-
చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?
-
బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
సాక్షి, అమరావతి : బడుగు, బలహీనవర్గాలంటే ఎంతటి ద్వేషమో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. తాను అధికారంలో ఉండగా బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనుడీయన. అత్యంత అవినీతిపరుడైన తన సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర రావు వంటి అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిన బరితెగింపు చరిత్ర కూడా ఆయనదే. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.అందుకే ఏకంగా అధికార వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అధికారులే లక్ష్యంగా కుట్రలకు తెగించారు. దాంతో పాటు రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా కుట్రపూరితంగా దు్రష్పచారం చేస్తున్నారు. ఆ సామాజికవర్గాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం.అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాల అధికారులపై కొంతకాలంగా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేస్తున్నారు. అవాస్తవాలు, అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన వదిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు తన పన్నాగంలో భాగస్వామిని చేసి, ఉమ్మడి కుట్రకు తెరతీశారు. టీడీపీ ఇచి్చన స్క్రిప్ట్ మేరకు పురందేశ్వరి కూడా అవే అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.చంద్రబాబు ఏ సామాజికవర్గాల అధికారులపై అసత్య ఆరోపణలు చేశారో.. సరిగ్గా ఆ అధికారులపైనే పురందేశ్వరి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సామాజికవర్గాలకు చెందిన అధికారుల నిబద్ధత, సమర్థతపై అపవాదులు వేస్తున్నారు. అనంతరం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ బడుగు, బలహీనవర్గాలు, రెడ్డి సామాజికవర్గ అధికారులను హఠాత్తుగా బదిలీ చేయిస్తున్నారు. ఆ అధికారులను ఆత్మన్యూనతకు గురి చేసి వేధిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలే సమిధలు చంద్రబాబు, పురందేశ్వరి ఈసీకి పదే పదే చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్న పేర్లలో 70% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీల అధికారులే. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు 20% ఉన్నారు. టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ ఇప్పటివరకు బదిలీ చేసిన, చార్జ్ మెమోలు జారీ చేసినవారిలో ఏకంగా 90% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నారు. చంద్రబాబు కుట్రకు తలొగ్గి ఈసీ ఇప్పటివరకు 29 మంది అధికారులను బదిలీ చేసింది.వారిలో 14 మంది అంటే దాదాపు 50% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారీ్టలకు చెందిన అధికారులే. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 11 మందిని బదిలీ చేసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి చార్జ్ మెమోలు జారీ చేసింది. అంటే మొత్తం 14మందిపై చర్యలు తీసుకుంది. అంటే టీడీపీ కుట్రలతో బదిలీ అయినవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అధికారులే 90% ఉండటం విభ్రాంతి కలిగిస్తున్న వాస్తవం. బ్రాహ్మణ, బలిజ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.చంద్రబాబు ఒత్తిడితో ఈసీ బదిలీ చేసిన అధికారుల జాబితా ఇలా ఉంది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ∙పి. రాజా బాబు (కలెక్టర్, కృష్ణా జిల్లా) ∙పీఎస్ గిరీషా (కలెక్టర్, అన్నమయ్య జిల్లా) ∙కల్పనా కుమారి (పీవో, సీతంపేట ఐటీడీయే, పార్వతీపురం మన్యం జిల్లా) ∙జి. పాలరాజు (ఐజీ, గుంటూరు) ∙కేకేఎన్ అన్బురాజన్ (ఎస్పీ, అనంతపురం జిల్లా) ∙పి. జాషువా (ఎస్పీ, చిత్తూరు జిల్లా) ∙పి.శరత్ బాబు (సీఐ, మాచర్ల) ∙వంగా శ్రీహరి (ఎస్సై, వెల్దుర్తి) ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ∙జి. లక్ష్మీశా (కలెక్టర్, తిరుపతి జిల్లా) ∙ఇ. మారుతి (ఎస్సై, సదుం, చిత్తూరు జిల్లా) బీసీ సామాజికవర్గానికి చెందినవారు ∙టి. కాంతి రాణా (పోలీస్ కమిషనర్, విజయవాడ) ∙సీహెచ్. అంజు యాదవ్ (సీఐ, శ్రీకాళహస్తి) ∙చిన మల్లయ్య (సీఐ, కారంపూడి) ముస్లిం మైనారీ్టలు ∙మహబూబ్ బాషా (డీఎస్పీ, రాయచోటి)రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ∙కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (డీజీపీ) ∙ఆర్.ఎన్. అమ్మిరెడ్డి (డీఐజీ, అనంతపురం) ∙ఎం. గౌతమి (కలెక్టర్, అనంతపురం జిల్లా) ∙కె. తిరుమలేశ్వరరెడ్డి (ఎస్పీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా) ∙పి. పరమేశ్వర్రెడ్డి (ఎస్పీ, ప్రకాశం జిల్లా) ∙వై. రవిశంకర్రెడ్డి (ఎస్పీ, పల్నాడు జిల్లా) ∙రిశాంత్రెడ్డి (ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం) ∙వీర రాఘవరెడ్డి (డీఎస్పీ, అనంతపురం) ∙సి. మహేశ్వర్రెడ్డి (సీఐ, పలమనేరు, చిత్తూరు జిల్లా) ∙పి.జగన్మోహన్రెడ్డి (సీఐ, తిరుమల) ∙జి. అమర్నాథ్రెడ్డి (సీఐ, తిరుమల) ఈసీ చార్జ్మెమో జారీ చేసిన అధికారులు ∙కె. రఘువీరారెడ్డి (ఎస్పీ, నంద్యాల) ∙ఎన్. రవీంద్రనాథ్రెడ్డి (డీఎస్పీ, నంద్యాల) ∙కె. రాజారెడ్డి (సీఐ, నంద్యాల టూటౌన్) బదిలీ అయిన ఇతర ఓసీ సామాజికవర్గాల వారు ∙పీఎస్ఆర్ ఆంజనేయులు (డీజీ, ఇంటెలిజెన్స్) (బ్రాహ్మణ) ∙ఆర్. వినోద్ (ఎస్సై, తిరుమల) (క్షత్రియ) ∙ బీవీ శ్రీనివాసులు (ఎస్సై, తిరుమల), (బలిజ) -
ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చూసి అబ్బురపడుతోన్న దేశప్రజలు
-
పేదల పథకాలు నిలిపివేత..కక్ష తీర్చుకున్న చంద్రబాబు
-
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
-
ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..
-
చంద్రబాబు కుట్రలు...భగ్నం
-
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
-
రాక్షస పరివార్..
-
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
-
పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర
-
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్కు, నేడు సీఎం జగన్కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర
-
వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
-
డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు
-
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
-
ప్రాణహాని ?..సీఎం జగన్ పై బాబు కుతంత్రం !
-
అనపర్తిలో చంద్రబాబు కుట్ర రాజకీయాలు..
-
కొత్త కుట్రలకు పదును పెడుతోన్న పచ్చమంద..
-
సీఎం జగన్ హత్యకు కుట్ర జరిగింది : రిమాండు రిపోర్టు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఏ1 నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. దాడి వెనుక సీఎం జగన్ను చంపాలన్న దురుద్ధేశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్కు గాయం మాత్రమే అయిందన్నారు. సీఎం జగన్పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్డేటా, సిసిటివి ఫుటేజ్లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కుట్ర ఎలా జరిగిందంటే? ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్ను ప్రేరేపించాడు. ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడు సింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడు సీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడు దాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడు ప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడు నిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయి సీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్గా ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాం సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశాం నిందితుడికి రిమాండ్ సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కు రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు నిందితుడిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ & మెట్రో పొలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా.. న్యాయస్థానం సతీష్కు 14 రోజులు రిమాండ్ విధించింది. సతీష్ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశం, జనసేనలో తత్తరపాటు సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయిన కొద్దీ తెలుగుదేశం, జనసేన నాయకుల్లో తీవ్ర కలకలం, తత్తరపాటును గత మూడు రోజులుగా చూస్తున్నాం. దాడి జరిగిన రోజునుంచీ ఈ ఘటనను వీలైనంత వరకు చిన్నగా చేసే ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తమ నోరు పారేసుకున్నారు. లోకేష్ చేసిన ట్వీట్ అయితే తీవ్ర వివాదస్పదం అయింది. పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబే ఏకంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటి వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా చంద్రబాబే ఓ అడుగు ముందుకేసి టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించాడు. పోలీసులు గానీ, వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు చెప్పకపోయినా.. గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకునే రీతిలో చంద్రబాబు వ్యవహరించారు. బోండా.. నీ సంగతేంటీ? ఇక టిడిపి సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ టిడిపి అభ్యర్థి బొండా ఉమ వ్యవహరశైలి తీవ్ర వివాదస్పదంగా ఉంది. దర్యాప్తులో అన్ని వేళ్లు తనవైపు చూపిస్తుండడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో ఇష్టానుసారంగా కామెంట్లు చేశాడు బోండా ఉమా. ఆయన కామెంట్లు చూస్తే.. అన్నా క్యాంటీన్ మూసేసినందుకు కోపంతో కొట్టాడు ర్యాలీకి వస్తే రూ.300 ఇస్తానని ఇవ్వలేదు అందుకే కొట్టాడు సింపతీ కోసం వైఎస్సార్సిపి వాళ్లే కొట్టించుకున్నారు అధికారులను హెచ్చరిస్తున్నా.. నా పేరు ఈ కేసులో పెట్టొద్దు జూన్ 4 తర్వాత పోలీసుల సంగతి తెలుస్తా ఇప్పుడు దర్యాప్తులో వేముల సతీష్ పాత్ర బయటపడడంతో బోండా ఉమ తనను తాను కాపాడుకోడానికి రాజకీయాలు చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్ -
గుడివాడ సిద్ధం సభలో సీఎం జగన్పై మరో దాడికి కుట్ర
కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం. – అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ -
సీఎం జగన్ పై కుట్ర చేసి..భయంతో కవరింగ్ చేస్తున్న పిచోళ్లు
-
కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక బీజేపీ సీనియర్ కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ్పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు. ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు. -
వాలంటీర్లపై కక్ష చివరికి సీన్ రివర్స్
-
ఈ సైకోయిజాన్ని ఏమనాలి పసుపుపతి..
టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఎల్లో సమాధిలో కుళ్ళబెట్టిన.. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను వదల బొమ్మాళీ వదల అంటున్నావా లేదా పసుపుపతీ.. వాలంటీర్లపై కక్షతో నిమ్మగడ్డకు ఎల్లో ముసుగు తొడిగి కోర్టుల్లో కేసులు వేయించావా లేదా పసుపుపతీ.. జగన్ను ఎదుర్కోలేక పండుటాకులపై పగ పెంచుకున్నావా లేదా పసుపుపతీ.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందకుండా కుట్రలు కుతంత్రాలు చేశావా లేదా.. పసుపుపతీ. అవ్వాతాతలు ఎండలో మలమలా మాడుతుంటే.. పైశాచికానందం పొందుతున్నావా లేదా పసుపుపతీ.. వికలాంగులు నానా అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందుతున్నావా లేదా.. పసుపుపతీ. చేసిందంతా చేసి నెపం జగన్ సర్కార్పై వేసేందుకు ఎల్లో తాతను వాడుకుంటున్నావా లేదా పసుపుపతీ... ఒక్కటి మాత్రం నిజం సిల్వర్ స్క్రీన్ పై అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లాగే ...పొలిటికల్ స్క్రీన్ పై అధికారంపై వ్యామోహంతో చంద్రబాబు పసుపుపతిలా మారిపోయారు. పైగా నేను అరుంధతి సినిమాలో పశుపతినే అని బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే... ఈ సైకోయిజాన్ని ఏమనాలి. అయ్యా పసుపుపతి గారూ...నీకు, నీఎల్లో ముఠాకు అవ్వాతాతల ఉసురు తగలడం గ్యారంటీ.. రామోజీ 87 ఏళ్ళ గుండెపై ఒట్టు.. అవ్వాతాతల కన్నీళ్ళు, వికలాంగుల కన్నీళ్ళు.. శాపమై మిమ్మల్ని వెంటాడటం గ్యారంటీ. చేసిందంతా చేసి పురాణాలు ప్రబోధిస్తున్న నువ్వు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటున్నారు.. అవ్వాతాతలు, విలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. 1. జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక పండుటాకులపై పగ తీర్చుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 2. అవ్వాతాతల పింఛన్లు ఆపేందుకు అడ్డదారిలో నిమ్మగడ్డను ఈసీ దగ్గరకు పంపావు.. ఇదేం సైకోయిజం బాబూ 3. పెన్షన్ల పంపిణీకి నువ్వే అడ్డంకులు సృష్టించి ఎల్లో మీడియాతో రివర్స్ ఎటాక్ చేయిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 4. పండుటాకుల పింఛన్లపై కుట్రచేసి.. ఇప్పుడు నెపం ప్రభుత్వం పైకి నెట్టేసే ప్లాన్ వేశావు.. ఇదేం సైకోయిజం బాబూ 5. ఎండలో మలమలా మాడుతున్న వృద్ధుల్ని చూసి పైశాచికానందం పొందుతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 6. సచివాలయాల దగ్గరకు నీ పచ్చమూకను పంపి పెన్షన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 7. అవస్థలు పడుతున్న అవ్వాతాతలు తిరగబడతారని నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 8. అచ్చెన్నాయుడితో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది నువ్వే అని చెప్పుకోలేకపోతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 9. చేసిందంతా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపణీ చేయాలని ఉచిత సలహాలిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 10. వాలంటీర్లపై నిమ్మగడ్డ, రామోజీలతో కుట్ర చేసి అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement