-
కాణిపాకంలో ‘వేస్ట్ మేనేజ్మెంట్’ పరిశీలన
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసర ప్రాంతంలోని వ్యర్థ పదార్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, (సాలిడ్– లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్) విధానాలను మంగళవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు పరిశీలించారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశ్వీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలు, బహుదా నది, తదితర ప్రాంతాలలో పర్యటించారు. అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ భాస్కర్ రావు, జాయింట్ చీఫ్ ఇంజినీర్ శ్రీరామమూర్తి, జాయింట్ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్, ఇంజినీర్ అశోక్, అసిస్టెంట్ ఇంజినీర్ హరీష్, ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ పాల్గొన్నారు. సాహితీవేత్తలకు పురస్కారం చిత్తూరు రూరల్ (కాణిపాకం): పారిశ్రామికవేత్త రత్నారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు. మర్రిపూడి దేవేంద్రరావుకు రాష్ట్ర సాహితీపతి బిరుదు, సి.నారాయణస్వామికి సాహితీశిల్పి అవార్డు, సి.సుబ్రమణ్యంరెడ్డికి అక్షరశిల్పి పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి జ్ఞాన నిర్దేశం చేయడంలో రచయితల పాత్ర కీలకమర్నారు. తెలుగు భాషను రక్షించుకునే క్రమంలో మర్రిపూడి దేవేంద్రరావు చేపట్టిన సాహితీ సదస్సులకు భాషాభిమానులు సహకరించాలని పిలుపు నిచ్చారు. అనంతరం రత్నారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం– 2024ను భారతీయ తెలుగు రచయితల సమాఖ్య వ్యవస్థాపకుడు దేవేంద్రరావు ప్రదానం చేశారు. పలమనేరులో స్ట్రాంగ్రూమ్ పరిశీలన పలమనేరు : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఈవీఎంల భద్రతపై ఆరా తీశారు. ఆయన వెంట ఆర్డీఓ మనోజ్రెడ్డి ఉన్నారు. నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : గిరిజన అభ్యర్థులు నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విదేశాల్లో పీహెచ్డీ, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికై న గిరిజన అభ్యర్థులు స్కాలర్షిప్ కోసం ఈ నెల 31వ తేదీలోపు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ www.overseas. tribal.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,748 మంది స్వామివారిని దర్శించుకోగా 30,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
సంక్షేమానికి జగనన్నే చిరునామా
గంగాధరనెల్లూరు: అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా సీఎం జగనన్న అని డెప్యూటీ సీఎం కే.నారాయణస్వామి కొనియాడారు. మంగళవారం ఆయన మండలంలోని అగరమంగళం, వెజ్జుపల్లి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీప్రియదామోదరం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం డెప్యూటీ సీఎం మాట్లాడుతూ పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు జగనన్న అని తెలిపారు. పేద ప్రజలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక దుష్టశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసి అడ్డుంకులు సృష్టించాయని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసిన జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్కార్పొరేషన్న్ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, జిల్లా రైతు అధ్యక్షుడు వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరక నెల్లూరు కోదండన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్, సీనియర్ నాయకులు నాయనిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఎంపీటీసీ ఇందిర, వెజ్జుపల్లి సర్పంచ్ హరిప్రసాద్రెడ్డి, ఎంపీటీసీ బాలసుబ్రమణ్యంరెడ్డి, మండల నాయకులు దామోదరం, గోపి, చిట్టి, వెంకటేశు, రుక్మానందరెడ్డి పాల్గొన్నారు. -
‘నేత’కు ఒక్క ఆర్డరైనా ఇప్పించారా?
నగరి : ‘మరమగ్గనేతకు ఒక్క మీటరు ఆర్డరైనా టీడీపీ ఇప్పించిందా..?’ అంటూ మరమగ్గ సామాజిక వర్గాలవారిని మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. మంగళవారం మున్సిపల్ పరిధిలో మరమగ్గ సామాజికవర్గం వారు ఎక్కువగా నివసించే కొత్తపేట, ఏకాంబరకుప్పం ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. స్థానిక మరమగ్గ నేత కార్మికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. తమ ఇంటి బిడ్డ వచ్చిందన్నంత ఆనందంతో స్థానికులు మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనులు, నిర్మించిన భవనాలు, ఏర్పరచిన వసతులను చిత్రపటాలతో సహా ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ యూనిఫామ్ ఆర్డరు ఒక్క మీటరైనా మరమగ్గకార్మికులకు ఇప్పించలేదన్నారు. తాను 23 లక్షల మీటర్ల గుడ్డకు ఆర్డరు ఇప్పించినట్టు తెలిపారు. ఒక్కరికై నా ఆధునిక మరమగ్గాలపై టీడీపీ శిక్షణ ఇవ్వలేదని మండిపడ్డారు. తాను మంత్రి అయ్యాక పట్టుచీరల నేతపైనా, ఆధునిక మరమగ్గాల నేతపైనా శిక్షణ ఇప్పించానని గుర్తుచేశారు. తమిళ మాధ్యమం చదివే విద్యార్థులకు గతంలో పుస్తకాలు ఇచ్చేవారు కారని, సీడీలు తెప్పించుకొని ముద్రించుకునే పరిస్థితి ఉండేదన్నారు. తమిళనాడు ప్రస్తుత, గత ముఖ్యమంత్రులిద్దరితోనూ చర్చించి తాను విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తెచ్చి ఇచ్చినట్టు తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీవారి ఆశీస్సులు పొందిన కొందరికే వీవర్స్ పెన్షన్ వచ్చేదని, నేడు 2,670 వీవర్ పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రంగునీటి శుద్ధీకరణ ప్లాంటు నిరుపయోగంగా మారితే దానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.2.75 కోట్లు తాను ప్రభుత్వంతో చర్చించి చెల్లించానన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ కేటగిరి మార్చి గెజిట్ ఇచ్చేయడం, అది 2022లో అమలులోకి రావడంతో తాను ముఖ్యమంత్రితో చర్చించి విద్యుత్ బిల్లు తగ్గించానన్నారు. కరోనా సమయంలో తాను మాత్రమే వచ్చి సేవలందించానని, నాడు టీడీపీ వారు ఏమయ్యారని ప్రశ్నించారు. నాడు రాని టీడీపీ వారు నేడు బూటకపు మేనిఫెస్టోతో మభ్యపెట్టేందుకు వస్తున్నారని, ప్రజలు వారిని తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, కౌన్సిలర్లు బీడీ భాస్కర్, భూపాలన్, బాబు, మురుగ, ఇంద్రయ్య, మాజీ కౌన్సిలర్ పుష్ప, కో–ఆప్షన్ సభ్యులు ఆనంద్కుమార్, నాయకులు అమర్, ఎంఎం రాజ, ఎంకేఎస్ మణిగండన్, ఎంబీ రాజ, గోపాల్ రెడ్డి, ఎస్బీ మూర్తి, జీపీఎం.మణి, ఎస్పీ షణ్ముగం, తనిగవాసన్ తదితరులు పాల్గొన్నారు. మంచి చేసే వారిని ఆదరించండి మభ్యపెట్టేవారిని తరిమికొట్టండి మంత్రి ఆర్కేరోజా -
పకడ్బందీగా మాక్ పోలింగ్
బీఎల్ఓల పాత్ర కీలకం పోలింగ్ రోజున బీఎల్ఓల పాత్ర కీలకమని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పకడ్బందీగా మాక్ పోలింగ్ నిర్వహించారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను మాక్ పోల్ చేసి చూపించామని తెలిపారు. ఈవీఎంలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించిన్నట్లు చెప్పారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించామని వెల్లడించారు. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ఓ అరుణ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మూడోరోజు 1,398 ‘పోస్టల్’ ఓట్ల పోలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం మూడోరోజు మొత్తం 1,398 మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 10,827 ఓట్లు పోల్ అయినట్లు వివరించారు. చిత్తూరు కలెక్టరేట్లో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పర్యవేక్షించారు. మూడురోజుల్లో జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో 1,752, నగరిలో 1,123, జీడీ నెల్లూరులో 1,498, చిత్తూరులో 2,350, పూతలపట్టులో 1,445, పలమనేరులో 1,751, కుప్పంలో 908 మొత్తం 10,827 మంది ఉద్యోగులు ఓటేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 1,113 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాల్సి ఉందని వెల్లడించారు. – 8లో -
కుప్పం దాహార్తికి శాశ్వత పరిష్కారం
కుప్పం : కుప్పం అభివృద్ధిలో భాగంగా హంద్రీ–నీవా కాలువ పూర్తిచేసి రెండు రిజర్వాయర్లు, పాలారు ప్రాజెక్టుకు పాలనా పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం కుప్పం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా కాలువ పూర్తి చేశామన్నారు. అంతేకాకుండా మాదనపల్లి, యామిగానిపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు, పాలారు ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. హంద్రీ–నీవా కాలువపైన ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని, వారంతా ప్రత్యేక మేధావుల బృందంతో పనులను పరిశీలించి విమర్శించాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన సాగించారని తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని, మీరే స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయాలని సూచించారు. ఐదు సంవత్సరాలు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నవరత్నాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేయగలిగామని చెప్పారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ వైఎస్సార్సీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, బీసీలు ఆయన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్ప చిత్తూరు పార్లమెంటుకు రెండోసారి పోటీ చేస్తున్నారని, ఆయన్ను కూడా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, మున్సిపల్ చైర్మన్ డా.సుధీర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రెండు రిజర్వాయర్లకు పాలనాపరమైన అనుమతులు హంద్రీ–నీవా పూర్తి చేస్తే పనికట్టుకుని విమర్శలు రూ.2.7 లక్షల కోట్లు డీబీ ద్వారా పేదలకు పంచాం 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement