
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్తో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఖసిం, మోనిస్, షోయాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. విచారిస్తున్నారు. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment