వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంటరీ సంఘం | 31-member JPC on Waqf Amendment Bill announced | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంటరీ సంఘం

Published Sat, Aug 10 2024 6:34 AM | Last Updated on Sat, Aug 10 2024 9:08 AM

31-member JPC on Waqf Amendment Bill announced

సభ్యుల్లో విజయసాయిరెడ్డి, అసద్, డీకే అరుణ, లావు

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. 

లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్‌ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. 

పార్లమెంట్‌ నిరవధిక వాయిదా 
పార్లమెంట్‌ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement