-
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని దోషులను కోరింది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తుచేసింది. "అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర (మహారాష్ట్ర) ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుంది." అని తీర్పు వెలువరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs — ANI Digital (@ani_digital) January 8, 2024 గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు -
సీరియల్ రేపిస్ట్ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..
న్యూఢిల్లీ: ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై మృగంలా మారి 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఓ కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది. అభశుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వరుస అత్యాచారాలకు పాల్పడిన ఈ కామాంధుడి పేరు రవీందర్ కుమార్. వయసు 32 ఏళ్లు. 2008 నుంచి 2015 మధ్య మొత్తం 30 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిపై అత్యాచారాలు చేసి హతమార్చాడు. 2015లో ఇతడు అరెస్టయ్యాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను ఇతను లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి డబ్బులు, చాక్లెట్టు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని వారిని దారుణంగా హత్య చేసేవాడు. గుడిసెల్లో నివసించే పేదలు, కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నింద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు. నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకునేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను రవీందర్ అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన ప్రదేశాలకు కూడా పోలీసులను తీసుకెళ్లాడు. 2015లో ఇతడ్ని విశ్రాంత ఏసీపీ జగ్మీందర్ సింగ్ దహియా అరెస్టు చేశారు. మద్యం తాగినా, డ్రగ్స్ తీసుకున్నా రవీందర్ మృగంలా మారి స్వీయ నియంత్రణ కోల్పోయేవాడని తెలిపారు. చంపిన తర్వాత మృతదేహాలను కూడా వదిలేవాడు కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోలోనే కాదు బదాయూ, హథ్రాస్, అలీగఢ్లోనూ రవీందర్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. పోలీసుల కంట పడొద్దని కాలినడకన, అడవుల ద్వారానే ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవాడు. ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని ఒక్క కేసులో మాత్రమే కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం -
డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో రూ.41 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు(రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. 1996లో మాన్హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్డార్ఫ్ గుడ్మ్యాన్ స్టోర్లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ రచయిత్రి ఇ. జీన్ కారెల్ ఆరోపించారు. ఆపై తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్పై భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్ను దోషిగా తేల్చింది. అయితే ట్రంప్పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ తీవ్ర విమర్శలు.. కాగా.. ఈ తీర్పుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ఇది తను ఎప్పటికీ వెంటాడుతుందని అన్నారు. లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈమేరకు తన 'ట్రూత్ సోషల్' ఖాతా వేదికగా తెలిపారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్స్టర్కు పదేళ్ల జైలు..
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తర్ అన్సారీని దోషిగా తేల్చింది ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. అతనికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. 2005లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు అన్సారీ సోదరులు. వీరిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 2001 ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ఈ ఏడాది జనవరిలోనే ముఖ్తర్పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు ఇతర కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. తీర్పు అనంతరం రాయ్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్లు అంతమయ్యారని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement