు), హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్, పెప్టిక్ అల్సర్, ఆహారం సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీస్), హయటస్ హెర్నియా వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తప్పక అన్వేషించాలి. ఆర్నెల్లు దాటిన వారు మొదలుకొని, రెండేళ్ల వరకు పిల్లల్లో వాంతులవుతూ, పై లక్షణాలు కనిపిస్తుంటే అప్పుడు వారిలో ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయేమోనని అదనపు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు... గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సమస్యను బేరియం ఎక్స్–రే పరీక్ష, మిల్క్ స్కాన్, 24 గంటల పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స... చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ వాంతులు కావడం మరీ ఎక్కువగా ఉంటే అలాంటి పిల్లలకు ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్ డ్రగ్స్ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం చాలావరకు ఉపశమనాన్నిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్న పిల్లలను పాలుపట్టిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కలిగించే) యాక్టివిటీస్ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఫండోప్లెకేషన్ అనే ఆపరేషన్ అవసరం పడవచ్చు. -
ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?
ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు. ‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం? సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) లిండా (సౌదీ అరేబియా) స్నేక్ (మలేషియా) ఫ్రైడే (ఇటలీ) ఇస్లాం (చైనా) సారా (మొరాకో) చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్) రోబోకాప్ (మెక్సికో) డెవిల్ (జపాన్) నీలం (ఇటలీ) సున్తీ (మెక్సికో) ఖురాన్ (చైనా) హ్యారియెట్ (ఐస్లాండ్) మంకీ (డెన్మార్క్) థోర్ (పోర్చుగల్) 007 (మలేషియా) గ్రిజ్మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) తాలులా హవాయి (న్యూజిలాండ్) బ్రిడ్జ్(నార్వే) ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ) మెటాలికా (స్వీడన్) ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్) అనల్ (న్యూజిలాండ్) నుటెల్లా (ఫ్రాన్స్) వోల్ఫ్ (స్పెయిన్) టామ్-టామ్ (పోర్చుగల్) కెమిల్లా (ఐస్లాండ్) జుడాస్ (స్విట్జర్లాండ్) డ్యూక్ (ఆస్ట్రేలియా) -
ఎన్టీ స్కాన్ అంటే ఏంటీ? దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది?
నాకిప్పుడు 3వ నెల. రొటీన్ స్కాన్లో బేబీ NT థికనెస్ 3.5 సెం.మీ ఉంది అని డాక్టర్ చెప్పారు. అది మంచిది కాదన్నారు. స్కాన్ మెషిన్ తప్పేమో అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మళ్లీ ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? – డి. అమరజ, బళ్లారి NT(న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ) స్కాన్ అనేది టైమ్ బౌండ్తో ఉంటుంది. అంటే 11–13 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలోనే చేయించుకోవాలి. సమయం తక్కువ కాబట్టి సెకండ్ ఒపీనియన్గా వెంటనే వేరే చోట అంటే ఫీటల్ మెడిసిన్ యూనిట్లో పనిచేసే డాక్టర్తో చేయించండి. పుట్టబోయే బిడ్డకు మెడ వెనుక చర్మం కింద నార్మల్గానే కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది. సాధారణంగా దీనిని మూడవ నెల ప్రెగ్నెన్సీలో NT స్కాన్లో చెక్ చేస్తారు. అది 3.5 సెం.మీలోపు ఉంటే ఏ సమస్యా ఉండదు. NT థిక్నెస్ బేబీది 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే ‘Icreased NT’ అంటారు. ఈ కేసులో గర్భస్రావం అయ్యే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. బిడ్డ గుండెకు సంబంధించి ఏదైనా అబ్నార్మాలిటీ ఉండొచ్చు. లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే డౌన్స్ సిండ్రోమ్(Down Syndrome) లాంటివి ఉండొచ్చు. కానీ ఒక్క NT థిక్నెస్ పైనే డయాగ్నసిస్ చేయరు. మీ బ్లడ్ టెస్ట్ కూడా చెక్ చేసి రెండిటినీ కలిపి చేసే టెస్ట్ని కంబైడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఆ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ‘లో రిస్క్’ అని వస్తే ప్రమాదం తక్కువ అని అర్థం. ‘హై రిస్క్’ అని వస్తే ఫీటస్ మెడిసిన్ కన్సల్టెంట్ని కలిస్తే వాళ్లు కౌన్సెలింగ్ చేస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా వారంలో వచ్చేస్తాయి. ఈ పరీక్షల రిపోర్ట్ని బట్టే తర్వాత స్కాన్ ఉంటుంది. హై రిస్క్ కేసెస్లో నాల్గవ నెలలో ఉమ్మనీరు చెక్ చెస్తారు. దీనిని Amniocentesis అంటారు. ఈ టెస్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏదైనా మేజర్గా క్రోమోజోమ్ ప్రాబ్లమ్కి సంబంధించి ఉంటుంది. ఈ రిపోర్ట్ రిజల్ట్ని బట్టే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ధారిస్తారు. చాలాసార్లు NT ఒక్కటి 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉన్నా బయాకెమిస్ట్రీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ని కూడా కలిపి రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. లో రిస్క్ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు.. ఏ ప్రాబ్లం లేదని అర్థం. అప్పుడు 5, 7, 9వ నెలల్లో స్కాన్స్ ఉంటాయి. కానీ కొంతమంది గర్భిణీల్లో అంటే మేనరికం పెళ్లిళ్లు అయిన కుటుంబంలో జెనెటిక్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా.. డయాబెటిస్.. ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. ఫీటస్ మెడిసిన్ కౌన్సెలర్ని కలిస్తే ఈ పరీక్షలన్నీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెల మొదట్లోనే చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. (చదవండి: ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
కృత్తిమ మేధతో వచ్చేసింది.. పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పేస్తుంది
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే! -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్తో దూసుకుపోతోంది. -
బిడ్డను చంకనెత్తుకుని... ఊరంతా వెతికాడట!
నెత్తిన కళ్లజోడు పెట్టుకుని.. అయ్యో నా కళ్ల జోడు అని వెతుక్కోవడం.. తాళాలు చేత్తో పట్టుకొని తాళాలు కోసం తెగ ఖంగారు పడి పోవడం మనలో చాలా మందికి అనుభవమే. అంతేకాదు ఒక్కోసారి ఫోన్ మాట్లాడుతూనే.. నా ఫోన్ ఏది అని గాభరా పడిపోతూ ఉంటాం కదా. మడి సన్నాక.. అయోమయం, మతిపరుపు కామన్ అంటారా? అయితే సరే.. ఈ వైరల్ వీడియో చూడండి..ఎండింగ్ అస్సలు మిస్ కాకూడదు మరి! ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బేబీ స్క్రోలర్లో బేబీ లేకపోవడంతో ఒక్కసారి కంగారు పడిపోయాడు. అటూ ఇటూ వెదుకుతూ తెగ ఆందోళన చెందాడు. తీరా .. చూస్తే ఆ పాపను భుజంపైన ఎత్తుకోవడం కనిపిస్తుంది. చివరికి అసలు సంగతి తెలుసుకున్న తరువాత తండ్రి రియాక్షన్ చూడాలి.. ఎంతో ఊరట చెంది పాపను హత్తుకుంటాడు హృద్యంగా. ఇంకో వీడియోలో ఒక మహిళ బేబీని ఎత్తుకుని, వాకర్ని ఊపుతూ ఉంటుంది బేబీని నిద్రపుచ్చాలని. కానీ కొన్ని క్షణాల్లో వాకర్లో ఏమీ లేకపోవడంతో బేబీని హడావిడిగా వెదుకుతూ ఉంటుంది. కాసేపటిరి బేబీ తన దగ్గరే.నన తన చంకలోనే ఉందన్న సంగతి తెలుసుకుని హమ్యయ్యా అనుకోవడమే కాదు తెగ నవ్వుకుంటుంది. మనమందరం కొన్నిసార్లు గందరగోళానికి గురవుతాము అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు A man panicked when he realized that his daughter was missing, when he forgot that he was carrying her around his neck. We can all be confused sometimes! 😂pic.twitter.com/VVsMXmMprb — Figen (@TheFigen_) January 18, 2024 Many such cases 🤣 pic.twitter.com/F87jvkduTB — AGI - Tech Gone Wild 🤖❤️🔥🇳🇴 (@AGItechgonewild) January 18, 2024 -
ఆరు నెలల పాపకు కరోనా! షాక్లో వైద్యులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్ 1 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఓ పక్కన వైద్యులు భయపడొద్దు అంత తీవ్ర స్తాయిలో లేదు, కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. కానీ వ్యాప్తి మాత్రం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడూ ఎవ్వరికీ కరోనా పాజిటివ్ వచ్చినా అది కరోనా కొత్త వేరియంటేనని భయపడే పరిస్థితి. ఓ పక్క మాస్క్లు ధరించి, సామాజిక దూరం పాటించమని ఇప్పటికే ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సైతం దీని గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఓ ఆరేళ్ల పాపకు కరోన పాజిటివ్ రావడం వైద్యులను మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. అక్కడ ఓ ఆరు నెలల పాపతో సహా ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బీహార్కు చెందిన ఆ చిన్నారి కోల్కతాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారందరికి వచ్చింది కరోనా కొత్త వేరియంట్ జెఎన్ 1? కాదా? అనేది తెలియాల్సి ఉంది. దీన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా నిర్థారిస్తున్నారు. ఈ ఘటనతో వైద్యులు కేసులను కుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇన్ఫ్లుఎంజా అనారోగ్యం(ILI)కి సంబంధించిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతేగాక పశ్చిమబెంగాల్ ఆరోగ్య అధికారుల ఈ కొత్త వేరియంట్ కేసులపై గట్ట నిఘా పెట్టడమే గాక నివారించేలా కట్లుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత?
అమెరికాలో ఊహకందని అద్భుతం జరిగింది. దీనిని విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. టెన్నెన్సీలో వచ్చిన బలమైన సుడిగాలి తమ ఇంటిని ధ్వంసం చేసిందని ఆ దంపతులు తెలిపారు. ఆ సమయంలో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, వారి పిల్లాడు ఊగుతున్న ఊయల కూడా ఎగిరిపోయింది. దీంతో ఆ చిన్నారి కుండపోత వర్షంలో.. పడిపోయిన చెట్ల మధ్య చిక్కకుపోయాడు. ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు అతని ఏడాది వయసున్న సోదరుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ (22) మీడియాతో తమకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. తుఫాను తాకిడికి తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, ఊయలతోపాటు తమ కుమారుడు కూడా ఎగిరిపోయాడని తెలిపారు. దీనిని చూసిన తన భర్త కుమారుడిని రక్షించేందుకు పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్టన్కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య కుమారుడు ఉండటాన్ని వారు గమనించారు. మొదట కుమారుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అయితే పిల్లాడు బతికే ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు! -
ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు
ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు. (చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..) -
బుజ్జి పాపాయిల కోసం.. వాళ్లకు నచ్చే విధంగా రుచికరమైన ఆహారం
ఇప్పుడిప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లిబుజ్జాయిలకి.. ఈ ప్యూరీ బ్లెండర్ బేబీ ఫుడ్ సప్లిమెంట్ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు నచ్చేవిధంగా.. మృదువుగా, రుచికరంగా ఆహారాన్ని ఉడికించి, పేస్ట్ చేస్తుంది. సాధారణంగా ఆపిల్, క్యారెట్, బీట్రూట్ వంటి పోషకాహారాలను కుక్ చేసి.. మెత్తగా క్రీమ్లా చేయడం చాలా సమయంతోనూ శ్రమతోనూ కూడిన పని. కానీ ఈ ఆటోమేటిక్ స్టీమింగ్ అండ్ బ్లెండింగ్ మేకర్ కొన్ని నిమిషాల్లోనే వేడివేడిగా ఆ క్రీమ్ని అందిస్తుంది. నాలుగు హైక్వాలిటీ బ్లేడ్స్తో వేగంగా పనిచేస్తుంది. ఈ మెషిన్స్లో చాలా రంగులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో చికెన్, ఫిష్ కూడా ఉడికించుకోవచ్చు. ముందుగా ఎడమవైపున్న వాటర్ ట్యాంక్లో వాటర్ నింపుకుని.. కుడివైపున ఆహారాన్ని వేసుకుని.. ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ మూత పక్కనే.. డిస్ప్లేలో ఆప్షన్స్ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. -
రక్తపు మడుగులో బాలుడు.. ఎలుకలే చంపాయా..?
న్యూయార్క్: అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్నెళ్ల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇళ్లంత చెత్తమయంగా ఉందని పేర్కొన్నారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన ఘాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్లు ఇండియానాలో ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అదే ఇంటిలో బాలుని అత్త, డెలానియా థుర్మాన్లు నివాసం ఉంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేప్పటికి బాలుడు రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల, ముఖం మొత్తం ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని వెల్లడించారు. శిశువు వేళ్లు సగం మేర కొరికి ఉన్న ఒళ్లు జలదరించే దృశ్యాలను చూసినట్లు చెప్పారు. శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము వెళ్లే సమయానికి బాధిత ఇళ్లంతా చెత్తతో నిండి ఉందని తెలిపిన పోలీసులు.. ఎక్కడ చూసినా ఎలుకలు సంచరిస్తున్నాయని చెప్పారు. బాధిత శిశువు తండ్రి ఫోన్ చేయగా.. తాము ఆ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధిత శిశువు తల్లిదండ్రులతో పాటు అత్తామామలను కూడా అరెస్టు చేశారు. ఎలుకలు పిల్లల్ని కరవడం ఇదే మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా జరిగినట్లు బాధిత కుటుంబానికి చెందిన పిల్లలు చదివే పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. బాధిత కుటుంబానికి చెందిన ఓ పిల్లవాడి కాలును ఎలుక కొరికినప్పుడు తాము ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. బాధిత పిల్లల్ని శిశు సంరక్షణ గృహానికి పంపించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇదీ చదవండి: Jaahnavi Kandula: జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ -
తల్లిగా లాలిస్తూ.. మేయర్గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్గా రికార్డ్కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
ఆ బిడ్డ భద్రం..!
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బాత్రూమ్లో గర్భిణి ప్రసవించి వదిలి వెళ్లిన పసికందుకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈనెల 16వ తేదీ వేకువజామున కడుపు నొప్పితో వచ్చిన ఓ గర్భిణి ఆస్పత్రి బాత్రూంలోనే ప్రసవించి... బిడ్డను వదిలి వెళ్లిన ఘటన విధితమే. ఆపై బిడ్డకు ఎస్ఎన్సీయూలో చికిత్స అందిస్తున్నారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 1.4 కేజీలుండగా..ప్రస్తుతం 1.5 కేజీలుందని వైద్యులు చెబుతున్నారు. 2 కేజీలు దాటేంత వరకు ఎస్ఎన్సీయూలోనే బిడ్డకు చికిత్స అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా బిడ్డకు కాస్త ఇబ్బందులు ఉన్నాయని..మరో రెండు రోజుల్లో ఈ సమస్య కూడా రికవరీ అవుతుందన్నారు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాలుగు వారాల పాటు చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే సంరక్షణకు ఐసీడీఎస్ శిశువిహార్కు పంపనున్నారు. ప్రస్తుతం ఆశాఖ సిబ్బంది పర్యవేక్షణలోనే బిడ్డకు వైద్య సేవలు చేస్తున్నారు. కాగా బిడ్డ వదిలి వెళ్లిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఐఓ రవిరాజు విచారణ కూడా పూర్తి చేశారు. దీనిపై సోమవారం కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బిడ్డను మాకు ఇవ్వండయ్యా... ఆడబిడ్డలంటే చులకన చూసే కళ్లు..ఇప్పటికే చాలానే ఉన్నాయి. ఆడబిడ్డ పుట్టిందని ఆమడ దూరంలోనే నిలబడే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తరచూ చూస్తుంటాం. మగ సంతానం లేదని ఆత్మహత్యలు చేసుకున్న కేసులు సైతం చాలానే ఉన్నాయి. అయితే ఈ వదిలి వెళ్లిన బిడ్డ కోసం పలువురు ముందుకు వస్తున్నారు. ఆ బిడ్డను తమకు ప్రసాదించండంటూ ఆస్పత్రి అధికారులకు నివేదించుకుంటున్నారు. అసలు తల్లి లేకుంటే.. తామున్నామంటూ.. క్యూ కడుతున్నారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఇలా ఆ బిడ్డనుకోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు మాత్రం బిడ్డను ఐసీడీఎస్కు అప్పగించామని, ఇక చట్ట ప్రకారం వెళ్లాల్సిందేనన్ని స్పష్టం చేస్తున్నారు. బిడ్డను కోరుకునే వారు దతత్త ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. -
వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ..
వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్ యిజున్(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్ యిజున్ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది. బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్గా ఉందన్నారు. చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్ యిజున్ కథ నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy. Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj — Historic Vids (@historyinmemes) August 17, 2023 (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
మాతృత్వానికే మాయని మచ్చ..పసికందు ఏడుస్తుందని ఓ తల్లి..
పక్షులు దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాయి. ఆఖరికి చిన్న కోడి సైతం తన పిల్లల జోలికి వస్తే పులి అయ్యిపోతుంది. అలాంటి ఓ మహాతల్లి పసిబిడ్డ పట్ల వ్యవహరించిని తీరు చూస్తే గగుర్పాటుకు గురవ్వుతారు. ఆమె అసలు తల్లేనా? అన్నంతగా సీరియస్ అవుతారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా శవం మాదిరిగా పడుకుని ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ఆ తల్లి నార్మల్గా ఉంది. ఎలాంటి భయాందోళన లేకుండా పసిబిడ్డకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని ట్రీట్మెంట్ చేయమని చెప్పి మరీ వైద్యులకు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆ పసికందుని పరీక్షించగా ఆల్కహాల్ పట్టించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా వైద్యలు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కన్న బిడ్డకే మద్యం ఇచ్చి చంపాలన చూసిందని ఆరోపణలు చేశారు. సదరు మహిళ హోనెస్టి డీ లా టోర్రేగా గుర్తించారు. ఆ మహిళ రియాల్టో గుండా డ్రైవింగ్ చేస్తుండా పాప ఏడుస్తుందని మద్య పట్టించినట్లు పేర్కొంది. పైగా మద్యం ఇవ్వడంతో ఏడుపు ఆపేసిందని చెబుతోంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే పసికందు పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు బయటకు తెలిజేయలేదు. ఏదిఏమైనా ఇంత ఘోరమైన తల్లులు కూడా ఉన్నారా! అనిపిస్తోంది కదూ. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ స్ట్రేంజ్ అడిక్షన్ వింటే షాకవ్వాల్సిందే!) -
నిలోఫర్లో దారుణం
నాంపల్లి: నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్లో అపశృతి చోటుచేసుకుంది. రోగి సహాయకుడు మీద పడటంతో మూడు రోజుల మగ శిశువు మృతిచెందాడు. ఈ సంఘటన నిలోఫర్ ఆసుపత్రి అత్యవసర సేవల విభాగంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి గేట్లు దాటించేశారు. దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది పండంటి మగ శిశువును పొట్టనపెట్టుకున్నారని బోరున విలపించారు. న్యాయం చేయాలని బాధితులు పట్టుబట్టడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శిశువు మృతికి కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిగి ప్రాంతానికి చెందిన పుష్పమ్మ అనే మహిళ మూడు రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఒకటిన్నర కేజీల బరువు ఉన్న శిశువు జన్మించడంతో పరిగి ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిలోఫర్ ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల నిమిత్తం తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు బంధువులు మగ శిశువును రెండు రోజుల క్రితం రెడ్హిల్స్లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఎన్ఐసీయూ ఇంక్యుబేటర్లో చికిత్స పొందుతుండగా వార్డులోని రోగి సహాయకుడు ఒకరు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి శిశువు మీద పడ్డాడు. దీంతో ఆ శిశువు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో శిశువు మీద పడ్డ రోగి సహాయకులు ఎవరనే విషయం తెలుస్తుందని, సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్తో రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది. (ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
Actress Poorna Baby Boy Photos: పూర్ణ కొడుకుని చూశారా? ఎంత క్యూట్ ఉన్నాడో (ఫోటోలు)
-
నేనేం పాపం చేశానమ్మా..
భువనగిరి: నవజాత శిశువును ఓ తల్లి కనకరం లేకుండా వదిలేసింది. చెట్ల పొదల్లో విసిరేసిన ఆ శిశువును కుక్కలు పీక్కుతింటూ బయటకు తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. భువనగిరి పట్టణంలోని పాత శిల్పా హోటల్ వెనుక భాగంలో బాబూ జగ్జీవన్రామ్ భవనం ఉంది. అక్కడ ఓ పార్టీకి చెందిన నాయకులు శనివారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భవనం సమీపంలోనే సమాధులు, చెట్ల పొదలు ఉన్నాయి. సమావేశం నుంచి బయటికి వచ్చి న ఓ మహిళ చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును కుక్కలు బయటకు లాక్కురావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని ఆమె తోటి నాయకులకు చెప్పగానే వారు అక్కడికి వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ఆ ఆడశిశువు మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement