Delhi
-
ఆలస్యంగా దక్కిన న్యాయం
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్కుమార్కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది. ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది. ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి. వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.అందులో సజ్జన్కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి. పంజాబ్ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు. అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది. -
సీఎం గారు నిద్ర లేవండి.. మనం అసెంబ్లీలో ఉన్నాం
ఢిల్లీ : ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖాగుప్తా బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాల్ని తీసేయించారని ఆరోపణలు గుప్పించింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 1౩ సెకన్ల వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ నిద్ర పోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. తమకు సేవ చేయాలని ఢిల్లీ ప్రజలు రేఖాగుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో సీఎం గారు నిద్రపోతున్నారు’అని సెటైర్లు వేసింది. అంతేకాదు, సీఎం గారు అంబేద్కర్,భగత్ సింగ్ను అవమానించడంలో మీరు కొంత సమయం తీసుకున్నట్లయితే, దయచేసి అసెంబ్లీ చర్చపై కూడా కొంచెం దృష్టి పెట్టండి’అని వ్యాఖ్యానించింది. ఇక ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాల్ని చూడొచ్చు.CM मोहतरमा के दो रूप‼️1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना 2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025అయితే, ఆప్ షేర్ చేసిన వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. మా సీఎం అసెంబ్లీ చర్చను కళ్లుమూసుకుని శ్రద్దగా వింటున్నారని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆప్ కావాలనే టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. -
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
ప్రధాని మోదీతో రేవంత్ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై చర్చ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్-2 లైన్ ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్ ఇంద్రజ్ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్ అర్వీందర్ సింగ్ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు. స్పీకర్ విజేందర్ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణంసెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది. -
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్,అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్,భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు. -
ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..
ఢిల్లీ: ఆప్నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. -
విజనరీ నాయకులు కావాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా నేడు అన్ని రంగాల్లో ప్రపంచస్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే అత్యుత్తమ నాయకులు సమాజానికి కావాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్(సోల్) సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉత్సాహవంతులైన సారథుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో సోల్ లాంటి సంస్థలు గేమ్ఛేంజర్ అవుతాయని వ్యాఖ్యానించారు. వేర్వేరు రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఆలోచనా దృక్పథంతో వ్యవహరిస్తూ స్థానికంగా అభివృద్ధికి పాటుపడే నేతలు తయారు కావాలని పిలుపునిచ్చారు. నేడు మన దేశం ‘గ్లోబల్ పవర్హౌస్’గా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో భారతీయ దార్శనికతను ప్రతిబింబించే నాయకత్వం అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. దేశానికి విజనరీ నాయకులు కావాలని వివరించారు. కీలక రంగాల్లో దేశం మరింత వేగంగా ముందుకు పరుగెత్తాలని, సమర్థ నాయకత్వం వల్లే అది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. సోల్ లాంటి సంస్థల అవసరం నేడు ఎంతో ఉందన్నారు. రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దు ‘గ్లోబల్ అప్రోచ్, లోకల్ మైండ్సెట్’కలిసిన నాయకులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సంక్షోభాలను పరిష్కరించడంలో, భవిష్యత్తు పట్ల సరైన ఆలోచనలు చేయడంలో సమర్థులైన వ్యక్తులను దేశం కోరుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకత్వం కేవలం రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లు, వేదికలపై మన దేశం పోటీ పడాలంటే అంతర్జాతీయ పరిణామాలపై పూర్తి అవగాహన కలిగిన నాయకులు కావాలన్నారు. డీప్–టెక్, అంతరిక్షం, బయోటెక్, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలతోపాటు క్రీడలు, వ్యవసాయం, తయారీ, సామాజిక సేవ వంటి రంగాల్లో నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ఆ స్ఫూర్తిని మననం చేసుకోవాలి అన్ని రంగాల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని కేవలం కోరుకుంటే సరిపోదని, ఆచరణలో సాధించి చూపాలని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థలను అభివృద్ధి చేసే సమర్థుల అవసరం నేడు దేశానికి ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో పురుడు పోసుకున్న ఎన్నో సంస్థలు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించాయని గుర్తించారు. ఆ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకోవాలన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా మనమంతా ముందుకు సాగుతున్నామని, ఈ తరుణంలో జాతి నిర్మాణం కోసం మానవ వనరుల నిర్మాణం అత్యంత కీలకమని వివరించారు. ఉత్తమమైన పౌరులతోనే దేశం ముందంజ వేస్తుందన్నారు. మానవ వనరుల విషయంలో గుజరాత్ అనుభవాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు గుజరాత్లో సహజ వనరులేవీ లేవన్నారు. గుజరాత్ భవిష్యత్తుపై అప్పట్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. సమర్థవంతమైన మానవ వనరులను, నాయకులను తయారు చేసుకోవడంతో గుజరాత్ నేడు అభివృద్ధి పథంలో నడుస్తోందని వెల్లడించారు. గుజరాత్లో వ జ్రాల గనులు లేవని, అ యినప్పటికీ ప్రపంచంలో ప్రతి పది వజ్రాల్లో తొమ్మి ది వజ్రాలు గుజరాతీల చేతుల్లోనే సానపెట్టుకొని అందంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. మోదీ నాకు పెద్దన్న: భూటాన్ ప్రధాని గుజరాత్లోని గిఫ్ట్ సిటీ సమీపంలో విశాలమైన ‘సోల్’క్యాంపస్ త్వరలో సిద్ధం కాబోతోందని నరేంద్ర మోదీ చెప్పారు. బలమైన నాయకత్వాన్ని త యారు చేసుకోవడంపైనే మన దార్శనికత, భవిష్యత్తు ఆధారపడి ఉన్నా యని తెలిపారు. ‘సోల్’ నుంచి సమర్థులైన నాయకులు బయటకు రావాలని ఆకాంక్షించారు. మనమంతా ఉమ్మడి లక్ష్యం, సమ్మిళిత ప్రయత్నాలతో ముందుకు కదిలితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. 21వ శతాబ్దంలో జని్మంచినవారు భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. యువశక్తితో దేశం నవ్య పథంలో పయనించబోతోందని అన్నారు. ‘సోల్’సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి దాషో త్సెరింగ్ తాబ్గే సైతం పాల్గొన్నారు. మోదీ గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఆయన తనకు పెద్దన్న లాంటివారని చెప్పారు. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్గా పేరొందిన జోయాఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ కొత్త సీఎంకు ‘ఏడు’ సవాళ్లు.. రూపు ‘రేఖ’లు మారేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.2. యమునా నది ప్రక్షాళన 3. వాయు కాలుష్య నిర్మూలన 4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం 5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు 6. మహిళల భద్రత 7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం. -
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత
-
42.6% మంది పట్టభద్రులే ఉద్యోగాలకు అర్హులు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగాఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి.అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... » దేశంలో కనీసం 50% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందగల రాష్ట్రాలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. » ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్కు టాప్ 10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. » నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి నైపుణ్యాలుఉండాల్సిందే.. ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్స్టెప్స్ నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్కూ మంచి అవకాశాలు లభిస్తాయి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆన్లైన్లో డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని విషయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే తగిన నైపుణ్యాలు తప్పనిసరి. » 2023తో పోలిస్తేౖటైర్–1, టైర్–3 కళాశాలలకు చెందిన పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం స్వల్పంగా తగ్గింది. టైర్–1 విషయానికొస్తే.. ఈ సంఖ్య 2023లో 49.1శాతం కాగా.. 2024లో 48.75 శాతంగా ఉంది. » టైర్–3 లో 44% నుంచి 43.6 శాతానికి పడిపోయింది. టైర్–2 కళాశాలల్లో ఎక్కువ క్షీణత కనిపించింది. 2023లో 47.5% మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి అర్హులుగా ఉంటే.. 2024లో అది 46.2 శాతానికి తగ్గింది. » ఉద్యోగానికి అర్హులైన గ్రాడ్యుయేట్ విభాగంలో మహిళలు (42%) పురుషుల (43%) కంటే పెద్దగా వెనుకబడి లేరని స్పష్టమవుతోంది. -
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
30 ఏళ్ల క్రితం.. ఢిల్లీ సీఎం ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025 -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయబోతున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ నుంచి రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అయితే, గతంలో(2015) విజేందర్ను సభ నుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లిన ఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్గా తనకు అవకాశం ఇవ్వడంపై విజేందర్ గుప్తా స్పందించారు. ఈ క్రమంలో విజేందర్ మాట్లాడుతూ.. ‘నాకు స్పీకర్ స్థానం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు. సభకు సంబంధించి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందుకు తీసుకువస్తాను’ అని తెలిపారు.అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. కాగ్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 20252015లో ఏం జరిగింది?నవంబర్ 30, 2015న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నాటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా(ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు), ఓపీ శర్మపై విజేందర్ గుప్తా అవమానకర వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. విజేందర్ గుప్తాను బయటకు పంపించి వేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విజేందర్ను సభ నుంచి మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా విజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతల పట్ల స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు విజేందర్కు స్పీకర్ అవకాశం రావడంతో ఆనాటి పరిస్థితులను బీజేపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. I remember that day when then LOP of Delhi assembly @Gupta_vijender ji was dragged out of the assembly not once but many times. Now he will become the Delhi assembly speaker. AAP will taste its karma. Many congratulations to Mr Gupta. pic.twitter.com/fwGsUxF10k— Prof Sayantan Ghosh (@sayantan_gh) February 20, 2025 -
రేఖా గుప్తా అనే నేను
-
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్పై నెటిజన్లు ఫైర్!
వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' మాటలు, వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మాటలు మరువకముందే.. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ.. జాబ్ ఆఫర్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫుల్ టైమ్ జాబ్, నెలకు రూ. 40000 అని పేర్కొంది. అయితే ఉద్యోగి తప్పకుండా ఆఫీసు నుంచే పనిచేయాలి. వారానికి ఆరు రోజులు (ఆదివారం మినహా).. ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రావాలి, పని పూర్తయ్యే వరకు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.భారతదేశంలో ఇలాంటి కంపెనీలు.. ఎందుకు ఇలాంటి నియమాలను బహిరంగంగా వెల్లడిస్తున్నాయో అర్థం కావడం లేదని కొందరు చెబుతున్నారు. కొన్ని కంపెనీలలో పని భారం ఎక్కువవుతుంది ఇంకొందరు చెబుతున్నారు. కార్మిక చట్టంలోని అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని, ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా? అని మరికొందరు చెప్పారు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?రూ. 40,000 జీతం తీసుకునేటప్పుడు.. 12 గంటలు పనిచేయొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ కంపెనీ అయిన నిజాయితీగా వెల్లడించింది, కొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరిన తరువాత ఎక్కువ పని చేయించుకుంటున్నాయని మరికొందరు చెప్పారు. భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి కంపెనీలు కూడా ఇలాంటి నిబంధలను పెడుతూ.. ఒత్తిడి పెంచుతున్నాయని అన్నారు. -
ఇవాళ ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500 బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.2. యమునా నది శుద్ధిబీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.3. పథకాలకు నిధులుఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తిగత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..
Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. #WATCH | BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lt Governor VK Saxena administers her oath of office. With this, Delhi gets its fourth woman CM, after BJP's Sushma Swaraj, Congress' Sheila Dikshit, and AAP's Atishi. pic.twitter.com/bU69pyvD7Y— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ ఇంద్రజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | BJP's Parvesh Sahib Singh takes oath as minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/0ertQiFXHO— ANI (@ANI) February 20, 2025 #WATCH | BJP's Kapil Mishra takes oath as a minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/PVDlRfsq1U— ANI (@ANI) February 20, 2025 BJP's Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh take oath as ministers in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/pzOXHgqXu1— ANI (@ANI) February 20, 2025 👉ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. #WATCH | Along with Delhi's new cabinet, led by CM Rekha Gupta, Prime Minister Narendra Modi greets the crowd at Ramlila Maidan. pic.twitter.com/jiy2AbWjUd— ANI (@ANI) February 20, 2025 👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుఢిల్లీలో కీలక పరిణామం..యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వంయమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 👉రామ్లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. #WATCH | Delhi CM-designate Rekha Gupta and BJP leader Parvesh Sahib Singh greet each other at Ramlila Maidan in Delhi. Parvesh Sahib Singh will also take oath today as part of her council of ministers. pic.twitter.com/k41QI69r4n— ANI (@ANI) February 20, 2025👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్మహల్ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్కు ధన్యవాదాలు. స్పీకర్ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్.. విజేందర్ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్ నేతలపై కామెంట్స్ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 2025 👉రామ్లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. #WATCH | Delhi swearing-in ceremony | BJP Mahila Morcha workers rejoice at Ramlila Maidan ahead of the swearing-in ceremony of CM-designate Rekha Gupta. pic.twitter.com/Hr8gMubHzo— ANI (@ANI) February 20, 2025 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.#WATCH | Delhi CM designate Rekha Gupta says, "It is a miracle, it is a new motivation and a new chapter. If I can be the CM, this means ways are open for all the women... Anyone who has been corrupt will have to give an account of each and every rupee..." pic.twitter.com/F1GUVRELVp— ANI (@ANI) February 20, 2025 #WATCH | Swearing-in ceremony of Delhi CM-designate Rekha Gupta and her council of ministers to take place at Ramlila Maidan today. Visuals from the venue. pic.twitter.com/d6acoUYOSr— ANI (@ANI) February 20, 2025మోదీకి థ్యాంక్స్: రేఖా గుప్తా భర్త👉రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's husband, Manish Gupta says, "...We never thought that she (Rekha Gupta) would become the Chief Minister of Delhi. It seems like a miracle... It is a matter of happiness for us that the party has given us so much respect..." pic.twitter.com/I7rX6X9PaW— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్ వర్మ, అశిశ్ సూద్, మన్జిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్సింగ్ ఉన్నారు. Delhi swearing-in ceremony | Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa, Ravinder Indraj Singh, Kapil Mishra and Pankaj Kumar Singh to take oath as Ministers today. pic.twitter.com/1Gbvkq9xK7— ANI (@ANI) February 20, 2025👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.#WATCH | NSG (National Security Guard) commandos, Delhi Police personnel and RAF (Rapid Action Force) personnel deployed on security at Ramlila Maidan. Delhi CM-designate Rekha Gupta and her new cabinet ministers will take oath here today. pic.twitter.com/9WMgoncQtb— ANI (@ANI) February 20, 2025రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.మోదీకి కృతజ్ఞతలు👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. -
నేడే ఢిల్లీ సీఎం పట్టాభిషేకం
-
Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ టిక్కెట్పై పోటీచేసి, గెలుపొందిన రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమె పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ప్రకటించగానే హర్యానాలోని జింద్లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జింద్లోని జులానా ప్రాంతంలోని నంద్గఢ్ రేఖా గుప్తా పూర్వీకుల గ్రామం. హర్యానాలోని ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్(All India Agarwal Samaj) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అగర్వాల్ సమాజానికి, జింద్కు గర్వకారణమని అన్నారు. కృషి, దృఢ సంకల్పం, సామాజిక సేవా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రేఖ గుప్తా నిరూపించారని గోయల్ పేర్కొన్నారు.రేఖా గుప్తా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఆమె ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్వీకుల గ్రామం కూడా హర్యానాలోనే ఉండటం, ఆయన కూడా అగర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేశారు. ఆయన గతంలో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుటుంబాన్ని కూడా ఆయన ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో రేఖా గుప్తా పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బీని ఢిల్లీలోనే పూర్తిచేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖాగుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వందన కుమారిని ఓడించారు.ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు. -
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ఖడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానంఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్ఎస్ఎస్లో యాక్టీవ్ మెంబర్గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా,ఒకసారి మేయర్గా సేవలందించారు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు. 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్గా గెలుపొందారు2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్గా వ్యవహరించారు2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు. 2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..
దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్ విమెన్ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్ దీక్షిత్. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్కి. ఇక వినోద్ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సభ్యుడు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై 11, 1962న షీలా వినోద్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ టిప్స్..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....) -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా?
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi new CM) కొత్త సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠతకు తెరపడేలా బినోయ్ సామాజిక వర్గానికి (Baniya community) చెందినే నేతకే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పలు రాజకీయ, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజికి వర్గ కీలక మహిళా నేత, షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకే (Rekha Gupta) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు మరింత కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇవాళ రాత్రి ఢిల్లీ బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించనుంది. ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీతో పాటు మాజీ సీఎం, కేజ్రీవాల్ను ఓడించిన బనియా సామాజిక వర్గం నేతకే సీఎం పట్టం కట్టే యోచనలో కమలం అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.ఢిల్లీ రాజకీయాల్లో బనియా సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పాటు,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఓడించేందుకు బనియా వర్గం ఓట్లు దోహదం చేసినట్లు హస్తిన రాజకీయాల్లో తలపండిన నేతలు చెబుతున్న మాట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు వాణిజ్యం, వ్యాపారం,రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషిస్తున్నారు. కేజ్రీవాల్ సైతం బనియా సామాజిక వర్గం. కాబట్టే ఆ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బినోయ్ సామాజిక వర్గం నుంచి విజేందర్ గుప్తా, రేఖాగుప్తా, జితేందర్ మహాజన్ ఈ ముగ్గురు నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో బినోయ్ సామాజిక వర్గంలో కీలక మహిళా నేత రేఖా గుప్తా వైపు బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బనియా సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. దీనికి తోడు ఢిల్లీ మేయర్గా పనిచేశారు. అదే సమయంలో ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం మరింత కలిసివస్తోంది. రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన విజేందర్ గుప్తా సైతం ఉన్నారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 రెండుసార్లూ విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.జితేంద్ర మహాజన్.. ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలు ఉన్న బనియా సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రోహ్తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఆయన విజయం సాధించారు. జాతీయ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో సీఎం ఎవరు? అనేది అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రి 7గంటల తరువాత వెలువడనుంది. ఢిల్లీ సీఎం ఎవరు? అని తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. -
Delhi: చుట్టుముట్టిన అగ్ని కీలలు.. రెండో అంతస్థు నుంచి దూకి..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని నాంగ్లోయీలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భవన్నాన్నంతటినీ చుట్టుముట్టాయి. మంగళవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉంటున్నవారంతా భయాందోళనలకు లోనయ్యారు. అయితే వారంతా అప్రమత్తమై, తమ బాల్కనీలలోనికి చేరుకుని ఒక్కొక్కరుగా రెండో అంతస్థు నుంచి దూకారు. ఈ నేపధ్యంలో వారంతా గాయాలపాలయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు. देखिए एक घर में लगी भयंकर आग,एक शख़्स दूसरी मंज़िल से कूद पड़ा आग लगने की घटना दिल्ली नांगलोई फोन मार्किट कल देर रात की है , जिसका वीडियो सामने आया है बताया जा रहा है गैस लीक होने की वजह से एक घर की पहली मंजिल पर आग लग गई थी,दूसरी मंज़िल पर से एक व्यक्ति ने छलांग लगा दी जो घायल… pic.twitter.com/MvwtDgwzua— Lavely Bakshi (@lavelybakshi) February 18, 2025ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో భవనంలో ఎగసిపడుతున్న మంటలను, బాల్కనీలో నుంచి దూకుతున్నవారిని చూడవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఫైర్ బ్రిగేడ్ మంటలు ఆపే ప్రయత్నం చేయడాన్ని కూడా గమనించవచ్చు. భవనంలో వ్యాపించిన మంటల నుంచి మొత్తం ఆరుగురు రెండో అంతస్థు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
13 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈశాన్య భారతంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని, పర్వత ప్రాంతాల్లో విపరీతంగా మంచుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం నాగాలాండ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండనుంది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21న పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ,పశ్చిమబెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బీహార్లోని 16 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి గ్రాండ్ గా ఏర్పాట్లు
-
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్తో..) -
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
ఢిల్లీ సీఎం ప్రమాణానికి కేజ్రీవాల్కు ఆహ్వానం?
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత కేజ్రీవాల్ను సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలుస్తారా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను, మరో మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.నూతన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీలోని లక్షమంది చోటామోటా నేతలను బీజేపీ ఆహ్వానించనుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ నేతలు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, వీరేంద్ర సచ్దేవ్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.ఫిబ్రవరి 19న జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. తొలుత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తరువాత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిశ్చయించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించనున్నదని సమాచారం. ఈ పరిశీలకులు ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. వీటి ఆధారంగా పార్టీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తుంది. కాగా ముఖ్యమంత్రి రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, రేఖ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్ -
20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. -
ఢిల్లీని కుదిపేసిన భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బిహార్లోని సివాన్లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. ప్రకంపనల కేంద్రం ఎర్రకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌలా కువాన్లోని ఝీల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉదయం 5.36 గంటల సమయంలో కంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) తెలిపింది. ఈ ప్రాంతంలో భూమి కంపించిన సమయంలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. భూమికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను సాధారణ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ నష్టం సంభవించేందుకు అవకాశముంటుంది. ఝీల్ పార్క్ ప్రాంతంలో ఏటా కనీసం రెండుమూడుసార్లు భూమి కంపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. 2015లో ఇక్కడ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. ప్రకంపనలతో భయపడిన ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని జనం భూకంపం వచ్చిందంటూ రోడ్లపైకి చేరుకున్నారు. ఇంత తీవ్రమైన భూకంపం ఇంతకు ముందెన్నడూ తాము చూడలేదని పలువురు తెలిపారు. భారీగా శబ్దాలు రావడంతో ఎంతో భయపడిపోయామని చెప్పారు. భూకంపంతో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో సంభవించిన భూ ప్రకంపనలతో ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ‘ఎక్స్’లో సూచించారు. అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారన్నారు. బిహార్లోనూ ప్రకంపనలుబిహార్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ముఖ్యంగా శివాన్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. శివాన్లో ఉదయం 8 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించామని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సివాన్లో ప్రకంపనలతో భయకంపితులైన జనం ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.తరచూ ఎందుకు?ఢిల్లీలో భూకంపాలు అసా ధారణమేం కాదు. ఢిల్లీ ప్రాంతం క్రియా శీల భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు ప్రపంచంలో అత్యంత భూకంప చురుకైన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఆవలి హిమాలయ పర్వతాలకు ఇవతలి వైపు హిమాలయాలకు మధ్య నెలకొన్న ఒత్తిడి( మెయిర్ బౌండరీ థ్రస్ట్–ఎంబీటీ) అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఢిల్లీ–హరిద్వార్ రిడ్జ్, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫాల్ట్, మొరాదాబాద్ ఫాల్ట్, సోహ్నా ఫాల్ట్, యమునా నదీ రేఖతో సహా అనేక భూకంప అనుకూల ప్రాంతాలు దేశరాజధాని భూభాగానికి సమీపంలో ఉన్నాయి. దీంతో భూకంపాల తీవ్రత అధికం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్–4లో ఉంది. జోన్–4 అంటే భూకంపాల ప్రమాదం ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలాంటి జోన్లో భూకంపాలు సాధారణంగా రిక్టర్ స్కేల్పై ఐదు లేదా ఆరు తీవ్రతతో వస్తాయి. అప్పు డప్పుడు ఏడు లేదా 8 తీవ్రతతో సంభవిస్తాయి. అయితే ఈ జోన్ పరిధి∙నిరంతరం మారు తూ ఉంటుంది. రిక్టర్ స్కేల్పై నాలుగుగా నమోదైనాసోమవారం రిక్టర్ స్కేల్పై కేవలం 4 తీవ్రతతో సంభవించినప్పటికీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించింది. అందుకు కారణం ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వస్తాయి. భూకంపం పుట్టిన ప్రదేశంలో దాని శక్తి తీవ్రంగా ఉంటుంది. దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రకంపనలు బలహీ నమవు తాయి. నేల రకం వంటి స్థానిక భౌగోళిక పరిస్థితులు కూడా కదలికల్లో హెచ్చు తగ్గులకు కారణ మవుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ విషయానికొస్తే భూఉపరి తలానికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది నగరం అంతటా బలమైన ప్రకంపనలను సృష్టించింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాల్లో సంభవించే భూకంపాల వల్ల ఢిల్లీలో స్వల్ప కదలికలు న మోదవుతాయి. అయితే, సోమవారం æ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో ఉండటంతో ఢిల్లీ–ఎన్సీఆర్లో మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ముగ్గురు సీఎంలను చూస్తాం’
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే!
దేశ రాజధాని నగరం ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులుతీశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. బలమైన ప్రకంపనలతో చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమయంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై చాలామంది ఆందోళనవ్యక్తం చేశారు . ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఢిల్లీ భూకంపంపై పలు మీమ్స్ను సృష్టించారు. #earthquake హ్యష్ట్యాగ్తో రూపొందించిన మీమ్స్ వైరల్గా మారాయి. ఢిల్లీలో నెలకొన్ని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. పొద్దున్న కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు. Money is the second thing you need to survive in Delhi, the first is still the courage to live in that city#earthquake pic.twitter.com/E4Jq0XqKY6— isHaHaHa (@hajarkagalwa) February 17, 2025#earthquake #Delhi earthquake to Delhi people: pic.twitter.com/vAYLFraIZo — Yash Khandelwal (@yashk1140) February 17, 2025ఢిల్లీలో జీవించడానికి కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ మీమ్ తయారు చేశారు. రెండు నెలలకోసారి టెక్నో ప్లేట్స్ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఒక పక్క ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతే, సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేయడం విమర్శలకు దారి తీసింది. Tectonic plates in Delhi NCR in every few months : #earthquake pic.twitter.com/vDJSw14sI3— UmdarTamker (@UmdarTamker) February 17, 2025 సాధారణంగా మీమ్స్ను జనాలకు వినోదం పండిస్తాయి. మానసిక ఉల్లాసాన్నిస్తాయి. చాలా తక్కువ సమయంలో సంబంధిత సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై వేసే మీమ్స్ ఆలోచన రగిలిస్తాయి. క్రికెట్మ్యాచ్లు, సినిమా రివ్యూల్లో వచ్చే మీమ్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలా క్రియేటివ్గా ఉండే ఈ మీమ్స్ ఒకవైపు సమాచారాన్ని ఇస్తూనే, మరోవైపు బోలెడంత హాస్యాన్ని పండిస్తాయి. भूकंप कुछ ऐसा ही था आज Delhi NCR में, बहुत तेज #earthquake pic.twitter.com/pGhsanaidT— बलिया वाले 2.0 (@balliawalebaba) February 17, 2025 -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిన దరిమిలా రైల్వే అధికారులు స్టేషన్లో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. సోమవారం మరోమారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఏర్పడటాన్ని చూసిన అధికారులు ప్లాట్ఫారం టిక్కెట్లు విక్రయాలను నిలిపివేశారు.న్యూఢిల్లీ రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికు సంఖ్య తగ్గాకనే ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రయాణికులు రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్లాట్ఫారం టిక్కెట్ల కౌంటర్ దగ్గర ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ అతికించారు. దానిలో ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆన్లైన్లో ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తున్నారా? లేదా అనేది తెలియరాలేదు. కాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్పాట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!! -
ఢిల్లీ, బిహార్ లో కంపించిన భూమి
-
ఢిల్లీ సీఎం సస్పెన్స్కు నేడు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. -
‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్ల ద్వారా పంచుకున్నారు. Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025‘ఎక్స్’ ప్లాట్ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake— Sarah Waris (@swaris16) February 17, 2025@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.Severe #earthquake tremors in #Delhi at 0537 amI was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. -
ఢిల్లీ భూకంపంలో భయపెట్టే శబ్దాలు..!కారణమిదే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి. భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది. -
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్
-
మళ్లీ ప్రకంపనలు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపన తీవ్రంగా ఉండటంతో భూమి కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. భూ ప్రకంపనలతో పాటు, ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్ధాలకు జనం మరింత భయాందోళనలకు గురయ్యారు.CCTV में कैद दिल्ली-NCR में भूकंप के तेज झटकेसुबह-सुबह भूकंप के झटकों से कांपी दिल्ली, 4.0 तीव्रता. दिल्ली में सोमवार सुबह भूकंप के जोरदार झटके महसूस किए गए. भूकंप के कारण लोगों की नींद भी खुल गई. कंपन इतनी ज्यादा थी कि कई सेकंड तक धरती डोलती रही.#earthquake | #delhincr |… pic.twitter.com/2zsuG2ZyKe— NDTV India (@ndtvindia) February 17, 2025ఈ భూకంప ప్రకంపనల గురించి స్థానికుడు సుమన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద శబ్దంతో నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. ఎంతో భయాందోళనలకు లోనయ్యాను. నేను నా ఐదేళ కుమారుడిని ఎత్తుకుని, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుండి బయటకు పరుగులు తీశాను. నాలాగే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు’ అని తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయి భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.బీహార్, హర్యానాలో..ఢిల్లీతో పాటు బీహార్,హర్యానాలలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్లోని సివాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హర్యానాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, సోనిపట్లలో భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్గఢ్లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. Prime Minister Narendra Modi tweets, "Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation." pic.twitter.com/KX9qCArbG3— ANI (@ANI) February 17, 2025ప్రధాని మోదీ ట్వీట్ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భూకంపం పై ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని తెలిపారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భూకంపాలకు కారణమిదే..భూమి నాలుగు పొరలతో కూడి ఉంటుంది. ఇవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. వీటిలో క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్ను లిథోస్పియర్ అని అంటారు. ఈ 50 కి.మీ మందపాటిగా ఉన్న పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల ఇలాంటి ఏడు ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు భూప్రకంపనలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపం కేంద్రం నుంచి తీవ్రత ఎంతనేది కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపం ఏ తీవ్రతతో ఉందనేది చెబుతారు. భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం అంత తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే దానిని భారీ భూకంపంగా గుర్తిస్తారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్! -
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్రేగ్రేషియా
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
-
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు షాక్!
ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్ఫాంపై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.Reportedly 21 people lost lives in the Delhi railway station stampede !who's taking responsibility for this ? This is not mismanagement? #RailwayMinisterResign #STAMPEDE #Delhi#NewDelhiRailwaystation#delhirailwaystation #MahakumbhStampede #trainaccident #Railway pic.twitter.com/oxrtomGkKL— sustainme.in®️ (@sustainme_in) February 16, 2025 See the crowd⚠️Each & every human is stuck to another like a garland woven togetherStampede is bound to happen at the slightest hint of chaos & panicIndian Railways for you 🤷#NewDelhiRailwaystation #STAMPEDE#trainaccident #ResignRailwayMinister pic.twitter.com/DKnrE8TYTS— Sudiksha (@Su_diksha) February 16, 2025ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్(#ResignRailwayMinister) ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచింది. भारतीय रेलवे 21वी सदी के सबसे अच्छे दौर से गुजर रही है। और सबसे बड़ा योगदान रील मंत्री का है। #STAMPEDE #ResignRailwayMinister #NewDelhiRailwaystation pic.twitter.com/lUXGTLCF5Y— Sunand Sarkar Kushwaha (@TheSunandSarkar) February 16, 2025 ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 1956 :: Ariyalur Train Accident Railway Minister Lalbahadur Shastri Resigned Taking Moral Responsibility ( Photo - The Hindu ) pic.twitter.com/rtUy9TdcGD— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 Not again Indian Railways 💔Sealdah bound Kanchenjungaa Express hit by a goods train near New Jalpaiguri, More Details awaited, Wishing for everyone's safety 🙏 #trainaccident #indianrailways pic.twitter.com/ALkidHnESb— Trains of India (@trainwalebhaiya) June 17, 2024 Railway Minister Lal Bahadur Resigned Taking Moral Responsibility of The Train Accident In 1956 pic.twitter.com/xJF8PDKPys— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 ज्यादा लोग बिहार के हैं #AshwiniVaishnawMustResign #AshwiniVaishnawResignNow pic.twitter.com/mh1uW2gpJl— Magadh Updates (@magadh_updates) February 16, 2025 -
ఢిల్లీ టూర్ లో రాహుల్ తో సీఎం రేవంత్ భేటీ
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణాలు..
-
విషాదం.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట (ఫోటోలు)
-
హస్తిన ముఖ్యమంత్రి ఎవరో?
-
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్, రాజస్థాన్కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ సాయ్లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
‘ఢిల్లీలో కరెంట్ కష్టాలు.. ప్రజలు ఇన్వెర్టర్లు కొంటున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు. బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంగా బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. -
న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. అయితే ఇంతలోనే అధిష్టానం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వికసిత్ ఢిల్లీ, ఆయుష్మాన్ భారత్ లాంటి కేంద్ర పథకాల అమలుకు, మురుగునీటి పారుదల, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను కోరారు.ఏదైనా ప్రాజెక్టు లేదా పథకాన్ని మంత్రి మండలికి సమర్పించాలనుకుంటే ముందుగా ఆ శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ అధిష్టానం కోరింది. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభించే పథకాలు లేదా ప్రాజెక్టుల కోసం క్యాబినెట్ ముసాయిదా నోట్లను సిద్ధం చేయాలని బీజేపీ అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, కొత్త ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ కోరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు హామీనిచ్చారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ప్రధాన కార్యదర్శి కోరారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
ఏపీ ప్రయోజనాలు వదిలేశారు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్రెడ్డిపోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుందికానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారుపోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదుఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలిరాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారురాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందివ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు సీఎం రమేష్పై మిథున్రెడ్డి ఫైర్ మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్సభలో అన్నారు. సీఎం రమేష్కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్పై విచారణ జరగాల్సిందేనని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్చంద్రబోస్బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదుటీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదుపార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలిటీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారుమేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదుపోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాంఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందిరైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారురైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్రెడ్డివిభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారుపోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందిరూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారుమేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారుదాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారుచంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారుకూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తితిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారుప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది పార్లమెంట్లో రాష్ట్రం పరువు తీయొద్దుశిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దుమాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారుసంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావుసూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారుఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారుచంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారువైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరురాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాంతమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలిఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్రెడ్డితిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలితిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరాపార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దుసాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాంవ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి -
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఢిల్లీకి మహిళా సీఎం?
న్యూఢిల్లీ: ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యున్నత వర్గాలను ఉటంకిస్తూ పార్టీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లోంచే ఎంపికవుతారని కూడా తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను బీజేపీ ఓడించడం తెలిసిందే. తద్వారా ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ తరఫున నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక వెనకవబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఆయన మాజీ సీఎం కుమారుడు. పర్వేశ్ తండ్రి సాహిబ్సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పని చేశారు. పర్వేశ్తో పాటు వీరేంద్ర గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 13న తిరిగి రానున్నారు. సీఎం అభ్యరి్థపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బహు శా 15వ తేదీకల్లా దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ నలుగురు వీరే... బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29 వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటిదాకా ముగ్గురు ఢిల్లీకి ఇప్పటిదాకా ముగ్గురు మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో రెండో మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగడం విశేషం. అనంతరం ఆప్ నుంచి తాజాగా ఆతిశీ రూపంలో మూడో మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె కేవలం నాలుగున్నర నెలల పాటు పదవిలో కొనసాగారు. -
బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షలపై ఉండే భయాలను పోగొడుతూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరిగింది. 8వ ఎడిషన్లో భాగంగా ఈసారి కూడా ప్రధాని మోదీతో నేరుగా సంభాషించేందుకు కోట్లాది మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోగా కేవలం 35 మందికి మాత్రమే నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. ఢిల్లీలోని సుందర్ నర్సరీ వనంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు క్రికెట్ స్టేడియంలో బ్యాటర్లాగా ఎదుర్కోవాలి. తర్వాతి బంతికి ఫోర్ కొట్టు, సిక్స్ కొట్టు అంటూ వేలాది మంది ప్రేక్షకులు అరుస్తున్నా, ఈలలు వేస్తున్నా బ్యాటర్కు ఇవేం వినిపించవు. ఒక్క బంతి మీద మాత్రమే దృష్టిపెడతాడు. అంతటి ఏకాగ్రతను మీరూ సాధించండి. పరీక్షలు అనే ఒత్తిళ్లకు లొంగకుండా చదువు మీద మాత్రమే మీరు పూర్తిగా ధ్యాస పెట్టాలి. గత పరీక్షల ఫలితాల కంటే మెరుగైన మార్కులు తెచ్చుకుంటానని మీకు మీరే సవాల్ విసురుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానంపై దృష్టిపెట్టండి. జ్ఞానం, పరీక్షలు అనేవి భిన్నమైన అంశాలు. పరీక్షలే లోకంగా ఎప్పుడూ బతకొద్దు. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. సమయాన్ని ఎంత ఎక్కువగా సద్వినియోగం చేస్తారో జీవితంలో అంతపైకి ఎదుగుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. సానుకూలతతో దేనినైనా సాధించవచ్చు’’అని మోదీ అన్నారు. ‘‘ఇటీవలికాలంలో సమాజంలో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. విద్యార్థులు పది, 12వ తరగతుల్లో సరిగా చదవక మార్కులు తక్కువొస్తే ఆ విద్యార్థి జీవితం నాశనమైనట్లేనని తల్లిదండ్రులు ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. విద్యార్థులేమీ రోబోట్లు కాదు. విద్య అనేది కేవలం తదుపరి తరగతికి అర్హత సాధించేందుకు ఉద్దేశించిందికాదు. విద్యార్థి సమగ్రాభివృద్ధికి విద్య ఒక సోపానం. తక్కువ గ్రేడ్లు వచి్చనప్పుడు సమాజం నుంచి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లను పక్కనబెట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు సవాల్గా తీసుకుని చదవండి. మంచిగా నిద్రపొండి. అత్యధిక స్కోర్ రాలేదంటే తమ పని అయిపోయిందనే ఆలోచనతో లోయలోకి విద్యార్థులు పడిపోవద్దు’’అని అన్నారు. ఆన్లైన్లో కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. -
‘మీకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు’.. అతిషీతో సక్సేనా!
ఢిల్లీ: ‘నేను ముందునుంచి చెబుతూనే ఉన్నా. యమునాతో పెట్టుకోవద్దు. మీ కొంప మునుగుతుంది అని. అయినా మీరు నా మాట విన్నారా. వినలేదు. పెడ చెవిన పెట్టారు. ఇప్పుడు అనుభవించండి’ అంటూ ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనాతో (Atishi Marlena) లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (lieutenant governor V K Saxena) అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషీ మర్లేనా తన రాజీనామాను లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. ఆ సమయంలో ఇరువురు మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (delhi assembly elections) బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ తరుణంలో కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో యమునా నదిని శుభ్రం చేయకుండా కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ప్రధాన కారణమని సమాచారం.యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్ను నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించా’ అని గవర్నర్ సక్సేనా అతిషితో చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. కేజ్రీవాల్కు యమునా నది శాపం ఏంటి?యమునా నది కాలుష్యం కోరలు చాచడంతో జనవరి 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నది పునరుజ్జీవనాన్ని పర్యవేక్షించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అత్యున్నత స్థాయి కమిటీ ఐదు సమావేశాలు నిర్వహించి యమునా నదిని శుభ్రపరచే పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. అందుకు ఆప్ ప్రభుత్వం సహకరించింది. యమునా నది ఆక్రమణలు తొలగించడం, 11 కిలోమీటర్ల మేర శుభ్రం చేయడం పూర్తయింది. నదిలో నీటి ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అప్పుడే యమునా నదిని శుభ్రం చేసిన ఘనత తమకు దక్కదనే దురుద్దేశ్యంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యమునా నదిని శుభ్రం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే విధించింది. తత్ఫలితంగా, యమునా నదిని పరిశుభ్రం చేసే పనులు ఐదు నెలల తర్వాత ఆగిపోయాయి. ఆ విషయంలో కేజ్రీవాల్ విజయం సాధించినా నదిని శుభ్రపరిచేందుకు గత 16 నెలలుగా ఒక్క పని కూడా చేయలేదు’అని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గతేడాది నవంబర్లో ఓ కార్యక్రమంలో ఆరోపణలు గుప్పించారు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన రాజీనామా సమర్పించేందుకు వచ్చిన అతిషీ మర్లేనాకు ‘యమునా నది పునరుజ్జీవనం’ శాపం అంశం గురించి గుర్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా,ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అటు అతిషీ కానీ, ఎల్జీ రాజ్భవన్ వర్గాలు నిరాకరించాయి.👉చదవండి : మాజీ సీఎం కేజ్రీవాల్ను మట్టికరిపించిన ఎవరీ పర్వేష్ వర్మ? -
ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
కేజ్రీవాల్ను ఓడించిన జెయింట్ కిల్లర్.. ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్ను ఓడించి జైంట్ కిల్లర్గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు. ఎవరీ పర్వేష్ వర్మ?ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు. -
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అతిషి రియాక్షన్
-
ఢిల్లీలో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీ! కేటీఆర్ అదిరిపోయే సెటైర్
-
కాంగ్రెస్ సృష్టించిన భస్మాసురుడు కేజీవాల్
-
మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్కు మాస్టర్ స్ట్రోక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్క్లాస్పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్కు బదులు కాంగ్రెస్కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్కు మైనస్గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్నే మట్టికరిపించారు కేజ్రీవాల్.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్కు వరంలా మారింది. -
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేటీఆర్ అరెస్ట్పై తొందరపడం.. ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు. రాహుల్గాం«దీతో దూరమేమీ లేదు.. రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు. -
అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్
-
ఇప్పట్లో లేనట్టేనా?.. కేబినెట్ విస్తరణపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
ఎల్జీ ఆదేశం.. ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ
న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కోక్కరికీ రూ. 15 కోట్లు చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ఫలితాలకు ఒక రోజు ముందు కేజ్రీవాల్.. ీబీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ సిద్ధమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించిన బీజేపీ.. ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఆప్ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీజేపీ(BJP) కోరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లేఖ ద్వారా ఎల్జీని కోరింది. దీనిపై స్పందించిన ఎల్జీ.. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు.ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీఎల్జీ ఆదేశాలతో దర్యాప్తుకు సిద్ధమైన ఏసీబీ(ACB).. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటితో ాపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సోదాలు ప్రారంభించింది. దీనిలో ఏసీబీకి చెందిన బృందాలు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనిపై ఆప్ ేనేత సంజయ్ సింగ్ మండిపడుతున్నారు. ఏసీబీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి బదులు సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అన్నారు.కాగా, ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.అయితే కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.