నందివాడ, న్యూస్లైన్ : పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పిల్లాడు పుడితే ఇన్నాళ్లూ పుట్టని బిడ్డ ఇప్పుడెలా పుట్టాడనే అనుమానంతో ఓ చిన్నారిని తండ్రి హత్య చేశాడు. ఏడేళ్ల క్రితం ఆగిరిపల్లి మండలం కాములూరు గ్రామానికి చెందిన రత్నకుమారికి నందివాడ మండలం రుద్రపాక శివారు గాజులపాడు గ్రామానికి చెందిన ఏసుబాబుతో వివాహం జరిగింది. కొద్ది రోజులకు అధిక కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. రత్నకుమారి పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకు వస్తున్నా కట్నదాహం తీరలేదు.
మూడేళ్ల కిందట ఒక మగబిడ్డకు రత్నకుమారి జన్మనిచ్చింది. అప్పడే ఏసుబాబు మనసులో అనుమాన విష బీజం మొలకెత్తింది. ఇన్నాళ్లు పుట్టని పిల్లాడు ఇప్పుడు ఎలా పుట్టాడంటూ భార్యను అనుమానిం చాడు. ఈ నెల 14న రత్నకుమారి పుట్టింటికి వెళ్లింది. బిడ్డ ఏనోష్బాబును పంపించకుండా తన వద్దే ఉంచుకున్నాడు. ఈ నెల 22న వచ్చి రత్నకుమారి తన బిడ్డను తనతో పాటు పంపాలని కోరింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టడంతో రెండు రోజుల తరువాత పంపిస్తానని చెప్పడంతో నిజమేననుకొని వెనుతిరిగింది.
24న తేదీ ఉదయం 11గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న పచారీ కొట్టులో నుంచి కేకులు కొన్నాడు. కేకులో ఎలుకల మందు కలిపి కొడుకుకి తినిపించాడు. ఆ తరువాత తను కూడా తిన్నాడు. తండ్రీకొడుకులు అపస్మారకస్థితిలో ఉండటం చూసి స్థానికులు గుడివాడ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి చనిపోయాడు. రూరల్ సీఐ జనార్దనరావు గాజులపాడు గ్రామం వెళ్లి విచారించారు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి ఏసుబాబు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కన్నతండ్రే కాలయముడు
Published Thu, Feb 27 2014 1:30 AM
Advertisement
Advertisement
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
ఏపీ వ్యాప్తంగా ఆగని టీడీపీ దాడులు
Tech Talk: గూగుల్ 'ఆస్క్ ఫొటోస్' తో.. ఈ వెతుకులాటకి చెక్!
మోదీ కొత్త క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్లోకి చొరబడేందుకు..
ప్రపంచ ఆర్థిక వేదిక జాబితాలో భారత కంపెనీలకు చోటు
పార్లమెంట్ లోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’
మూడోసారి సునీత అంతరిక్ష ప్రయాణం
తప్పక చదవండి
- హైదరాబాద్ పబ్ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
- 'లవ్ మౌళి' సినిమా రివ్యూ
- Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
- పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
- మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
- జోసా కౌన్సెలింగ్కు సర్వం సిద్ధం!
- అరాచకాన్ని అరికట్టండి
- ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం
- టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
- ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
Advertisement