Parliament
-
సెర్బియా పార్లమెంట్లో గందరగోళం పొగబాంబులతో దాడి..
బెల్గ్రేడ్: బాల్కన్ దేశం సెర్బియా పార్లమెంట్ సమావేశం మంగళవారం వీధి పోరాటాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్మోక్ బాంబులు విసరడంతో అవి తాకి ముగ్గురు ఎంపీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించే విషయమై జరగాల్సిన ఓటింగ్ను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఈ సమావేశం అక్రమమని, ప్రధానమంత్రి మిలోస్ వుసెవిక్, ఆయన ప్రభుత్వం రాజీనామాను వెంటనే ధ్రువీకరించాలని డిమాండ్ చేశాయి. సమావేశం మొదలైన అరగంటలోనే ప్రతిపక్ష సభ్యుల ఈలలు, కేకలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నారు. ఆ తర్వాత పొగబాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షం ఉగ్రవాద ముఠాగా మారిపోయిందని స్పీకర్ అనా బిర్నాబిక్ అభివర్ణించారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల ప్రతిపక్షాల మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. వుసెవిక్ ప్రభుత్వం గద్దెదిగి, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా యూనివర్సిటీలకు నిధుల పెంపుపై చర్చ సాధ్యమని వామపక్ష నేత రదోమిర్ లజోవిక్ తేల్చి చెప్పారు. గతేడాది నవంబర్లో కాంక్రీట్ నిర్మాణం కూలి 15 మంది చనిపోయారు. దీంతోపాటు మరికొన్ని ఘటనలను ఉదహరిస్తూ అవినీతి పెరిగిపోయిందంటూ విద్యార్థులు భారీ నిరసనలు చేపడుతున్నారు. విద్యారంగానికి ఎక్కువ నిధులు తదితర డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రధాని వుసెవిక్ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదిస్తేనే ప్రధాని రాజీనామా అమలవుతుంది. అధ్యక్షుడు అలెక్జాండర్ వుసిక్కు చెందిన అధికార సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి పార్లమెంట్లో మెజారిటీ ఉండటంతో వుసెవిక్ ప్రభుత్వం కొనసాగుతోంది. -
పార్లమెంట్ సందర్శనలో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (ఫొటోలు)
-
పార్లమెంట్కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
నిర్ణయాధికారం పార్లమెంట్దే
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. నిర్ణయాధికారం పార్లమెంట్దేనని పేర్కొంది. దీనితో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. రాజకీయ నేతలు ఏవైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపితమైతే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారిపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులపై జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆరేళ్లపాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. అయితే, దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా? లేక ఆరేళ్లపాటు నిషేధం విధించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్కే ఉందని వెల్లడించింది. -
ఇక్కడయితే మన ఆస్తులన్నీ జరిమానాలకే సరిపోయేవి!
-
‘మార్గదర్శి’ని ఎందుకు వదిలేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్సభలో 2025–26 కేంద్ర బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.ఈ రకంగా నిధులు సేకరించడం తప్పని ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆదాయ పన్ను విభాగం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.17 మెడికల్ కాలేజీల పనుల నిలిపివేశారు వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్ కమిషన్ కు లేఖ రాశారని లోక్సభ దృష్టికి తెచ్చారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.⇒ మిథున్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీలో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు. ⇒ బడ్జెట్లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ⇒ రైల్వేజోన్ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్ డివిజన్ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్ డివిజన్ను కొత్త రైల్వే జోన్లోకి కలపాలని డిమాండ్ చేశారు.⇒ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి
-
భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్ ఇదే
Parliament Session Live Updates..అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటన..అమెరికా నుంచి భారతీయుల అమానవీయ తరలింపుపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రంమధ్యాహ్నం రెండు గంటలకి రాజ్యసభ, మూడు మూడు గంటలకి లోక్సభలో ప్రకటన చేయనున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న విపక్షాలుపార్లమెంట్ వద్ద విపక్ష పార్టీ ఎంపీల నిరసన..అమెరికా నుంచి భారతీయుల రాక విషయంపై విపక్ష పార్టీల నేతలు నిరనసలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. #WATCH | MPs of the opposition parties including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress National President Mallikarjun Kharge, Samajwadi Party chief Akhilesh Yadav hold a protest outside the parliament over the issue of deportation of alleged illegal Indian… pic.twitter.com/aUCpbEOK1Q— ANI (@ANI) February 6, 2025 పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాభారతీయులను అమానవీయంగా అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలుఅమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలుకాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఉభయసభల సభాపతులువాయిదా తీర్మానాలను తిరస్కరించడం పై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళనఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై ఉభయ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో, లోక్సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.Lok Sabha adjourned till 12 noon amid ruckus following Opposition MPs' demand to discuss the issue of deportation of Indian nationals who were allegedly illegally living in the US. pic.twitter.com/UTPMln1Mzp— ANI (@ANI) February 6, 2025 👉పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రేణుకా చౌదరి వాయిదా తీర్మానం అందజేశారు. దీనిపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.Congress MP Renuka Chowdhury gives Suspension of Business Notice in Rajya Sabha under Rule 267 to discuss the deportation of Indian nationals who were allegedly illegally living in the US. "The entire exercise of reportedly deporting 20,407 Indian immigrants could have… pic.twitter.com/rQoUbqReYY— ANI (@ANI) February 6, 2025 -
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
-
పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం
-
నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష
కేంద్రం రేపు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా 150 పని దినాలు కల్పిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేయాలని, పథకం అమలుకు సరిపడినన్ని నిధులను ముందుగానే కేటాయించాలని కోరుతున్నారు. ఏటా కేటాయింపులు తక్కువగా ఉండటంతో సరైన సమయానికి నిధులు విడుదల కాక రాష్ట్రాల్లో పేదలకు పనుల కల్పన తగ్గిపోతోందని చెబుతున్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 55 రోజుల చొప్పున పనులు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 47కు తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో 68 శాతం జనాభా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న తరుణంలో గతేడాది బడ్జెట్లో కేవలం రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 3.1 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఇతర రంగాలకు జరిపే కేటాయింపులతో పోల్చి చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిపే కేటాయింపులు కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో రైల్వే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని ఆ రంగ ఉద్యోగులే వాపోతున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణపై ఈసారైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. – సాక్షి, అమరావతికనీసం 150 పని దినాలు కల్పించాలిఉపాధి హామీ పథకం అమలుకు ఆర్థిక ఏడాది చివరిలో నిధుల కొరత తలెత్తకుండా కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget)లోనైనా నిధులు కేటాయించాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) జాబ్కార్డుదారులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుంది. చట్టం నిబంధన ప్రకారం పని అడిగిన ప్రతి కూలీ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో డిమాండ్కు తగ్గట్టుగా కేంద్రం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఆర్థిక ఏడాది చివరిలో జనవరి–మార్చి నెలల మధ్య పని చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు మ్యాచింగ్గా మెటీరియల్ కేటగిరిలో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తున్న కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత 2024–25 వార్షిక బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్రం రూ.86 వేల కోట్లు కేటాయించింది. అయితే, జనవరి 26వ తేదీ (సోమవారం) నాటికే అన్ని రాష్ట్రాల్లో జరిగిన పనులకు రూ.87,865 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కన ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మిగిలి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో పని చేసే కూలీలకు వేతనాలు చెల్లించడానికి అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీల వేతనం ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పని దినాల సంఖ్య 100 నుంచి 150కి పెంచాలని పేదలు, వివిధ ఎన్జీవో సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. పెద్దపీటతోనే ‘సాగు’ క్షేమంవ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 15 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ వంటి పథకాలకు 2023–24తో పోలిస్తే 2024–25లో భారీగా కోత విధించారు. ఈసారి మొత్తం బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం 5–10 శాతానికి తక్కువ కాకుండా కేటాయింపులు జరపాలనే డిమాండ్ విన్పిస్తోంది. పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే సాయం రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులు పెంచడమే కాదు.. ప్రీమియం చెల్లింపు భారం రైతులపై మోపకుండా పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా మార్పులు తీసుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను, జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్గా వీటిని ప్రోత్సహించేందుకు ఎఫ్పీవోలు, ఎస్హెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఆయిల్ పామ్ మరింతగా విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయల ఉత్పత్తి, సరఫరా చైన్ను ఏర్పాటు చేయడం, వీటి నిల్వ కోసం గ్రామ స్థాయిలో స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలి. బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్ర పరికరాలతో పాటు డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఉద్యాన, మత్స్య, పాడి రంగాల్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలి. అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పరిశోధన కేంద్రాలకు నిధులు పెంచాలి.పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులురాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటినా నిధుల కేటాయింపు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఖజానా దాటడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 2025–26 వార్షిక బడ్జెట్లో అయినా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు రాబట్టడంలో సఫలమవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 2014లోనే రైల్వేశాఖ ఆమోదించినట్లు ప్రకటించింది. ఆ ఐదేళ్లలో కనీసం సర్వే కూడా పూర్తిచేయలేదు. ఇప్పుడు మరోసారి అమరావతి రైల్వే లైన్పై మాటల గారడి చేస్తున్నాయి. రైల్వేకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. » కాకినాడ–పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల–నల్గొండ (92 కి.మీ.), కంభం–ప్రొద్దుటూరు (142కి.మీ.), గూడూ రు–దుగ్గరా జుపట్నం (41.55 కి.మీ.) రైల్వేలైన్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించాలి. కొండపల్లి– కొత్తగూడెం (125 కి.మీ.), భద్రాచలం–కొవ్వూరు (151 కి.మీ.) లైన్ల నిర్మాణం సంగతి తేల్చాలి.» కడప–బెంగళూరు (255 కి.మీ), కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. » నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా, విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు వెంటనే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలి.» కర్నూలు జిల్లాలో రూ.440 కోట్లతో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు సకాలంలో పూర్తి చేయాలి.» తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ను ఏర్పాటుచేయాలి. జయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మించాలి. కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్చాలి. ఇప్పటికే ఆమోదించిన మచిలీపట్నం–రేపల్లె రైల్వేలైన్ను బాపట్ల వరకు పొడిగించాలి.» ఓబులవారిపల్లి–కృష్ణపట్నం రైలు మార్గంలో పాసింజర్ రైలును నడపాలి. నందలూరు రన్నింగ్ స్టాఫ్ సెంటర్ను మరింత అభివృద్ధి చేయాలి. అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒంటిమిట్టలో హాల్టింగ్ కల్పించాలి. -
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్లు సెనేట్లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్లు స్టార్టప్లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు శుక్రవారం సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులుకావడం విశేషం. గెలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు. హిందువులు సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేయడం తెల్సిందే. భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ ప్రమీలా జయపాల్ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్ దిగువసభ సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’అని అమీబెరీ అన్నారు. మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. స్పీకర్గా మళ్లీ మైక్ 52 ఏళ్ల మైక్ జాన్సన్ ప్రతినిధుల సభ స్పీకర్గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన నెగ్గారు. గత వందేళ్ల చరిత్రలో ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్గా మైక్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ బరిలో దిగారు. దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి. డెమొక్రటిక్ సభ్యుడు హకీమ్ జెఫ్రీస్ సైతం మైక్కే ఓటేయడం విశేషం. స్వల్ప మెజారిటీతో నెగ్గిన మైక్ వెంటనే స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. -
పార్లమెంట్ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్పుత్ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
పటేల్ ప్రధాని ఎందుక్కాలేదు?
1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడు అవుతాడు. స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలలో గత వారాంతంలో ప్రత్యేక చర్చ జరిగినపుడు ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనా కాలంలో రాజ్యాంగాన్ని పలుమార్లు దుర్వినియోగ పరచటమే కాకుండా, స్వాతంత్య్రానంతరం సర్దార్ పటేల్ బదులు నెహ్రూను ప్రధాని చేసేందుకు తమ సొంత పార్టీ రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించిందన్నారు. ఆయన అటువంటి ఆరోపణ చేసినపుడు ఎందువల్లనో గానీ కాంగ్రెస్ పక్షం నుంచి పూర్తి మౌనం తప్ప కనీస నిరసనలు కూడా కనిపించలేదు. ప్రధాని విమర్శలో నిజమున్నదని వారావిధంగా అంగీకరించినట్లా? కనీసం మరునాడైనా తమ స్పందన లేమిటో ఎందుకు తెలియజేయలేదు? చరిత్రలో వాస్తవంగా జరిగిందేమిటో తెలిసిన కాంగ్రెస్వాదులు సభలో చర్చ జరిగిన సమయంలోగానీ, ఆ తర్వాతగానీ లేకపోయారా? వారి మౌనాన్ని బట్టి మాత్రం, మోదీ ఆరోపణ నిజమని నమ్మే అవకాశం సహజంగానే ఉంటుంది.యథాతథంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని దేశం కోసం సహేతుకమైన అవసరాల కోసం సవరించటంతోపాటు, తమ అధికార ప్రయోజనాల కొరకు దుర్వినియోగ పరిచాయన్నది నిజం. ఆ విషయమై ఎప్పటికప్పుడు విమర్శలు రావటం తెలిసిందే. వాటిని పురస్కరించుకుని 1983లో ఏర్పడిన జస్టిస్ సర్కారియా కమిషన్,కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఒక గొప్ప నివేదికను ఇచ్చింది. దానితో, కేంద్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోసే దుష్ట సంప్రదాయం నిలిచిపోగలదని అందరూ ఆశించారు. కానీ, ఆ తీరు కొంత అదుపులోకి వచ్చినా, ఆ తర్వాత సైతం రాజ్యాంగ దుర్వినియోగం కొన సాగింది. ప్రభుత్వాలను ఆర్టికల్ 365 అనే ఆయుధంతో పడగొడు తుండటం ఒకటైతే... రాష్ట్రాల ఆర్థిక, రాజకీయాధికారాలను కుదిస్తూ పోయారు. ఆ ధోరణు లకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (1989–91) కళ్లెం వేసింది. అది ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం కాకుండా పలు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం కావటం అందుకు కారణం. ఆ విధంగా దుర్వినియోగపరచటమనే రికార్డు గల కాంగ్రెస్, బీజేపీలు రెండూ జాతీయ పార్టీలే కావటం గమనించదగ్గది. అందు వల్ల, ఈ విషయమై ఈ రెండు గురివింద పార్టీలలో ఎవరు ఎవరిని వేలెత్తి చూపినా అది హాస్యాస్పదమే అవుతుంది. అందువల్ల,రాజ్యాంగ ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తి కావటమనే ఒక ఘనమైన సందర్భాన్ని ఉపయోగించుకుని వీరిద్దరితోపాటు అన్ని పార్టీలు కూడా, పరస్పరం వృథా విమర్శలు చేసుకోవటానికి బదులు, ఇంతకాలం జరిగిన దుర్వినియోగాలకు చింతిస్తున్నామని, అందుకు దేశ ప్రజలు తమను క్షమించాలని, ఇక ముందు ఎట్టి పరిస్థితులలోనూ దేశ అవసరాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకొనబోమని ఏకగ్రీవ తీర్మానం చేసి ఉంటే, ఈ సంద ర్భానికి తగినట్లు అంతే ఘనంగా ఉండి, దేశ భవిష్యత్తుకు ఉపయో గకరమయేది.కొంత భిన్నమైనదే అయినా రాజ్యాంగ దుర్వినియోగాలకు సంబంధించిన అవగాహనలకు అవసరమైన ఈ చర్చను అట్లుంచితే, స్వాతంత్య్రానంతరం ప్రధానమంత్రి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి?దేశానికి 1947లో ఇక స్వాతంత్య్రం రానున్నట్లు ధ్రువపడిపోయింది. అంతకుముందు 1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక కాలానికి మౌలానా అజాద్ అప్పటికే ఆరు సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్నారు. అయినా మళ్లీ కావాలనుకున్నారు. అందుకు కారణం, ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడు కానుండటం! ఆ హోదాలో ఆ వ్యక్తి, ప్రధానమంత్రికి సమానుడవుతాడు. స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు. దానితో ఆయన 1946 ఏప్రిల్ 20న ఆజాద్కు లేఖ రాసి పోటీ నుంచి విరమింపజేశారు. అంతేకాదు, ‘ఎవరైనా నా అభిప్రాయం అడిగితే జవహర్లాల్ పేరు చెప్తాను. అందుకు నాకు చాలా కారణాలు న్నాయి’ అని కూడా అదే లేఖలో స్పష్టం చేశారు (ప్యారేలాల్ పేపర్స్). నామినేషన్లకు చివరి రోజు 29వ తేదీ కాగా, తను ఎవరికి అనుకూలమో 20వ తేదీ నాటికి మరి కొందరికి కూడా సూచించారు. మరొక వైపు, వర్కింగ్ కమిటీ సభ్యులు 15 మందిలో 12 మంది, మొత్తం అన్ని పీసీసీల నుంచి పటేల్కు మద్దతు లభించింది.అయినప్పటికీ, గాంధీజీ అభిప్రాయం తెలిసిన కృపలానీ, నెహ్రూ పేరును ప్రతిపాదించి పోటీ నుంచి తప్పుకున్నారు. అపుడు పటేల్ కూడా ఉపసంహరించుకుని, ‘నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు వీలుగా’ అంటూ ఒక కాగితంపై రాసి ఆజాద్కు అందజేశారు (పటేల్ కుమార్తె మణిబెన్). దానితో నెహ్రూ ఏకగ్రీవ ఎంపిక, అదే క్రమంలో అంతిమంగా ప్రధాని కావటం ఖాయమైంది. అదే సమయంలో గాంధీజీ నెహ్రూతో, తన పేరును ఒక్క పీసీసీ కూడా ప్రతిపాదించని విషయాన్ని లాంఛనంగా ప్రస్తా వించారు గానీ, అందుకు నెహ్రూ స్పందించకపోవటంతో, ఎట్లాగూ గాంధీజీ ఆమోదం కూడా ఉన్నందున నెహ్రూదే నాయకత్వం అయింది. పీసీసీల మద్దతు గురించి ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఉదాహరణకు, పటేల్కు సన్నిహితుడైన సెంట్రల్ ప్రావి న్సెస్ పీసీసీకి చెందిన డి.పి. మిశ్రా, తర్వాత ‘లివింగ్ యాన్∙ఈరా’ అనే పుస్తకం రాస్తూ, తాము పటేల్నైతే బలపరిచాముగానీ భవి ష్యత్తులో నెహ్రూ ప్రధాని కాకుండా అడ్డుపడటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నెహ్రూ అప్పటికే మూడుసార్లు అధ్యక్షునిగా పని చేసినందున పటేల్కు రెండో అవకాశం ఇవ్వాలనుకున్నామని, పైగా ప్రధానమంత్రి పదవికి సంబంధించినంతవరకు గాంధీజీ తన వారసునిగా నెహ్రూను ఎప్పుడో ప్రకటించారని అన్నారు.వాస్తవానికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమ సమయంలో ఒక దశలో తన వారసునిగా పటేల్ను ప్రకటించి, ఆ తర్వాత అభిప్రాయం మార్చుకున్నారు. అందుకు కారణాలేమిటో 1945 ప్రాంతంలోనే బహిరంగంగా చెప్పారు. అవి ఈ విధంగా ఉన్నాయి: దేశానికి ఆంగ్లే యుల నుంచి అధికారం రానుండగా ఆ సమయంలో నెహ్రూ మినహా మరొకరు ఆ స్థానంలోకి రాలేరు. విదేశాలలో చదివి బారిస్టర్ అయిన తను మాత్రమే వారితో వ్యవహరించగలడు. అది గాక ముస్లిములతో తనకున్న సత్సంబంధాలు పటేల్కు లేవు. ఇవి గాక మరికొన్ని కార ణాలు కూడా ఉన్నాయి. దేశంలో మత కలహాలు, దేశ విభజన అవ కాశాల స్థితిలో, ముస్లిములకు వ్యతిరేకి అనే ముద్ర గల పటేల్ వల్ల సామరస్యతలు సాధ్యం కాకపోవచ్చు. ఇండియా వంటి దేశపు విదేశాంగ వ్యవహారాలను నెహ్రూ వంటి దృక్పథంగల వారే సరిగా చక్కబెట్టగలరు. పటేల్ మితవాది అయినందున పార్టీలోని మితవాద, ఫ్యూడల్ వర్గాల మద్దతు బలంగా ఉండటం నిజమే గానీ, సామాన్య ప్రజానీకానికి సంబంధించి వారి హృదయ సమ్రాట్ నెహ్రూ మాత్రమే. పైగా, మొదటి నుంచి దరిద్ర నారాయణ్ అంటూ ఆ వర్గాలతో మమేక మైన గాంధీజీకి, ఫేబియన్ సోషలిస్టు భావజాలం గల నెహ్రూయే సరైన ప్రధానిగా తోచటంలో వింత లేదు.ఇంతకూ దీనంతటిలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడున్నదో, ఆ పని నెహ్రూ కుటుంబం ఏ విధంగా చేసిందో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. అప్పటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
... ద్వారాల వద్ద వద్దన్నారని..!
-
రాహుల్పై కేసు క్రైమ్ బ్రాంచ్కు...
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ కేసును క్రైమ్బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3(5) కింద రాహుల్పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. తోపులాటలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే రాహుల్ గాం«దీని పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం పార్లమెంట్ సెక్రటేరియట్కు లేఖ రాస్తామని వెల్లడించారు. తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్చంద్ర సారంగి(69), ముకేశ్ రాజ్పుత్(56) గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కోలుకుంటున్నారని డాక్టర్లు శుక్రవారం తెలియజేశారు. -
వాళ్లు గొప్ప నటులు!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలది నటనేనని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపించారు. వారి నటనా పటిమకు అన్ని అవార్డులూ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాహుల్గాం«దీ, ఇతర కాంగ్రెస్, విపక్షాల ఎంపీల తోపులాటలో గాయపడ్డట్టు బీజేపీ సభ్యులు ప్రతాప్చంద్ర సారంగీ, ముకేశ్ రాజ్పుత్ చెప్పడం తెలిసిందే. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించారు.శుక్రవారం విపక్షాల ఆందోళన సందర్భంగా జయ మీడియాతో మాట్లాడుతూ వారి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్లకంటే మెరుగైన నటులను తన కెరీర్లోనే చూడలేదంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘రాజ్పుత్కు తొలుత చిన్న బ్యాండేజీ వేశారు. తర్వాత దాని సైజు పెరిగింది. చివరికి చూస్తే ఐసీయూలో తేలారు. ఎంత అద్భుతమైన నటనో!’’ అంటూ దుయ్యబట్టారు. జయ విమర్శలపై బీజేపీ మండిపడింది. ‘‘బాధితులను వదిలి నిందితుని పక్షం వహించడమా? సమాజ్వాదీ పార్టీ సంస్కృతికి, విపక్ష ఇండియా కూటమి సంస్కృతికి ఇది మరో నిదర్శనం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. -
లోక్ సభ నిరవధికంగా వాయిదా
-
పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ మకర ద్వారం వద్ద గురువారం అధికార, విపక్ష పారీ్టల సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట నేపథ్యంలో ఇలాంటివి పునరావృతంకాకుండా నివారించేందుకు లోక్సభ స్పీకర్ ఇకపై పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలపై నిషేధం విధించారు. ఎంపీలు, రాజకీయ నేతలు, విడివిడిగా, బృందంగా ఇకపై ఏవైపు గేట్ వద్ద కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని స్పీకర్ ఓం బిర్లా గురువారం కఠిన నియమాలను సూచించారు. -
పార్లమెంటు ఆవరణలో తన్నుకున్న ఎంపీలు
-
ఈసారి బంగ్లాదేశ్ బ్యాగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్ స్టాండ్ విత్ ది హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆఫ్ బంగ్లాదేశ్) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది. प्रियंका के आने से विपक्ष में, कांग्रेस में एक जोश तो आया है, अंततः कोई तो बांग्लादेश के अल्पसंख्यकों के हितों की बात कर रहा है #PriyankaGandhi pic.twitter.com/awMqbrEVbe— Pooja Tiwari (@Irony_Pooja) December 17, 2024 -
లోక్సభకు ‘జమిలి’ బిల్లు? బీజేపీ ఎంపీలకు విప్!
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్17) లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్ నుంచి తొలగించారు.ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియరైంది. దీంతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే -
పార్లమెంటుకు జమిలి ఎన్నికల బిల్లు
-
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో... రాజ్యసభపై లోక్సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్సభ టీమ్కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్లో పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికల బిల్లు వాయిదా!
-
పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వీడని ప్రతిష్టంభన
-
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
పార్లమెంట్లోకి నోట్ల కట్ట తీసుకెళ్లకూడదా?
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సమగ్ర దర్యాప్తు-కుట్ర అని పరస్పరం ఆరోపించుకున్నాయవి. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా కూడా పడింది. కానీ, ఒక చట్ట సభ్యుడు నిజంగా అలా నోట్ల కట్టతో సభకు వెళ్లకూడదా?.. ఇది రాజకీయ రాద్ధాంతం చేయాల్సిన అంశమా?.. అసలు అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమా?పార్లమెంట్ అంటే చట్ట సభ్యులు కొలువుదీరే భవనం. కాబట్టి.. హైసెక్యూరిటీ జోన్ అని అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అయితే పార్లమెంట్లో భాగమైన రాజ్యసభలో.. అదీ ఓ సభ్యుడి సీటు దగ్గర డబ్బు దొరకడం కచ్చితంగా తీవ్రమైన అంశమే!. పార్లమెంట్లోకి ఏది పడితే అది తీసుకురావడానికి ఆస్కారం ఉందన్న సంకేతాలను పంపిచింది ఈ ఘటన.‘‘ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటుచేయాలి. సభ్యులు వాటికి తాళాలు వేసుకుంటే.. తాము ఇంటికెళ్లాక సీట్ల వద్ద ఇతరులెవరూ గంజాయి, కరెన్సీ నోట్లు పెట్టకుండా నివారించొచ్చు’’.. నోట్ల కట్ట దొరికిన సీటు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కామెంట్అసలేం జరిగిందంటే..శుక్రవారం రాజ్యసభ నడుస్తుండగా.. చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించా. ఈ విషయాన్ని సభకు తెలియజేయడం నా బాధ్యత’’ అన్నారు.#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7— ANI (@ANI) December 6, 2024రాజకీయ దుమారంతో..చైర్మన్ చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నోట్ల కట్ట వ్యవహారంపై దర్యాప్తునకు తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకూడదనే కుట్రలో ఇది భాగంకావొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అయితే..ఖర్గే స్పందనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఏ సీటు వద్ద కరెన్సీ దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో.. ఛైర్మన్ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోట్ల కట్టను సభకు తీసుకురావడం చాలా తీవ్రమైన అంశమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ భంగం కలిగించిందంటూ మరో సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సభ్యులెవరూ శాంతించకపోవడంతో.. సభ వాయిదా పడింది. అరుదుగా జరిగిన ఘటన.. అందునా రాజకీయ దుమారం రేగడంతో మీడియా కూడా అంతే హైలైట్ చేసి చూపించింది.మరి ఇంత వీకా?అయితే సదరు సభ్యుడు ఆరోపిస్తున్నట్లు ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే!. గత అనుభవాల దృష్ట్యా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. సరిగ్గా కిందటి ఏడాది ఇదే నెలలో లోక్సభలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. సెషన్ జరుగుతున్న టైంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకిన ఇద్దరు.. టియర్ గ్యాస్ షెల్స్తో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. కొందరు ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ నిలువరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. హైటెక్ హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక పాత పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు 2001లో జరిగిన ఉగ్రదాడి సంగతి సరేసరి.ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతా ఎవరి బాధ్యతో తెలుసా? మరోవైపు ఈ ఘటనతో పార్లమెంట్ ఔనత్యంపై ప్రజల్లోనూ పలు అనుమానాలు కలగొచ్చు. చట్ట సభల్లోనే సభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నమా? లేదంటే డబ్బుతో ప్రభావితం చేయాలనుకుంటున్నారా? లేకుంటే.. విపక్ష సభ్యుడి సీటు దగ్గరే దొరకడంలో ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వీటిని నివృత్తి చేయడానికైనా రాజ్యసభలో నోట్ల కట్ట బయటపడడంపై రాద్ధాంతం కాకుండా.. చర్చ జరగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Video: అరుదైన సన్నివేశం.. మోదీ, ఖర్గే ముచ్చట్లు
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్లు క్లిక్మనిపించడంతో.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ కార్యక్రమానికి మోదీ, ఖర్గేతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొనే నేతలు ఇలా ఒకేచోట అభివాదం చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్కు నివాళులర్పించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, Former President Ram Nath Kovind, Congress President Mallikarjun Kharge and Lok Sabha Speaker Om Birla at the Parliament House Lawns as they pay tribute to Dr BR Ambedkar on the occasion of 69th… pic.twitter.com/TUrefyCY1m— ANI (@ANI) December 6, 2024 -
లోక్సభలో ప్రియాంక సీటింగ్ ఖరారు.. మోదీ, రాహుల్ స్థానాలు కూడా!
18వ లోక్సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.రాహుల్ గాంధీ 498వ స్థానంలో..వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. -
ప్రతిష్టంభనకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్ హింస, మణిపూర్ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది.అదానీ, సంభాల్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియాన్ దుయ్యబట్టారు.అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదాఅదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. -
పార్లమెంట్ కాంప్లెక్స్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ను వీక్షించనున్న మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్కు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూడనున్నారు. మోదీతో పాటు విక్రాంత్ మాస్సే, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా చిత్రాన్ని వీక్షించనున్నారు.ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్’లో నటులు విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రాలుగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా తెరకెక్కించగా.. ఏక్తా కపూర నిర్మించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది.కాగా పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్ప్రెస్కు కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చిన హిట్మ్యాన్ (ఫొటోలు)
-
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
‘అదానీ’పై రగడ.. పార్లమెంట్ రేపటికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండోరోజు బుధవారం(నవంబర్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.పార్లమెంట్ ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత లోక్సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్షాలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేశాయి.ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినప్పటికీ తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మళ్లీ వాయిదా తీర్మానం. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళకు దిగారు.విపక్షాల ఆందోళనతో స్పీకర్ లోక్సభను గంట పాటు వాయిదా వేశారు.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరం: లోక్సభలో అశ్విని వైష్ణవ్సోషల్మీడియాను నియంత్రించాలంటే ఉన్న చట్టాలనే కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందిఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించే అంశం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిధిలో ఉంది.సోషల్మీడియాలో వాక్స్వాతంత్రం పేరిట ఏదిపడితే అది పోస్టు చేస్తున్నారుదీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.ఎంపీ అరుణ్గోవిల్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్విపక్షాల ఆందోళన మధ్యే సమాధానం చెప్పిన ఐటీ మంత్రి -
విపక్షాల ఆందోళన..పార్లమెంట్ ఎల్లుండికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 25) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడంతో ఉభయసభలను బుధవారానికి వాయిదా వేశారు.పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ కామెంట్స్..పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరగాలిఎంపీలు అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలికానీ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయిప్రజలు తిరస్కరించిన పార్టీలు, పార్లమెంటులో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయిపార్లమెంటును అడ్డుకునే వారికి ప్రజలు సమయం చూసి శిక్ష విధిస్తారుగందరగోళం సృషించే పార్టీలు పశ్చాతాపం చెందాలిఅదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..తొలి రోజే అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం. సంభల్లో అల్లర్లపై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానం.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
National : పార్లమెంట్లో 16 కీలక బిల్లులు
-
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్జెండర్ చట్టసభ మెంబర్పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్జెండర్గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
నిరసన డ్యాన్సులు..
-
న్యూజిలాండ్ - పార్లమెంట్ దద్దరిల్లింది
-
జపాన్లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్ పార్లమెంట్లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. -
ప్రజాపద్దుల కమిటీ భేటీకి మాధవీ పురి డుమ్మా
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు. సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు. -
‘నా ఛాంబర్లో చొరబాటు’.. రాజ్యసభ ఛైర్మన్కు ఖర్గే లేఖ
ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), టాటా ప్రాజెక్ట్ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు లేఖ రాశారు.‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్లోని ప్రోటోకాల్లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు. -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్పై రెండో ఓటింగ్ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
పాక్ పార్లమెంటులో ఎలుకల వేట!
మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్ పార్లమెంట్ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది. కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్ సుల్తాన్ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్ చేయడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట! -
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్
ఢిల్లీ: కేరళలోని వయనాడ్లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:1. Support a comprehensive rehabilitation package for the affected communities2. Enhance the compensation for bereaved families3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024 వరదల కారణంగా వయనాడ్లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. -
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని ఎత్తివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రద్దు డిమాండ్తో విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నిరసన చేపట్టారు. ‘పన్ను ఉగ్రవాదం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాందీతో పాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం ఎంపీలు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీ ప్రజలపై పెనుభారమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు.జీఎస్టీతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. ఇండియా కూటమి ఎంపీల నిరసనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనలు, నినాదాలు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ప్రవేశ ద్వారం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడతామని సభ్యులంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8,263 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. -
బంగ్లా సంక్షోభం: పార్లమెంట్ రద్దు
ఢాకా: బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది. -
బడ్జెట్లో 26 రాష్ట్రాల పేర్లులేవు: నిర్మలాసీతామరామన్ క్లారిటీ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో 26 రాష్ట్రాల ఊసే లేదని, అంత మాత్రాన ఆ రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024 బడ్జెట్పై జరిగిన చర్చకు లోక్సభలో మంగళవారం(జులై 30) ఆమె సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి
-
స్పీకర్కు లేఖ.. ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపు వ్యాఖ్యలు: గౌరవ్ గోగొయ్
ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు. -
35 ఏళ్లలోపు యువతకు 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో కొందరు చట్టసభ్యులు ప్రైవెట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా లోక్సభలో 10 శాతం స్థానాలను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉందని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారి తీస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయస్సు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు.అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏమిటి? శాసన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్లో రెండు రకాల బిల్లులను చట్ట సభ్యులు ప్రవేశపెడతారు. అవి ఒకటి పబ్లిక్ బిల్లు, మరోకటి ప్రైవేట్ బిల్లు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును మంత్రి కాకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక.. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రమే ప్రవేశపెడతారు. అందుకే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లు అని కూడా పిలుస్తారు. ప్రైవేట బిల్లు ప్రవేశపెట్టడానికి నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంటుంది. చట్ట సభ్యలు ఈ బిల్లును ముసాయిదా రూపంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ప్రైవేట్ బిల్లును శుక్రవారం రోజు మాత్రమే ప్రవేశపెట్టి చర్చ జరుపుతారు. పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మూడు ప్రైవేట్ బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం ముగ్గురు ఎంపీలు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్లు కోరుతూ ప్రైవేట్ బిల్లుబీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ప్రైవెట్ మెంబర్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.ప్రైవేట్ రంగంలోని విద్యాసంస్థలు, కనీసం 20 మందితో కూడిన పలు సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు.. పబ్లిక్ సెక్టార్లోనే అమలు అవుతున్న విషయం తెలిసిందే.విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ బిల్లుకాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ ప్రైవేట్ విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పర్యవేక్షణ , నియంత్రణ కోసం ఓ రెగ్యూలేటరీ బోర్డును ఏర్పాటుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు. -
Budget 2024: బడ్జెట్, క్యూ1 ఫలితాలపై దృష్టి
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సమగ్ర బడ్జెట్– 2024కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలపైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు (గురువారం), ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్పై బడ్జెట్ ప్రభావమెంత..? ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఈ జూలై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘బడ్జెట్ అంచనాలను అందుకుంటే, మార్కెట్కు మరింత స్థిరత్వం లభిస్తుంది. రక్షణ, రైల్వే, మౌలిక రంగ షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్పై దృష్టి మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన 298 కంపెనీలు జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్, నెస్లే, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి. వీటితో పాటు ఇండిగో, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలైడ్ బ్లెండర్స్, ఐడీబీఐ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ సరీ్వసెస్, టొరెంట్ ఫార్మా, యూనిటెడ్ స్పిర్పిట్స్ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ జూలై వినియోగదారుల విశ్వాస గణాంకాలు, అమెరికా జూన్ గృహ అమ్మకాలు మంగళవారం విడుదల కానున్నాయి. అమెరికా, జపాన్ యూరోజోన్లు బుధవారం జూలై నెలకు సంబంధించి తయారీ, సేవారంగ గణాంకాలను ప్రకటించనున్నాయి. అదే రోజున దేశీయ జూలై హెచ్ఎస్బీసీ తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. అమెరికా క్యూ2 జీడీపీ డేటా, కోర్ పీసీఈ ధరల గణాంకాలు, వాస్తవ వినియోగదారుల వ్యయ డేటా గురువారం వెల్ల డి కానుంది. ఇక వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూలై 19తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వ లు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(జూలై 25న) నిఫ్టీకి చెందిన జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 24,700 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 25,000 స్థాయిని శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 24,000 వద్ద తొలి మద్దతు, 23,500 వద్ద మరో కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయి’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
వాడివేడిగా అఖిలపక్ష భేటీ.. ‘నీట్’పై నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది. -
రాహుల్కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
బడ్జెట్ పై మెగా కవరేజ్
-
సభాపతులే పక్షపాతం ప్రదర్శిస్తే..!
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకోవడం ద్వారా స్పీకర్ స్థానానికి విఠల్భాయ్ పటేల్ ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైనప్పుడు, జి.వి. మావలంకర్ ‘కాంగ్రెస్వాడిని అయినప్పటికీ... నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’ అన్నారు. 1956లో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎం.ఏ. అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1970ల నాటికి లోక్సభ స్పీకర్ నిష్పాక్షికత బలహీనపడటం మొదలైంది. ఇక ప్రస్తుత లోక్సభ, రాజ్యసభల్లోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.స్పీకర్ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా ఉంటారు. అన్ని అంశా లను నిర్ణయించే ముఖ్యమైన న్యాయపరమైన విధులను స్పీకర్కు సభ వదిలివేయవచ్చు.– సర్ ఐవర్ జెన్నింగ్స్,పార్లమెంట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 195718వ లోక్సభ మొదటి సెషన్ జూన్ 24న సమావేశమైనప్పుడు, బీజేపీ మెజారిటీని కలిగి ఉన్న 16వ, 17వ లోక్సభలలో రాజకీయ పార్టీలు విడిచిపెట్టిన చోట నుండే పక్షపాతం తిరిగి ప్రారంభమైంది. సహజంగానే, లోక్సభ స్పీకర్కు పోటీ, ‘ఎన్నిక’, సభ తదుపరి కార్యకలాపాల నిర్వహణ వంటివి ‘నిష్పక్షపాతానికి’ చాలా దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ గురించిన తన విశిష్ట అధ్యయనంలో సర్ జెన్నింగ్స్ ఇలాంటి స్థితి గురించి వివరంగా నమోదు చేశారు.వాస్తవానికి, రాజ్యాంగానికి తగిన గౌరవం ఇవ్వకపోగా, దాని సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి, పార్లమెంటును తన కట్టడిలోనే పనిచేసేలా చూస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నొక్కి చెప్పింది. లోక్సభ, శాసనసభలలో రాజ్యాంగం అమలైనప్పటినుండి కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి, సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా నియమించే వెస్ట్మినిస్టర్ నమూనాకి చెందిన పురాతన సంప్రదాయానికి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. సంప్రదాయం ప్రకారమైతే ఆ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీకి కేటాయించాల్సి ఉండింది. కానీ ఈసారి పార్లమెంటులో బీజేపీకి చెందిన రెండో సీనియర్ సభ్యునికి ప్రొటెం స్పీకర్ పీఠం దక్కింది. సహజంగానే, ‘మా ఎంపికను అంగీకరించడమే ఏకాభిప్రాయం’ అనే రాజకీయ ప్రకటనలో, ఏకాభిప్రాయం కోసం ఏదైనా ప్రతిపక్ష సూచనను ఆశించే, ఆమోదించే అవకాశమే లేదు. ఈ ఏడాది లోక్సభలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని ప్రజలు లాక్కుని ఆ పార్టీ బలాన్ని 303 సీట్ల నుంచి 240కి తగ్గించారు. ఎన్నికలకు ముందు ఎన్ డీఏ ఏర్పర్చుకున్న కొత్త మిత్రుల దన్నుతో 293 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 99 సీట్లతోనూ, విస్తృత ప్రాతిపదికన ‘ఇండియా’ కూటమి 234 సీట్లతోనూ తిరిగి రావడం వల్ల, తమను తాము నొక్కి చెప్పు కోగల ప్రతిపక్షంతో, ట్రెజరీ బెంచ్లను సర్దుబాటు చేసే కథను పూర్తి చేశాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం రాహుల్ గాంధీని ముందుకు నడిపింది.ఏది ఏమైనప్పటికీ, స్పీకర్ పదవికి పోటీని మొదట ప్రతిపాదించినప్పటికీ, భారతదేశం ఎక్కువగా అనుసరించే వెస్ట్మిన్ స్టర్ సంప్ర దాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయి స్తారని ఆశించిన ఇండియా కూటమి... ఎన్డీఏ ఎంపిక మేరకు (మోదీ ఎంపిక అని భావించాలి) మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు మద్దతు ఇచ్చింది. కానీ ప్రతిపక్షాలకు ఈ ప్రత్యేక పదవిని నిరాకరించడానికి, పదేళ్లపాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. దీనిపై ఇప్పటికీ మౌనం కొనసాగించడం అరిష్టదాయకం అనే చెప్పాలి.హౌస్ ఎక్స్–అఫీషియో ఛైర్మన్ అయిన భారత ఉపరాష్ట్రపతిని ఒక వ్యవస్థ ఎన్నుకున్నప్పుడు రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారి ఎవరనే ప్రశ్న పరిష్కరించబడుతుంది. దీనిని తప్పనిసరి చేసే ఆర్టికల్ 89, సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రతిపక్షా లకు ఈ పదవిని కల్పించేందుకు రాజ్యాంగపరమైన నిబంధన కానీ, సంప్రదాయం కానీ లేవు. అయితే, 1952 నుండి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీ ఈ పదవిని అలంకరించారు.‘ఒకసారి స్పీకర్ను నియమించిన తర్వాత, ఆయన తన పార్టీ స్వభావానికి దూరంగా ఉంటాడనీ, అలాగే తనను నియమించిన వారిని సమర్థించకుండా ఉంటాడనీ’ బ్రిటన్ సంప్రదాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను విఠల్భాయ్ పటేల్ తెంచుకున్నప్పుడు, 1926లో తన పార్టీ శాసనసభ్యులతోపాటు వాకవుట్ చేయడానికి నిరాకరించినప్పుడు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ సంప్రదాయా లకు కట్టుబడి భారతదేశం ఆరోగ్యకరమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. విఠల్భాయ్ పటేల్ 1927లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైనప్పుడు, జి.వి.మావలంకర్ ఇలా అన్నారు: ‘‘కాంగ్రెస్వాడిని అయినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’’. 1956 మార్చిలో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎంఏ అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సర్దార్ హుకుమ్ సింగ్ (1962 నుండి 1967 వరకు లోక్సభ స్పీకర్) కూడా తనకు తానుగా ఆరోపణలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ పదవికి ఎన్నిక కావడానికి, అధికారంలో ఉన్న లేదా మెజారిటీ పార్టీపై ఆధారపడటం వల్ల పాలక పార్టీల ఆజ్ఞలకు అతడు/ఆమె కట్టుబడాల్సి ఉంటుందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే 1970ల నాటికి లోక్సభ స్పీకర్ నిష్పాక్షికత కాస్త బలహీనపడటంలో ఆశ్చర్యం లేదు. సోమనాథ్ ఛటర్జీ (2004–09) తన నిష్పాక్షికతతో స్పీకర్ కార్యాలయాన్ని ఉన్నతీకరించగా, బలి రామ్ భగత్, బలరామ్ జాఖడ్ వంటి కొందరు స్పీకర్ బాధ్యతలు ముగిసిన తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు.ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ స్పీకర్ కుర్చీ వద్దకు ఓం బిర్లాను తీసుకువెళ్లినప్పుడు, ఆయన మోదీ ముందు వంగి కరచాలనం చేయడం, తరువాతి ప్రతిపక్ష నేత వద్ద నిటారుగా నిలబడటం ద్వారా తన విధేయత ఎవరి పట్ల ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 27న శశి థరూర్ ‘జై సంవిధాన్’ అని చెప్పడం ద్వారా ఎంపీగా తన ప్రమాణ స్వీకారం ముగించినప్పుడు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కీర్తిస్తూ ప్రమాణం చేయ డానికి అభ్యంతరం ఎందుకు అని దీపేందర్ హుడా అడిగినప్పుడు, బిర్లా ఆయన్ని ఆక్షేపించి కూర్చోవాల్సిందిగా కోరారు. ఇది స్పష్టంగానే నిశ్చితమైన పక్షపాతానికి సంకేతం.స్పష్టంగా ప్రధానమంత్రి సూచనల మేరకు, 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన తీర్మానం, ఆయన పార్టీ విధేయతకు తిరుగులేని సంకేతం. లోక్సభకు సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్లోని రూల్ 380 కింద ప్రధాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా ఆయన తొలగించారు. కొన్ని వివాదాస్పద బిల్లులను అడ్డంకులు లేకుండా ఆమోదించడం కోసం 17వ లోక్సభలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించిన ఈ వ్యక్తి, అధికార పక్షానికి తన విధేయ తను ప్రదర్శించారు.ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా ద్వంద్వ పాత్రను పోషిస్తూ, గత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడం కోసం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమ యం నిరాకరించడం, వారు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అడ్డు కోవడం ద్వారా ధన్ఖడ్ రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. పార్లమెంటులోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.అజయ్ కె మెహ్రా వ్యాసకర్త రాజకీయ శాస్త్రవేత్త(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపీ గౌరవ్ గొగొయ్ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్సభలో పార్టీ చీఫ్విప్గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్ను నియమించారు. వీరికి తోడు సీనియర్నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్లకు లోక్సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాశారు. లోక్సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్గాంధీ మార్గదర్శకత్వంలో లోక్సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు. -
Rahul Gandhi: పార్లమెంట్లో నిలదీస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్లో శాంతిస్థాపన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతామని లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నెలకొన్న విషాదాన్ని పారద్రోలి శాంతినెలకొనేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి వారి బాధలను అర్ధంచేసుకుని ఘర్షణలకు చరమగీతం పాడాలని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన మణిపూర్లో పర్యటన, బాధితులతో మాట్లాడటం తదితర ఘటనల వీడియోను గురువారం ‘ఎక్స్’లో షేర్చేస్తూ హిందీలో పలు పోస్ట్లుచేశారు. ‘మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక మూడుసార్లు రాష్ట్రంలో పర్యటించా. ఇన్నిరోజులైన అక్కడి పరిస్థితిలో మార్పురాలేదు. ఇప్పటికీ అక్కడి జనం రెండు వర్గాలుగా విడిపోయి బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. వేలాది కుటుంబాలు దిక్కులేక శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగానైనా ఒక్కసారి మణిపూర్లో పర్యటించి అక్కడి వారి బాధలను వినాలి. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి’ అని అన్నారు. ‘పార్లమెంట్లో మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తాం. శాంతిస్థాపన కోసం చర్యలు తీసుకునేదాకా కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి మోదీ సర్కార్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాయి’ అని అన్నారు. ‘ మీ వాణిని పార్లమెంట్లో వినిపిస్తాగానీ మీరు శరణార్థి శిబిరాలను వీడి స్వస్థలాలకు ఎప్పటికల్లా వెళ్లగలరు? అనే ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం వద్దే ఉంది’’ అని అన్నారు. -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
పని చేస్తోందా? పట్టు తప్పుతోందా?!
ఇప్పుడిక మనం 18వ లోక్సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?17వ లోక్సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్సభల పనిగంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్స¿¶ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్సభలలో ఒక్క 17వ లోక్సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది.ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్సభతో పోల్చి చూస్తే 17వ లోక్సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ. అంటే, లోక్సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి.మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి?దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు.మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు.పీఎంక్యూస్ అని బ్రిటన్లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు.ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి.చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి.ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పార్లమెంట్ రౌండప్.. విపక్షాల వాకౌట్
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారం(జులై 3)తో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. విపక్షాల వాకౌట్పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను విడిచి వెళ్లారన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్నితిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. లోక్సభ మంగళవారమే నిరవధిక వాయిదా పడటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది. కాంగ్రెస్పై మళ్లీ విమర్శల దాడి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మరోసారి కాంగ్రెస్పై విమర్శల దాడి చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి పవర్లోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. మళ్లీ తామే అధికారంలోకి రావడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను మూడోవంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు.. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. తమ పాలనలో కేవలం మూడవ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయిందన్నారు.ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థవృద్ధిలో భారత్ను ప్రపంచంలో పది నుంచి ఐదో స్థానానాకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుస్తామని ప్రధాని చెప్పారు. మణిపూర్, నీట్లపై స్పందించిన ప్రధాని..మణిపూర్, నీట్ అంశాలపై సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో ప్రధాని రాజ్యసభలో ఈ అంశాలపై స్పందించారు. మణిపూర్లో శాంతి స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీపైనా ప్రధాని మాట్లాడారు. నీట్లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుధామూర్తికి ప్రశంసలు..దాత, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై ప్రధాని బుధవారం సభలో ప్రశంసలు కురిపించారు. సుధామూర్తి దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి విలువైన సూచనలిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో మహిళల కోసం ఎన్నో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. -
KSR Live Show: ఎందుకు అరెస్టు చేయలేదు ?.. చంద్రబాబు స్కాంలు, వెన్నుపోట్ల పై లోక్ సభలో ప్రకంపనలు..
-
లోక్సభలో నా మాటలన్నీ వాస్తవాలే: రాహుల్ గాంధీ
ఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు మంగళవారం లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. తన స్పీచ్లోని వ్యాఖ్యలు తొలగించటంపై రాహుల్ గాంధీ స్పందించారు.‘మోదీ ప్రపంచంలో మాత్రమే నిజాన్ని తొలగిస్తారు. కానీ, వాస్తవ ప్రపంచంలో నిజం ఎప్పుడూ తొలగించబడదు. నిన్న లోక్సభలో నేను చేసిన వ్యాఖ్యలు అన్నీ నిజాలు, అసత్యాలు. వాళ్లు తొలగించుకోవాలనుకుంటే.. తొలగించుకోవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.పార్లమెంట్ సమావేశాలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నీట్, అగ్నిపథ్ పథకాలు, బీజేపీ వ్యవహరిస్తున్న హిందుత్వ విధానాల తీరుపై సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అధికర ఎన్డీయే అభ్యంతరం తెలిపింది. రాహుల్ గాంధీ హిందు సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
కొత్త నేరచట్టాలపై ఉద్యమించాలి!
పార్లమెంట్ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం, లోక్సభలో స్పీకర్ వ్యవహార శైలి, జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాలు వంటి వాటిని గమనిస్తే 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజాస్వామికవాదులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ ఉక్కుపాదంతో అణచేలా ఉన్నాయి.గుజరాత్ నమూనా అంటూ ఊదరగొట్టిన మోదీ– అమిత్ షాలు దశాబ్ద కాలంగా చేస్తున్న నరమేధపు రక్తపు మరకలను ఎమర్జెన్సీ బూచి చూపి తుడిచి వేయలేరు. బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలను స్వాగత సత్కారాలతో విడుదల చేయటం, డేరా బాబా లాంటి వారికి పెరోల్ ఇవ్వటం, గోవింద్ పాన్స్రే, స్టాన్ స్వామి లాంటి వారి ప్రాణాలను హరించి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని ఆరు సంవత్సరాలు నేరం నిరూపణ కాకుండానే నిర్బంధించటం, వరవరరావు, సుధా భరద్వాజ్లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు విడుదల చేయటం... వంటివన్నీ మోదీ పాలన ఎంత అమానవీయంగా, అన్యాయంగా సాగుతున్నదో తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే.ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉపా, దేశ ద్రోహం, మనీ లాండరింగ్ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా సవరించారు. డా‘‘ నరేంద్ర దాభోల్కర్, కామ్రేడ్ గోవింద్, ప్రొఫెసర్ ఎమ్ఎమ్ కల్బుర్గి, గౌరీ లంకేశ్ ప్రాణాలను బలిగొన్నారు. ఇటువంటి తరుణంలో అమలులోకి తెచ్చిన కొత్త నేర చట్టాలు పోలీసులకు అపరిమిత అధికారాలను దఖలు పరుస్తున్నాయి.కేసులు నమోదు చేయడంలో వారికి హద్దూ అదుపూ లేకుండా చేస్తున్న ఈ చట్టాలు మానవహక్కుల కార్యకర్తలూ, రాజకీయ కార్యకర్తల మనుగడనే కాదు, సామాన్యుల బతుకులనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రజలు ఉద్యమించాలి. – దినవహి హరినాథ్, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
-
లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్
ఢిల్లీ: లోక్సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్పై చర్చ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.లోక్సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.ఒకరోజు నీట్పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు.