-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైరల్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్కు కాకుండా ప్యాడ్కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 -
IND VS ENG 2nd Test: బెన్ స్టోక్స్ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!
విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలిపోయిన వేల బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై చెలరేగి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. Technology got it wrong on this occasion: England skipper Ben Stokes on Zak Crawley's lbw dismissal in second innings of second Test #INDvsENGTest — Press Trust of India (@PTI_News) February 5, 2024 మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే అంపైర్ కాల్ అనే ఆప్షన్ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. Review.....successful! ✅☝️ Kuldeep Yadav picks up the big wicket of Crawley to keep #TeamIndia in the driving seat 👊⚡️#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/c4hMunPVSP — JioCinema (@JioCinema) February 5, 2024 ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్ఎస్ అప్పీల్ను థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్తో వెళ్తారు. కానీ ఈ సందర్భంలో థర్డ్ అంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్ స్టంప్కు తగులుతున్నట్లు డీఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. -
#Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది మరో బంతిని
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో ప్రతిఘటిస్తుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఇక టీమిండియా ఇన్నింగ్స్లో కోహ్లి సెంచరీతో మెరిస్తే.. అశ్విన్, జడేజా, యశస్వి జైశ్వాల్లు అర్థసెంచరీలతో రాణించారు. ఇక కోహ్లితో కలిసి ఐదో వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా ఔటైన తీరు సక్రమమే అయినప్పటికి డీఆర్ఎస్లో ఎంత లోపం మరోసారి బయటపడింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 104వ ఓవర్లో కీమర్ రోచ్ వేసిన ఆఖరి బంతిని జడేజా డ్రైవ్షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ జోషువా దసిల్వా చేతిలో పడింది. కీపర్ వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో విండీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. కాగా రివ్యూను పరిశీలించిన టీవీ అంపైర్ మైకెల్ గాఫ్ తొలుత అన్ని యాంగిల్స్లోనూ బంతి బ్యాట్కు తాకిందా లేదా అని చూశారు. కాని బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్లింది కానీ తాకిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్కు రిక్వెస్ట్ చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకుతూ స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ జడేజాను ఔట్ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొలుత అల్ట్రాఎడ్జ్లో జడ్డూ ఔటైన బంతికి బదులుగా.. జడ్డూ ఆడిన మరో బంతిని డిస్ప్లే చేయడం వైరల్గా మారింది. అయితే యాదృశ్చికంగా రెండింటిలోనూ జడ్డూ బ్యాట్కు బంతి తగిలివెళ్లినట్లుగా స్పైక్ కనిపించింది. ఇక్కడ విండీస్ ఆటగాళ్లను.. అటు థర్డ్ అంపైర్ను తప్పుబట్టలేం. ఎందుకంటే జడేజా ఔట్లో ఎలాంటి పొరపాటు లేదు. కేవలం సాంకేతిక లోపంతో జడ్డూ ఔటైన బంతిని కాకుండా తప్పుడు బంతిని చూపించడండలో తప్పు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. DRS scam 2023. Jadeja's wicket was robbed. @ICC @BCCI @imjadeja @imVkohli pic.twitter.com/FAbXKihW0S — Human_Insaan🇮🇳 (@Alishan_53) July 21, 2023 చదవండి: 352 పరుగుల వెనుకంజలో విండీస్.. భారత్ పట్టు బిగిస్తుందా? -
#TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటుంది. ఒకే బంతికి 18 పరుగులు రావడం మరిచిపోకముందే మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఒకసారి బ్యాటర్ రివ్యూ తీసుకుంటే.. మరోసారి అదే నిర్ణయంపై బౌలర్ రివ్యూ తీసుకున్నాడు. లీగ్లో భాగంగా బుధవారం దిండిగుల్ డ్రాగన్స్, బా11 ట్రిచ్చి మధ్య మ్యచ్ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్ను కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని క్యారమ్ బాల్ వేయగా.. క్రీజులో ఉన్న రాజ్కుమార్ షాట్కు యత్నించగా బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్కు తగిలినట్లు సౌండ్ రావడంతో కీపర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో రాజ్కుమార్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్ వస్తున్నప్పటికి బంతికి, బ్యాట్కు గ్యాప్ క్లియర్గా ఉండడంతో టీవీ అంపైర్ ఎస్. నిశాంత్ నాటౌట్ అని ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించగానే అశ్విన్ వెంటనే మళ్లీ డీఆర్ఎస్ కోరాడు. అయితే అశ్విన్ ఎందుకు రివ్యూ కోరాడో ఎవరికి అర్థం కాలేదు. బంతి బ్యాట్కు తగిలిందేమోనన్న అనుమానంతోనే అశ్విన్ రివ్యూ కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో అశ్విన్ చర్చించాడు. కాగా టీవీ అంపైర్ నిశాంత్ మరోసారి స్పష్టంగా పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్లో స్పైక్ కనిపిస్తున్నప్పటికి.. బంతికి, బ్యాట్కు గ్యాప్ క్లియర్గా ఉంది. దీంతో బ్యాట్ గ్రౌండ్కు తాకడంతోనే స్పైక్ వచ్చిందని.. ఇది నాటౌట్ అంటూ బిగ్స్క్రీన్పై చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గంగా శ్రీధర్ రాజు 48 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రాజ్కుమార్ 39 పరుగులతో రాణించాడు. దిండిగుల్ డ్రాగన్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, శరవణ కుమార్, సుబోత్ బాటిలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దిండిగుల్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శివమ్ సింగ్ 46, బాబా ఇంద్రజిత్ 22, ఆదిత్య గణేశ్ 20, సుబోత్ బాటి 19 పరుగులు చేశారు. Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐 . .#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9 — FanCode (@FanCode) June 14, 2023 చదవండి: రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్లు; మూడు స్వదేశం.. మూడు విదేశం -
'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు'
ఎంఎస్ ధోని రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే తన మాస్టర్మైండ్తో ఆలోచించే ధోని రివ్యూ విషయంలో ఫర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి ధోని లెక్క తప్పింది. గురువారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ధోని.. యశస్వి జైశ్వాల్ విషయంలో రివ్యూకు వెళ్లాడు. తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని జైశ్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. అంపైర్కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోని డీఆర్ఎస్ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్లో బంతి ప్యాడ్లను తాకినప్పటికి లెగ్స్టంప్ ఔట్సైడ్లో బంతి పిచ్ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్ నాటౌట్ అని తేలగా.. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్ 11 బంతుల్లో 31 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ఒక దశలో సీఎస్కే బౌలర్లపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే దాటిగా ఆడుతున్నాడన్న కోపం అనుకుంటా అందుకే రివ్యూకు పోయాడు.. కానీ ఏం లాభం చేతులు కాల్చుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్ చేశారు. DHONI REVIEW SYSTEM 😎😎..#CSKvRR pic.twitter.com/Xzc4kiAuVm — ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023 చదవండి: రాజస్తాన్తో మ్యాచ్.. ధోని ఉగ్రరూపం గుర్తుందా?
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement