-
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
రాజమహేంద్రవరం లలితానగర్కు బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుకున్నాం. అప్పుడే అపార్టుమెంట్లో నైట్ వాచ్మన్గా పని చేసి ఉదయాన్నే ఇంటికి వెళుతున్న టేకి శ్రీనును కలిశాం. ‘జగనన్న పథకాలతో మా ఇంట్లో అందరం లబ్ధి పొందాం. ఇప్పటి వరకూ ఎవ్వరూ అలా చేయలేదు. ఇల్లు కట్టుకోవడానికి మాకు స్థలం వచ్చింది. మా కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. మా అత్తయ్యకు చేయూత రూ.18 వేలు అందాయి. మేము ఇన్ని రకాలుగా జగన్ వల్ల మేలు పొందాం. ఉన్న పథకాలను కొనసాగిస్తామని జగన్ చెప్పారు. ఇక ఆయనకు కాకుండా మరెవరికి ఓటేస్తాం చెప్పండి!’ అని శ్రీను సంతోషంగా చెప్పారు. ● అనంతరం మోరంపూడి చేరుకున్నాం. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేస్తున్న నాగేశ్వరరావు, వెంకన్న అనే ఇద్దరు రోజు కూలీలతో మాటలు కలిపాం. ‘ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దళారీలు లేకుండా పథకాలన్నీ నూరు శాతం మా ఇంటికి చేర్చిన జగన్ను ఎలా మరచిపోతాం?’ అని నాగేశ్వరరావు సంతోషంగా అన్నారు. ‘పైన ముఖ్యమంత్రి జగన్, ఇక్కడ భరత్ ఎంతో అభివృద్ధి చేసి రాజమండ్రిని సుందరమైన నగరంగా తీర్చిదిద్దారు. వారిని మరోసారి గెలిపించుకుంటాం’ అని చెప్పారు. ● అక్కడి నుంచి కలెక్టరేట్ సమీపాన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నాం. రోడ్డు పక్కన చిన్న కిళ్లీ దుకాణం వద్ద కొద్దిసేపు ఆగి దుకాణ యజమాని రమేష్తో మాట కలిపాం. ఆయన ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా ‘ఈ ప్రభుత్వం వల్లే కదా మా కుటుంబమంతా లోటు లేకుండా నడిచిపోతోంది’ అని అన్నారు. అదెలాగని అడిగాం. ‘దేనినైనా తీసుకోండి. ఒకటేమిటి మా కుటుంబంలో అన్ని పథకాలూ అందాయని చెప్తే మొదట్లో చాలామంది నమ్మలేదు. తరువాత తరువాత మా ఖాతాల్లో డబ్బులు చూసి నిజం తెలిసొచ్చింది’ అని చెప్పారు. ●● వేమగిరి జంక్షన్ వద్ద చేరుకునేసరికి 10.10 గంటలైంది. జాతీయ రహదారి క్రాస్ చేసి కడియం వెళ్లేందుకు రోడ్డు దాటాం. వేమగిరి గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని మేజర్ పంచాయతీ. ఆ జంక్షన్లో మిఠాయి దుకాణం నడుపుతున్న 60 ఏళ్ల వెంకటేశ్వరరావును కలిశాం. ‘అన్ని పథకాలూ బాగానే వస్తున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా ఎవరి అవసరం లేకుండా బ్యాంక్ ఖాతాలో డబ్బు వేసేస్తున్నారు’ అని చాలా సంతోషంగా చెప్పారు. అయితే ఇసుక కాస్త త్వరగా దొరికేటట్టు చేస్తే మరింత బాగుంటుందని అన్నారు. ●● వేమగిరి జంక్షన్ దాటి అర కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఆర్టీసీ బస్సు కోసం వేచి చూస్తున్న తాపీ మేస్త్రి నారాయణ కుటుంబం కనిపించింది. వారిది మండపేట నియోజకవర్గంలోని తాపేశ్వరం గ్రామం. నారాయణను పలకరిస్తే ‘పనులు బాగా దొరుకుతున్నాయి. పనులు లేక ఇక్కడి జనం ఎక్కడెక్కడికో మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వాన్ని కావాలనే బ్యాడ్ చేస్తున్నారు’ అని ధైర్యంగా చెప్పారు. అతని భార్య మంగమ్మతో మాట కలిపితే ‘ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేశాను. వారికి ఇద్దరేసి పిల్లలు. ముగ్గురు మనవరాళ్లకు ఎవరి దయాదాక్షిణ్యాలతో పని లేకుండా అమ్మ ఒడి రూ.15 వేలు క్రమం తప్పకుండా వారి ఖాతాల్లో నేరుగా పడింది. ప్రభుత్వ బడులు చాలా బాగు చేశారు. పిల్లలు కూడా చాలా ఆనందంగా స్కూలుకు వెళుతున్నారు. డ్వాక్రా రుణ మాఫీ అయ్యింది. సున్నా వడ్డీ సొమ్ములు కూడా పడ్డాయి. చేయూత కూడా ఈ మధ్యనే వచ్చింది. ఇంతకంటే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది?’ అని అన్నారామె. ●● కడియం వెళ్లేసరికి జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ ఉద్యోగి చిట్టిబాబు కనిపించారు. ‘గతంలో ప్రభుత్వ సాయం కావాలంటే మధ్యలో దళారీలకు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు చూశాం. ఈ ఐదేళ్లలో ఎప్పుడూ ఏ పనికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాలని అడిగిన వాడు లేడంటే నమ్ముతారా! నమ్మాల్సిందే! కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఏది కావాల్సి వచ్చినా క్షణాల్లో పది అడుగులు వేస్తే వచ్చే గ్రామ సచివాలయంలోనే తీసుకుంటున్నాం. నిజంగా ప్రజల వద్దకు పాలన అంటే ఇదే అనేలా ప్రభుత్వ పాలనను పల్లెల్లోకి తీసుకు వచ్చారు. ఈ డెవలప్మెంట్ను ఎవరు మాత్రం మరచిపోతారు చెప్పండి’ అని ఆయనన్నారు. ● కడియం గ్రామంలోనే మహిళ శెట్టి వరలక్ష్మితో మాట్లాడాం. ‘ఈ సంక్షేమ పథకాలు మాలాంటి పేదలకు చేదోడవుతున్నాయి. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని దేవుళ్లందరినీ వేడుకుంటున్నాం. నా కుటుంబానికి ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు రూ.7.55 లక్షలు రావడం మా అందరి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఒక్కొక్కరికి రూ.18,875 వచ్చాయి. కాపు నేస్తంగా రూ.15 వేలు నా బ్యాంక్ ఖాతాలో వేశారు. సున్నా వడ్డీగా రూ.21 వేలు వచ్చాయి’ అని చెప్పారు. ● మండపేట నియోజకవర్గం కేశవరంలో రోడ్డు పక్కన చిన్న రేకుల షెడ్డులో ఉన్న టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు పద్మజతో మాట్లాడాం. ‘మా పెద్ద పిల్లాడు ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడు. రెండో కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇది వరకు ప్రభుత్వ బడుల్లో తెలుగు చదవడమే గగనమైపోయేది. మూడేళ్లుగా ఇంగ్లిషుపై జగనన్న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో మా పిల్లలు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడగలుగుతూండటం చూస్తే చాలా సంతోషమనిపిస్తోంది. ఇలా రాణిస్తారని కలలో కూడా ఊహించలేదు’ అని అన్నారు. ● ద్వారపూడిలో కళ్లంలో ధాన్యం ఆరబెట్టుకుంటున్న మధ్యతరగతి రైతు కె.సత్యనారాయణతో కొద్దిసేపు మాట కలిపాం. ‘జగన్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం ఇలా అమ్మితే అలా ఖాతాలో డబ్బు వచ్చి పడింది. రెండెకరాలు సాగు చేస్తే 80 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. కళ్లాల్లో ఉండగానే అమ్మేశాను. నాలుగు రోజులు కూడా తిరగకుండానే కనీస మద్దతు ధర రూ.1,560 వంతున ప్రభుత్వం మా ఖాతాల్లో వేసేసింది. గతంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడమనేదే ఉండేది కాదు’ అని ఆయనన్నారు. ● ద్వారపూడి నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి కోట చేరుకున్నాం. వలలు కుట్టుకునే టైలర్ నాగభైరవస్వామి తారసపడితే మాట కలిపాం. ‘ఈ రోజు చమురు సంస్థల పరిహారం మాకు అందిందంటే జగన్ వల్లే సాధ్యమైంది. గతంలో చమురు సంస్థల పరిహారం అందలేదు. అప్పటి మా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ద్వారా పరిహారం ఇవ్వాలని కోరినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మా అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పుణ్యమా అని మా కుటుంబాలలో కొంతమందికి చమురు సంస్థల పరిహారం అందింది. నాకు పెన్షన్ వస్తోంది. ఒకటో తేదీనే వలంటీర్ పట్టుకుని వచ్చి ఇస్తున్నారు’ అని భైరవస్వామి చెప్పారు. ● కోటిపల్లి కోట గ్రామానికి చెందిన మత్స్యకారుడు పెమ్మాడి మల్లేశ్వరరావును కలిశాం. ‘ఏటా వేట విరామం సమయంలో మూడు నెలల పాటు నష్టపరిహారం రూపంలో రూ.70 వేలు అందుకున్నాం. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకున్నాం. చేపల వేటకు అవసరమైన వలలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసుకున్నాం. దీంతో కుటుంబ పోషణకు ఆసరా దొరికింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో మత్స్యకారులను నవరత్నాల పథకాలతో ఆదుకోవడంతో పాటు చమురు సంస్థల నుంచి నష్ట పరిహారం తగిన సమయంలో అందేలా చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న వారిలో పిల్లి సూర్యప్రకాష్ను గెలిపించుకుంటాం’ అని చెప్పారు. ● Æ>Ð]l$-^èl…-{§ýlç³#Æý‡… Ð]l$…yýlÌS…ÌZ° §ýl„ìS×æ M>ÖV> õ³Æö…¨¯]l {§é„>-Æ>Ð]l$ {V>Ð]l$…ÌZ Ð]l$íßæâýæ ¯]l$¯]l² }§ólÑ™ø Ð]l*sêÏ-yé…. "¯é ¿ýæÆý‡¢ ™éï³ Ðól$[íÜ¢. ¯ól¯]l$ OsñæÌS-Ç…VŠæ ^ólçÜ$¢…-sê¯]l$. Ð]l* MýS$r$…-»ê-°MìS fVýS-¯]l¯]l² {糿¶æ$-™èlÓ…ÌZ AÐ]l$à Jyìl, fVýS-¯]l¯]l² ^ól§øyýl$, OÐðlGÝëÞÆŠ‡ çÜ$¯é² Ð]lyîlz, OÐðlGÝëÞÆŠ‡ BçÜÆ> ç³£ýl-M>Ë$ A…§éƇ$$. Òsìæ™ø ´ër$ C…sìæ çܦÌS… MýS*yé Ð]l$…þOÆð‡…¨. AƇ¬™ól Mö°² Ýë…MóS-†MýS M>Æý‡×êÌS M>Æý‡×æ…V> C…M> B C…sìæ çܦÌS… Ð]l*MýS$ A«¨M>Æý‡$Ë$ ^èl*í³…-^èlÌôæ§ýl$. Mö…™èl-Ð]l$…¨ ™ðlË$-VýS$§ólÔèæ… ¯éĶæ$-MýS$Ë$ ÐéâýæÏ {糿¶æ$™èlÓ… Ð]lõÜ¢ ^èl…{§ýl-»êº$ Æð‡…yýl$ òÜ…rÏ çܦÌS… CÝë¢Æý‡° ÑçÜ¢–™èl…V> {ç³^éÆý‡… ^ólçÜ$¢¯é²Æý‡$. M>± ™ðlË$VýS$§ólÔ¶æ… ´ëÈt ¯éĶæ$MýS$Ë Ð]l*rÌSOò³ Ð]l*MýS$ ¯]lÐ]l$ÃMýS… Ìôæ§ýl$. OÐðlG‹Ü fVýS¯ŒæÐðl*çß毌æÆð‡yìlz Ð]l$äÏ Ð]l¬QÅ-Ð]l$…{† AĶæ*ÅMýS Ð]l*MýS$ C_a¯]l òÜ…r$-¯]l²Æý‡ çܦÌS…ÌZ C…sìæ °Æ>Ã×æ… ^ólçÜ$Mø-Ð]l-yé-°MìS A°² Ñ«§éÌê çÜçßæMýS-Ç-Ýë¢-Æý‡¯]l² ¯]lÐ]l$ÃMýS… E…¨. BĶæ$¯]l Ð]l*r C^éaÆý‡…sôæ °Ë$ç³#MýS$…sêÆý‡$. Ðól$… M>ç³# MýS$Ìê°MìS ^ðl…¨¯]l ÐéâýæÏ…. Ð]l* A»ê¾Æ‡$$ Ððl¬¯]l²sìæ Ð]lÆý‡MýS* ç³Ð]l¯ŒS MýSÌêÅ׊æ A…r* f¯]lõܯ]l ´ëÈt ™èlÆý‡$çœ#¯]l †Ç-VóS-Ðéyýl$. G糚-Oyðl™ól ç³Ð]l¯ŒS MýSÌêÅ׊æ sîæyîlï³, ½gôæï³™ø ´÷™èl$¢-ÌS™ø Ð]l¬…§ýl$MýS$ Ð]l^éayø Aç³µyól ÐéyìlMìS MýS*yé ç³Ð]l-¯ŒSMýSÌêÅ׊æOò³ ¯]lÐ]l$ÃMýS… ç³NÇ¢V> ´ùƇ$$…-¨. A…§ýl$MóS {ç³çÜ$¢™èl… CMýSPyýl OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ GÐðl$ÃÌôæÅ A¿ýæÅ-Ǧ í³ÍÏ çÜ*Æý‡Å-{ç³-M>-ÔŒæ™ø MýSÌSíÜ G°²MýSÌS {ç³^é-Æý‡…ÌZ ´ëÌŸY…-r$¯é²yýl$' A° }§ólÑ ^ðl´ëµÆý‡$. ḍసాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారు తూర్పు గోదావరి జిల్లా వాసులు. అటువంటి వారు.. చరిత్రలోనే తొలిసారిగా గడచిన ఐదేళ్లలో లంచాలు లేని పాలనను ప్రజల ముంగిటకే తెచ్చిన ప్రభుత్వంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీల నుంచి ఒక మోస్తరు మధ్య తరగతి కుటుంబీకుల వరకూ అందరి నోటా ‘మా జగనన్న చేసిన సాయం ఎలా మరచిపోతాం’ అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో జనం నాడి తెలుసుకునే చిరు ప్రయత్నాన్ని ‘సాక్షి’ రోడ్ షో ద్వారా చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం నుంచి మొదలైన ఈ రోడ్ షో రాజమహేంద్రవరం రూరల్, మండపేట, రామచంద్రపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా కాకినాడ నగరం వరకూ సాగింది. నగరం, పట్టణం, మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీ, మైనర్ పంచాయతీ.. ఇలా ఎక్కడ ఎవరిని కదిలించినా ప్రతి కుటుంబంలోనూ నలుగురైదుగురికి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం సాయం అందించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిందని నిండైన కృతజ్ఞతతో చెబుతున్న వారే కనిపించారు. చిల్లిగవ్వ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సాయం ఎప్పటికీ మరచిపోలేమని చెప్పారు. అటువంటి నాయకుడిని తప్ప మరెవరిని కోరుకుంటామని అన్న వారే ఎక్కువగా కనిపించారు. ఇంత మంచి పాలన అందించడం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు సాధ్యం కాలేదని దారి పొడవునా ఉన్న పల్లెల్లో ప్రజలు ఆడ, మగ అనే తేడా లేకుండా అడిగారు. ఎన్నికల ముందు ఆయన ఉత్తుత్తి హామీలు ఇచ్చి తర్వాత ముఖం చాటేశారని, మళ్లీ ఇప్పుడు ఇస్తున్న హామీలను నమ్మలేమనే మాట అందరి నోటా వినిపించింది. రామచంద్రపురం మెయిన్ సెంటర్లో చిన్నకారు రైతు సుందర జ్యోతికుమార్ కనిపించారు. ఆయనది కె.గంగవరం ఎస్సీ పేట. ‘జగన్ ప్రభుత్వంతో మా ఇంట్లోని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగింది. ఆ మేలు మరచిపోలేం. మళ్లీ జగనన్నకే ఓటు వేసి సీఎంను చేయడానికి మా పేట అంతా కలసికట్టుగా ఉంది. మా అబ్బాయికి అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. నాకు రైతు భరోసా సొమ్ములు పడ్డాయి. మా నాన్నకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించాను. ఆయనకు నెలనెలా పింఛన్ సొమ్ములు వస్తున్నాయి. మా అమ్మకు ఆసరా సొమ్ములు వచ్చాయి. మా కుటుంబంలో అందరికీ మేలు జరిగింది. నేను జగన్, వైఎస్సార్ సీపీ వెంటే ఉంటాను. మా ఎస్సీ పేటలో మాలాగా లబ్ధి పొందిన వారు చాలామంది జగన్మోహన్రెడ్డి అంటేనే నమ్ముతున్నారు’ అని జ్యోతికుమార్ అన్నారు. రామచంద్రపురం – కాకినాడ వెళ్లే దారిలో నరసాపురపుపేటలో పండ్ల వ్యాపారి సలాది నారాయణ మణికంఠను కలిశాం. ‘ఈ ఐదేళ్లలో పేదలకు బాగా సాయం జరిగింది. సాయం చేసిన వారిని మా ప్రాంతంలో గుండెల్లో పెట్టుకుంటారు. నా దుకాణం వద్దకు వచ్చే వారిలో చాలామంది ప్రభుత్వం బాగా పని చేస్తోందనే చెబుతున్నారు. నా అభిప్రాయం కూడా అదే’ అని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగిలో మండిపోతున్న ఎండకు తాళలేక చెట్టు నీడన కూర్చున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పి.వీర వెంకట సత్యనారాయణను కలిశాం. ‘గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా ప్రజల బాగోగులు చూసిన వాళ్లను ఇన్నేళ్ల సర్వీసులో నేను ఎప్పుడూ చూడలేదు. రేషన్ దుకాణం వద్దకు వెళ్లనవసరం లేకుండా మా ఇంటికే వచ్చి ఇస్తున్నారు. వయస్సు మీద పడిన నాలాంటి వారికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా ఇంటికి కూతవేటు దూరంలోనే గ్రామ సచివాలయం ఉంది. ఏ అవసరం వచ్చినా నాలుగడుగులు వేసి వెళ్తే అక్కడి ఉద్యోగులు ఏ పనయినా నిమిషాల్లో చేసి పెడుతున్నారు. వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో పైన జగన్మోహన్రెడ్డిని, మా నియోజకవర్గంలో కురసాల కన్నబాబును గెలిపించుకుంటాం’ అని స్పష్టంగా చెప్పారు. కాకినాడ తూరంగి వద్ద అప్పుడే తాపీ పనికి సహాయకురాలిగా వెళ్లి, ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్న శాంతమ్మను కలిశాం. ‘మా బోటి కుటుంబాల్లో ఈ రోజు మేమంతా సంతోషంగా ఉన్నామంటే జగనన్న ప్రభుత్వం చేసిన మేలే కారణం. సకాలంలో డ్వాక్రా రుణాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన రూ.లక్షతో ఇంటి వద్ద చిన్న దుకాణం పెట్టుకున్నాను. ఉదయం పూట పనిలోకి వెళ్లి వచ్చి మధ్యాహ్నం నుంచి దుకాణం చూసుకుని పిల్లలను చదివించుకుంటున్నాను. జగన్నాథపురంలో ఒకప్పుడు శ్లాబులు ఊడిపోయి కూలిపోతుందనేలా ఉండే పాఠశాలకు పంపాలంటే భయపడే వాళ్లం. ఇప్పుడు మా బడి బాగా బాగు చేశారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు’ అని శాంతమ్మ చెప్పారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ, – సాక్షి, రాజమహేంద్రవరం, సాక్షి, అమలాపురం -
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
కొత్తపేట: రెక్కాడితేనే గాని డొక్కాడని కూలీ దంపతులు. వారు రెక్కల కష్టంతోనే ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కుటుంబాన్ని కొద్దిపాటి కూలీ డబ్బులతో పిల్లలను పోషించుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ జీవనం సాగించారు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఆ నిరుపేద కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. జీవన స్థితిగతులను మెరుగుపర్చుకుంది. వివరాల్లోకి వెళితే కొత్తపేట మండలం, ఖండ్రిగ గ్రామానికి చెందిన కముజు చిన సత్యనారాయణ దంపతులు వెనుకబడిన వర్గానికి చెందిన నిరుపేదలు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చినసత్యనారాయణ, అతని భార్య లక్ష్మి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. పిల్లలను పెంచి పెద్దచేశారు. వారిలో ఒక కుమారుడు, కుమార్తెకు వివాహాలు చేశారు. మరో కుమారుడు సాయిప్రసాద్ గత కొన్నేళ్ల క్రితం కొబ్బరిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. దాంతో తలకు తీవ్ర గాయమై పక్షవాతానికి గురయ్యాడు. అతను ఏ పనీ చేయలేక ఇంటి పట్టునే ఉండిపోవడంతో అతని భారం కూడా ఆ దంపతులపై పడింది. ఆ ఇద్దరు దంపతులు కూలీ పనిచేసుకుంటూ కొడుకు భారాన్ని కూడా వారే మోస్తూ జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం సత్యనారాయణకు ఓఏపీ పింఛన్ మంజూరు చేసింది. తరువాత అతని భార్య లక్ష్మి డ్వాక్రా గ్రూపులో ఉండగా సీఎం జగన్ అమలు చేసిన వైఎస్సార్ ఆసరా పథకం అమలుతో రూ.12 వేలు, అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందుతున్నాయి. పక్షవాతంతో దివ్యాంగుడిగా మారిన సాయిప్రసాద్కు గత టీడీపీ ప్రభుత్వంలో ఎంత ప్రయత్నించినా రాని సదరం సర్టిఫికెట్ ఈ ప్రభుత్వంలో రావడంతో రూ.3 వేలు, దివ్యాంగ పించను మంజూరైంది. ఫలితంగా ఆ కుటుంబం గత నాలుగేళ్ల కాలంలో సుమారు రూ.3.26 లక్షల లబ్ధి పొందింది. వారికి ఉన్న కొంత జాగాలో మళ్లీ జగన్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సుఖంగా జీవిస్తున్నాం రెక్కాడితే గాని డొక్కాడని మాకు జగన్ ప్రభుత్వ పథకాలతో సుఖంగా జీవనం సాగిస్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు ఈ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. మేమే కాదు మాలాంటి ఎన్నో నిరుపేద కుటుంబాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఆనందంగా బతుకుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – కముజు చినసత్యనారాయణ, ఖండ్రిగ, కొత్తపేట మండలం మాబోటి పేదల ప్రభుత్వం మాబోటి పేదల ప్రభుత్వం ఇది. చెట్టుపై నుంచి పడిపోయి ఏ పనీ చేయలేని నాకు దివ్యాంగ పింఛను ఇప్పించిన దేవుడు మా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ఆసరా కింద మా అమ్మ పేరున ఏటా రూ.12 వేలు, చేయూత ద్వారా రూ.18,750, మా నాన్నకు రూ.3 వేలు పింఛన్ డబ్బులతో ఆనందంగా జీవిస్తున్నాం. ఎప్పటికీ ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాం. – కముజు సాయిప్రసాద్, ఖండ్రిగ, కొత్తపేట మండలం నాలుగేళ్లలో సుమారు రూ.3.26 లక్షల లబ్ధి -
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
కొవ్వూరు: వైఎస్సార్ సీపీ పేదలకు అండగా నిలించింది. నవరత్నాల పథకాలు అమలుతో వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రతి కుటుంబానికి ఆర్థికంగా తోడుంది. సంక్షేమ పథకాలతో నిరుపేదల కుటుంబాలలో వెలుగులు నిండాయి అనడానికి పక్షవాతంతో దయనీయ పరిస్థితిలో ఉన్న తిగిరిపల్లి వీర్రాజు కుటుంబమే నిదర్శనం. ఈ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వత అన్నీ రకాలుగా అండదండగా నిలిచింది. దివ్యాంగులైన వీర్రాజు భార్యభర్తలకు రూ.3 వేలు చొప్పున ప్రభుత్వం పింఛను అందిస్తోంది. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛను ఇస్తున్నారు. ఇంటి స్థలం మంజూరు చేశారు. కుమార్తె చదువుకి సంక్షేమ పథకాలు ఉపకరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చోరవతో కుమార్తెకి ఉద్యోగం లభించిందని వీర్రాజు గర్వంగా చెబుతున్నాడు. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి కాస్తా మెరుగు పడింది. ఇప్పుడు ఆ కుటుంబం మనో స్థైర్యంతో బతుకుతోంది. మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు జగనన్న నా పేరు వీర్రాజు, నాది తాళ్లపూడ మండలం పెద్దేవం గ్రామం. నేను చుట్టు పక్క ప్రాంతాల్లో ఆకుకూరలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడిని, నాలుగేల్ల క్రితం పక్షవాతంతో మూలన పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందిలు ఎదుర్కొన్నాం. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య దివ్యాంగురాలు. చెవుడు, మూగ దీంతో కుటుంబ సంపాద లేకుండాపోయింది. ఇప్పుడు జగనన్న దయ వల్ల ఇద్దరికి నెలకి రూ.3 వేలు చొప్పున రూ.6 వేలు పింఛను అందుతోంది. మా అమ్మకు వితంతు పింఛను రూ.3 వేలు ఇస్తున్నారు. అదికూడా ఒకటో తారీఖు తెల్లవారు జామున వలంటీర్లు వచ్చి అందిస్తున్నారు. 35 కిలోల రేషన్ బియ్యం కూడా ఇంటి వద్దకే వస్తున్నాయి. మా గ్రామంలోనే జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. దాని విలువ మార్కెట్లో రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.1.80 లక్షల మంజూరైంది. ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో చిన్న అమ్మాయి రమ్యని చదువు మాన్పించేశాను. పెద్ద కుమార్తె దివ్యని డిగ్రీ వరకూ చదివించాను. ఫీజు రియంబర్స్ మెంట్ (జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన)తో చదువు పూర్తి చేసింది. ఇప్పుడు జీఎస్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. దీంతో కుటుంబ పోషణకు ఢోకా లేదన్న ధైర్యం ఏర్పడింది. ఏ చీకు చింత లేకుండా జీవనం సాగిస్తున్నాం. ఇదంతా సీఎం జగన్ వల్లే సాధ్యమైంది. ఆయనకు మా జీవితాంతం రుణపడి ఉంటాం. దివ్యాంగులైన భార్యభర్తలకు ప్రతి నెల వస్తున్న పింఛను ఇంటి స్థలం మంజూరు కుటుంబ దయనీయ స్థితికి చలించి దివ్యకు ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి నవరత్నాలతో తిగిరిపల్లి వీర్రాజు వెలుగులు తిరిగిపల్లి వీర్రాజు కుటుంబానికి చేకూరిన లబ్ధి ఇంటి స్థలం – సుమారు రూ.4లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరైన మొత్తం – రూ.1.80లక్షలు జగనన్న విద్యాదీవెన(ఫీజు రియంబర్స్మెంటు) – రూ.90(30వేలు చోప్పున మూడు విడతలు జగనన్న వసతి దీవెన రూ.30 (రూ.15వేలు చొప్పున రెండు విడతలు) దివ్యాంగుల పింఛను తిగిరిపల్లి వీర్రాజుకి –1,68,000 (మూడు వేలు చొప్పున 56 నెలలు ఫిబ్రవరి వరకు) తిగిరిపల్లి సంధ్యాకు దివ్యాంగుల ఫించన్ –రూ.1,68,000 (నెలకి మూడు వేలు చొప్పున 56 నెలలు ఫిబ్రవరి వరకు) తిగిరిపల్లి దివ్యకి రూ.36 వేలు(రూ.18వేలు చొప్పున రెండు నెలలు జీతం తిగిరిపల్లి దమయంతి–రూ.9వేలు (నెలకి రూ.3వేలు చొప్పున మూడు నెలలు నుంచి) మొత్తంగా రూ.10.79 లక్షల లబ్ధి చేకూరింది.దరఖాస్తు చేసుకోగానే పింఛను ఇచ్చారు ఆరు నెలలు క్రితమే నా భర్త చిన్న సుబ్బారావు మృతి చెందారు. వలంటీర్ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఏ విధమైన సిఫార్సులు లేకుండానే పింఛను మంజూరైంది. ఎవరికి రుపాయి లంచం ఇవ్వలేదు. మూడు నెలలు నుంచి వితంతు పింఛను అందుకుంటున్నాను. ఒకప్పుడు పింఛను కోసం తిరిగి తిరిగి అలసిపోయేవాళ్లు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చా అలాంగే కష్టాలే లేవు. మా లాంటి పేదోళ్లును ఈ ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుంటోంది. –తిగిరిపల్లి దమయంతి, పెద్దేవం ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు నాలుగేళ్ల క్రితం నాన్నకి పక్షవాతం రావడంతో చెల్లి చదువులా నా చదువు ఆగిపోతుందెమోనని ఆందోళన చెందాను. జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.30 వేలు, వసతి దీవెన రూ.15 వేలు చొప్పున మూడేళ్లు సాయం అందింది. దీంతో డిగ్రీలో బికాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. గత మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహరెడ్డి కొవ్వూరు వచ్చిన సందర్భంలో నాకు మాట్లాడే అవకాశం లభించింది. నా కుటుంబ దయనీయ స్థితిని విని చలించిపోయారు. రాజమహేంద్రవరంలోని రాష్ట్ర జీఎస్టీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. జనవరిలో ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.18 వేలు జీతం. నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఆత్మస్దైర్యాన్ని జగనన్న అందించారు. జీవితాంతం జగనన్నకి రుణపడి ఉంటాం. – తిగిరిపల్లి దివ్య, పెద్దేవం -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై సమీక్ష
రాజానగరం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సెక్యూరిటీ సిస్టమ్పై సాధారణ పరిశీలకులు కె. బాలసుబ్రహ్మణ్యం, కమల్కాంత్ సరోఛ, బలరామ్ మీనాలు బుధవారం సమీక్షించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 1,577 పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నియామకం గురించి తీసుకున్న చర్యలను కలెక్టర్ కె. మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ వారికి వివరించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్ల నుంచి బ్యాలెట్ యూనిట్స్ని ‘నన్నయ’ వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్కి పటిష్టమైన భద్రతతో తరలించే విధానంపై రూట్ మ్యాప్ని సిద్ధం చేశామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియను సీసీ కెమోరాల నిఘాలో సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి రాజమహేంద్రవరం రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఈ నెల 12 , 13 తేదీలలో జారీ చేసే ప్రచార ప్రకటనలు మీడియా పర్యవేక్షణ, మీడియా ధ్రువీకరణ (ఎమ్ సి ఎమ్ సీ) విభాగం నుంచి రెండురోజులు ముందుగా అనుమతి పొందాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతులు పొందాలన్నారు. -
No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన, బీజేపీలను సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోందా..? అబద్ధపు హామీలతో ప్రజలను ప్రలోభోలకు గురిచేస్తున్నారా..? మా ప్రభుత్వం వచ్చాక అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మాయమాటలు చెబుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టమైన పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అభివృద్ధే అజెండాగా ముందుకెళుతోంటే.. ప్రజా విశ్వాసం, నమ్మకం కోల్పోయిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు మాత్రం ప్రలోభాల పర్వానికి తెర తీశారు. వృద్ధుల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ అమలు చేసిన హోం ఓటింగ్లో సైతం పెద్ద ఎత్తున ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటు హక్కు ఉన్న వృద్ధుల ఇళ్ల వద్ద పడిగాపులు కాసి మరీ ఓట్లు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. ఇళ్ల వద్దకు ద్వితీయ శ్రేణి నాయకులను పంపి తమ అభ్యర్థికి ఓటేయాలని కవర్లు అందించినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. పగలు ప్రచారం.. రాత్రుళ్లు పంపిణీలు పోలింగ్కు తక్కువ సమయం ఉండటంతో ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. పగలు ప్రచారం, రాత్రిళ్లు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. కుటుంబాల వారీగా ఎంపిక చేసుకుని రహస్యంగా కలుస్తున్నారు. వారికి ప్రయోజనాలు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మీకేం కావాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచాక మిమ్మల్ని బాగా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఓటుకింత అని గంపగుత్తగా డబ్బులు అందజేస్తున్నట్లు తెలిసింది. చీరలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ముమ్మరంగా కమ్మునిటీ సమావేశాలు ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లున్న సామాజిక వర్గాలను ఎంపిక చేసుకుని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. టీడీపీ హయాంలో చేసిందేమీ లేదని.. తిరిగి ఇప్పుడొచ్చి దొంగ హామీలు ఎందుకిస్తున్నారని సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సారి కచ్చితంగా చేస్తామంటూ బూటకపు మాటలతో మభ్యపెడుతున్నారు. రాజమండ్రి సిటీ, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సమావేశాలకు వచ్చిన వారికి తాయిలాల ఎర వేస్తున్నారు. రూ.3వేల నుంచి రూ.5 వేలు కవర్లలో పెట్టి ఇచ్చి పంపుతున్నారు. కొన్ని సంఘాల నాయకులు మాత్రం తమకు తక్షణం సంఘ భవనం, ఇతర అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తుంటే ఎన్నికలయ్యాక చూద్దామంటూ ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది. డబ్బు, మద్యం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాపారుల నుంచి భారీగా మద్యం కొనుగోలు చేసి తమ రహస్య స్థావరాల్లో నిల్వ ఉంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటుకు ఇంత అని డబ్బు పంచే ప్రక్రియకు నాంది పలుకగా.. మరికొన్ని చోట్ల మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి, నేరుగా పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్పై కన్ను ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్పై కన్నేసిన టీడీపీ నేతలు వాటిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయాత్నాలు చేశారు. రాజమండ్రి సిటీలో అయితే ఒక్కో ఓటుకు రూ.2,500 వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. నిడదవోలులో రూ.1,000, గోపాలపురం రూ.1,500 ఇలా నియోజకవర్గానికి ఒక ధర నిర్ణయించి మరీ యథేచ్ఛగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబంలో రెండు నుంచి మూడు ఓట్లుంటే ఆ కుటుంబాన్ని కాకాపట్టి మరీ ఓట్లు అభ్యర్థించినట్లు తెలిసింది. సంక్షేమమే అజెండాగా వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమమే అజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి ఫలాలు ప్రజలకు చేరిన తీరును వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తిస్తున్న ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారు. తిరిగి మిమ్మల్నే గెలిపిస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చేరికల కలరింగ్ పార్టీలో చేరికల పేరుతో హడావుడి చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కార్యాలయాల్లో నిత్యం కండువాలు కప్పించే కార్యక్రమం తంతుగా మారుతోంది. పార్టీపై ఇష్టంతో చేరుతున్నారా? వీరి వల్ల నిజంగా పార్టీకి ఉపయోగమా..? అనే విషయాన్ని పక్కన బెట్టేస్తున్నారు. పార్టీలో వందలాది మంది చేరుతున్నారని ప్రకటించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మైండ్గేమ్ అడుతున్నారు. టీడీపీ నాయకులు, వాళ్ల వద్ద పనిచేసే వ్యక్తులకే కండువాలు కప్పేసి పార్టీలో చేరినట్లు కలరింగ్ ఇస్తున్నారు. ఇటీవల రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడికి కండువా కప్పి పార్టీలోకి చేరినట్లు నమ్మించే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న చోటా నాయకుడు తెల్లారేసరికి ప్రత్యర్థి పార్టీలో కండువా కప్పుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ఇదే తంతును కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం భారీ నజరానాలు సమర్పించుకుంటున్నారు. 100 ఓట్లు ప్రభావితం చేయగలిగిన ప్రత్యర్థి పార్టీల నాయకులకు రూ.లక్షల తాయిలాలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలనే టార్గెట్ చేసుకుని మరీ ప్రలోభాలకు పాల్పడుతున్నారు. సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల యత్నం చివరకు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ సైతం కొనుగోలు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టుకుని మరీ ప్రలోభాలు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ అబద్ధపు హామీలు గంప గుత్తగా ఓట్లు కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు సంక్షేమ అజెండాతో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న ఆదరణ -
No Headline
రాజమహేంద్రవరం రూరల్: పాలిసెట్–2024 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్ధులు టాప్ లేపారు. తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు నలుగురిలో ఇద్దరు స్టేట్ఫస్ట్ ర్యాంకులు, ఇద్దరు సెవెన్త్ ర్యాంకులను కై వసం చేసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గత నెల 27వ తేదీన పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ నిర్వహించారు. ఈ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చల్లా నాగ వెంకట సత్యశ్రీవర్షిణి, జొన్నలగడ్డ యశ్వంత్సాయి ప్రథమ ర్యాంకులు, దేవశ్రీవేద్, గొల్ల ప్రభావ్తేజ్ ఏడవ ర్యాంకులు సాధించడం విశేషం. జిల్లాలో 4,791 మంది విద్యార్థులు పాలిసెట్కు హాజరుకాగా, 4,253మంది 88.77 శాతంతో పాలిసెట్లో అర్హత సాధించారని జిల్లా కోఆర్డినేటర్, బొమ్మూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. -
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2024–25 సంవత్సరానికి మొదట విడత అడ్మిషన్లకు పదో తరగతి, ఆపై అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ తెలిపారు. ఆసక్తి కలవారు ఐటిఐ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్సైట్లో గురువారం నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలన్నారు. వారందరికీ ఈ నెల 10 నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 92940 50231 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రశాంతంగా ఏపీ ఈసెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్–24 ఆన్లైన్ పరీక్షను బుధవారం కాకినాడ జిల్లాలోని ఐదు కేంద్రాలలో బుధవారం ఆన్లైన్లో నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 2,140 మంది దరఖాస్తు చేసుకోగా 2,094 మంది హాజరయ్యారు. కాకినాడ అచ్యుతాపురం అయాన్ అన్లైన్ కేంద్రంతో పాటు సూరంపాలెం ప్రగతి, ఆదిత్య కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. -
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక కేంద్రం ముమ్మిడివరం
ముమ్మిడివరం: తూర్పు, దక్షిణాన సాగర సంగమ సోయగాలు.. ఉత్తరాన గౌతమీ గోదావరి పరవళ్లు.. పడమరన కోనసీమ కేంద్రమైన అమలాపురం నియోజకవర్గ సరిహద్దులు.. ఇదీ ముమ్మిడివరం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం. జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం ఇద్దరు రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం, అనంతరం లోక్సభ స్పీకర్ కావడం ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి జిల్లాలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు ముమ్మిడివరం నుంచి రెండు సార్లు గెలుపొందడం మరో విశేషం. ముమ్మిడివరం నియోజకవర్గం ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. 40 ఏళ్లు నిద్రాహారాలు మాని కఠోర తపస్సు నాచరించిన శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమం ఇక్కడే ఉంది. నియోజకవర్గ స్వరూపం చెయ్యేరు జనరల్ నియోజకవర్గం 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో చేరింది. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గం జనరల్గా మారింది. అంతకు ముందు చెయ్యేరు నియోజక వర్గంగా ఉన్న సమయంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగగా కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండేసి పర్యాయాలు ప్రాతినిథ్యం వహించాయి. మొదటిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నడింపల్లి రామభద్రిరాజు సీపీఐ అభ్యర్థి సి.కృష్ణమూర్తిపై 8,637 ఓట్లతో గెలుపొందారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీకే రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావు 2,066 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావును స్వతంత్ర అభ్యర్థి సీబీకే రాజు 15,365 ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి పళ్ళ వెంకటరావు ఇండింపెండెంట్ అభ్యర్థి జీవీ రావుపై 11,304 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. రసవత్తర రాజకీయ పోరు 1978లో చెయ్యేరు నియోజకవర్గం ముమ్మిడివరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి బి.అప్పలస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 13,228 ఓట్లతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి వల్తాటి రాజా సక్కుబాయిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 36,225 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జీకే వరప్రసాద్ను టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తి 33,124 ఓట్ల తేడాతో ఓడించారు. 1989లో టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 6,749 ఓట్లతో విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సుబ్బారావు టీడీపీ అభ్యర్థి మోకా ఆనందసాగర్పై 9,565 మెజార్టీతో రెండో సారి గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జిల్లాలో రికార్డు సృష్టించారు. బత్తిన మరణానంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుపై టీడీపీ అభ్యర్థి జీఎంసీ బాలయోగి 14,496 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో బాలయోగి అమలాపురం ఎంపీగా గెలుపు పొందడంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్పై టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానంద 17,778 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వరూప్పై వివేకానంద మరోసారి 10,742 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెల్లి శేషకుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 15,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన తరువాత 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజవర్గం జనరల్గా మారింది. అప్పట్లో పీఆర్పీ పార్టీ ఆవిర్భావంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్కుమార్, టీడీపీ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాసరాజు, పీఆర్పీ అభ్యర్థిగా కుడిపూడి సూర్యనారాయణరావులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్కుమార్ 2,234 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో జరిగిన జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఽభ్యర్థి దాట్ల బుచ్చిబాబుపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్కుమార్ 5,547 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా లబ్ధిదారులకు చేకూరిన లబ్ధి పథకం లబ్ధిదారులు లబ్ధి(రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్షన్ కానుక 47,054 233.57 జగనన్న అమ్మ ఒడి 25,583 118.60 వైఎస్సార్ చేయూత 11,240 64.50 వైఎస్సార్ ఆసరా 10,314 160.00 వైఎస్సార్ రైతు భరోసా 24,050 98.18 వైఎస్సార్ డ్వాక్రా సున్నా వడ్డీ 3,500 8.73 వైఎస్సార్ కాపు నేస్తం 3,269 9.14 ఉచిత పంటల బీమా 6,840 29.15 జగనన్న విద్యా దీవెన 6,007 17.49 జగనన్న వసతి దీవెన 6,456 18.54 వైఎస్సార్ నేతన్న నేస్తం 416 5.80 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 519 4.19 వైఎస్సార్ బీమా క్లెయిమ్ 35 4.31 రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ 757 12.71 వైఎస్సార్ రైతు సున్నా వడ్డీ 3,500 7.86 వైఎస్సార్ వాహన మిత్ర 1,217 .81 మొత్తం 1,50,757 795.58 ఇతర పథకాలు జగనన్న చేదోడు 541 3.67 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 414 0.55 కోవిడ్ సాయం 33,714 2.71 వైఎస్సార్ మత్స్యకార భరోసా 23,242 73.55 అగ్రిగోల్డ్ 2,010 0.48 వైఎస్సార్ లానేస్తం 6 0.03 వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా 164 1.08 అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు సాయం 114 0.18 జగనన్న విదేశీ విద్యా దీవెన 1 0.15 మొత్తం 60,206 82.40 నాన్ డీబీటీ పథకాల లబ్ధి జగనన్న తోడు 1240 1.24 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 29,040 3.70 జగనన్న గోరుముద్ద 12,543 34.34 జగనన్న విద్యా కానుక 61,350 14.84 ఇళ్ల స్థలాల భూసేకరణ, పరిహారం, చెల్లింపు 7,654 8.19 మొత్తం 1,11,827 62.31 నిత్య కల్యాణం పచ్చతోరణంగా మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం బాలయోగి తపో ఆశ్రమానికి దేశవిదేశాల నుంచి భక్తుల రాక పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న కోరంగి అభయారణ్యంనియోజకవర్గంలో మొత్తం ఓట్లు – 2,41,875 పురుషులు – 1,20,681 మహిళలు – 1,21,194 నగర పంచాయతీ – 1 పంచాయతీలు – 63 పోలింగ్ స్టేషన్లు – 268 మండలాలు 1. ముమ్మిడివరం 2. కాట్రేనికోన 3. ఐ.పోలవరం 4. తాళ్లరేవునియోజకవర్గ ప్రత్యేకతలు మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. స్వామివారికి కల్యాణం జరిపిస్తే పెళ్లి కాని యువతీయువకులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి. స్థానికంగా ఉన్న భగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి మరుసటి రోజున బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి బాలయోగీశ్వరుల దివ్య సమాధులను దర్శించుకుంటారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కార్తిక మాసంలో రాష్ట్ర నలుమాలల నుంచి భక్తులు తరలి వస్తారు. తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యం, కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్ హౌస్లు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. బంగాళాఖాతం సముద్ర తీరం మడ అడవులతో ఈ ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నియోజకవర్గ నడిబొడ్డున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, డెంటల్, డీఫార్మసీ కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం విద్యా కేంద్రంగానూ విరాజిల్లుతుంది. -
ఓటమి భయంతో కుయుక్తులు
● పిఠాపురంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలు ● వైఎస్సార్ సీపీ క్యాడర్ను రెచ్చగొట్టే ప్రణాళిక పిఠాపురం: దున్న పోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అంటున్నాడు పిఠాపురం టీడీపీ నేత. ఎక్కడ వివాదం జరిగినా అదేంటో తెలుసుకోకుండానే వైఎస్సార్ సీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తూ కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిఠాపురం మండలం విరవలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆ ఊరేగింపులోకి జనసేన, టీడీపీ నేతలు తమ పార్టీ జెండాలతో దూసుకువచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వంగా గీత వారిని వారిస్తూ శాంతియుతంగా ఎవరి ప్రచారాలు వారు చేసుకోవాలి తప్ప ఇలా రెచ్చగొట్టే విధానాలు వద్దని చెప్పారు. అయినా వినకుండా ఆమె ప్రచారం ఎదురుగా వచ్చి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే గీత తమ పార్టీ నాయకులకు నచ్చజెప్పి ఎవరు ఉద్రేకాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుని వెళ్లిపోయారు. తాటిపర్తిలో అసలేం జరిగింది.. జనసేన తరఫున సినీ నటుడు సాయిధర్మతేజ ఈ నెల 5వ తేదీన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన గొల్లప్రోలు మండలం తాటిపర్తి మీదుగా చిన జగ్గంపేట ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ ర్యాలీ వెళ్లే మార్గంలో ఉన్న వైఎస్సార్ సీపీ నేత దాసం వెంకటేష్ ఇంటి వద్దకు వచ్చిన జనసేనకు చెందిన యువకుడు తన మోటారు సైకిల్తో విన్యాసాలు చేస్తూ అక్కడ కూర్చున్న వైఎస్సార్ సీపీ సానుభూతి పరులను రెచ్చగొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. అనంతరం మళ్లీ తిరిగి సాయిధర్మతేజ ర్యాలీ కాన్వాయి అదే రూటులో వచ్చి వెళ్లి పోయింది. తరువాత ఒక యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లు కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని, యువకుడిపై దాడి జరిగింది తప్ప.. ఎవరు ఎందుకు చేశారో తెలియదని దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన పత్రికా సమావేశంలో వెల్లడించారు. వాస్తవానికి దాడిలో గాయపడిన యువకుడికి మరో యువకుడికి గతంలె సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా డీజే పార్టీలో వేసిన ఒక పాట విషయంలో ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువకుడిపై దాడి జరిగి ఉండవచ్చంటున్నారు. కాని దానిని రాజకీయం చేసిన టీడీపీ నేత ఏకంగా సాయిధర్మతేజ పైనే దాడి జరిగిందని, దానిలో భాగంగానే యువకుడు గాయపడ్డాడని, దాడి చేసింది వైఎస్సార్సీపీ నేతలని హంగామా చేశారు. దాడి కేసులో అనుమానితులు అంటూ పోలీసులు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారే తప్ప తమను రెచ్చగొట్టారని వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేదు. వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో దానిని ఎదుర్కొలేక టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. పిల్లలు, యువకులను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించాలని ప్లాన్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సంతోషాలకు చిరునామా జగన్ సర్కారు
మామిడికుదురు: నవరత్నాల పథకాలతో ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారుకే దక్కింది. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. దీంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడి సంతోషంగా జీవిస్తోంది. ప్రతి కుటుంబం కనిష్టంగా మూడు, నాలుగు పథకాలు అందుకున్నవే. కొన్ని కుటుంబాలకు జగనే అండగా నిలిచారు. కరోనా సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా తమను ఆదుకుందని ప్రజలు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన ఇనుముల శివప్రసాద్ కుటుంబం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సంక్షేమ పథకాలు అందుకుని ప్రభుత్వ సంక్షేమానికి చిరునామాగా మారింది. రూ.10 లక్షలకు పైగా లబ్ధి విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టి.భూర్జువలస గ్రామానికి చెందిన ఇనుముల శివప్రసాద్ 2008 నుంచి మొగలికుదురు గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉండే ఒక హోటల్లో పని చేస్తూ అతను జీవనం సాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అతను టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ జగనన్న ప్రభుత్వంలో అతనికి సెంటున్నర ఇంటి స్థలం మంజూరైంది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.5 లక్షలు ఉంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఆ ఇంటికి అవసరమైన విద్యుత్ సదుపాయం, తాగునీటి కుళాయి వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఇంటి నిర్మాణానికి డ్వాక్రా ద్వారా పావలా వడ్డీపై రూ.35 వేల రుణం కూడా అందించారు. పథకాలు అందడంతో.. శివప్రసాద్ కుమారుడు ఉదయ్ మానసిక వికలాంగుడు. అతనికి టీడీపీ హయాంలో పింఛను మంజూరు కాలేదు. ఎంతో మంది దగ్గరకు వెళ్లినా వారు కనికరం చూపలేదని శివప్రసాద్ వాపోయారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత 2020 పిబ్రవరి నుంచి ఉదయ్కు దివ్యాంగ పింఛను వస్తోంది. 7వ తరగతి చదువుతున్న అతనికి అమ్మఒడి ద్వారా నాలుగేళ్లలో రూ.55 వేల లబ్ధి చేకూరింది. వైఎస్సార్ పింఛను కానుకగా ఇంత వరకు రూ.1.53 లక్షల సహాయం అందించారు. శివప్రసాద్ భార్య లక్ష్మికి డ్వాక్రా రుణమాఫీ ద్వారా రూ.7,250, సున్నా వడ్డీ రాయితీగా రూ.5,500 వెరసి రూ.12,750 లబ్ధి చేకూరింది. ఒంటరి మహిళ అయిన అత్త మీసాల సువర్ణకు వైఎస్సార్ పింఛను కానుకగా రూ.1.30 లక్షలు, రైతు భరోసాగా రూ.67,500, చేయూత పథకం ద్వారా రూ.92,500 సహాయం లభించింది. ఈ కుటుంబం మొత్తానికి రూ.10 లక్షలకు పైగా లబ్ధి కలిగింది. జగనన్న వల్లే తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా గర్వంగా బతుకుతున్నామని, ఇంత కంటే తమకు కావల్సింది ఏముంటుందని శివప్రసాద్ ఎంతో ఆనందంగా చెప్పారు.కల సాకారం టీడీపీ హయాంలో ఎంతో మంది దగ్గరకు తిరిగినా ఫలితం లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. మా సొంతింటి కల సాకారం చేసిన మహానుభావుడు జగన్. ఇంటి స్థలం ఇచ్చారు. రుణం మంజూరు చేశారు. ఎంతో అందంగా ఇళ్లు నిర్మించుకున్నాం. మా కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. జీవితాంతం జగన్కు రుణపడి ఉంటాం. అతనికి మేము అండగా ఉంటాం. – ఇనుముల లక్ష్మి, మొగలికుదురు, కోనసీమ జిల్లా మా దైవం జగన్ నా భర్త రామ్మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన డెత్ సర్టిఫికెట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒంటరి మహిళ పింఛను మంజూరు చేశారు. అంతేకాకుండా ఉన్న కొద్ది పాటి భూమికి రైతుభరోసా, వైఎస్సార్ చేయూత పథకాలు అందాయి. వీటితో ఆర్థికంగా ఆసరా లభించింది. మాలాంటి ఎన్నో కుటుంబాలకు జగన్ ఆరాధ్యుడిగా నిలిచారు. – మీసార సువర్ణ, మొగలికుదురు, కోనసీమ జిల్లా మా జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ తు.చ. తప్పకుండా అమలు చేశారు. జగన్ సర్కారు అమలు చేస్తున్న నవరత్నాలతో మా జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి. నా భర్య, నా కొడుకు, మా అత్తకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు. ఆర్థిక సహాయం అందించింది లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తున్నారు. – ఇనుముల శివప్రసాద్, మొగలికుదురు నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు ఆర్థికంగా బలపడిన ప్రజలు -
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్ డ్యామేజ్ ఎంతలా అంటే.. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్ రిపేర్ కోసం మెకానిక్లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్ను చూశారు. ఆ సైకిల్కు సీటు లేదు. చక్రాల్లేవ్. సైకిల్కు పెడెల్ లేదు. ట్యూబ్లు ల్లేవ్. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్కు ఓటు వేయరా?. జగన్ ఏదైనా బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. 👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే జగన్లాగా బాబు బటన్లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు. అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
పిఠాపురం: గడచిన 40 ఏళ్లలో నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం వైఎస్ జగనే అని దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ అన్నారు. పిఠాపురంలో దూదేకుల సంఘం నియోజకవర్గ నేత షేక్ నాగూరు అధ్యక్షతన సోమవారం సంఘ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, సంఘ నాయకులు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు మద్దతు పలికారు. ఆమె విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సంఘం నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నూర్బాషా కులాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడినా దూదేకులోడా, పింజారి, సగం సాయిబు వంటి మాటలతో కులాన్ని దూషించినా చర్యలు తీసుకునే విధంగా జీఓ తీసుకువచ్చి దూదేకుల కులానికి ఒక గుర్తింపు, రక్షణ కల్పించారన్నారు. రాష్ట్రంలో 158 నియోజకవర్గాల్లో 25 లక్షలకు పైగా ఉన్న నూర్ బాషా కులానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును వివరిస్తూ రాష్ట్ర పర్యటన చేస్తున్నామన్నారు. తమ కులానికి గుర్తింపు ఇచ్చిన వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కార్యక్రమంలో దూదేకుల సంఘం నాయకులు షేక్ జిలానీ, సయ్యద్ మోహీద్దీన్, జగిర్ ఆలీ, ఖలీల్సా తదితరులు పాల్గొన్నారు. ● దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ ● పిఠాపురంలో వంగా గీతకు మద్దతు -
No Headline
నియోజకవర్గ సమాచారం సచివాలయాలు 76 రైతు భరోసా కేంద్రాలు 76 ఆర్బీకేల్లో వెటర్నరీ కేంద్రాలు 55 వెటర్నరీ ఆస్పత్రులు 4 విలేజ్/అర్బన్ హెల్త్ క్లినిక్లు 76 నియోజకవర్గ పరిధిలో 68 గ్రామాలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు మండల పరిధిలో 11 గ్రామాలు -
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
రాయవరం: ఓటరు నమోదు సమయంలో ఓటరు వివరాలను నమోదు అధికారికి అందించాలి. అయితే 1951లో తొలిసారిగా ఓటరు నమోదు చేపట్టినపుడు తమ వివరాలు పూర్తి స్థాయిలో అందించేందుకు పలువురు నిరాకరించారు. అలా ఒకరు ఇద్దరు కాదు.. 30 లక్షల మంది. అప్పట్లో ఉన్న ఆచార సంప్రదాయాల ప్రకారం తమ పేరుతో భర్త పేరును చెప్పేందుకు నిరాకరించారు. కొందరు తండ్రి పేరు మాత్రమే చెప్పడంతో ఎన్నికల సిబ్బంది విధిలేని పరిస్థితుల్లో మహిళా ఓటర్ల పేర్లను ఫలానా వారి కుమార్తెగా ఓటర్ల జాబితాలో వివరాలుగా నమోదు చేసుకున్నారు. ఓట ర్ల పేరు లేకుండా కేవలం తండ్రుల పేరుతో దేశంలో ఈ విధంగా 30 లక్షల మంది వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం పేరు, భర్త పేరు లేకుండా కేవలం ఫలానా వారి కుమార్తె అని నమోదు చేసిన ఓటర్లందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడంతో ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది. -
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
ఫ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం ఫ రెండుసార్లు ఎమ్మెల్సీ ఫ స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలు ఫ జై ఆంధ్రా, ఎమర్జెన్సీ నిరసనలతోజైలు జీవితం ఫ జాతీయ ప్రముఖులతో సాన్నిహిత్యం కొత్తపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మంతెన వెంకట సూర్య సుబ్బరాజు (ఎంవీఎస్ సుబ్బరాజు) మూడున్నర దశాబ్దాల పాటు తనదైన ప్రత్యేక శైలిలో రాజకీయాలు నడిపి రాజకీయ అపర చాణక్యుడిగా పేరు పొందారు. ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే కళా వెంకట్రావు కాగా, ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండో ఎమ్మెల్యేగా గెలిచారు సుబ్బరాజు. రాష్ట్ర మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన కళా వెంకట్రావు తరహాలోనే ఎంవీఎస్ కూడా ఈ నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు తీసుకువచ్చారు. ఈ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకై క నాయకుడు ఆయన. ఈ నియోజకవర్గం నుంచి రెండో, మూడో, నాలుగోసారి ఎమ్మెల్యేగా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన ఘనత సుబ్బరాజుదే. అయిదోసారి జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన ఎంవీఎస్ ఆరోసారి మళ్లీ విజయం సాధించారు. జాతీయ ప్రముఖులతో సాన్నిహిత్యం మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య, స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య ఎన్జీ రంగా, వావిలాల గోపాలకృష్ణ, గౌతు లచ్చన్న, బెజవాడ గోపాలరెడ్డి, తరిమెళ్ల నాగిరెడ్డి వంటి ఎందరో ప్రముఖులతో సుబ్బరాజుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ మర్రి చెన్నారెడ్డి అయితే ప్రత్యేకంగా మూడు రోజులు కొత్తపేటలో సుబ్బరాజు ఇంట విడిది చేశారు. వారితో ఆయన అంత సన్నిహితంగా ఉండేవారు. అందుకనే ఆయనకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉండేది. ఆయన తన 20వ ఏట కొత్తపేట తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 25వ ఏట తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1962 నుంచి 1969 వరకూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా, డ్రైనేజీ బోర్డు చైర్మన్గా, జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. తొలి పెద్దల సభలో పిన్న వయస్కుడిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి శాసన మండలి(పెద్దల సభ)లో పిన్న వయస్కుడిగా ఎంవీఎస్ అడుగు పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాగా.. 1958లో శాసన మండలిని అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. మంత్రి కళా వెంకట్రావు సిఫారసుతో సీఎం సంజీవరెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా సుబ్బరాజును నామినేట్ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభలో మంత్రిగా కళా, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎంవీఎస్ ప్రాతినిధ్యం వహించారు. 1959లో కళా వెంకట్రావు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంవీఎస్ పోటీ చేసి సీపీఐ అభ్యర్థి ఎం.సూర్యనారాయణపై విజయం సాధించారు. 1962 జనరల్ ఎన్నికల్లో సుబ్బరాజు స్వతంత్ర అభ్యర్థి ముత్యాల సుబ్బారాయుడుపై గెలుపొందారు. 1967 ఎన్నికల్లో కూడా సుబ్బారాయుడును ఓడించి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. అయితే 1971లో ఎమర్జెన్సీ అనంతరం అప్పటి వరకూ తిరుగులేని శక్తిగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ.. చీలికలతో తన ప్రాభవం కోల్పోయింది. ఆ ప్రభావం కొత్తపేటపై కూడా పడింది. ఫలితంగా అప్పటి వరకూ కాంగ్రెస్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఎంవీఎస్కు 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా దెందులూరి భానుతిలకం పోటీ చేయగా సుబ్బరాజు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుబ్బరాజు విజయ ఢంకా మోగించారు. 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిర్ల సోమసుందరరెడ్డిపై విజయం సాధించి, కొత్తపేటకు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో వ్యక్తుల ప్రాబల్యం పోయి, రాజకీయ పార్టీల ఆధిపత్యం వచ్చింది. ఈ పరిస్థితుల్లో సుబ్బరాజు 1983లో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. నియోజకవర్గంలో తన సామాజికవర్గ బలం అంతగా లేకపోయినప్పటికీ నీతి, నిజాయితీలతో ప్రజలను ఆకట్టుకుని సుబ్బరాజు వరుస విజయాలు సాధించారు. నియోజవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. బాల్యం నుంచీ దేశం కోసం పోరాటం పూర్వపు కొత్తపేట తాలూకా గంటి పెదపూడి సుబ్బరాజు స్వగ్రామం. 1926 ఫిబ్రవరి 12న ఆయన జన్మించారు. గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటంపై ఆకర్షితులైన సుబ్బరాజు పలువురు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని పొంది ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు, 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో సుబ్బరాజు ఏడాది జైలు జీవితం గడిపారు. -
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
● ఒకప్పుడు పెంకుల పరిశ్రమకు ప్రసిద్ధి ● పలు ప్రాంతాల్లో చైనా క్లే లభ్యంగోకవరం: మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు మధ్యలో ఉన్నందున మెట్ట రాజకీయానికి కేంద్ర బిందువుగా ఉండేది. 17వ శతాబ్దంలో బ్రిటిషు పాలనలో ఉద్దండుల కోట, ది గేట్ ఆఫ్ ఏజెన్సీ, ద ఎంట్రాన్స్ ఆఫ్ మారేడుమిల్లి ఫారెస్ట్ వంటి పేర్లతో పిలిచేవారు. వత్సవాయి పెదరాయ జగపతిరాజు తన పేరు మీద జగ్గంపేట గ్రామాన్ని ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. జగ్గంపేట నియోకవర్గం అన్ రిజర్వుడ్ నియోజకవర్గం. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా పని చేశారు. కిర్లంపూడికి చెందిన తోట గోపాలకృష్ణ రవాణశాఖ మంత్రిగా, అదే మండలం వీరవరం గ్రామానికి చెందిన తోట నరసింహం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, కిర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం రోడ్లు, భవనాల శాఖ, చేనేత, ఎకై ్సజ్, సివిల్ సప్లయీస్ శాఖల్లో మంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం పలు ఉద్యమాలు నిర్వహించారు. వీటిలో కాపు ఉద్యమం ప్రధానమైంది. కాపు ఉద్యమానికి బీజం ఇక్కడ నుంచే పడింది. 2011లో వైఎస్సార్ సీపీ ఏర్పడిన తరువాత నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టారు. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున జ్యోతుల నెహ్రూ బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై విజయం సాధించారు. తదనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో నెహ్రూ టీడీపీలో చేరగా జ్యోతుల చంటిబాబు వైఎస్సార్ సీపీలోకి చేరారు. 2019లో వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన జ్యోతుల చంటిబాబు, టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై 23,365 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నియోజకవర్గంలో పటిష్టంగా ఉంది. 2009లో... కాకినాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడి, గండేపల్లి మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గ పునర్విభజనకు ముందు గోకవరం మండలం బూరుగుపూడి నియోజకవర్గంలో, కిర్లంపూడిలో కొన్ని గ్రామాలు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉండేవి. 2009లో జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడి, గండేపల్లి మండలాలు నియోజకవర్గంగా ఏర్పడగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గతేడాది జిల్లాల పునర్విభజన చేయగా గోకవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలోకి, మిగిలిన మూడు మండలాలు కాకినాడ జిల్లాలోకి వెళ్లాయి. గోకవరం మండలం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. గోకవరం మండలం ఏజెన్సీ ముఖద్వారంగా కూడా ఉంది. ప్రముఖ సినీ హీరో రవితేజ జగ్గంపేటకు చెందిన వారే కావడం విశేషం. వ్యవసాయ ఆధారం నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. చెరువులు, కాలువలపై ఆధారపడి రైతులు సాగు చేస్తుంటారు. గండేపల్లి మండలంలోని తాళ్లూరులోని తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు 37 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. గోకవరం మండలంలోని ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ టెర్మినల్స్, హెచ్పీ గ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రూ.250 కోట్లతో అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్గి 2022లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జగ్గంపేట శివారున దేవీ ఫిషరీస్ ఫ్యాక్టరీ ఉంది. సుమారు 2 వేల మంది ఈ ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతున్నారు. 25 ఏళ్ల క్రితం పెంకుల తయారీ నియోజకవర్గంలో జగ్గంపేట ప్రధానంగా పెంకుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. సుమారు 25 సంవత్సరాల క్రితం వరకు జగ్గంపేటలో పెంకులు తయారయ్యేవి. ఇక్కడ సుమారు 35 పెంకుల పరిశ్రమలు ఉండగా సుమారు 10 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. ఇక్కడ తయారైన పెంకులను తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. రానురాను పెంకుటిళ్ల నిర్మాణాలపై ప్రజలకు ఆసక్తి తగ్గడంతో ఈ పరిశ్రమలు మూతబడ్డాయి. జగ్గంపేట మండలంలో గుర్రంపాలెం, రామవరం, జెడ్.రాగంపేట, గండేపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో చైనా క్లే (తెల్లమట్టి) లభిస్తుంది. ఈ మట్టిని ప్లాస్టర్ ఆఫ్ పారీస్, ఎలక్ట్రికల్కు సంబంధించిన వస్తువులు తయారీకి, మందుల తయారీలో వినియోగిస్తుంటారు. టైల్స్ తయారీకి కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. గండేపల్లి మండలంలో ఆదిత్య, ప్రగతి వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు జగ్గంపేట నియోజకవర్గంలోని తాళ్లూరు జియన్నస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. విశేషంగా భక్తులు తరలివస్తుంటారు. గోకవరం మండలంలోని తంటికొండలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రముఖమైంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గోకవరం–జగ్గంపేట సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సింగారమ్మతల్లి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఆదివారం, మంగళవారం విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. జనాభా నియోజకవర్గంలో కాపులు 50 వేలు మంది, బీసీలు 70 వేలు, ఎస్సీలు 40 వేలు, మిగిలిన కులాలకు చెందిన వారు సుమారు 50 వేలు మంది ఉంటారని అంచనా.2019 నుంచి 2023 వరకు వివిధ ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలుపథకం లబ్ధిదారులు లబ్ధి(రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్షన్ కానుక 33,847 32.72 జగనన్న అమ్మఒడి 22,429 10.22 వైఎస్సార్ చేయూత 13,046 5.76 వైఎస్సార్ ఆసరా 39,916 14.27 వైఎస్సార్ రైతు భరోసా 28,831 14.04 ఇంటి నిర్మాణానికి( నేరుగా చెల్లింపు) 2,976 2.94 సున్నా వడ్డీ పథకం 43,837 1.11 వైఎస్సార్ కాపు నేస్తం 5,182 2.19 ఉచిత పంటల బీమా 1,719 0.2 జగనన్న విద్యా దీవెన 10,559 3.31 జగనన్న వసతి దీవెన 8,351 1.27 వైఎస్సార్ నేతన్న నేస్తం 110 8.37 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 1,280 36.95 వైఎస్సార్ బీమా 828 1.178 వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ 5,765 38.87 వైఎస్సార్ వాహన మిత్ర 1,333 38.21 సున్నా వడ్డీ పంట రుణాలు 5,188 20.65 ఇతర పథకాలు జగనన్న చేదోడు 2,341 రూ.33.73 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 9,360 రూ.33.49 తెల్లరేషన్ కార్డుదారులకు కోవిడ్ సాయం 54,069 67.26 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 6,700 68.23 వైఎస్సార్ మత్స్యకార భరోసా 535 3.90 అగ్రిగోల్డ్ 30 0.53 వైఎస్సార్ కల్యాణమస్తు 105 3.99 అర్చకులు/ఇమాంలు/పాస్టర్లకు సాయం 560 2.43 జగనన్న విదేశీ విద్యా దీవెన 237 18.91 మొత్తం 2,99,134 227.5 కోట్లు నాన్ డీబీడీ పథకాల లబ్ధి పథకం లబ్ధిదారులు లబ్ధి(రూ.కోట్లలో) జగనన్న తోడు 3,594 0.31 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 12,883 2.38 జగనన్న గోరు ముద్ద 13,360 1.37 జగనన్న విద్యా కానుక 13,462 1.75 ఇళ్లస్థలాలు(భూసేకరణ, పరిహారం చెల్లింపు) 4,427 17.4 మొత్తం 47,726 23.22 కోట్లు నియోజకవర్గం భౌగోళిక సమాచారం నియోజకవర్గం : జగ్గంపేట విస్తీర్ణం : 87,797 హెక్టార్లు మండలాలు : 4 పంచాయతీలు : 67 మేజర్ పంచాయతీలు : 16 మైనర్ పంచాయతీలు : 3 మొత్తం జనాభా : 2,77,628 (2011 ) పురుషులు : 1,37,906 మహిళలు : 1,39,722 రెవెన్యూ గ్రామాలు : 64 ప్రైమరీ స్కూల్స్ : 140 హైస్కూల్స్ : 35 ప్రభుత్వ జూనియర్ కాలేజ్లు : 4 పోలీస్ స్టేషన్లు : 4 పోలింగ్ కేంద్రాలు : 248 ఓటర్లు : 2,16,029 పురుషులు : 1,06,764 సీ్త్రలు : 1,09,265 ఆసుపత్రులు : 9 సబ్ సెంటర్లు : 30 పశువుల ఆసుపత్రులు : 7 గోపాల మిత్రాలు : 11 అంగన్వాడీ కేంద్రాలు : 253 పంటపొలాలు : 25,494 హెక్టర్లు నీటి సదుపాయం : 18,771 హెక్టర్లు వర్షాధార పంటలు : 6,716 హెక్టర్లు వరి పంట విస్తీర్ణం : 15,358 హెక్టర్లు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ పనిచేసిన ఎమ్మెల్యేలు వ.సం సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు 1. 1962 వడ్డి ముత్యాలరావు కాంగ్రెస్ 19330 2. 1667 కె.పంతం స్వతంత్య్ర 28771 3. 1972 పంతం పద్మనాభం కాంగ్రెస్ 28528 4. 1978 పంతం పద్మనాభం కాంగ్రెస్ 40566 5. 1983 తోట సుబ్బారావు స్వతంత్య్ర 47085 6. 1985 తోట సుబ్బారావు టిడిపి 52756 7. 1989 తోట సుబ్బారావు టిడిపి 49504 8. 1991 టీ.వి చలం కాంగ్రెస్ 51150 9. 1994 జ్యోతుల నెహ్రూ టిడిపి 64186 10. 1999 జ్యోతుల నెహ్రూ టిడిపి 63626 11. 2004 తోట నరసింహం కాంగ్రెస్ 62566 12. 2009 తోట నరసింహం కాంగ్రెస్ 51184 13. 2014 జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ సీపీ 88146 14. 2019 జ్యోతుల చంటిబాబు వైఎస్సార్ సీపీ 93496 -
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
ఇతర పథకాలు... జగనన్న చేదోడు 1,577 40.06 (లక్షలు) వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 1,020 80.20 (లక్షలు) కోవిడ్ సహాయం 4758 2.40 కోట్లు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 2,941 5.31 కోట్లు వైఎస్సార్ మత్స్యకార భరోసా 718 2.04 కోట్లు అగ్రిగోల్డ్ 1210 5.17 కోట్లు వైఎస్సార్ లా నేస్తం 3 50 వేలు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా 228 1.36 లక్షలు అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు సహాయం 144 9.80 లక్షలు జగనన్న విదేశీ విద్యా దీవెన 50 2.00 లక్షలు ప్రభుత్వ పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) వెఎస్సార్ పెన్షన్ కానుక 38,676 30.19 జగనన్న అమ్మ ఒడి 23,847 22.57 వైఎస్సార్ చేయూత 15,824 11.71 వైఎస్సార్ ఆసరా 35,011 98.39 వైఎస్సార్ రైతు భరోసా 32,092 17.14 ఇంటి నిర్మాణానికి చెల్లింపులు 2,070 6.56 వైఎస్సార్ సున్నా వడ్డీ 33,254 17.09 వైఎస్సార్ కాపు నేస్తం 6,121 18.73 ఉచిత పంటల బీమా 12,717 17.85 జగనన్న విద్యా దీవెన 7,304 51.90 జగనన్న వసతి దీవెన 6,862 38.79 వైఎస్సార్ నేతన్న నేస్తం 939 9.96 వైఎస్సార్ ఈబీబీ నేస్తం 799 2.24 వైఎస్సార్ బీమా 146 3.03 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 6,589 1.18 వైఎస్సార్ వాహనమిత్ర 1163 3.23 సున్నా వడ్డీ పంట రుణాలు 4,248 1.28 -
రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్
● ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సహకరించలేదు ● రాష్ట్ర విభజన చట్టంపై నిర్లక్ష్యం ● ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజం రాజమహేంద్రవరం సిటీ: రాజకీయ లబ్ధి కోసమే ప్రధానమంత్రి యూటర్న్ తీసుకున్నారని ఎంపీ, వైఎస్సార్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. ప్రజాగళం బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీని సర్వనాశనం చేసింది చంద్రబాబు అని గత ఎన్నికలలో విమర్శించిన మోదీ, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబును పక్కన పెట్టుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన తరువాత మన రాష్ట్రానికి ఆయన న్యాయం చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరుగుతున్నాయని సాక్షాత్తూ కేంద్ర ఫైనాన్స్ శాఖ హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని గత ఎన్నికలలో ప్రకటించి, ఇప్పుడు ఆ ఏటీఎంతోనే ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. కేంద్రం పూర్తి నిధులు ఇవ్వకపోవడం వల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వకుండా చేసింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విశాఖ – చైన్నె కోస్టల్ కారిడార్కు నిధులు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి గౌరవం ఇవ్వకపోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల ఆస్తులు పంపకం జరగలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ అడిగినా, లిఖితపూర్వకంగా కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు ఒక్క రూపాయి జమ కాలేదని, సీఎం జగన్ పాలనలో ఇసుక ద్వారా రూ.4 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయని వివరించారు. మద్యపాన నిషేధం దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమ పాలనను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగనన్న అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మార్గాని నాగేశ్వరరావు, నందెపు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీఎం సభకు సర్వం సిద్ధం
మధురపూడి: ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం పాల్గొంటున్న కోరుకొండలో సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ సభకు ప్రజలు అశేషంగా తరలి కానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోరుకొండ మండలం కాపవరం పెట్రోలు బంకు సమీపాన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రోడ్డులో నిర్వహించే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను, హెలిప్యాడ్ను, సీఎం కాన్వాయ్ సాగే రోడ్డు, సభాస్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కోరుకొండ సీఐ అడపా నాగమురళి, ఎస్సై ఆనందకుమార్ ఆధ్వర్యాన సభా స్థలంలో ఎత్తయిన భవనాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆయా భవనాల్లోకి అనుమతులు ఇవ్వరాదని వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ప్రభాకరరావు, సీఐ సూర్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థుల ఖర్చులపై రెండో విడత ఆడిటింగ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై రెండో విడత ఆడిటింగ్ నిర్వహించామని పార్లమెంటరీ ఎన్నికల వ్యయ పరిశీలకుడు జై అరవింద్ తెలిపారు. ఎంపీ అభ్యర్థుల ఖర్చుల వివరాల ఆడిటింగ్ కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జై అరవింద్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో వివిధ సర్వైలెన్స్ బృందాలు అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాయని చెప్పారు. రానున్న ఐదు రోజులూ ఖర్చుల వివరాలపై మరింతగా దృష్టి పెడతామని తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన ఖర్చుల వివరాలను ఎన్నికల విధుల్లో ఉండే అకౌంటింగ్ బృందం షాడో రిజిస్టర్లో నమోదు చేస్తోందని అన్నారు. దీంతో అభ్యర్థుల ఖర్చులను బేరీజు వేస్తామని తెలిపారు. నామినేషన్ వేసిన సమయంలో అందజేసిన వ్యయ రిజిస్టర్లో అభ్యర్థులు తమ ఖర్చులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు రిజిస్టర్లను ఆడిటింగ్ చేసి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు చూపుతామని జై అరవింద్ తెలిపారు. ఖర్చులను హేతుబద్ధంగా నిర్ధారించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆడిటింగ్ నోడల్ అధికారి వేంకటేశ్వరరావు, 12 మంది అభ్యర్థుల ఆడిటింగ్ బృందాలు పాల్గొన్నాయి. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
రాజమహేంద్రవరం రూరల్: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు విలువను చాటారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. పిడింగొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూలులో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ రిటర్నింగ్ అధికారి ఎన్.తేజ్భరత్తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర అనుబంధ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. వీరితో పాటు, ఇతర అత్యవసర సేవలు నిర్వహించే 32 విభాగాల్లోని సిబ్బందికి కూడా ఈ అవకాశం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ తేజ్భరత్ మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు ఉదయం రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్న ప్రతి ఓటరుకూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండి, ఓటు హక్కు లేని జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఉద్యోగులకు కూడా ఫామ్ 12 ద్వారా ఓటు హక్కు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఆర్.కృష్ణనాయక్ సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను భద్రపరచామని జేసీ చెప్పారు. -
రత్నగిరికి ఉత్సవ శోభ
అన్నవరం: రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవాలకు మరో 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనులు చురుకుగా జరుగుతున్నాయి. స్వామివారి టేకు రథం చక్రాలకు ఇనుప పట్టీలను రథానికి రంగులు వేయడం మొదలయ్యాయి. 19వ తేదీన సత్యదేవుని కల్యాణం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన గత నెల 28వ తేదీన దేవ స్థానంలో జరిగిన ప్రభుత్వ శాఖ లు, దేవస్థానం అధి కారుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించిన విష యం విధితమే. తర్వాత దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ ఆలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలకు చేయాల్సిన పనులపై ఆదేశాలిచ్చారు. ఉత్సవాలలో భాగంగా మే 19వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఆ రోజు విస్తృత ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించారు. శరవేగంగా పనులు సత్యదేవుని ధ్వజస్తంభానికి పీఠం ఏర్పాటు చేసే పనులు చురుకుగా జరుగుతున్నాయి. తర్వాత స్తంభానికి బంగారు రేకు తాపడం చేసే పనులు ప్రారంభిస్తామని పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈ ఉదయ్ తెలిపారు. సత్యదేవుని నూతన టేకు రథాన్ని గత నెల 24వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు రంగులు వేస్తున్నారు. చక్రాలకు ఇనుప బద్దెలతో పట్టీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రంగులు వేసే పనులు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, వ్రత మంటపాలు, ఇతర భవనాలకు రంగులు వేసే కార్యక్రమం చురుకుగా జరుగుతోంది. ఈ పనులు ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి కానున్నాయి. వార్షిక కల్యాణ వేదికకు రంగులు వేసే పనులు పూర్తయ్యాయి. దీనిపైకి భక్తులు ఎక్కకుండా చుట్టూ మెస్ చట్రాలు పెట్టారు. అయితే వాటి స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశించారు. సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు ఈ నెల 18 నుంచి 24 వరకూ వేడుకలు భక్తుల రాకకు అనుగుణంగా వసతులు -
దంపతులను ఢీకొన్న లారీ
పిఠాపురం: లారీ ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెంద గా, భర్తకు తీవ్ర గాయాలయ్యా యి. టౌన్ ఎస్సై మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురంలోని జగ్గయ్య చెరువు వైభవ్ వెంచర్స్లో నివాసం ఉంటున్న యజ్జల అప్పారావు, పంపాదమ్మ (55) సొంతూరు తొండంగి మండలం ఎర్రయ్యపేట పంచాయితీ వి.కొత్తపేట గ్రామం. పిల్లల వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా ఈ దంపతులు దశాబ్ద కాలం క్రితం పిఠాపురానికి వచ్చారు. కాగా.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో పిఠాపురం నుంచి ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనంపై భార్యభర్తలిద్దరకూ కోనపాపపేట బయలుదేరారు. నగరంలోని ఉప్పాడ బస్టాండ్ వద్ద వీరిని ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నుంచి జారి కింద పడిపోయిన పంపాదమ్మ మీదుగా లారీ వెళ్లపోయింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా అప్పారావుకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఈ దంపతుల కుమారులు బాబ్జి, రమణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రిని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పంపాదమ్మ మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పోస్టుమార్టం పూర్తయింది. ఆస్పత్రి వద్దకు బంధువులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, యాజమాని కొండెవరానికి చెందిన సింహాద్రి మల్లికార్జునరావుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. STRIP6X8 భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు పిఠాపురంలో ఘటన
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement