-
First phase of Lok Sabha polls: ఈరోజు ఎన్నికల్లో ధనవంతులు వీళ్లే..
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతులు ఎవరు.. సున్నా ఆస్తులు ఉన్నవారు ఎంత మంది? వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న 1,625 మంది అభ్యర్థులను 1,618 మందిని విశ్లేషించి వారి ఆస్తులపై ఓ నివేదికను విడుదల చేసింది. వీరిలో 10 మంది తమ ఆస్తులను సున్నాగా ప్రకటించారు. 450 మంది అభ్యర్థులు లేదా 28 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని విశ్లేషణలో తేలింది. మాజీ సీఎం కొడుకే టాప్ రూ.716 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడే ఈ నకుల్ నాథ్. 2019 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇక రూ. 662 కోట్లు ప్రకటించిన ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. రూ. 304 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరం ఉన్నారు. చిదంబరం రూ.96 కోట్లతో నెట్వర్త్తో జాబితాలో పదో స్థానంలో ఉన్నారు . సున్నా ఆస్తులున్న వారు వీరే.. తొలి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో సున్నా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినవారు 10 మంది ఉన్నారు. వీరిలో తమిళనాడులోని తూత్తుకుడి నుండి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న పొన్రాజ్ కె తన వద్ద రూ. 320 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈయన తర్వాత మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం, తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులు కార్తీక్ గెండ్లాజీ డోక్, సూర్యముత్తులు రూ.500 ఆస్తులను ప్రకటించారు. -
ముగిసిన లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Lok Election 2024 First Phase Polling Updates లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్నవారికి ఓటు వేసే చాన్స్ తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది 5 గంటల వరకు అందిన వివరాల ప్రకారం సగటున 60 శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ -నికోబార్ -56.87 శాతం అరుణాచల్ ప్రదేశ్ -63.27 శాతం అస్సాం -70.77 శాతం చత్తీస్ ఘడ్ -63.41శాతం జమ్మూ- కాశ్మీర్ -65.08 శాతం లక్షద్వీప్ -59.02 శాతం మధ్యప్రదేశ్ -63.25 శాతం మహారాష్ట్ర -54.85శాతం మణిపూర్ -67.66 శాతం మేఘాలయ -69.91 శాతం మిజోరాం -52.73 శాతం నాగాలాండ్ -55.79 శాతం పుదుచ్ఛేరి -72.84 శాతం రాజస్థాన్ -50.27 శాతం సిక్కిం -68.06శాతం తమిళనాడు -62.02 శాతం త్రిపుర -76.10శాతం ఉత్తరప్రదేశ్ -53.56 శాతం ఉత్తరాఖండ్ - 57.54 శాతం పశ్చిమబెంగాల్ -77.57 శాతం బిహార్ -46.32 శాతం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ -నికోబార్ -45.48శాతం అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం అస్సాం -60.70 శాతం చత్తీస్ ఘడ్ -58.14శాతం జమ్మూ- కాశ్మీర్ -57.07 శాతం లక్షద్వీప్ -43.98 శాతం మధ్యప్రదేశ్ -53.40 శాతం మహారాష్ట్ర -44.12శాతం మణిపూర్ -63.03 శాతం మేఘాలయ -61.95 శాతం మిజోరాం -49.77 శాతం నాగాలాండ్ -51.73 శాతం పుదుచ్ఛేరి -58.86 శాతం రాజస్థాన్ -41.51 శాతం సిక్కిం -52.72శాతం తమిళనాడు -51.10 శాతం త్రిపుర -68.35శాతం ఉత్తరప్రదేశ్ -47.44 శాతం ఉత్తరాఖండ్ -45.62 శాతం పశ్చిమబెంగాల్ -66.34 శాతం బిహార్ -39.73 శాతం మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 35. 70 శాతం అరుణాచల్ ప్రదేశ్- 35.75 శాతం అస్సాం- 45.12 శాతం బిహార్- 32.41శాతం చత్తీస్ఘడ్- 42.41శాతం జమ్ము అండ్ కశ్మీర్- 43.11 శాతం లక్ష్యదీప్- 29.91 శాతం మధ్యప్రదేశ్- 44.43 శాతం మహారాష్ట్ర - 32.36 శాతం మణిపూర్- 46.92శాతం మేఘాలయ- 48.91 శాతం మిజోరం- 37.43 శాతం నాగాలాండ్- 39.66 శాతం పుదుచ్చేరి- 44.95 శాతం రాజస్థాన్- 33. 73శాతం సిక్కిం- 36.82 శాతం తమిళానాడు- 39. 51శాతం త్రిపుర- 53.04 శాతం ఉత్తరప్రదేశ్ 36. 96శాతం ఉత్తరఖండ్- 37. 33 శాతం తమిళనాడు ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు విజయ్ తమిళనాడులో లోక్సభ తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది నటుడు, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు #WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam president Vijay casts his vote at a polling booth in Neelankarai, Chennai#LokSabhaElections2024 pic.twitter.com/rTtu4tGZJy — ANI (@ANI) April 19, 2024 మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు మణిపూర్లో లోక్సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది మణిపూర్లోని మొయిరాంగ్ సెగ్మెంట్లోని థమన్పోక్పిలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో పోలింగ్ కేంద్ర వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లలో ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో వైరల్గా మారింది ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ ఉదయం11 గంటల వరకు 102 సీట్లలో 24 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 21.82 శాతం అరుణాచల్ ప్రదేశ్- 18.26 శాతం అస్సాం- 27. 22 శాతం బిహార్- 20. 42 శాతం చత్తీస్ఘడ్- 28. 12 శాతం జమ్ము అండ్ కశ్మీర్- 22.60 శాతం లక్ష్యదీప్- 16.33 శాతం మధ్యప్రదేశ్ 30.46 శాతం మహారాష్ట్ర 19. 17 శాతం మణిపూర్- 27. 64 శాతం మేఘాలయ- 31.65 శాతం మిజోరం- 26. 23 శాతం నాగాలాండ్- 22. 50 శాతం పుదుచ్చేరి- 27. 63 శాతం రాజస్థాన్- 22. 51 శాతం సిక్కిం- 21.20 శాతం తమిళానాడు- 23. 72 శాతం త్రిపుర- 33.28 శాతం ఉత్తరప్రదేశ్ 25.20 శాతం ఉత్తరఖండ్- 24.83 శాతం #LokSabhaElections2024📷 | Voter turnout till 11 am for phase 1 of polling: Lakshadweep records the lowest - 16.33% Tripura records the highest - 33.28% pic.twitter.com/tgkI2p7ATU — ANI (@ANI) April 19, 2024 ఓటేసిన మేఘాలయ సీఎం మేఘాలయలో పోలింగ్ కొనసాగుతోంది ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు #WATCH | Meghalaya CM Conrad Sangma casts his vote at a polling booth in Tura, West Garo Hills#LokSabhaElections2024 pic.twitter.com/qyXK0MVPkb — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి అమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు నాగ్పూర్లో ఓటు వేసిన జ్యోతి అమ్గే #WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk — ANI (@ANI) April 19, 2024 ఓటేసిన సిక్కిం సీఎం సిక్కింలో లోక్సభ పోలింగ్ కొనసాగుతోంది గ్యాంగ్టక్ పోలింగ్ కేంద్రంలో సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు #WATCH | Sikkim CM Prem Singh Tamang casts his vote for #LokSabhaElections2024 and state Assembly Elections 2024 at a polling station in Gangtok pic.twitter.com/XY6agVbGTr — ANI (@ANI) April 19, 2024 తమిళనాడులో మందకోడిగా సాగుతున్న పోలింగ్ ఉదయం నుంచే ఎండ పెరగటంతో బయటకు రాని జనం ఉదయం 9 గంటలకు వరకు 12. 55 శాతం పోలింగ్ నమోదు ఓటు వేసిన త్రిపుర సీఎం అగర్తలా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సీఎం మాణిక్ షాహా కొనసాగుతున్న పోలింగ్ #WATCH | Tripura CM Manik Saha casts his vote at a polling booth in Agartala #LokSabhaElections2024 pic.twitter.com/g7ztewDNxT — ANI (@ANI) April 19, 2024 తమిళనాడు ఓటు వేసిన కమల్ హాసన్ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు కోయంబేడులో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan arrives at a polling booth in Koyambedu, Chennai to cast his vote. Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024, the party supported and campaigned for DMK. pic.twitter.com/q1bizg3Wey — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న బాబారాందేవ్, బాలకృష్ణ ఉత్తరఖండ్ హరిద్వార్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Uttarakhand: Yog guru Baba Ramdev and Patanjali Ayurved's Managing Director Acharya Balkrishna cast their votes at a polling booth in Haridwar#LokSabhaElections2024 pic.twitter.com/6fho7bk5t9 — ANI (@ANI) April 19, 2024 ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతాలు తమిళనాడు- 8. 21 శాతం త్రిపుర- 15, 21 శాతం ఉత్తర ప్రదేశ్- 12. 66 శాతం ఉత్తరఖండ్- 10. 54 శాతం పశ్చిమబెంగాల్- 15. 09 శాతం లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది #LokSabhaElections2024 | Voter turnout till 9 am for phase 1 of polling: Lakshadweep records the lowest - 5.59% Tripura records the highest - 15.21% pic.twitter.com/Y5ekbBDCrU — ANI (@ANI) April 19, 2024 ఉత్తరఖండ్ ఓటు వేసిన ఉత్తరఖండ్ సీఎం ఉత్తరఖండ్లో పోలింగ్ కొనసాగుతోంది ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హక్కు వినియోగించుకున్నారు #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his mother and wife cast his vote for the first phase of #LokSabhaElections2024 at a polling station in Khatima. pic.twitter.com/kd4ZC1uyTJ — ANI (@ANI) April 19, 2024 మిజోరం ఓటు వేసిన మిజోరం గవర్నర్ మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐజ్వాల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Mizoram Governor Dr Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl#LokSabhaElections2024 pic.twitter.com/GYkykdPz8n — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన అన్నామలై కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి అన్నామలై ఓటు హక్కు వినియోగించకున్నారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది "DMK, AIADMK has spent 1000 crores in Coimbatore": BJP's Annamalai alleges after casting his vote Read @ANI Story | https://t.co/pE64lzIK5U#LokSabhaElection2024 #TamilNadu #KAnnamalai #Votingday #BJP pic.twitter.com/Mie4ulXT79 — ANI Digital (@ani_digital) April 19, 2024 కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఊపందుకున్న పోలింగ్ ప్రక్రియ ఎండాకాలం కావడంతో ఉదయాన్నే ఓటింగ్ వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో సీఎం స్టాలిన్ ఓటు వేశారు #WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin casts his vote at a polling booth in Chennai.#LokSabhaElections2024 pic.twitter.com/IGyEcGD34I — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన రాజస్తాన్ సీఎం రాజస్తాన్లో పోలింగ్ కొనసాగుతోంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు రాజస్తాన్ సీఎం భజనలాల్ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు #WATCH | Rajasthan CM Bhajanlal Sharma casts his vote for the first phase of #LokSabhaElections2024, in Jaipur, Rajasthan. pic.twitter.com/kTjB47fk2Y — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో రజినీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.#LokSabhaElections2024 pic.twitter.com/kdgb3ewP8p — ANI (@ANI) April 19, 2024 #WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu. #LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన మాజీ సీఎం కమల్ నాథ్ మధ్యప్రదేశ్: మాజీ సీఎం కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చింద్వారాలో పోలింగ్ కొనాసాగుతోంది #WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath says, "I have full faith in the people of Chhindwara. I have full hope that they will stand by the truth." His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat… pic.twitter.com/2La3i41ZoI — ANI (@ANI) April 19, 2024 #WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024📷 His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat pic.twitter.com/XpDqSqr7oG — ANI (@ANI) April 19, 2024 మేఘాలయ వెస్ట్ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలో నిల్చున్నారు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాని వచ్చారు #WATCH | #LokSabhaElections2024 | People queue up outside a polling station in Tura, West Garo Hills Meghalaya CM Conrad Sangma is also present here to cast his vote. pic.twitter.com/laVAKteCoe — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో అజిత్ తమిళనాడు: సినీ హీరో అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు తిరువాన్మియూర్ పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Ajith Kumar arrives at a polling Booth in Thiruvanmiyur to cast his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/WW3vcvbMEn — ANI (@ANI) April 19, 2024 లోక్సభ ఎన్నిక తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలతోపాటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లుర్లు భారీగా ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది ఓటు వేసిన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు( చెన్నై): చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు చెన్నైలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: BJP's South Chennai candidate Tamilisai Soundarajan arrives at a polling booth in Saligramam, Chennai to cast her vote.#LokSabhaElections2024 pic.twitter.com/9PGQiaH23d — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ 2024 లోక్సభ ఎన్నికలు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ స్థానాల్లో ఓటు హక్కు ఉన్న ఓటర్లు.. రికార్డు స్థాయిలో తమ వినియోగించుకోవాలని కోరుతున్నాను PM Narendra Modi says, "The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers..."#LokSabhaElections2024 pic.twitter.com/7rJrJRTvgt — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన పళనిస్వామి మాజీ సీఎం ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి ఓటు వేశారు సేలంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Former Tamil Nadu CM and AIADMK leader Edappadi K Palaniswami casts his vote at a polling booth in Salem. #LokSabhaElections2024 pic.twitter.com/NT6zdXtFiE — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన కాంగ్రెస్ నేత పి. చిదంబరం తమిళనాడు: కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శివగంగ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Congress leader P Chidambaram casts his vote at a polling booth in Sivaganga.#LokSabhaElections2024 pic.twitter.com/9Aq8IfY5cT — ANI (@ANI) April 19, 2024 ఉత్తరఖండ్: ఉత్తరఖండ్ చీఫ్ ఎన్నికల అధికారి బీవీఆర్సీసీ పురుషోత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరఖండ్లో లోక్సభ తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది Uttarakhand Chief Electoral Officer BVRCC Purushottam cast his vote at booth number 141 in Dehradun.#LokSabhaElections2024 pic.twitter.com/32SYUpTdI8 — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మహారాష్ట్ర( నాగ్పూర్) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/rqZ2Fn0ZU1 — ANI (@ANI) April 19, 2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూలైన్లో నిల్చున్నారు పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నేడే లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3,ఉత్తరాఖండ్లోని 5, అరుణాచల్ప్రదేశ్లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలో1, లక్షద్వీప్లోని 1 సీటు, మణిపూర్లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి పోలింగ్ 2019 ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుపు #WATCH | #LokSabhaElection2024 | Tamil Nadu: Polling preparations underway at polling booth number 134 in Sivaganga district All 39 Lok Sabha seats in Tamil Nadu are going to polls today, in the first phase of the 2024 general elections. pic.twitter.com/EkLf5SPXPb — ANI (@ANI) April 19, 2024 తొలిదశ బరిలో ప్రముఖులు: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, డీఎంకే నేత ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు #WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling station in Soreng, Sikkim. Sikkim is represented by a single seat in the Lok Sabha, pic.twitter.com/69lLuyznaR — ANI (@ANI) April 19, 2024 సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్కుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. Polling team proceeding to Gate and Gasheng village under Payum circle in Siang District- Arunachal Pradesh, Dated 17th, April 2024.@ceoarunachal 🙌🤝#Elections2024 #IVoteForSure #ChunavKaParv #DeshKaGarv #saathchalenge #YouAreTheOne pic.twitter.com/hZ0YQ6sycr — Election Commission of India (@ECISVEEP) April 18, 2024 భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్బూత్లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్లలో పోలింగ్ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్లనూ ఏర్పాటుచేశారు. -
రేపే ఎన్నికలు.. సిద్ధంగా హెలికాప్టర్లు! ఎందుకంటే..
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాద రహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు. "అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వాల్లో, మరొకటి కుమావోన్లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అంబులెన్స్ల నంబర్లను అందుబాటులో ఉంచాం" అని ఆయన పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మొత్తం ఐదు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి క్లీన్స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా ఉంది. -
80లో 8.. రేపే తొలి సమరం!
లక్నో: దేశవ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఢిల్లీని కైవసం చేసుకునేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న మొదటి దశలో ఎనిమిది స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ నియోజకవర్గాలు ఇవే.. ఉత్తర ప్రదేశ్లో తొలి దశలో ఎన్నికలు 8 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. అవి పిలిభిత్, సహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్. వీటిలో ఐదు సహారన్పూర్, కైరానా, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్ జనరల్ నియోజకవర్గాలు కాగా మిగిలినవి రిజర్వ్డ్ స్థానాలు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎనిమిది సీట్లలో కేవలం మూడింటిని మాత్రమే గెలిచింది. అవి పిలిభిత్, కైరానా, ముజఫర్నగర్. సమాజ్వాదీ పార్టీ మొరాదాబాద్, రాంపూర్ స్థానాలను గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ సహరాన్పూర్, బిజ్నోర్, నగీనా స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాన అభ్యర్థులు వీళ్లే.. పిలిభిత్ నియోజవర్గం - జితిన్ ప్రసాద్ (బీజేపీ), భగవంత్ శరణ్ గంగ్వార్ (ఎస్పీ), అనిస్ అహ్మద్ ఖాన్ (బీఎస్పీ) సహరాన్పూర్ నియోజవర్గం- రాఘవ్ లఖన్పాల్ (బీజేపీ), మాజిద్ అలీ (బీఎస్పీ), ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్) కైరానా నియోజవర్గం - ప్రదీప్ కుమార్ (బీజేపీ), శ్రీపాల్ సింగ్ (బీఎస్పీ), ఇక్రా హసన్ (ఎస్పీ) ముజఫర్నగర్ నియోజవర్గం- సంజీవ్ బల్యాన్ (బీజేపీ), హరీంద్ర మాలిక్ (ఎస్పీ), ధారా సింగ్ ప్రజాపతి (బీఎస్పీ) రాంపూర్ నియోజవర్గం- ఘనశ్యామ్ లోధి (బీజేపీ), జీషన్ ఖాన్ (బీఎస్పీ) మొరాదాబాద్ నియోజవర్గం- సర్వేష్ సింగ్ (బీజేపీ), మొహమ్మద్ ఇర్ఫాన్ సైఫీ (బీఎస్పీ) బిజ్నోర్ నియోజవర్గం - చందన్ చౌహాన్ (ఆర్ఎల్డీ), విజేంద్ర సింగ్ (బీఎస్పీ), యశ్వీర్ సింగ్ (ఎస్పీ) నగీనా నియోజవర్గం- ఓం కుమార్ (బీజేపీ), సురేంద్ర పాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్ కుమార్ (ఎస్పీ) -
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్సభ మొదటి దశ పోలింగ్లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్లోని ఐదు, అరుణాచల్ప్రదేశ్లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో ఎనిమిది, మధ్యప్రదేశ్లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
ఇంటి వద్ద ఓటింగ్ నేటి నుంచే..
జైపూర్: రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రాజస్థాన్లో మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. -
బరిలో బాలీవుడ్ నటుడి సోదరుడు.. ఫస్ట్ ఫేజ్లో ఈయనే రిచ్!
Lok Sabha Elections 2024: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నియోజకవర్గం నుంచి మాజిద్ అలీని బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా నిలిపింది. కేఆర్కేగా పిలిచే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమాల్ ఆర్ ఖాన్ సోదరుడే మాజిద్ అలీ. ఈ లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో మాజిద్ అలీ అత్యంత ధనవంతుడు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అలీ మొత్తం ఆస్తులు సుమారు రూ. 160 కోట్లుగా ప్రకటించారు. మాజిద్ అలీకి రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, ఆహార ఉత్పత్తులు, దుస్తుల వ్యాపారాలు ఉన్నాయి. అవిసెన్నా స్టోన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తోదర్పూర్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మజిద్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్విజన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఆయన నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు. మాజిద్ అలీ లోక్సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా, ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాదు. 2009లో బీఎస్పీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2016లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దేవ్బంద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో ఆజాద్ సమాజ్ పార్టీలో చేరి వెంటనే తిరిగి బీఎస్పీకి వచ్చేశారు. -
AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తొలిదశలోనే!
ఢిల్లీ/విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో ఇప్పటికే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించింది కూడా. మరిన్ని పర్యటనలు.. సంప్రదింపుల తర్వాతే షెడ్యూల్ను విడుదల చేయనుంది. అయితే.. దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగానే.. తొలి దశలోనే ఏపీ ఎన్నికలను ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు, అలాగే తమిళనాడు లోక్సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జనవరి 7వ తేదీ నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కసరత్తులు మొదలుపెట్టనుంది. ముందుగా తమిళనాడు నుంచే తమ పర్యటనను ప్రారంభించనుంది. తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు.. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉన్న 175 స్థానాలతో పాటు 25 లోక్సభ సీట్లకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఎన్నికల సమయంలో.. అంటే 2019 ఎన్నికల సమయంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమై.. మే 19వ తేదీతో లోక్సభ/ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో 2024 ఎన్నికలను కూడా ఆరు లేదంటే ఏడు విడతల్లో నిర్వహించాలని ఈసీ అనుకుంటోంది. ఏపీకి వస్తున్న ఎన్నికల సంఘం ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా వీరు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఈసీ నుంచి అందాయి. -
సామాజిక ‘కూర్పు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన కేబినెట్ను సామాజిక కోణంలో ఏర్చికూర్చినట్టు స్పష్టమవు తోంది. సీనియార్టీ ప్రాతిపదికతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నేతలతో తొలిదఫా మంత్రివర్గాన్ని సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త కేబినెట్లో దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. కనీసం ఇద్దరికి ఈ హోదా వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ రేవంత్రెడ్డితో పాటు సీఎం పదవి కోసం పోటీ పడిన భట్టికి మాత్రమే ఈ హోదా లభించడం గమనార్హం.ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎంతో కలిపి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో అవకాశం లభించినట్టైంది. కొండా సురేఖ (పద్మశాలి), పొన్నం ప్రభాకర్ (గౌడ్) లను బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయగా, దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్బాబు (బ్రాహ్మణ), తుమ్మల నాగేశ్వర రావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), ధనసరి అనసూయ (ఎస్టీ)లకు మంత్రిమండలిలో స్థానం లభించింది. మొత్తం మీద అగ్రవర్ణాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 12 మందితో తెలంగాణ మంత్రిమండలి కొలువు దీరడం విశేషం. కాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడంతో తొలి దఫా కేబినెట్లో ఆ వర్గానికి స్థానం లభించలేదు. నాలుగు జిల్లాలకు నో.. జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు గాను 6 జిల్లాల నేతలకు మాత్రమే కేబి నెట్లో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నుంచి ముగ్గురు, నల్లగొండ నుంచి ఇద్దరు, మహ బూబ్ నగర్ నుంచి సీఎంతో కలిపి ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరా బాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందక పోవడంతో ఆ జిల్లాకు అవకాశం లభించలేదు. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలా బాద్ జిల్లాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. కేబి నెట్లో మరో 17 మంది మంత్రులుగా ఉండే అవ కాశం ఉండగా ప్రస్తుతం 12 మంది ప్రమాణం చేశారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను వీలును బట్టి భర్తీ చేస్తారని, పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరేలోపు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఫస్ట్ టైమర్స్ నలుగురు.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మొదటిసారి మంత్రులయ్యారు. ఇక రేవంత్రెడ్డి కూడా ఇంతకుముందు మంత్రిగా పని చేయకుండానే ఏకంగా సీఎం కావడం గమనార్హం. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన ఆయన ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు మాత్రం నిర్వర్తించలేదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేత పదవుల్లో పనిచేశారు. ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పొంగులేటి, పొన్నం ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం కూడా తొలిసారే కావడం గమనార్హం. -
నేడు ఛత్తీస్గఢ్లో తొలి దశ
సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.] మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి. తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్సింగ్తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్నంద్గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్కాల్, నారాయణ్పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. రాజ్నంద్గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్ల మధ్య నెలకొంది. రాజ్నంద్గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్సింగ్కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్కు సవాల్ విసిరారు. కొండగావ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ మార్కంకు కాంగ్రెస్ మళ్లీ టికెట్ ఇవ్వగా.. రమణ్సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లతా ఉసేందిని బీజేపీ రంగంలోకి దింపింది. కవార్ధా అసెంబ్లీ స్థానం నుంచి భూపేశ్ బఘేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహమ్మద్ అక్బర్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, అక్బర్ను ఓడించేందుకు బీజేపీ విజయ్ శర్మను రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఒడిశా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కొంట అసెంబ్లీ 24 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదీనంలో ఉంది. కొంటా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కవాసీ లఖ్మాను కాంగ్రెస్ పోటీకి దింపింది. -
ముగిసిన ప్రచారం.. అక్కడ రేపే పోలింగ్
ఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్గఢ్లో తొలి విడతలో పోలింగ్ జరుగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దీంతో, ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. VIDEO | Mizoram elections 2023: EVMs being dispatched to various polling booths in Aizawl. Polling for 40 assembly constituencies will take place in Mizoram on November 7.#AssemblyElectionsWithPTI #MizoramElections2023 pic.twitter.com/Bo8CmO0o5e — Press Trust of India (@PTI_News) November 6, 2023 మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది. #Chhattisgarh: Ahead of Assembly elections, polling teams leave by helicopter to #Naxal-hit areas, in Sukma The first phase of voting for #ChhattisgarhElections2023 will be held on November 7.#lokmat #lokmattimes #Elections2024 #AssemblyElection2024 #voting pic.twitter.com/yDRqGx6Xjg — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 4, 2023 ఇది కూడా చదవండి: అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్ -
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్కల్లా గ్రౌండ్ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్
05.30 PM ముగిసిన పోలింగ్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చిన్ని చిన్న ఘటనలు, విపక్షాల ఆరోపణల మధ్య ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 04:10 PM 13,065 పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా తపి నియోజకవర్గంలో 63.98శాతం ఓటింగ్ నమోదైంది. 13,065 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 02:20 PM గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంత జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరారు. 11:50 AM నెమ్మదిగా పోలింగ్.. గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. 10:35 AM ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని రవీంద్ర జడేజా పిలుపునిచ్చాడు. ఈ ఎన్నికల్లో అతని భార్య రివబ బీజేపీ తరఫున జామ్నగర్ నుంచే పోటీ చేస్తోంది. #GujaratElections2022 | Cricketer Ravindra Jadeja cast his vote at a polling station in Jamnagar. His wife and BJP candidate Rivaba Jadeja voted in Rajkot earlier today. Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/TXyu2W8JoD — ANI (@ANI) December 1, 2022 తండ్రి కాంగ్రెస్.. రవీంద్ర జడేజా భార్య బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె నైనా జడేజాతో కలిసి వచ్చి జామ్నగర్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. ఇద్దరూ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీల విషయంలో అభిప్రాయాలు వేరైనప్పటికీ కుటంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జడేజా తండ్రి స్పష్టం చేశారు. తాను ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. #GujaratAssemblyPolls | Anirudhsinh Jadeja & Naina Jadeja - father & sister of cricketer Ravindra Jadeja - vote at a polling station in Jamnagar Ravindra Jadeja's wife Rivaba Jadeja is BJP candidate from Jamnagar North while Anirudhsinh & Naina campaigned for Congress candidate pic.twitter.com/RxCJGlDUGT — ANI (@ANI) December 1, 2022 9:30 AM ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. తొలి విడత పోలింగ్లో కాముబెన్ లాలాభాయ్ పటేల్ అనే 100 ఏళ్ల బామ్మ తన ఓటు హక్కు వినియోగుంచుకుంది. ఉమర్గాంలోని ఓ పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటేసింది. 9:10 AM గ్యాస్ సిలిండర్తో పోలింగ్ స్టేషన్కు.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్పై గ్యాస్ సిలిండర్తో పోలింగ్ స్టేషన్కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా చేశారు. #WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR — ANI (@ANI) December 1, 2022 8:30 AM ఓటేసిన మంత్రి.. గుజరాత్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పూర్ణేష్ మోదీ.. సూరత్లోని ఓ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8:00 AM పోలింగ్ ప్రారంభం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2017 ఫలితాలు ఇలా.. తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. బరిలో 788 మంది తొలి దశలో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు- 89 పోటీ పడుతున్న అభ్యర్థులు- 788 మహిళా అభ్యర్థులు- 70 స్వతంత్ర అభ్యర్థులు- 339 ఓటర్ల సంఖ్య- 2.39 కోట్లు పోలింగ్ కేంద్రాలు - 1,432 -
AP: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మనబడి నాడు–నేడు కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధనా కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. చదవండి: లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. కన్నీరు పెట్టించిన ఫొటోలు, వీడియోలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్ ద్వారా ఈ కంటెంట్ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్ ల్యాబ్లకు ఈ–కంటెంట్ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్ల్లో డిజిటల్ డివైస్లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది. డిజిటల్ తరగతులకు సన్నాహాలు మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద 2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్ బ్యాండ్, లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్, పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. -
UP: మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలు విడుదల చేశాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జగరనుంది. తొలి విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు పోలింగ్ జరనుంది. -
కరీంనగర్లో దళిత బంధు తొలి విడత యూనిట్ల పంపిణీ
-
తొలివిడతపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంతో పోల్చితే.. ఈసారి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. ఇందుకు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిశీలకులు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. చదవండి: (టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే) (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్కు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు. -
తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. ప్రధాని మోదీ సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై చర్చించారు. భారత్లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు. సైంటిస్టుల మాటే ఆఖరి మాట ఇప్పటికే అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ అంశంలో సైంటిస్టుల మాటే ఆఖరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు. మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి తొలి దశలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకే కరోనా టీకా అందుతుందని, వారు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని నరేంద్రమోదీ కోరారు. ప్రామాణికమైన ప్రొటోకాల్ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. బూత్లెవల్ వ్యూహం సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని తెలిపారు. బూత్ లెవెల్ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. కో–విన్ అనే డిజిటల్ వేదిక ఏర్పాటు చేశామన్నారు. టీకా తొలిడోస్ తీసకున్నాక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్ అప్రమత్తం చేస్తుందని వివరించారు. ఓటర్ జాబితాతో.. హెల్త్కేర్, ఫ్రంట్లైన్ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
వ్యాక్సిన్ పంపుతున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్కు మొదటి విడత టీకాను త్వరలో పంపుతామని కేంద్రం తెలిపింది. టీకాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖలో రిప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ప్రదీప్ హల్డేర్ ఈ నెల 5న రాసిన లేఖలో రాష్ట్రాలను కోరారు. రిజిస్టరైన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన సూచనలను త్వరలోనే పంపుతామని పేర్కొన్నారు. నేడు మరో విడత డ్రైరన్: దేశవ్యాప్తంగా యూపీ, హరియాణా మినహా నేడు చేపట్టే డ్రైరన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, స్వయంగా పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులను కోరారు. దేశ వ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 736 జిల్లాల్లో ఈ బృహత్ కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు. -
బిహార్లో ముగిసిన తొలి దశ పోలింగ్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత 71 స్ధానాలకు పోలింగ్ బుధవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 52.24 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఆర్జేడీ 42 మంది అభ్యర్ధులను బరిలో దింపగా, జేడీయూ తరపున 35, బీజేపీ 29, కాంగ్రెస్ 21, సీపీఐ-ఎంఎల్ 8, హెచ్ఏఎం ఆరుగురు అభ్యర్ధులను బరిలో నిలిపాయి. ఇక ఇతర పార్టీల తరపున ఆర్ఎల్ఎస్పీ నుంచి 43, ఎల్జేపీ 41, బీఎస్పీ నుంచి 27 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. సోమవారంతో ముగిసిన తొలి విడత పోలింగ్ ప్రచారంలో పలు పార్టీల తరపున అగ్రనేతలు, సీనియర్ నేతలు ప్రచార పర్వాన్ని వేడెక్కించారు. ఇక జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాలుగోసారి అధికార పీఠంపై కన్నేశారు. బీజేపీతో కలిసి ముందుకు సాగుతుండగా ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా జట్టుకట్టాయి. నితీష్ సర్కార్పై నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని మహాకూటమి ఆశలు పెట్టుకుంది. ఇక కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశారు. మరోవైపు కోవిడ్ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్బూత్కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేశారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. చదవండి : బిహార్ ఎన్నికలు: ‘అత్యాచారం చేసి చంపేసేవారు’ -
బిహార్లో ముగిసిన తొలి దశ పోలింగ్
-
జార్ఖండ్లో ముగిసిన తొలి విడత పోలింగ్
రాంచీ: జార్ఖండ్లో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ 62.87 శాతం నమోదయింది. తొలివిడతలో ఈ రోజు జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయగా.. ఐదు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ విత్డ్రా, పోలింగ్ తేదీలు ఉన్నాయి. కాగా.. తుది ఫలితాలు డిసెంబర్ 23న విడుదలవుతాయి. (చదవండి : జార్ఖండ్: తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్..!) -
తొలిదఫాలో బెల్ట్షాపులు రద్దుచేసిన ప్రభుత్వం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
Advertisement